బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

51 - ధన్వంతరి దర్పభంగము, మనసావిజయము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను:

నారాయణాంశో భగవాన్ స్వయం ధన్వంతరిర్మహాన్

పురా సముద్ర మథనే సముత్తస్థౌ మహోదధేః

సర్వవేదేపు నిష్ణాతో మంత్ర తంత్ర విశారదః

శిష్యో హి వైనతేయస్య శంకరస్యోవశిష్యకః

శిష్యాణాం చ సహస్రేణ గతః కైలానమీశ్వరి

ఓ ఈశ్వరీ! (రాధా) పూర్వము సముద్రమును (అమృతము కొరకు దేవరాక్షసులు) మధించినప్పుడు ఆ మహాసముద్రము నుండి ఏగిసినవాడు (ఉద్భవించినవాడు) ధన్వంతరియన్న మహానుభావుడు.అతడు స్వయముగా నారాయణుని అంశయైనవాడు. ఇతడు గరుత్మంతుని శిష్యుడు. శంకరునియొక్క ఉపశిష్యుడు (శిష్యుని శిష్యుడు) కనుక సర్వవేదములందారి తేరిన పండితుడు. మంత్ర తంత్రములందు నేర్పు గలవాడయ్యెను. అతడొకసారి తన వేయి మంది శిష్యులతో కలిసి కైలాసమున కేగుచుండెను.

దదర్శ తక్షకం మార్గే లేలిహానం భయానకం

లక్షనాగైః పరివృతం శల తుల్యం విషోల్బణం

భోక్తుం కోపాత్సమాయాంతమేవం దృష్ట్వా జహాస చ

దంబీ ధన్వంతరేః శిష్యో ధృత్వా తక్షకముల్బణం

మంత్రేణ జృంభితం కృత్వా నిర్విషం తం చకార హ

అమూల్యం మణిరత్నం చ జహార మస్తకే స్థితం

కరేణ భ్రామయిత్వా చ ప్రేరయామాస దూరతః

ఆ ధన్వంతరి మార్గమధ్యములో లక్షమంది నాగులతో కూడి ముండ్లపంది (ఏదు అని తెలుగులో వ్యవహరించు జంతువు) ని పోలియుండి తీవ్రమైన విషము కలిగియున్న తక్షకుడను నాగమును చూచెను. ఇంతలో నాతక్షకుడితనిని చూడగనే మ్రింగివేయుటకీతని వైపు వేగముగా వచ్చుచుండగా ధన్వంతరి వానిని చూచీ నవ్వెను. మోసగించు విద్యలో నేర్పు గల ఒక (ధన్వంతరి యొక్క) శిష్యుడు తీవ్రముగానున్న తక్షకుని పట్టుకొని తన మంత్రశక్తిలో స్తంభింపజేసి విషమును పిండి వేసెను. శిరస్సు నందున్న అమూల్య మణిరత్నమును పెకలించి తీసుకొని - చేతితో వానిని గుండ్రముగా త్రిప్పి దూరమునకు విసిరి వేసెను.

