బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

3 - సప్తసముద్ర జన్మరాధా సుదామ శాపము

శ్రీనారాయణ ఉవాచ :

రాధా రతిగృహం గత్వా న దదర్శ హారీం మునే

 విరజాం చ నరిద్రూపాం దృష్ట్వా గేహాం జగామ సా

శ్రీనారాయణముని ఇట్లు పలికెను :

రాధాదేవి రత్నమండపములోని నివాసగృహమునకు పోయి అచట హరిని కానక నదీ రూపము ధరించిన విరజను మాత్రమే చూచి తన ఇంటికి తిరిగి పోయెను.

శ్రీకృష్ణో వీరజాం దృష్ట్వా సరిద్రూపాం ప్రియాం సతీం

ఉచ్చైరురోద వీరజా తీరే నీరమనోహరే

మమాంతికం సమాగచ్ఛ ప్రేయసీనాం పరే వరే

త్వయా వినాఽ హం సుభగే కథం జీవామి సుందరి

సద్యధిష్ఠాత్రి దేవి త్వం భవ మూర్తిమతీ సతీ

మమాశిషా రూపవతీ సుందరీ యోషితాం వరా

పూర్వరూపాచ్చ సౌభాగ్యాదిదానీం సుభగా భవ

పురాతన శరీరం తే సరిద్రూపముభూత్పతి

జలాదుత్థాయ చాగచ్ఛ విధాయ తసుముత్తమాం

ఆష్టౌ సిధ్ధీర్మయా దత్తాః సురసుందరి సత్వరం

శ్రీకృష్ణుడు నదీరూపము చెందిన ప్రియురాలగు విరజను చూచి మనోహర జలము గల ఆ నదీ తీరమున కూర్చుండి బిగ్గరగా ఇట్లు ఏడ్చెను. ఓ ప్రేయసీ! నా దగ్గరకు రమ్ము. ఓ కళ్యాణీ! నీవు లేకుండ నేనెట్లు జీవింతును. ఓ నదీ నాయికా! నీవు నా ఆశీస్సుతో పూర్వ రూపము కంటే పూర్వ సౌభాగ్యము కంటే విశేషసుందర మూర్తివై రమ్ము. నీ పూర్వ రూపము నదీ రూపమైనది. ఉత్తమ శరీరము దాల్చి ఆ జలము నుండి లేచి రమ్ము. నీకు అష్టసిద్ధులిచ్చితిని త్వరగా రమ్ము అని అనెను.

కృష్ణాజ్ఞయా చ విరజా విధాయ తనుముత్తమాం

ఆజగామ హరేరగ్రే సాక్షాద్రాధేవ నుందరీ

పీతవస్త్ర పరీధానా స్మేరానన సరోరుహా

పశ్యంతం ప్రాణనాథం చ పశ్యంతి వక్ర చక్షుషా

నీతంబశ్రోణి భారార్తా పీనోన్నత పయోధరా

మానినీ మానినీనాం చ గజేంద్ర మందగామినీ

నుందరీ సుందరీణాం చ ధన్యా మాన్యా చ యోషితాం

చారుచంపకవర్ణాభా పక్వ బింబాధరా పరా

పక్వ దాడిమ బీజాభ దంత పంక్తి మనోహరా

శరత్పార్వణ చంద్రాస్యా ఫుల్లేందీవర లోచనా

కస్తూరీబిందునా సార్ధం సిందూర బిందు భూషితా

చారుపత్రిక శోభాడ్యా సుచారు కబరీయుతా

రత్నకుండల గండస్థా భూషితో రత్నమాలయా

గజమౌక్తిక నాసాగ్రా ముక్తాహార విరాజితా

రత్న కంకణ కేయూర చారుశంఖ కరోజ్జ్వలా

కింకిణిజాల శబ్దాడ్యా రత్నమంజీర రంజితా

కృష్ణాజ్ఞతో విరజాదేవి ఉత్తమ రూపము దాల్చీ సాక్షాత్తు రాధయే అన్నట్లు హరి ముందుకు వచ్చెను. పీతాంబరము ధరించి తనను జూచు ప్రాణనాధుని చిరునవ్వుతో ఓరచూపుతో చూచుచుండెను. నిండైన నితంబ భారముతో పుష్టిగా ఉన్నతముగానున్న స్తనమండలముతో గజేంద్రుని మందగమనముతో సుందరమైన సంపెంగ పూవు వన్నెతో (పసుపు పచ్చవన్నె) పండిన దొండపండు వంటి క్రింది పెదవితో పక్వమైన దానిమ్మ గింజల కాంతి గల పలువరుసతో శరత్పూర్ణిమనాటి చంద్రుని వంటి ముఖముతో విచ్చిన కలువపూలవంటి కన్నులతో కస్తూరీ తిలకము పై సింధూరపు చుక్క బొట్టుతో మకరరేఖలు గల చెక్కిళ్ల కాంతితో అందమైన కొప్పుతో రత్నకుండలములతో రత్నహారముతో జాతి ముత్యపు ముక్కుపోగుతో రత్నకంకణములు దండకడియములు సుందర శంఖములు గల హస్తాభరణములతో ముత్యాల హారములతో మువ్వల మొలనూలుతో రత్నాల అందెలతో సుందరీమణులలో సుందరియై స్త్రీలలో మాన్యయై ధన్యయగు విరజ హరిని సమీపించెను.

