లింగ మహా పురాణము
97 - జలంధర వధోపాఖ్యానము
“పరమేశ్వరుడు ఇంద్రసమానుఁడైన జలంధరునెట్లు సంహరించెను? దీనిని వివరింపుము!” అని శౌనకాదులు ప్రశ్నింప రోమహర్షణుడు నలప నారంభించెను.
జలంధరుడు సముద్రమునందు శిఫాలాగ్నిచే ముద్భవించి తపస్సుచే దేవ గంధర్వయక్షో రగాడులచే అవధ్యుడగునట్లు ‘బ్రహ్మవరము నార్జించి అమితపరాక్రమము గలవాడై బ్రహ్మద్యమరుల నోడించి దేవదేవుఁడగు విష్ణువును గెలుచుబుకు బయలుదేరి తలపడినందున వారిద్దరికి రేయింబవళ్లు ఘోరమైన పోరాటము కాగా శ్రీహరి పరాజితుడయ్యెను. ఆ తరువాత “హరి బ్రహ్మాదుల సందరి నోడించితిని. ఇక నొక శంకరుడే మిగిలెను గదా ! ఆతనిని జయింప బయలు దేరుదమని” యుద్దేశించి జలంధరుడు దైత్యేంద్రులను వెంట నిడుకొని శంకరుఁజేరఁబోవుచు “రాక్షసులారా ! మహేశ్వరు నోడించిన పిడప మీలో నొక్కొకరికి ఇంద్రపదవిని, బహ్మస్థానమును విష్ణుత్వము నొసగగలను” అని నవంచెను.
జలంధర వాక్యమును దానవులు విని హెచ్చు నినాదములఁజేయు చుండిరి. మృత్యువు తమను మ్రింగుటకు నోరు తెరఱియున్నదని వారు గ్రహింపకుండిరి.
రథగజ తురగ పదాతి సైన్యముతో జలంధరుఁడు శంకరుని సమీపింపగా మేరు పర్వతశిఖరముఁజోరిన జలంధరుని గాంచి “ఇతురంచే సంహరింప నలవిగానివాడు వీడని గుర్తించి జగద్రక్షణతత్పరుఁడైన మహేశ్వరుడు మహేశ్వరితో నందికేశ్వరుని తోడను కూడిన వాడై చిరునగవుతో “అసురేంద్రా! నీకు యుద్ధము అవసరము లేదు. నా బాణ ప్రహారములకు తాళలేక మరణింప గలవు” అని వచింపగా జలంధరుడు కర్ణకఠోరమగు శివవాక్యము నాలకించి “దేవదేవా ! మాటలు వాలించుము ! అనేక శస్త్రాస్త్రములు సుపయోగించుచు నీతో పోరాడుచు కేతెంచితిని.” అని యార్భాటించెను. అంత కైలాసనాథుడు సముద్రమన పాదాంగుష్ఠమును రాచి భయంకరమైన సుదర్శన చక్రమును పుట్టింది . “వక్ష్యజ్ఞహర్త, అంధకాంతకుడు, శమన శిక్షకుడు, పురప్రయాంతకుడు నకుటచే” నవలీలగా నవ్వుచు – “జలంధరా! బలవంతుడవేని ఈ చక్రమును లేపుము!” అని నుడువగా దైత్యధిపతి “గదతో సన్ను నందిని వధించి గరుత్మంతుడు సర్పములను వలె సురలనందరిని సంహ రింపగలను. నా యమ్ముల దెబ్బలకు తాళువారు ముల్లోకములలో లేరు. బాల్యమున బ్రహ్మదేవుని బంధించితిని, యౌవనమున మునిపుంగవుల నోడించితిని. చరాచర ప్రపంచము నంతయు నొకే క్షణమున దహింప సమర్థుడను. రుద్రా ! నీవు తపస్సుతో హరి బ్రహ్మాదులను మించిన వాడు తివా ? ప్రమథగణేశ్వరా ! నా దీర్ఘ బాహువులు భూమిపై ఆకాశమునను చాలనందున పర్వతములను ఢీకొని యొలిపిడి (జేసితిని. ఇత్యాది ప్రగల్భములఁబలుకుచుండగా ఫాలనేత్రాగ్నిజ్వాలాలేశమున దైత్యులందరిని
ఫాలాక్షుడు దహించెను. అంత జలంధరుడు సుదర్శనచక్రమును తన చేతులతో లేవనెత్తగా సిద్ధాని తాకిడితో రెండు తునకలై మరణించెను. జలంధరుని రక్త మాంసములు ఊరి నిండెను.
జలండరుని మరణమును కనుగొనిన దేవగండర్సాములు సంతసించి మహల్యము ని వేనోళ్ల నాని.
ఇయ్యడం
“ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (97)వ అధ్యాయము.