నిశ్చేష్టస్తక్షకస్తస్థౌ తత్ర మార్గే యథా మృతః

గణా నివేదనం చక్రుర్గత్వా వాసుకి సన్నిధిం

వాసుకిస్తత్సమాకర్ణ్య ప్రజ్వలన్నతికోపనః

సర్సాన్ ప్రస్థాపయామాసానంఖ్యాంశ్చైవ విషోల్బణాన్

సర్ప సేనాగ్రణీనాం చ ముఖ్యాన్ పంచ విశారదాన్

ద్రోణ కాలీయ కర్కోట పుండరీక ధనంజయాన్

సర్వే నాగాస్సమాజగ్ముర్యత్ర ధన్వంతరిః స్వయం

భయమాపుః శిష్యగణా దృష్ట్వా నాగానసంఖ్యకాన్

నాగనిశ్వాసవాతేన సర్వే శిష్యా మృతో ఇవ

నిశ్చేష్టా జ్ఞానరహితాః శేరతే ధరణీతలే

తక్షకుడు మరణించినవానివలె చేష్టలు (కదలిక) లేనివాడై ఆ మార్గములో పడియుండెను. అతని వెంటనున్న సర్పగణములు వాసుకీ వద్దకు పోయి ఆ వార్తను విన్నవించిరి. వాసుకి ఆ వార్తను విని మిక్కిలి కోపము గలవాడై. మండిపోవుచు తీవ్ర విషము గల లెక్కలేనన్ని సర్పములను ధన్వంతరి మీదికి దండెత్తించెను. ద్రోణుడు, కాళీయుడు, కర్కోటకుడు, పుండరీకుడు, ధనంజయుడు అన్న యుద్ధ విశారదులగు ఐదుగురు ముఖ్య సేనాపతులను నడిపించెను. ధన్వంతరి ఉన్న చోటికి మొత్తము నాగరాజులు చేరవచ్చిరి. అప్పుడ సంఖ్యాకులైన నాగులను చూచి ధన్వంతరి శిష్యులు భయము పొందిరి. నాగరాజుల నిశ్వాసవాయువు (విడిచిన ముఖమందలి గాడ్పులు) లు సోకి ధన్వంతరి శిష్యులందరు మరణించిన వారి వలె జ్ఞాన రహితులై చేష్టలు తక్కి భూతలమందు పండుకొని యుండిరి.

ధన్వంతరిశ్చ భగవాన్ పీయూష వర్షణేన చ

జీవయామాస శిష్యాంశ్చ మంత్రేణ చ గురుం స్మరస్

చేతనాం కారయిత్వా చ శిష్యాణాం చ జగద్గురుః

చకార జృంభితం మంత్రైః సర్పసంఘం వీషోల్బణం

సర్వే బభూవుర్నిశ్చేష్టా జృంభీతాస్తే మృతా ఇవ

కోఽపి నాలం తతో దేవి వార్తాం దాతుం గణేషు చ

భగవంతుడైన (విష్ణ్వంశ గల) ధన్వంతరి తన గురువును స్మరించి తన మంత్రశక్తీచేతను అమృతవర్షముచేతను శిష్యులను బ్రదికించెను. ఇట్లు శిష్యులకు చైతన్యము కల్గించి - విషము చేత భయంకరముగా నున్న సర్న సంఘమును తన మంత్రములతో స్తంభించునట్లు చేసెను. ఆ నాగులందరు మరణించిన వారివలె నిశ్చేష్టులైరి - ఆ సర్పగణములలో ఒక్కడు కూడ తమ ప్రభువగు వాసుకికీ వార్తనందించుటకు సమర్థుడు కాకపోయెను.

వాసుకిర్బుబుధే సర్వం సర్వజ్ఞః సర్వసంకటం

ఆజుహావ జగద్గౌరీం భగినీం జ్ఞానరూపిణీం

సర్వజ్ఞుడైన వాసుకి సర్పగణములకు వచ్చిన మొత్తము సంకటమును (ప్రాణాపాయస్థితిని) తెలిసికొని జ్ఞానరూపిణియైన తన  చెల్లెలిని జగద్గారిని ఆహ్వానించెను (పిలిచెను).

వాసుకిరువాచ - వాసుకి ఆమెను :

మనసేత్వం సమాగచ్ఛ నాగాన్ రక్షాతిసంకటాత్

జగత్త్రయే మహాభాగే పూజ తవ భవిష్యతి

వాసుకేర్వచనం శ్రుత్వా ప్రహస్యోవాచ కన్యకా

వాక్యం పీయూష తుల్యం చ వినయావనతస్థితా

 “ఓ మనసా! మహాభాగురాలా! నీవిక్కడకు రమ్ము. గొప్ప సంకటము నుండి నాగులను రక్షించుము. ఈ కార్యము వలన నీకు ముల్లోకములయందు పూజ జరుగగలదు”. వాసుకి మాట విని ఆ మానస కన్యక నవ్వి వినయము చేత వంగి నిలిచి అమృత తుల్యమైన నూట పలికెను.