తాం చ రూపవతీం దృష్వా ప్రేమోద్రేకాజ్జగత్పతిః

చకారాలింగనం చూర్ణం చుచుంబ చ ముహుర్ముహుః

నానాప్రకార శృంగారం విపరీతాదికం విభుః

రహసి ప్రేయసీo ప్రావ్య చకార చ పునః పునః

విరజా సారజో యుక్తా ధృత్వా వీర్యమమోఘకం

సద్యో బభూవ తత్రైవ ధన్యా గర్భవతీ నతీ

దధార గర్భమీశస్య దివ్యం వర్ష శతం చ సా

తతస్సుమావ తత్రైవ పుత్రాన్ సప్త మనోహరాన్

మాతా సా సప్త పుత్రాణాం శ్రీకృష్ణస్య ప్రియా సతీ

తస్థౌ తత్ర నుఖాసీనా సార్ధం వుతైశ్చ సప్తభిః

ఆ సుందరిని చూచి జగత్పతియగు కృష్ణుడు ప్రేమోద్రేకముతో వెంటనే అ లింగనమొనర్చుకొని మరల మరల ముద్దిడెను. ఏకాంతమున ఆ ప్రేయసిని పొంది నానావిధ శృంగారములొనర్చెను. విరజాదేవి అతని అమోఘ వీర్యము ధరించి సద్యోగర్భవతియై ధన్యురాలయ్యెను. నూరుదేవతా సంవత్సరములు గర్భము ధరించి అందమైన ఏడుగురు కొడుకులను గనెను. ఆ కొడుకులతో ఆ సాధ్వి కృష్ణునకిష్టురాలై సుఖముగా నుండెను.

ఏకదా హరిణా సార్ధం బృందారణ్యే చ నీర్జనే

విజహార వునస్సాధ్వీ శృంగారాసక్త మానసా

ఏతస్మిన్నంతరే తత్ర మాతుః క్రోడం జగామ హ

కనిష్ఠ పుత్రస్తస్యాశ్చ భ్రాతృభిః పీడితో భియా

భీతం స్వతనయం దృష్ట్వా తత్యాజ తాం కృపానిధిః

క్రోడే చకార బాలం సా కృష్నో రాధాగృహం యయౌ

ప్రబోధ్య బాలం సా సాధ్వీ స దదర్శాంతికే ప్రియం

విలలాప భృశం తత్ర శృంగారాతృప్త మానసా

ఒకసారి నిర్జనమైన బృందారణ్యమున ఆ సాధ్వి శృంగారాసక్తిలో హరితో విహరించుచుండెను. ఇంతలో ఆమె చిన్నకొడుకు అన్నలతో బాధింపబడి భయముతో తల్లి వద్దకు వచ్చెను. వాని స్థితిని చూచి కృపానిధియైన కృష్ణుడామెను వదిలి రాధాగృహమునకేగెను. విరజ తన పుత్రుని ఒడిలో చేర్చుకొని వానిని బుజ్జగించి ధైర్యము చెప్పి కృష్ణునకై చూడగా ఆమెకు కృష్ణుడు కనిపించక అసంతృప్తురాలై మిక్కిలి దుఃఖించెను.

శశాప స్వనుతం కోపాల్లవణోదో భవిష్యసి

కదాఽపి తే జలం కేచిన్న ఖాదీష్యంతి జీవినః

శశాప బాలాన్ సర్వాంశ్చ యాంతు మూఢా మహీతలం

గచ్ఛధ్వం చ మహీం మూఢ జంబుద్వీపం మనోహరం

స్థితిర్నైకత్ర యుష్మాకం భవిష్యతి వృథక్ పృథక్

ద్వీపే ద్వీపే స్థితింకృత్వా తిష్ఠంతు సుఖినస్సదా

ద్వీపస్థాభిర్నదీభిశ్చ సహ క్రీడంతు నిర్జనే

కనిషో మాతృశాపాచ్చ లవణోదో బభూవ హ

కనిష్ఠః కథయామాస మాతృశాపం చ బాలకాన్

ఆజగ్ముర్దుఃఖితాస్సర్వే మాతృస్థానం చ బాలకాః

శ్రుత్వా వివరణం సర్వే ప్రజగ్ముర్ధరణీతలం

ప్రణమ్య చరణం మాతుర్భక్తి నమ్రాత్మ మూర్తయః

సప్తద్వీపసముద్రాశ్చ సప్త తస్థుర్విభాగశః

కనిష్ఠాద్వృద్ధపర్యంతం ద్విగుణం ద్విగుణం మునే

లవణేక్షు సురాసర్పిర్ధధీ దుగ్ధ జలార్ణవాః

ఏతేషాం చ జలం పృథ్వ్యాం సస్యార్థం చ భవిష్యతి

వ్యాపాస్సముద్రా స్స ప్తైవ సప్త ద్వీపాం వసుంధరాం

రురుదుర్బాలకాః సర్వే మాతృ భ్రాతృశుచా2న్వితాః

రురోద చ భృశం సాధ్వీ పుత్రవిచ్ఛేద కాతరా

మూర్ఛామవాప శోకెన పుత్రాణాం భర్తు రేవ చ

ఆమె కోపముతో ఆ కొడుకును లవణసముద్రమగుదువు గాక ఏ జీవులును ఏకాలమందు గాని నీ నీరు త్రాగకుదురు గాక అని శపించెను. వానిని బాధించిన మిగిలిన బాలురును మూఢులై భూమిని చేరి జంబూ ద్వీపమున అందరొక చోటగాకుండ వేర్వేరుగా ఆయా ద్వీపములందు నీలుతురుగాక. ఆ ద్వీపములందున్న నదులతో ఏకాంతముగ క్రీడించి సుఖింతురు గాక అని శపించెను. చిన్నవాడు తల్లి శాపమును తోబుట్టువులకు తెలుపగా వారందరు ఏడ్చుచు తల్లి వద్దకు వచ్చి శాప వివరణను విని భక్తితో సాష్టాంగముగా తల్లిపాదములకు నమస్కరించి భూతలమునకు పోయిరి. చిన్నవాడు తల్లి శాపమున లవణ సముద్రమయ్యెను. వారు సప్త ద్వీపములను విభజించుకొని చిన్నవాని నుండి అగ్రజునివరకు ఒకరికంటే ఒకరు రెండింతలుగా ఆయా ద్వీపములందు సముద్రములైరి. లవణసముద్రము, ఇక్షు సముద్రము (చెరకు), సురా (కల్లు) సముద్రము, సర్పీస్ (నెయ్యి) సముద్రము, దధి సముద్రము, క్షీర సముద్రము, జల (మంచినీటి). సముద్రము అని అవి ఏడు. ఈ సముద్రములు సప్తద్వీపవతియైన భూమియందు వ్యాపించినవి. ఇవి (పరోక్షముగా) సస్యములకు నీరందించును. తల్లి తోబుట్టువుల వియోగమునకు వీరందరు దుఃఖించిరి. సాధ్వీయగు విరజాదేవియు పుత్రులకు కట్టిన దుర్గశకు మిక్కిలి దుఃఖించి భర్త యొక్కయు కొడుకుల యొక్కయు వియోగమునకు దుఃఖించి మూర్ఛిల్లెను.

