లింగ మహా పురాణము

Table of Contents

29 -  హిరణ్యగర్భదా సనిరూపణము

క్రిందిపాత్రను యథాశక్తి బంగారుతో చేయించి - అందు గుణత్రయసమన్వితురాలైన పై పాత్రను గూడ - సువర్ణముతో చేయించి దానిపై పరమేశ్వరుని పూజించులుకు పీఠముపై నవవస్త్రమున తండులో పరి స్థాపించవలెను.

దేవీ రుద్ర గాయత్రీ మంత్రములతో హవనము నొనర్చి పార్వతీ పరమేశ్వర ప్రతిమలను విధివిధానముగ నర్చించియు ఆచార్యునకు ఋత్విజులకును భోజనతాంబూల వస్త్ర దక్షిణలను సమర్పించియు - ఆది దంపతుల ప్రతిమల నాచార్యునకు లేక - తన గురువునకు దానమొసగవలెను. ఇట్లు చేయబడునది హిరణగర్భదాన మనబడును.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక“ అను శాంకరీయ

 ఆంధ్రానువాద ప్రవచనమున (29)వ యధ్యాయము.