మానసోవాచ - మానసాదేవి పలికెను :

నాగేంద్ర శ్రేణు మద్వాక్యం యాస్యామి సమరం ప్రతి

భద్రాభద్రం దైవపాధ్యం కరిష్యామి యథోచితం

తం శత్రుం సంహరిష్యామి లీలయా సమరస్థలే

అహం యం నిహనిష్యామి తం కో రక్షితుమీశ్వరః

యది బ్రహ్మాదయో దేవాః సమాయాంతి రణస్థలే

తథాపి తవ శత్రుం చే ప్రజెష్యామి న సంశయః

గురుర్నే భగవాన్ శేషః సిద్ధమంత్రం చ దత్తవాన్

నారాయణస్య జగదీమీశస్య పరమాద్భుతం

బిభర్మి కవచం కంఠే వరం త్రైలోక్య మంగలం

సంపారం భస్మసాత్ కృత్వా పునః స్రష్టుమహం క్షమా

నాగరాజా! నా మాట వినుము. యుద్ధభూమికి పోవుచున్నాను. క్షేమమో మరింకేదో దైవము చేత సాధింపబడదగినది. తగిన ప్రయత్నమైతే నేను చేయగలను. నేను చంపదలచిన వ్యక్తిని రక్షించుటకెవడు సమర్థుడు? నీ శత్రువును లీలగా యుద్ధరంగమున చంపగలను. ఒకవేళ యుద్ధభూమికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పటికిని నీ శత్రువును నేను జయించగలను. సంశయము లేదు. నా గురువైన శేష భగవానుడు నాకు సిద్ధమంత్రము నిచ్చినాడు. అది జగన్నాథుడైన సొరాయణుని యొక్క పరమాద్భుతమైన కవచము. ఆ కవచమును ముల్లోకములకు మిక్కిలి మంగళము చేకూర్చు దానిని వాకండమందు ధరించియున్నాను. ఆ శక్తి వలన సంసారమును భస్మమొనర్చి మరల దానిని సృష్టించుటకు నేను సమర్ధురాలనగుచున్నోను.

శిష్యాఽహం మంత్ర శాస్త్రేమ శంభోర్భగవతః పురా

మహాజ్ఞానం దత్తవన్ ప మహ్యం చ కృపయా విభుః

శంభోశ్చ శిష్యో గరుడో గణయామి న తర ధ్రువం

ధన్వంతరిస్తచ్చష్యాణాం ఏకః కిం గణయామి తం

ఇత్యుక్త్వా సా జగామైకా త్యక్త్వా (నాగగణాస్రుషా?)

ప్రణమ్య శ్రీహరి శంభుం శేషం చ హృష్ణ మానసా

యత్ర ధన్వంతరిర్దేవః ప్రసన్నవదవేక్షణః

తత్రాజగామ పా దేవీ కోపరక్తేక్షణారుషా

దృష్టిమాత్రేణ సర్వాంశ్చ జీవయామాన సుందరీ

ఏషదృష్ట్వా శత్రు శిష్మావ్నిశ్చేష్టాంశ్చ చకార హ

“నేను మొదట భగవంతుడైన శంకరుని యొక్క శిష్యురాలని మంత్ర శాస్త్రములను పొందితిని. కృషతో నా విభుడు నాకు మహాజ్ఞానమిచ్చియుండెను. గరుడుడు శంభుని యొక్క శిష్యుడే. సనతవీని లెక్క చేయను. ఇది నిశ్చయము, ధన్వంతరి ఆ గరుడుని శిష్యులలో నొకడు. అతనిని లెక్క చేయుదునా?” ఇట్లు పలికి ఆమె ఒక్కతె వాసుకిని వదిలి - శ్రీహరికి శంకరునికి శేషునికి నమస్కరించి హర్షము గల మనస్సుతో - కోపముతో నెర్రబారిన కన్నులు గలదై ఎక్కడ ధన్వంతరి శత్రుజయము వలన ప్రసన్నమైన వదనము నేత్రములు కలవాడైయుండెనో ఆ స్థలమునకు చేదబోయెను. ఆ మానసకన్యక తన చూపులోనే పొగగణములనందరిని జీవింపజేసి - విష దృష్టిని ప్రసరింపజేసి శత్రు శిష్యులను (ధన్వంతరి శిష్యులను) నిశ్చేష్టులను చేసెను.