తాం శోకసాగరే మగ్నాం విజ్ఞాయ రాధికాపతిః

ఆజగామ పునస్తస్యాః స్మేరానన సరోరుహః

దృష్ట్వా హరిం సా తత్యాజ శోకం రోదనమేవ చ

ఆనంద సాగరే మగ్నా దృష్ట్యా కాంతం బభూవ హ

చకార శ్రీహరిం క్రోడే విజహార న్మరాతురా

తాం చ పుత్రపరిత్యక్తాం హరిస్తుష్టో బభూవ హ

వరం తస్యై దదౌ ప్రీత్యా ప్రసన్న వదనేక్షణః

కాంతే నిత్యం తన స్థానమాగమిష్యామి నిశ్చితం

యధా రాధా తత్సమా త్వం భవిష్యతి ప్రియా మమ

వుత్రాన్ ద్రక్ష్యసి నిత్యం త్వం మద్వరస్య ప్రసాదతః

ఇత్యుక్తవంతం శ్రీకృష్ణం వసంతం విరజాంతికే

దృష్ట్వా రాధావయస్యాశ్ప కథయామాసురీశ్వరీం

రాధికాపతియగు శ్రీహరి విరజాదేవి శోకసాగర మగ్నమైనట్లు తెలిసికొని చిరునవ్వు మొగముతో ఆమె వద్దకు మరలి వచ్చెను. హరిని చూచి ఆమె శోకవిషాదములు త్యజించి ఆనంద సాగరమగ్నమై కాంతుని ఆలింగనమొనర్చెను. పుత్రులను పరిత్యజించి ఉన్న ఆమెను కృష్ణుడు ప్రసన్న నేత్రములతో చూచి ప్రీతితో వరమిచ్చెను. ప్రియా! నిత్యము నీ స్థానమునకు తప్పకుండా వత్తును. రాగవలెనే నీవును ఆమె వంటి ప్రియురాలవగుదువు. నా వరప్రసాదము వలన నీ పుత్రులనెల్లప్పుడు చూడగలవు. ఇట్లు పలుకుచు విరజ యింటనున్న శ్రీకృష్ణుని చూచి రాధ చెలికత్తెలు ఆమెకీవార్త చెప్పిరి.

శ్రుత్వా రురోష సా దేవీ సుష్వాప క్రోధమందిరే

ఏతస్మిన్నంతరే కృష్ణా జగామ రాధికాంతికం

స తస్థౌ రాధికాద్వారే శ్రీదామ్నా సహ నారద

రాసేశ్వరీ హరిం దృష్ట్వా రుష్నోవాచ ప్రియం పురః

ఓ నారదా! చెలుల మాట విన్న రాధ కోపించి క్రోధమందిరమున పడుకొనెను. ఇంతలో శ్రీ కృష్ణుడు శ్రీదామునితో పాటు రాధ వద్దకు పోయి ఆమె ఇంటిముందు నిలిచెను. తన ముందున్న వారిని చూచి ఆ రాసమండల నాయిక కోపముతో యిట్లు పలికెను.

