బ్రహ్మాండ మహా పురాణము
5 - లలితోపాఖ్యానము ప్రారంభము – అగస్త్య యాత్రా జనార్దనావిర్భావము
నాలుగు భుజములు, చంద్ర కళాభూషణము, ఉన్నత కుచములు, కుంకుమరాగ శోణిమ (ఎరుపుదనము) గలిగి పుండ్రేక్షువు (శ్రేష్టమైన చెరకుగడ) పాశము, అంకుశము, పుష్పబాణము - ఇవి నాలుగు హస్తములందుగల. ఓ జగత్తునకు ఏకైక మాతయైన లలితాంబా! నీకు నమస్కారము-1. అది శివుని వామాంగమున సుందరమైన వస్తువు. దానివల్లనే విద్వాంసుల మూడవది యావిష్కరించినది. ఆ మూడవదే పరమమైన తేజము-2. అగస్త్యుడను దేవర్షి కలడు. ఆతడు వేదవేదాంగపారగుడు, సర్వసిద్ధాన్తసారముల దెలిసినవాడు, బ్రహ్మానందరసమే యాత్మగా గలవాడు-3.
ఆతడు మహాద్భుతములకు కారణములైన తీర్థములు, స్థానములు. (దేవస్థానములు), శైలములు, అరణ్యములు, నదులు మొదలగువానిని, సమస్త దేశములను సంచరించేను -4. అయా ప్రదేశములలోని ప్రాణులు అజ్ఞానాంధకారమున జుట్టబడినవారు. శిశ్నోదర (మైథున-భోజనములందు) పరాయణులు. ఇట్టివారీని చూచి యగస్త్యుడు. వారిని గూర్చి చింతపసాగెను-5. ఆ విధముగా చింతించుచు నీభూమిని సంచరించు నగస్త్యునకు కాంచీపురము ఘటించినది. ఆ కాంచీ నగరము మహాపుణ్యమైన యుత్తమ నగరము-6. అట శుద్దాత్ముడై యగస్త్యుడు వారణ శైలేంద్రమును (ఏనుగువంటి, పర్వత శ్రేష్ఠమును) ఏకామ్ర వృక్ష స్థలముననున్న శివుని (ఏకామేశ్వరుని) కలిదోషముల నశింపజేయు కామాక్షీదేవిని పూజించెను-7.
లోక కారణుడును, దయార్ధుడును, మహాధీశాలియును, మాటిమాటికి ధ్యానించువాడును, అయిన యగస్త్యుని యొక్క తపస్సుచే జనార్దనుడైన విష్ణువు సంతసించెను-8. హయగ్రీవాకారము వహించి అమితమైన తేజముతో యగస్త్యుని యెదుట సాక్షాత్కరించెను. ఆ హయగ్రీవాకారము కన్నులయెదుట మూర్తీభవించిన కేవలం చిన్నయ రూపము, శంఖము, చక్రము, అక్షవలయము. . (జపమాల) . పుస్తకము-వీనిని ధరించుటచే నుజ్జ్వలమైన (ఉన్నతముగా ప్రకాశించిన) నాలుగు బాహువులు గలది. తన దేహమునుండి బుట్టిన కాంతితో జగమునంతయు నింపుచున్నది-10. ఆ హయగ్రీవుని జూచి యానంద భరితుడై మాటిమాటికి నమస్కరించి వినయ వినమ్రుడై యాజగత్పతిని స్తుతించెను -11, ఆ తరువాత జగన్నాథుడు - నీ తపమునకు సంతసించితిని. వరమును గోరుకొనుము. నీకు క్షేమము గలుగును. అనియనేసు-12 ఈ విధముగా నడుగబడి. యాముని సత్తముడు ఈ విధముగాననెను. ఓ భగవంతుడా! నీవు సంతసించినచో, ఈ పామర ప్రజలందరు ఏయుపాయమున ముక్తులగుదురో, దీనిని మాకు జెప్పుము - అని మునిచే నడుగబడిన దేవదేవుడైన జనార్దనుడు ఇట్లనెను -14. ఈ ప్రశ్నమునే పూర్వము శివుడడిగెను. ఆ తరువాత నీ ప్రశ్నమునే బ్రహ్మయడిగెను. తరువాత దుర్వాసుడడిగెను. ఆ తరువాత నీ వడిగితివి-16.