ధన్వంతరిస్తు భగవాన్ మంత్రశాస్త్ర విశారదః

మంత్రేణ యత్నం కృతవాన్నోత్థాపయితుమీశ్వరః

దృష్ట్వా ధన్వంతరిం దేవీ స్రహస్యోవాచ సత్వరం

బహూక్తిమర్దయుక్తాం చ పాహంకారాం సురేశ్వరీ

భగవంతుడైన ధన్వంతరి మంత్ర శాస్త్రమందు ఆరితేరిన వాడు కనుక తన శిష్యులను మంత్రశక్తితో ప్రయత్నించి కూడ లేపుటకు సమర్థుడు కాకుండెను. అప్పుడాదేవి సురేశ్వరి (మానస) ధన్వంతరిని చూచి నవ్వి - అహంకారముతో విశేషార్థములతో కూడిన అనేక వాక్యములను పలికెను.

మానసోవాచ - మానసాదేవి పలికెను:

మంత్రార్ధం మంత్ర శిల్పం చ మంత్రభేదం మహౌషధం

వద జానానీ కిం సిద్ధ శిష్యోఽసి గరుడస్య చ

అహం వైనతేయశ్చ శిష్యౌ శంభోశ్చ విశ్రుతౌ

సంకల్పకాలం సుచిరమహం ధన్వంతరే శ్రుణు

ఇత్యుక్త్వా సరసః పద్మం సమానీయ జగత్ర్పసూః

మంత్ర సంవలితం కృత్వా ప్రేరయామాన కోపతః

“ఓయీ ధన్వంతరీ! నీవు గరుడుని శిష్యుడవు కదా! మంత్రార్ధమును మంత్రశిల్పమును మంత్రభేదమును మహాషధమును నీవెరుగుదువా? చెప్పుము. నేనును వైనతేయుడును (గరుడుడు) శంకరుని యొక్క శిష్యులుగా ప్రసిద్ధికెక్కితిమి. నేను కల్పప్రమాణ కాలము - సుదీర్ఘ కాలము శివుని శిష్యురాలిగా నుంటిని. అని పలికి ఆ జగన్మాత సరస్సునందలి ఒక పద్మమును తీసుకొని మంత్రము యొక్క శక్తినీ దోనీ చుట్టు రక్షగా కూర్చి కోపముతో విసిరెను.

దృష్ట్వాఽగతం పద్మపుష్పం జ్వలదగ్నిశిఖోపమం

(ధన్వంతరిశ్చనిఃశ్వాసైర్భస్మసా తచ్చకార హ)

తచ్చధన్వంతరిర్దృష్ట్యా సమంత్రరేణు ముష్టినా

చకార నిష్ఫలం భస్మ తాం ప్రహస్యావలీలయా

తన వైపు మండుచున్న అగ్నిజ్వాలను పోలి వచ్చిన పద్మపుష్పమును చూచి ధన్వంతరి - ఆమెను గూర్చి తిరస్కారపు నవ్వు నవ్వి - తన నిశ్వాసవాయువుతోనే భస్మముగా చేసెను. తిరిగి ఆ పద్మ భస్మమును మంత్రించిన పిడికెడు మట్టితో అవలీలగా వ్యర్ధము చేసెను (దానిని కూడ నశింపజేసెను).