మత్తో బహుతరాః కాంతా గోలోకే సంతి తే హరే

యాహి తాసాం నవ్నిధానం మయా తే కిం ప్రయోజనం

విరజా ప్రేయసీ కాంతా సరిద్రూపా బభూవ హ

దేహం త్యక్త్వా మమ భయాత్తథాఽపి యాహి తాం ప్రతి

తత్తీరే మందిరం కృత్వా తిష్ఠ తిష్ఠ చ యాహి తాం

నదీ బభూవ సా త్వం చ నదో భవితుమర్హసి

నదస్య నద్యా సార్ధం చ నంగమో గుణవాన్ భవేత్

స్వజాతౌ పరమా ప్రీతిః శయనే భోజనే నుఖాత్

దేవచూడామణేః క్రీడానద్యా సార్ధమహో బత

మహాజనః స్మేరముఖః శ్రుత్వా సద్యో భవిష్యతి

యే త్వాం వదంతి నర్వేశం తే కిం జానంతి తత్త్వతః

భగవాన్ నర్వ భూతాత్మా నదీం సంభోక్తుమిచ్ఛతి

ఇత్యుక్త్యా రాధికాదేవీ విరరావు రుషాఽన్వితా

నోత్తస్థౌ భూమి శయనాద్గోపీ లక్షనమన్వితా

ఓ హరీ! గోలోకమున నీకు నాకంటే మిక్కిలి ప్రియమైన స్త్రీలెందరో కలరు. వారివద్దకే పొమ్ము. నాతో ప్రయోజనమేమీ? నీ ప్రియకాంత వీరజ నా భయము వలన దేహము వదలి నదీ రూపము దాల్చినది. ఐనను ఆమె వద్దకే పొమ్ము. ఆ నదీ తీరమున ఇల్లు కట్టుకొని ఉండుము. పొమ్ము. ఆమె నదియయ్యెను, నీవు నదమగుట యోగ్యముగానుండును. నదీనదముల సంగమము ప్రశస్తముగా ఉండును. శయన భోజనములందు స్వజాతి వలన కలుగు సుఖము మిక్కిలి తృప్తినిచ్చును. దేవతాశిరోమణికి నదితోక్రీడ. ఓహో! ఇది విని గొప్పవారు వెంటనే నవ్వుకొందురు. నిన్ను సర్వేశ్వరుడని చెప్పువారు వాస్తవమునకేమెరుగుదురు. సర్వభూతము (జీవులు)లకు అంతరాత్మయగు భగవంతుడు నదీ సంభోగము కోరుచున్నాడు! రాధాదేవి ఇట్లు కోపముతో పలికి లక్షల గోపికలతో కూడియుండియు (దాసీజనము) నేల పై పండుకొని లేవకుండెను.

కాశ్చిచ్చామర హస్తాశ్చ కాశ్చిత్సూక్ష్మాంశుకాంబరాః

కాశ్చిత్తాంబూల హస్తాశ్చ కాశ్చిన్మాలా కరావరాః

వాసితోదకరాః కాశ్చీత్ కాశ్చిత్పద్మకరా పరాః

కాశ్చీత్సిందూర హస్తాశ్చ పానహస్తాశ్చ కాశ్చన

రత్నాలంకారహస్తాశ్చ కాశ్చిత్కల వాహికాః

వేణు వీణాకరాః కాశ్చీత్ కాశ్చిత్కంకతికాకరాః

కాశ్చిదావీర హస్తాశ్చ యంత్రహస్తాశ్చ కాళ్ళన

సుగంధతైలహస్తాశ్చ కాశ్చన ప్రమదోత్తమాః

కరతాలకరాః కాశ్చిద్దేందుహస్తాశ్చ కాశ్చన

కాశ్చీన్మృదంగ మురజ మురళీ తాన కారకాః

సంగీతనిపుణాః కాశ్చీత్కాశ్చిన్నర్తన తత్పరాః

క్రీడావస్తుకరాః కాశ్చీన్మధుహస్తాశ్చ కాశ్చన

సుధా పాత్రకరాః కాశ్చిదంఘ్రి పీఠకరాః పరాః

వేషవస్తుకరాః కాశ్చిత్కాశ్చిచ్చరణ సేవికాః

పుటాంజలీకరాః కాశ్చిత్కాశ్చిత్ స్తుతి పరాపరాః

ఏవం కతివిధాః సంతి రాధికాపురతో మునే

బహిర్దేశస్థితాః కాశ్చిత్కోటిశః కోటిశస్సదా

కాశ్చిద్ద్వారనియుక్తాశ్చ వయస్యా వేత్రధారికాః

కృష్ణ మభ్యంతరం గంతు న దదుర్ద్వార సంస్థితాః

ఓ నారదమునీ రాధికాదేవి ముందర చామరములు ధరించి కొందరు సన్నని మేలి వస్త్రములు కలవారు కొందరు తాంబూల ద్రవ్యములు పట్టుకొని కొందరు పూలమాలలు పట్టుకొని కొందరు సుగంధ జలము ధరించి కొందరు పద్మములు పట్టుకొని కొందరు సిందూరము పట్టుకొని కొందరు మంచినీరు పట్టుకొని కొందరు రత్నాలంకారములు చేత పట్టుకొని కొందరు కాటుక బరీణలు పట్టుకొని కొందరు వేణువు, వీణలను పట్టుకొని కొందరు ఆవీరమును చేత బట్టి కొందరు జలయంత్రము (చిమ్మెన గొట్టము) లు పట్టుకొని కొందరు సువాసన తైలములతో కొందరు కరతాళములు కందుకము (బంతులు) గలవారు కొందరు మృదంగములను మురజములను మ్రోగించువారు కొందరు, కొందరు సంగీత నిపుణలు మరి కొందరు నర్తనము చేయువారు క్రీడా వస్తువులు ధరించి కొందరు సుధామధువుల పాత్రలు ధరించి కొందరు పాదపీఠములలో కొందరు అలంకార వస్తువులతో కొందరు పాద సేవ చేయువారు కొందరు చేతులు జోడించుకొని కొందరు స్తోత్రములు చేయుచు కొందరు చెలికత్తెలుండిరి. అంతఃపురము చుట్టు గుంపులు గుంపులుగా కొందరు ద్వారపాలికలుగా కొందరు నేత్రములు ధరించియు ఉండిరి. ద్వారమునందున్న వారు శ్రీకృష్ణుని లోనికేగనీయకుండిరి.

పురః స్థితం తం ప్రాణేశం రాధాపునరువాచ సా నానురూపమత్యకథ్యమయోగ్యమతికర్కశం

ముందున్న ప్రాణేశుని చూచి రాధాదేవి అతిగర్వముతో అయోగ్యము అననురూపము (తగని) అతికర్కశముగా ఇట్లు పలికెను.