సర్వప్రాణులకు గురుభూతులై మహాత్ములైన మీచేత నాయుపదేశము లోకములందు ప్రసిద్ధిగాంచుగాత. ఇది నా వరము-17. నేను భూతములకాదని, భూతములకాదికర్తను, నేను స్వయముగా ప్రభువును సృష్టిస్థితి లయలకును అన్నింటికీని కారకుడను-18. త్రిమూర్తి (స్వరూపుడను)నీ, సత్త్వరజస్తమో గుణముల కతీతుడను. నిర్గుణుడను, గుణములకాశ్రయమైన వానినీ-19 స్వేచ్ఛగా విహరించువానిని, భూతములకాత్మను, ప్రధాన- పురుషాత్మకుడను ఓబ్రహ్మస్వరూపుడవైన అగస్త్యమునికి ఇటువంటి శ్రీజగద్రూపధారినైన నా యొక్క రూపము ప్రధానము- పురుషుడు అని రెండు విధములయ్యెను. నా ప్రధాన మను రూపము సర్వలోక గుణాత్మకము-21 తక్కిన గుణాతీతమైన రూపము పరమునకంటెను పరతరమైనది. మహత్తైనది. ఈ విధముగా రెంటి యొక్క స్వరూపములను దెలిసి ఈ రెంటిని వదిలిపెట్టును-22. చిరకాల తపస్సుల చేత, యమ నీయముల చేతను, త్యాగముల చేతను, దుష్కర్మలు నశించిన తరువాత ముక్తి తొందరగనే లభించును-23. ఏ రూపము ఏగుణముతో గూడియున్నదో అదీ గుణీయొక్క యొక్యముతో లభించును. తక్కినది సమస్త జగద్రూపము కర్మభోగము యొక్క పరాక్రమము (ఫలితము)-24 అదీ కర్మలనంటియుండును. అది కర్మల పదిలీనను (సదసత్కర్మల - వదిలినను) ఈ వరకు జేసిన సద సత్కర్మల ఫలితము లభించుచునే యుండును. ఓ తాపస! ఎవ్వరికైనను ఆ రెంటిని (సదసత్కర్మ ఫలములను) వదలుట దుస్తరము-25. సదసత్కర్మ గోచరమైన ఫలము వీడనిదీ, సులభముగా బొందునది-26. సద సద్గుణములాత్మస్థములై వీడవు, తత్పలితములనవశ్యమనుభవింపచేయును. ఆత్మైక్యముగా గలిగిన సర్వసిద్ధులనొసంగును-27. బ్రహ్మక్షత్రియులకన్న తక్కువై పాపిష్టులైన నరులకు గూడ ఏరూపమును ధ్యానించినంత మాత్రమున దుష్కృతము గూడ సుకృతముగా మారునో అది పరాశక్తి రూపము-28. విధి విధానముతోగానీ, వీధి విధానములవదలిగానీ పరాశక్తి నర్చించిన వారు సంసారులు సంసారులుగారు, నిశ్చయముగా వారు ముక్తులే. సంశయము లేదు -29, శివుడు గూడ నామెను ధ్యానయోగ బలముతో సమారాధించి సర్వసిద్దులకీశ్వరుడై యర్ధనారీశ్వరుడయ్యెను-30. ఆ పరాశక్తి ధ్యానవైభవమున బ్రహ్మ మొదలగు దేవతలు సీదులైరి. కావున సమస్తలోకులకు త్రిపురాశక్త్యారాధనము లేక యెక్కడనైనను ఒక్కమారుగా భోగా పవర్గములు భోగమోక్షములు లేవు. కావున పరాశక్తి మనస్కుడవై, పరాశక్తి గత ప్రాణుడవై, పరాశక్తిని యజించు (పూజించు) వాడవై, కోరికలన్నింటిని నామె. యందే. నిలిపినవాడవై-32 పరాశక్త్యాత్మలో సమస్త కర్మలజేయుచు ముక్తిని బొందగలవు. మునిశ్రేష్ఠ నీ తపమునకు సంతసించి అందరి హితమును గోరి యిరహస్యము జెప్పబడినది. దేవతలు మునులు, సిద్ధులు, మానుషులు, ఇతరులును నీముఖ కమలము నుండి యీ పరాశక్తి. రహస్యమును బొంది పరాత్పరమైన . సిద్ధిని బొందుదురుగాక-34
విష్ణు రూపుడైన హయగ్రీవుడు చెప్పిన పై వాక్యములను వినీ నమస్కరించి యగస్త్యముని ఆ మధుసూదనునితో నిట్లనెను-35. ఓ భగవన్! నీవు పూర్వము జెప్పినది యెట్టి రూపము? ఎట్టి విహారములు గలది? ఎట్టి ప్రభావము గలది? - ఇది యంతయు మాకుజెప్పుము-36. హయగ్రీవుడనేను: - ఓ దేవర్షివైన అగస్త్యమునీ! ఈ హయగ్రీవరూపము సాయంశరూపమైన నా వేరొక రూపము. కావున నీవు వినదలచినదంతయు జెప్పగలది. అని జగన్నాథుడైన మహా విష్ణువు తపోధనుడైన హయగ్రీవుని నాదేశించి యగస్త్యముని యెదుటనే యంతర్ధానమొందెను-38. తరువాత ఆశ్చర్యము జెంది యగస్త్యుడు పులకిత గాత్రుడయ్యెను. హయగ్రీవ మునీతో స్వాశ్రమమును జేరెను-39.
ఇది బ్రహ్మాండ మహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్య సంవాద రూపమైన లలితోపాఖ్యానము అగస్తయాత్రా జనార్ధనావిర్భావమును అను పంచమాధ్యాయము -5
Summary of chapter 117 of the Brahmānda Mahā Purana is as follows:
Inaugurating the glorious Lalitā Māhātmya, this chapter introduces the divine dialogue between the venerable sage Agastya and lord Hayagrīva, the horse-headed incarnation of lord Vishṇu. Deeply moved by a desire for universal welfare, sage Agastya humbly inquires about the supreme path to liberation and the divine manifestation of goddess Lalitā. Lord Hayagrīva warmly welcomes the sage's pious query, preparing to reveal the most sacred secrets of Sri Vidyā and the divine play of the supreme mother.