దేవీ జగ్రాహ శక్తించ సూర్యశక్తి సమప్రభాం

మంత్ర సంచలితాం కృత్వా ప్రేరయామాస తం రిపుం

దృష్ట్వా జాజ్వల్యమానాం తాం శక్తిం ధన్వంతరిః స్వయం

విష్ణుదత్తేన శూలేన స తు చిచ్చేద లీలయా

తాం చ శక్తిం వృథా దృష్ట్వా ప్రజజ్వాలేశ్వరీ రుషా

జగ్రాహ నాగపాశం చ ఘోరమవ్యర్థముల్బణం

నాగలక్ష సమాయుక్తం సిద్ధమంత్రేణ మంత్రితం

ప్రేరయామాస కోపేన కాలాంతక సమప్రభం

ధన్వంతరి ర్నాగపాశం దృష్ట్వా చ నస్మితో ముదా

సస్మార గరుడం తూర్ణమాజగామ ఖగేశ్వరః

అప్పుడు దేవి సూర్యతేజస్సుతో సమానమైన తేజస్సు గల శక్త్యాయుధమును గ్రహించి మంత్రశక్తితో రక్షచేసి శత్రువైన ధన్వంతరి పైకి విసిరెను. మండిపోవుచున్న శక్త్యాయుధమును చూచి ధన్వంతరి విష్ణువు తనకు ప్రసాదించిన శూలముతో లీలగా ఖండించెను. తన శక్త్యాయుధము వ్యర్థమగుట చూచి ఈశ్వరి కోపముతో మండిపోయెను. తరువాత ఘోరమును తీవ్ర శక్తి కలదియు, వ్యర్థముగానిదియు కాలాంతకునితో సమానమైన తేజస్సు గలదియు, లక్ష సంఖ్యగల సర్పములతో కూడినదియు సిద్ధిపొందిన మంత్రముతో అభిమంత్రించే బడినదియు ఐన నాగపాశమును స్వీకరించి ధన్వంతరి మీదికి ప్రయోగించెను. నాగపాశాస్త్రమును చూచి ధస్వంతరి చిరునవ్వు గలవాడై సంతోషముతో (తన గురువగు) గరుడుని స్మరించెను. వెంటనే గరుడుడు (పక్షిరాజు) అక్కడికి వచ్చేను.

సర్పాస్తమాగతం దృష్ట్వా గరుడో హరివాహనః

విధాయ చంచునా శీఘ్రం బుభుజే క్షుధితశ్పిరం

విషువాహనమైన గరుడుడు సర్పాస్రము దగ్గరకు రాగానే చూచి చాల కాలమునుండి ఆకలిగొనియున్న వాడు కనుక వెంటనే ముక్కుతో పట్టుకొని భుజించెను. (సర్పములను తీసివేసి అస్త్రమును శక్తిహీనము చేసెను).

నాగాస్త్రం నిష్ఫలం దృష్ట్వా కోప రక్తీక్షణా భృశం

జగ్రాహ భస్మముష్టిం చ శివదత్తాం పురా ప్రియే

భస్మ ముష్టిం మంత్రపూతాం దృష్ట్వా చ ప్రేరితాం తథా

వక్షవాతేన చిక్షేప శిష్యం పశ్చాన్నిధాయ చ

నిరస్తాం భస్మముష్టిం చ దృష్ట్వా దేవీ చుకోప హ

జగ్రాహ శూలమవ్యర్థం హంతుం ధన్వంతరిం స్వయం

శివదత్తం చ శూలం చ శతసూర్య సమప్రభం

అవ్యర్థ శూలం లోకేషు ప్రలయాగ్ని సమప్రభం

నాగాస్త్రము వ్యర్థమగుట చూచి కోపముతో కన్నులెర్రబోరిన దేవి. పూర్వము తనకు శివుడు ప్రసాదించిన భస్మమును పిడికెడు తీసుకొని దానిని మంత్రము చేత అభిమంత్రించి శత్రువు పైకి విసిరిను. దానిని చూచి గరుడుడు శిష్యుని తన వెనుకనుంచి రెక్కల గాడ్పుతో భస్మమును చెల్లాచెదరు చేసెను. తన భస్మముష్టి ఇటు త్రోసివేయబడగా చూచీ దేవి కోపించీ - ధన్వంతరిని చంపుటకు గాను - వ్యర్థము కానట్టిదియు, శివుడు తనకు ప్రసాదించినదియు, శతసూర్యులంత తేజస్సుగలదియు, ప్రళయాగ్నితో సమానమైన ప్రభ కలదియునైన లోకములందు ఎక్కడ మొక్కవోని శూలమును చేత బట్టెను.