రాధికోవాచ :

హే కృష్ణ విరజాకాంత గచ్చ మత్పురతో హరే

కథం దునోషి మాం లోల రతి చౌరాతిలంపట

శీఘ్రం పద్మావతీం గచ్ఛ రత్నమాలాం మనోరమాం

అథవా వనమాలాం వా రూపేణాప్రతిమాం వ్రజ

హేనదీకాంత దేవేశ దేవానాం చ గురోర్గురో

మయా జ్ఞాతోఽసి భద్రం తే గచ్చ గచ్చ మమాశ్రయాత్

శశ్వత్తే మానుషాణాం చ వ్యవహారస్య లంవట

లభతాం మానుషీం యోనిం గోలోక్దాద్ర్వజ భారతం

హే సుశీలే శశికళే హే పద్మావతి మాధవి

నివార్యతాం చ ధూర్తోఽయం కి మస్యాత్ర ప్రయోజనం

రాధ ఇట్లు పలికెను :

ఓ కృష్ణా! విరజావల్లభా నాముందు నుండి పొమ్ము. ఓ చపలుడా విషయాసక్తుడా నన్నెందుకు బాధింతువు. పద్మావతి వద్దకు గాని నీమనోరమమైన రత్నమాల వద్దకు గాని అతి సుందరియైన వనమాల వద్దకు గానీ పొమ్ము. ఓ నదీకాంతుడా దేవదేవేశా నీ వ్యవహారములన్నియు తెలిసినవి. నీకు భద్రమగు గాక. ఇచటి నుండి వెడలి పొమ్ము. ఎప్పుడు కూడ మనుష్య వ్యవహారములందు నీకాసక్తి. కావున నీకు మనుష్య జన్మ కలుగుగాక. ఈ గోలోకము నుండీ భరత ఖండమునకు పొమ్ము. ఓ సుశీలా ఓ శశికళా ఓ మాధవీ ఈ ధూర్తునీకిచట ఏమీ ప్రయోజనము. వెడలగొట్టండి.

రాధికా వచనం శ్రుత్వాః తమూచుక్టోపికా హరిం

హితం తథ్యం చ వినయం సారం యత్సమయోచితం

కాశ్చిదూచురితి హరే గచ్చ స్థానాంతరం క్షణం

రాధాకోపాపనయనే హ్యాగమిష్యామ హే వయం

కాశ్చిదూచురితి ప్రీత్యా క్షణం గచ్ఛ గృహాంతరం

త్వయైవ వర్ధితా రాధా త్వాం వినా కం చ వక్ష్యతి

కాశ్చిదూచురితి ప్రేమ్ణా రాధికాయాం హరిం మునే

క్షణం బృందావనం గచ్ఛ మానాపనయనావధి

కాశ్చిదిత్యూచురీశం చ పరిహాస పరం వచః

మానాపనయనం భక్త్యా మానిన్యాః కురు కాముక

కాశ్చనోచురితీశం తం యాహి జాయాంతరం తవ

లోలుపస్య కథం నాధ కరిష్యామో యథోచితం

కాశ్చనోచురితి హరిం సస్మితం పురతః స్థితం

గత్వా సమీపముత్థాయ మానాపనయనం కురు

కాశ్చనోచురితి ప్రాణనాథం గోప్యో దురక్షరం

కః క్షమః సాంప్రతం ద్రష్టుం రాధికాముఖ పంకజం

కాశ్చనోచురితి విభుం ప్రజ స్థానాంతరం హరే

కోపాపనయనే కాలే పునరాగమనం తప

కాశ్చనోచురితీదం తం ప్రగల్భాః ప్రమదోత్తమాః

వయం త్వాం దారయిష్యామో న చేద్యాహి గృహాంతరం

కాశ్చిన్నివారయామాసుర్మాధవం ప్రమదోత్తమాః

స్మితవక్షం చ సర్వేశం స్వస్థమక్రోధమీశ్వరం

రాధాదేవి మాటలు విని గోపికలు హితము సత్యము సమయోచితము సారవంతములైన వినయ వాక్యములు హరితో పలికిరి. ఓ శ్రీహరి క్షణము సేపు వేరొకచోటికి పొమ్ము. రాధాదేవి కోపము తొలగిపోగానే మీ వద్దకు వచ్చి తల్చుదుము అని కొందరనిరి. కొందరు క్షణము సేపు వేరొక యింటికి పొమ్ము. ప్రేమతో నీవు పెంచిన రాధ నిన్ను తప్ప ఎవరిని ఇట్లు పలుకును! అనిరి. మరికొందరు రాధికయందలి ప్రేమలో ఆమె కోపము తొలగిపోవునంతవరకు ఒక క్షణము బృందావనమునకు పొమ్మనిరి. ఇంక కొందరు పరిహాస వాక్యముగా ఈశునితో ఇట్లు “ఓ కాముకుడా! భక్తితో మానిని (అభిమానవతి) కోపమును తీర్చుము” అనిరి. ఇంకను కొందరు లోలుడవగు నీకు యోగ్యమైన మర్యాదలెట్లు చేయుదుము. వేరొక భార్య వద్దకు పొమ్ము అనిరి. మరికొందరు హరికి ఎదురుగా నిలిచి చిరునవ్వుతో “ఆమె వద్దకు పోయి లేపి కూర్చుండబెట్టి కోపము తీర్చుము” అనిరి. ఇంక కొందరు గోపికలు రాధ ముఖమును చూచుటకెవడు సమర్థుడు అని కఠినముగా పలికిరి. మాటలు నేర్చిన మరికొందరు స్త్రీలు కృష్ణా నీవు ఇంకొక గడప తొక్కని యెడల ఆమెతో నిన్ను కూర్చుదుము అనిరి. అందరి మాటలు విని చిరునవ్వుతో కోపము లేక నిలిచియున్న ఆ ప్రభువును కొందరు లోనికి పోనీయక అడ్డగించిరి.

గోపీభిర్వార్యమాణే చ జగత్కారణ కారణే

సద్యశ్చుకోప శ్రీదామా హరౌ గేహాంతరం గతే

కోపాదువాచ శ్రీరామా రాధికాం పరమేశ్వరీం

రక్త పద్మేక్షణాం రుష్టాం రక్త వంకజ లోచనః

జగత్సృష్టికి బ్రహ్మాదులకు మూలమైన శ్రీహరి గోపికలడ్డగించగా వేరొక గృహమున కేగుటను చూచి శ్రీదాముడు వెంటనే కోపించి కనులేర్రన చేసి భర్త మీది అలుకతో కనులేర్రబడియున్న పరమేశ్వరి అగు రాధాదేవితో ఇట్లనెను.

