లింగ మహా పురాణము

Table of Contents

39 - షోడశ మహాదానములలో పదునొకండవ హిరణ్యాశ్వదానమును వివరించుట

అశ్వమేధయాగఫలమును మించిన ఫలము నొసగు హిరణ్యాశ్వదానముఁదగు విధానము ఎట్లనఁగా?

అశ్వమును - నాలుగు కాళ్లపై ముఖముపైనను తెలుపు అను పంచలక్షణములు కలిగియుండునట్లు యథాశక్తి బంగారముతో చేయించవలెను.

మరియు సమస్త ఆయుధములతో గూడ ఇంద్రరథమును యథాశక్తి బంగారము లేక వెండితో చేయించి - రథాగ్రమధ్యన సువర్ణాశ్వమును ఉచ్చైః శ్రవసముగా నెలకొలిపి పూజించియు ఇంద్రరథమునకు తూర్పునండు విద్వాంసుడైన సద్ర్బాహ్మణుని - దేవేంద్ర భావనతో నర్చించి - రథము నశ్వమును, సువర్ణదక్షిణ, నస్త్ర యుగ్మము అనువానితో భోజన తాంబూలములతోడను దానమొనరు. దానికి స్వర్గసుఖము చిరకాలము లభించును.

సువర్ణాశ్వప్రదాత - బ్రాహ్మణులకు, దీనులకు, అంధులకు, దరిద్రులకు, అనాథులకు, బాలురకు, వృద్ధులకు, కృశులకు, రోగార్తులకును అన్నదానముఁజేసి - వారిని సంతోషింపఁజేయవలెను.

ఇట్లు చేసినచో - స్వర్గమున ఇంద్రభోగములను చిరకాలము అనుభవింపఁబడుటే గాక - ప్రారబ్ధాంతమున కోటీశ్వరుఁడై భువిని - జన్మించుట సంఘటించును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (39)వ యధ్యాయము.