అథ బ్రహ్మా తథా శంభురాజగామ రణాజిరం

ధన్వంతరేశ్చ రక్షార్థం శమనార్థం ఖగస్య చ

దృష్ట్వా శంభుం జగద్గౌరీ విధిం చ జగతాం పతిం

భక్త్యా సనామ తావేవ నిఃశంకా శూలధారిణీ

ధన్వంతరిశ్చ గరుడః ప్రణనామ సురేశ్వరౌ

తుష్టావ పరయా భక్త్యా తౌ చ చక్రతురాశిషం

ఉవాచ బ్రహ్మా మధురం హితం ధన్వంతరిం ముదా

పూజార్థం మనసాయాశ్చ లోకానాం హితకామ్యయా

అనంతరమారణ భూమీకి ధన్వంతరిని రక్షించి, గరుడుని శాంతపరచుటకు బ్రహ్మయు శంకరుడును వచ్చిరి. జగదౌరి (మానస) శంకరుని జగత్పతియైన బ్రహ్మను చూచి శూలము ధరించియుండియు శంకలేనిదై భక్తితో ఆ ఉభయులకు నమస్కరించెను. ధన్వంతరియు గరుడుడును ఆ దేవతాశ్రేష్ఠులకు నమస్కరించి గొప్ప భక్తితో స్తుతించిరి. ఆ బ్రహ్మయు పరమేశ్వరుడును వారికాశీస్పులిచ్చిరి. అప్పుడు బ్రహ్మ లోక హితమును గోరి మనసాదేవి యొక్క గౌరవార్థము ధన్వంతరీతో హితమును మధురమును ఐన వాక్యమునిట్లు పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మ వలికెను :

ధన్వంతరే మహాభాగ సర్వశాస్త్ర విశారద

రణం తే మనసా సార్థం న హి సామ్యం చ మే మతం

శివదత్తేన శూలేన దుర్నివార్యేణ సర్వతః

త్రైలోక్యం భస్మసాత్కర్తుం క్షమేయం త్రిదశేశ్వరీ

ధన్వంతరీ! ఓ భాగ్యవంతుడా! సర్వశాస్త్రములందరితేరినవాడా! మానసదేవితో నీ యుద్ధము సమయుద్ధము కాదని నా అభిప్రాయము. ఈ సురేశ్వరి తనకు శివుడు ప్రసాదించిన, (అందువలననే) అన్ని వైపుల నుండి ఎవరి చేతను నివారింపబడుట సాధ్యము గానీది ఐన శూలముతో ముల్లోకములను భస్మము చేయుటకు సమర్ధురాలు సుమా.

ధ్యానం కౌథుమశాఖోక్తం కృత్వా భక్త్యా సమాహితః

దత్త్వా షోడశోపచారం దేవ్యాశ్చ కురు పూజనం

ఆస్తికోక్తేన స్తోత్రేణ స్తవనం కర్తుమర్హసి

పరితుష్టా చ మనసా వరం తుభ్యం ప్రధాస్యతి

బ్రహ్మణో వచనం శ్రుత్వా చకారానుమతిం శివః

వైనతేయశ్చ సంప్రీత్యా బోధయామాన యత్నతః

సామవేదమందలి కౌథుమశాఖలో చెప్పబడిన విధముగా శ్రద్ధాభక్తులతో నీవీ దేవిని ధ్యానించి షోడశోపచారములు సమర్పించి పూజ చేయుము. ఆస్తికుడు (ముని) చెప్పిన స్తోత్రముతో ఈమెను నీవు స్తుతింపదగును. నీ పూజా స్తోత్రము వలన పంతుష్టురాలై ఈ మనసాదేవి నీకు వరము ప్రసాదింపగలదు. ఇట్లు పలికిన బ్రహ్మ వాక్కు విని శివుడు దానికనుమతించెను. గరుడుడు కూడ మిక్కిలి ప్రీతితో పూనుకొని ధన్వంతరికీ కర్తవ్యమును బోధించెను.

ఏషాంచ వచనం శ్రుత్వా స్నాత్వా శుచిరలంకృతః

విధిం పురోహితం కృత్వా పూజాం కర్తుం సముద్యతః

వీరి మాటలు విని స్నానము చేసి పరిశుద్ధుడై వస్త్ర తిలకాదులు ధరించి బ్రహ్మదేవునే పూజను చేయించు పురోహితునిగా చేసికొని (ధన్వంతరి) మానసాదేవిని పూజ చేయుటకై పూనుకొనెను.