శ్రీదామోవాచ :

కథం వదసి మాతస్త్వం కటువాక్యం మదీశ్వరం

విచారణాం వినా దేవి కరోషి భర్త్స్రనం వృధా

బ్రహ్మానంతేశ దేవేశం జగత్కారణ కారణం

వాణీపద్మాలయా మాయా ప్రకృతీశం చ నిర్గుణం

స్వాత్మారామం పూర్ణకామం కరోషి త్వం విడంబనం

దేవీనాం ప్రవరా త్వం చ నిబోధ యస్య సేవయా

యస్య పాదార్పనేనైవ సర్వేషామీశ్వరీ వరా

తన్న జానాసి కల్యాణి కిమహం వక్తుమీశ్వరః

భౄ భంగ లీలయా కృష్ణః స్రష్టుం శక్తశ్చ త్వద్విధాః

కోటిశః కోటిశో దేవ్యస్తం న జావాసీ నిర్గుణం

వైకుంఠే శ్రీహరేరస్య చరణాంబుజ మార్జనం

కరోతి కేశైః శశ్వచ్ఛ్రీః సేవనం భక్తి పూర్వకం

సరస్వతీ చ స్తవనైః కర్ణపీయూష సుందరైః

సతతం స్తౌతి యం భక్త్యా తం న జానాసి తమీశ్వరం

భీతా చ ప్రకృతిర్మాయా సర్వేషాం బీజరూపిణీ

సతతం స్తౌతి యం భక్త్యా తం న జానాసి మానీని

స్తువంతి సతతం వేదా మహిమ్నః షోడశీం కలాం

కదాపి న వీజానంతి తం న జానాసి భామిని

వక్త్రైశ్చతుర్భిర్యం బ్రహ్మ వేదానాం జనకో విభుః

స్తౌతి సేవాం చ కురుతే చరణాంబుజమీశ్వరి

శంకరః పంచభిర్వక్త్రైః స్తౌతి యం యోగినాం గురుః

సాశ్రుపూర్ణః సవులకః సేవతే చరణాంబుజం

శేషః సహస్ర వదనైః పరమాత్మానమీశ్వరం

సతతం స్తౌతి యం భక్త్యా సేవతే చరణాంబుజం

ధర్మః పాతా చ సర్వేషాం సాక్షీ చ జగతాం పతిః

భక్త్యా చ చరణాంభోజం సేవతే సతతం ముదా

శ్వేతద్వీప నివాసీ యః పాతా విష్ణుః స్వయంవిభుః

తస్యాంశశ్చ తథా యం యం ధార్యతేఽప్యక్షరం పరం

సురాసుర మునీంద్రాశ్చ మనవో మానవా బుధాః

సేవతే న హి పశ్యంతి స్వప్నేఽపీ చరణాంబుజం

క్షిప్రం రోషం పరిత్యజ్య భజ పాదాంబుజం హరేః

భ్రూభంగ లీలామాత్రేణ సృష్ఠి సంహర్తురేవ చ

నిమేష మాత్రాద స్యైవ బ్రహ్మణః పతవం భవేత్

య స్యైక దీవసేఽప్యషా వింశతీంద్రాః పతంత్యపి

ఏవమష్టోత్తర శతమాయుర్యస్య జగద్విధేః

త్వం వా కాఽన్యాశ్చ వా రాధే మదీశ్వరవశేఽఖిలం

శ్రీరాముడిట్లు పలికెను :

ఓ తల్లీ! నో ప్రభువును కటువాక్యములేట్లు పలుకుచున్నావు. ఆలోచన లేకుండ బెదిరించుచున్నావు. ఇదీ వ్యర్ధము. బ్రహ్మ అనంతుడు (ఆదిశేషుడు) ఈశ్వరుడు (శంకరుడు) మొదలగు దేవతలకు ప్రభువు. జగన్మూలమునకు మూలమైనవాడును సరస్వతి లక్ష్మీ మాయ ప్రకృతులకు ఈశుడును, నిర్గుణుడు, స్వాత్మారాముడు, పూర్ణకాముడు (కోర్కెలు నిండినవాడు) ఐన స్వామిని నీవు నిందించుచున్నావు. నీవు అతని సేవ మరియు పాదార్చనల వలననే అందరు దేవేరులలో శ్రేష్ఠురాలవు నాయకివి ఐతివికదా. ఓకల్యాణీ! అది ఎరుగకుంటివి. నేనేమీ చెప్ప సమర్థుడను. శ్రీ కృష్ణుడు తన భ్రూ విలాసము చేతనే (బొమ్మముడీ) నీవంటి దేవేరులను కోటానుకోట్లు సృష్టించు శక్తి కలవాడు. నిర్గుణుడగు నతనిని గుర్తించవైతివి. శ్రీవైకుంఠమున శ్రీదేవి భక్తిపూర్వకముగా తన శిరోజముల (తలవెండ్రుకల)తో ఈ శ్రీహరి పాదపద్మములను తుడుచుచు మాటి మాటికి సేవలు చేయుచుండును. సరస్వతీ దేవి కర్ణామృతమైన స్తోత్రములతో ఎల్లప్పుడు భక్తిగీతములు పాడును. అట్టి ప్రభువును నీవెరుగకుంటివి. జీవకోటికి బీజరూపమైన మాయా ప్రకృతి స్వామికి భయపడుచు ఎల్లప్పుడు భక్తితో స్తుతించును. అట్టివానీ నేరుగవైతివి. ఆ మహాత్ముని ఎల్లప్పుడు స్తుతించుచున్న వేదములును ఆతని మహిమలోని పదహారవ భాగమును కూడ సరిగా నెరుగవో అట్టి మహాభాగునీ నీవెరుగకుంటివి. వేదములకు జనకుడైన బ్రహ్మ తన నాలుగు ముఖములతో సుతించుచు స్వామి పాద సేవ చేయునమ్మా. యోగిజనులకు గురువగు శంకరుడును శరీరము పులకరింపగా ఆనందబాష్పములు రాలగా తన పంచముఖములతో స్తుతించుచు వారి చరణాంబుజములు సేవించును. ఆదిశేషుడు తన వేయినోళ్ళతో ఎల్లప్పుడు స్తుతించుచు ఆ పరమాత్మ పాదపద్మములను భక్తితో సేవించును. ధర్మపాలకుడు జీవుల కర్మలకు సాక్షి జగత్నాలకుడు అగు ధర్మదేవత కూడ భక్తి సంతనములతో అతని పాదపద్మములను సేవించును. శ్వేతద్వీపమున నివసించుచు జగములను పాలించు విష్ణువితడే. అతడును అతని అంశలే వ్యక్తావ్యక్తములను ధరించును, దేవదానవులు, మునిగణములు, మానవులు వారి సంతతియు పండితులును అతని సేవలు చేసినప్పటికీ స్వప్నములో కూడ అతని చరణాంబుజములను దర్శించలేరు. ఒక్క బొమ్మముడి పాటుతోనే సృష్ట సంహారములు చేయగల శ్రీహరి పాదపద్మములను భజింపుము. కోపమును త్యజించుము.

సృష్టికర్తయగు బ్రహ్మ జీవితకాలము నూట ఎనిమిది పరమాయు వర్షములు. ఆ బ్రహ్మయొక్క ఒకదినములో ఇరువది ఎనిమిది మంది ఇంద్రులు కూలిపోదురు. అట్టి సృష్టికర్త శ్రీహరి యొక్క కనురెప్ప పాటు కాలములో ఆయువు ముగిసి రాలిపోవును. రాధాదేవి నీవును ఇతర స్త్రీలందరును సర్వము నా ప్రభువు ఆధీనములోని వారే.

శ్రీదామ్నో వచనం శ్రుత్వా కేవలం కటుముజ్జ్వలం

సద్యశ్చుకోప సా బ్రహ్మన్ సద్యః ప్రాణేశ్వరీ హరేః

రాసేశ్వరీ బహిర్గత్వా తమువాచ హ నిష్ఠురం

స్ఫురదోష్ఠీ ముక్తకేశీ రక్తాంభోరుహలోచనా

రాధికోవాచ :

రేరే జాల్మ మహా మూఢ శృణు లంపట కింకర

త్వం చ జానాసి సర్వార్ధం న జానామీ త్వదీశ్వరం

త్వదీశ్వరశ్చ శ్రీకృష్ణో న హ్యస్మాకం ప్రజాధమ

జానామి జనకం స్తౌషి సదా  నిందసి మాతరం

యథాఽసురాశ్చ త్రిదశాన్  నిత్యం నిందంసి సంతతం

తథా నిందంసి  మాం మూఢ తస్మాత్త్వమసురో భవ

గోప ప్రజానురీం యోనిం గోలోకాచ్చ బహిర్భవ

మయాఽద్య శష్తో మూఢస్త్వం కస్త్వాం రక్షితుమీశ్వరః

రాసేశ్వరీ తమీత్యుక్త్వా సుష్వాప వీరరామ చ

వయస్యాః సేవయామానుశ్చామరై రత్నముష్టిభిః

ఓ నారదా! శ్రీదాముని తీవ్రమైన నీష్ణురవాక్యములు విని శ్రీహరి ప్రాణేశ్వరియు రాసమండలసాయికయు అగు రాధ బయటకు పచ్చి తలముడి విడిపోగా పెదవులు వణకగా కనులెర్రచేసి నిష్ఠురముగా అతనితో ఇట్లు పలికెను. ఓరీ! నీచుడా! తెలివిమాలినవాడా! లాలసునిబానిసా అన్ని విషయములు నీవెరుగుదువు. నేను నీ ప్రభువు తత్వమెరుగనా? అధముడా! శ్రీకృష్ణుడు నీకు ప్రభువు. మాకు కాదు. వెళ్లుము. తండ్రినీ పొగడుచు సదా తల్లిని నిందించుచుంటివి. ఎప్పుడును దేవతలను రాక్షసులు నిందించునట్లు నన్ను నిందించుచుంటివి. అందుకు నీవు రాక్షసుడవు కమ్ము. గోలోకము నుండి బయటకు వెళ్లి రాక్షస జన్మను పొందుము. నాచేత శపించబడిన నిన్ను ఎవడు రక్షించును? రాధాదేవి ఇట్లు పలికి మూర్ఛిల్లెను. ఆమె చెలికత్తెలు రత్నాల పిడులు గల వింజామరలు విసిరి ఆమెకు సేవలు చేసిరి.

శ్రుత్వా చ వచనం తస్యాః కో పేన స్ఫురితాధరః

శశాప తాం చ శ్రీదామా ప్రజ యోనిం చ మానుషీం

శ్రీ దామోవాచ :

మానుష్యా ఇవ కోపస్తే తస్మాత్వం మానుషీ భువి

భవిష్యసి న సందేహో  మయా శప్తా త్వమంబికే

ఛాయయా కలయావాఽపి వరశక్త్యా కలంకినా

మూఢా రాపాణపత్నీం త్వాం వక్ష్యంతి జగతీ తలే

రాపాణః శ్రీహరేరంశో వైశ్యో బృందావనే వనే

భవిష్యతి మహాయోగీ రాధా శాపేణ గర్భజః

గోకులే ప్రావ్య తం కృష్ణం వీహరిష్యసి కాననే

భవితా తే వర్షశతం విచ్ఛేదో హరిణా సహ

పునః ప్రాప్య తమీశం చ గోలోకమాగమిష్యసి

తమిత్యుక్త్వా చ నత్వా చ స జగామ హరేః పురః

గత్వా ప్రణమ్య శ్రీకృష్ణం శాపాఖ్యానమువాచ హ

అనుపూర్వ్యాత్తు తత్సర్వం రురోధ చ భృశం వునః

రాధాదేవి వచనములు విని శ్రీరాముడు పెదవులు వణకగా కోపముతో మనుష్య జన్మమెత్తుముని శపించెను.