ధన్వంతరి రువాచ - ధన్వంతరి ఇట్లనెను (దేవిని స్తుతించెను) :

ఇహాగచ్ఛ జగద్గౌరి గృహాణ మమ పూజనం

పూజ్యా త్వం త్రిమ లోకేషు పురా కశ్యపకన్యకే

త్వయా జితం జగత్సర్వం దేవి విష్ణు స్వరూపయా

తేన తేఽస్త్రీ ప్రయోగే న కృతో రణభూమీషు

ఇత్యుక్త్యా సంయతో భూత్వా భక్తినమ్రాత్మ కంధరః

గృహీత్వా శుక్ల కుసుమం ధ్యానం కర్తుం సముద్యతః

“ఓ జగదౌరీ! ఇక్కడకు రమ్ము. నా పూజను స్వీకరింపుము. ఓ కశ్యపప్రజాపతి పుత్రీ! నీవు మూడులోకములందును పూజింపదగినదానవు. ఓ దేవీ! విష్ణు స్వరూపిణివైన నీ చేత మొత్తము జగత్తు జయింపబడినది. ఆ కారణము చేతనే యుద్ధభూమిలో నీ చేత అస్త్రములు ప్రయోగింపబడలేదు.” ఇట్లు పలికీ మనో నిగ్రహము కలవాడై భక్తితో శిరస్సు వంచి తెల్లని పుష్పమును తీసుకొని ఆ దేవినీ ధ్యానించుట పూనుకొనెను.

చారుచంపక వర్ణాభాం సర్వాంగ సుమనోహరాం

ఈషద్ధాస్య ప్రనవాస్యాం శోభితాం సూక్ష్మవాససా

సుచారుకబరీ శోభాం రత్నాభరణ భూషితాం

సర్వాభయ ప్రదాం దేవీం భక్తానుగ్రహకాతరాం

నర్వవిద్యా ప్రదాం శాంతాం సర్వవిద్యావిశారదాం

నాగేంద్ర వాహినీం దేవీం భజే నాగేశ్వరీం పరాం

సుందరమైన సంపెంగపువ్వు యొక్క వర్ణము వంటి శరీర వర్ణము గలదియును సర్వావయవములు మిక్కిలి మనోహరముగా నున్నదియు, కొంచెము నవ్వుతో కూడి ప్రసన్నముగానున్న ముఖము కలదియు సన్నని వస్త్రముతో శోభించుచున్నదియు, సుందరమైన వెండ్రుకల కొప్పుకలదీయు రత్నాభరణముల చేత అలంకరింపబడినదియు నర్వజీవులను రక్షింతునని అభయమిచ్చునదియు భక్తులననుగ్రహించుట యందు త్వరగలదియు, సర్వవిద్యా విశారదయు, సర్వవిద్యలనిచ్చునదియు, శాంతస్వరూపిణియు గజరాజము వాహనముగా గలదియు ఐన శ్రేష్టురాలగు నాగేశ్వరీ దేవిని భజించుచున్నాను.

ధ్యాత్వైపం కుసుమం దత్త్యా నానాద్రవ్యసమన్వితం

దత్త్వా షోడశోపచారం పూజయామాస తాం ప్రియే

స్తోత్రం చకార యత్నాచ్చ పులకాంచీత విగ్రహః

పుటాంజలి యుతో భూత్వా భక్తినమ్రాత్మకంధరః

ఇట్లు ధ్యానించి (దేవీ పాదముల వద్ద) పుష్పముంచి నానావిధ పూజాద్రవ్యములతో షోడశోపచారములను చేయుచు ధన్వంతరి పూజించెను. తరువాత ప్రయత్నించి భక్తితో వంగిన శిరస్సు గలవాడై శరీరము పులకరించగా చేతులు జోడించి స్తోత్రమొనర్చెను.