శ్రీదాముడిట్లనెను :

సామాన్య మనుష్య స్త్రీకి వలె నీకు కోపమున్నది. కనుక నీవు భూమి మీద మనుష్య స్త్రీవగుదువు. పరశక్తి యొక్క కలంకపు నీడయో లేక అంశయో నీకు క్రోధావేశము కల్గించినది. భూమండలమున బృందావనములో శ్రీహరి అంశతో రాపాణుడను వైశ్యుడు ఉండును. అవివేకులు నిన్ను ఆ రాపాణుని భార్య వని చెప్పుకొందురు. మహాయోగియగు శ్రీహరి నీ శాపము వలన గోకులమున జన్మించును. నీవతనిని పొంది బృందావనమున విహరింతువు. నీవు వంద సంవత్సరములు శ్రీహరి వియోగముననుభవించి మరలనతనిని పొంది గోలోకమునకు వత్తువు. ఇట్లు పలికి ఆమెకు నమస్కరించి శ్రీహరి వద్దకు పోయి క్రమముగా శాపవృత్తాంతమంతయు చెప్పి నమస్కరించి మిక్కిలి ఏడ్చెను.

ఉవాచ తం రుదంతం చ గచ్ఛ త్వం ధరణీతలం

న జేతా తే త్రిభువనే హ్యసురేంద్రో భవిష్యసి

కాలే శంకరశూలేన దేహం త్యక్త్వా మమాంతికం

ఆగమిష్యసి పంచాశద్యుగాంతే తు మమాశిషా

ఏడ్చుచున్న శ్రీరామునితో శ్రీహరి ఇట్లనెను. భూలోకమునకు పొమ్ము. ముల్లోకములందు ఓటమి లేని రాక్షసేంద్రుడవగుదువు. అంత్యకాలమున ఏబది యుగముల తర్వాత శంకరుని శూల ప్రహారముతో శరీరమును విడిచీ నా ఆశీస్సుల బలమున తిరిగి నా సన్నిధికి చేరుదువు.

శ్రీకృష్ణస్య వచః శ్రుత్వా తమువాచ శుచాన్వితః

త్వద్భక్తి రహితం మాం చ కదాచిన్న కరిష్యపి

ఇత్యుక్త్వా శ్రీహరిం నత్వా జగామ స్వాశ్రమాదృహిః

శ్రీకృష్ణుని మాటలు విని శ్రీరాముడు దుఃఖముతో నన్ను నీభక్తిరహితునిగా ఎన్నడు చేయవు గదా అని స్వామికి నమస్కరించి ఆశ్రమము వదలి వెళ్లెను.

పశ్చాజ్జగామ సా దేవీ రురోధ చ పునః పునః

క్వ యాసి  వత్సేత్పుచ్చార్య విలలాప భృశం సతీ

శ్రీదామాఽపి చ తాం నత్వా రురోద ప్రేమ విహ్వలః

స ఏవ శంఖచూడశ్చ బభూవ తులసీపతిః

రాధాదేవియు కొడుకా ఎక్కడపోవుచుంటివని మిక్కిలి ఏడ్చుచు వెనుక వెళ్లెను. ప్రేమ విహ్వలుడు అగు శ్రీదాముడును ఆమెకు మొక్కి దుఃఖించెను. అతడే తులసీ భర్తయగు శంఖచూడుడుగా జన్మించెను.

గతే శ్రీదామ్నీ సా దేవీ జగామేశ్వర సన్నిధిం

సర్వం నివేదయామాన హరిః ప్రత్యుత్తరం దదౌ

శోకాతురాం చ తొం కృష్ణో బోధయామాస ప్రేయసీం

శంఖచూడశ్చ కాలేన సంప్రాప పునరీశ్వరం

రాధా జగామ ధరణీం వారా హే హరిణా సహా

వృషభానుగృహే జన్మ లలాభ గోకులే మునే

శ్రీదాముడు వెళ్లిపోగా రాధాదేవి హారిసన్నిధిని చేరి సంఘటనను పూర్తిగా నివేదించెను. శోకముతో బాధపడు ప్రియురాలిని శ్రీహరి ఓదార్చి జ్ఞాన బోధగావించెను. శంఖచూడుడు శాపాంతమున మరల స్వామి సన్నిధిని పొందెను. వరాహకల్పమున శ్రీహరితో పాటు రాధాదేవి ధరణికి వచ్చి గోకులమున వృషభాసుని ఇంట జన్మనెత్తెను.

ఇత్యేవం కథితం నర్వం శ్రీకృష్ణాఖ్యాన మంగళం

సర్వేషాం వాంఛితం సారం కీం భూయః శ్రోతుమిచ్ఛసి

ఓ నారదా! అందరు కోరునట్టి మంగళకరమైన శ్రీకృష్ణ కథాసారము మొత్తము నీకిట్లు చెప్పితిని. ఇంకను ఏమి వినగోరుచున్నావో తెలుపుమనెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే సప్తసముద్ర జన్మ రాధా శ్రీదామ శాపోద్భవో నామ తృతీయోఽధ్యాయః

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములో శ్రీకృష్ణజన్మఖండమున నరనారాయణ సంవాదమున సప్తసముద్ర జన్మము రాధాశ్రీదాముల శాపప్రకారము అను మూడవ అధ్యాయము.