ధన్వంతరీ రువాచ - ధన్వంతరి ఇట్లనెను:

నమః సిద్ధ స్వరూపాయై సిద్ధిదాయై నమో నమః

నమః కశ్యపకన్యాయై వరదాయై నమో నమః

నమః శంకర కన్యాయై శంకరాయై నమో నమః

నమస్తే నాగవాహిన్యై నాగేశ్వర్యై నమో నమః

నమ ఆస్తీక జనని జనన్యై జగతాం మమ

నమో జగత్కారణాయై జగత్కారు స్త్రీయై నమః

నమో నాగ భగిన్యై చ యోగిన్యై చ నమో నమః

నమశ్చిరం తపస్విన్యై సుఖదాయై నమో నమః

నమస్తవస్యా రూపాయై ఫలదాయై నమో నమః

సుశీలాయై చ సాద్వై చ శాంతాయై చ నమో నమ:

సిద్ది స్వరూపయు, సిద్ధశక్తులనిచ్చునదియు ఐన దేవికి అనేక నమస్కారములు. కశ్యప ప్రజాపతి పుత్రికయు పరములనిచ్చునదియు ఐన దేవీకి అనేక నమస్కారములు. (విద్యాభ్యాసము చేత) శంకరునికి పుత్రికవంటిదియు ఆశ్రీతులకు సుఖములను కూర్చునదియు ఐన దేవికి నమస్కారములు. గజవాహనముగా గలదియు నాగేశ్వరీయునైన దేవికనేక నమస్సులు. ఓ ఆస్తీకముని యొక్క మాతా! నాకును జగములకు తల్లి ఐనదానా! జగత్తునకు మూలమైన దేవీ! జగత్కారు మహర్షి యొక్క పత్నీ! నీకు నమస్కారములు. నాగరాజులసోదరియు యోగీనీయు చిరకాల తపస్వినియు (ఆశ్రితులకు) సుఖములొసంగనదియు ఐన దేవికి నమస్సులు నమస్సులు. తపస్యారూపమైనదియు తపస్పుల ఫలము లిచ్చునదియు ఐన దేవికి నమస్కారములు. సుశీలయు సాధ్వియు శాంతరూపిణియు ఐన జగద్గారికి అనేక నమస్కారములు.

ఇత్యేవముక్త్వా భక్త్యా చ ప్రణనామ ప్రయత్నతః

తుష్టా దేవి వరం దత్త్వా సత్వరం స్వాలయం యయౌ

పూనికతో ఇటు స్తుతి చేసి భక్తితో నమస్కరించెను. పూజా స్తోత్రములకు తుష్టురాలైన దేవి ధన్వంతరికి వరములిచ్చి తన స్థానమునకు పోయెను.

బ్రహ్మరుద్రవైనతేయాః నమాజగ్ముః నిజాలయం

ధన్వంతరీశ్చ భగవాన్ జగామ నిజమందిరం

బ్రహ్మ శంకరుడు గరుడుడు తమ తమ ఆలయములకు పోయిరి. విష్ణ్వంశ గల ధన్వంతరి కూడ తన మందిరమున కేగెను.

జగ్ముర్నోగాః ప్రహృష్టాశ్చ ఫణరాజి విరాజితాః

ఇత్యేవం కథితం సర్వం స్తవరాజం మయా తవ

విధినా మాతరం భక్తిమాస్తీకశ్చ చకార హ

తదా తుష్టా జగద్గౌరీ పుత్రం తం మునిపుంగవం

ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్

వంశజానాం నాగభయం నాస్తి తస్య న సంశయః

నాగరాజులును ఫణములతో వెలిగిపోవుచు సంతుష్టులై వెడలిపోయిరి. ఇట్లు స్తవరాజము నాచేత నీకు చెప్పబడినది. ఆస్తీకముని ఇంటికి వచ్చిన తల్లిని శాస్త్ర ప్రకారము భక్తితో గౌరవించెను. ఆ మునిపుంగవుని సేవలను స్వీకరించి జగద్గారి పుత్రుని యెడల సంతుష్టురాలయ్యెను. మహాపుణ్యవంతమైన ఈ స్తోత్రమునెవడు భక్తితో పఠించునో వానికినీ వాని వంశమున బుట్టిన వారికీని సర్పభయము లేదు. ఈ విషయములో సందేహము లేదు సత్యము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే ధన్వంతరి దర్పభంగ మనసా విజయోనామ ఏక పంచాశత్తమోభీఽధ్యాయః

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండముందు నారాయణ నారదనంవాదరూపమైన ధన్వంతరీ దతభంగము మనసావిజయమను కధలు గల ఏబది యొకటవ అధ్యాయము సమాప్తము.