4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
128 - అధ్యాయము
మూ॥ శ్రీనారాయణ ఉవాచ :
శ్రీభగవానువాచ :
శ్రీ నారాయణుడిట్లా - ఆ శ్రీకృష్ణుడు గోపాలురను కూడా ఆహ్వానించాడు. భాండీర మహావటవృక్షమూలమందు అక్కడ స్వయంగా ఉన్నాడు. (1) బ్రాహ్మణ స్త్రీ సమూహమున్నచోట వారందరికి అన్నము పెట్టాడు. హరివామపార్శ్వమందు రాధికాదేవి ఉన్నది. (2) కుడి భాగంలో నంద గోపుడు, యశోదకూడా ఉన్నారు. వారికి కుడిభాగంలో వృషభానుడున్నాడు. ఆతనికి ఎడమ భాగంలో కళావతి ఉంది. (3) ఇతరులు గోపాలురు, గోపికలు, స్నేహితులు, బాంధవులున్నారు. వారిని గూర్చి గోవిందుడు యధార్థాన్ని ఆసమయానికి తగిన దాన్ని చెప్పాడు. (4) శ్రీభగవానుడిట్లా – ఓనందుడ! ఇప్పుడు సమయానికి తగ్గదాన్నిచెప్తా విను అది సత్యము. యధార్థము పరలోకంలో సుఖాన్నిచ్చేది. (5) బ్రహ్మ మొదలుకొని స్తంబము వరకు అంతా భ్రమమైన దానిని విను. జలములతో ఈవిద్యుద్దీప్తి. నీటిలో బుడగలాంటిది. (6) మథురలో అంతా చెప్పాను. ఏమీమీగుల లేదు. యశోదకు రాధికకదళీ వనంలో బోధించింది. (7) అదే సత్యము పరమమైనది. భ్రమ అనే చీకట్లను వెలిగించేది. మిధ్య మాయనువదలి ఆపరమస్థానమును స్మరించు. (8) జన్మమృత్యు జర, వ్యాధులను హరించేది. మిక్కిలి ఆనందాన్నిచ్చేది. శోకసంతాపములను హరించేది. కర్మల మూలమును కోసివేసేది. (9) పరబ్రహ్మ, భగవంతుడు, సనాతనుడు ఐన నన్నే ధ్యానిస్తూ, ధ్యానిస్తూ, నాపుత్రుడు అనే బుద్ధిని వదలి పరమ పదమును పొందు. (10) గోకుల వాసులతో కూడి నీవు శీఘ్రంగా గోలోకానికి వెళ్ళు. త్వరలో కలివస్తుంది, కర్మమూలములను తెంచేస్తుంది. (11) స్త్రీ పురుషులకు నియమం లేదు. జాతులకు అట్లాగే. బ్రాహ్మణుడు సంధ్యాదులు చేయడు. యవీతమే ఆతని గుర్తు. (12) యజ్ఞోపవీతము, తిలకము తప్ప మిగిలిన వన్నిలోపిస్తాయి. నిశ్చయము. పగలు గ్రామ్యధర్మమందు మునిగితేలుతాడు. ధర్మకర్మలు మానేస్తాడు. (13) యజ్ఞములు, వ్రతములు, తపస్సు ఇవి లోపిస్తాయి. కేదారకన్య శాపంవల్ల ధర్మం ఉండనే ఉండదు. (14) స్త్రీలు స్వేచ్ఛగా విహరించేవారౌతారు. పతి ఎప్పుడూ వారి వంశంలో ఉంటాడు. ఎప్పుడు అతనిని కోడుంది. రాత్రింబగళ్ళు భయ పెడుంది. (15) స్త్రీ కుటుంబములకు స్త్రీలకు ఎప్పుడూ ప్రాధాన్యముంటుంది. ఓ ప్రజ! స్వామి (యజమాని) హరికి ఎల్లప్పుడు భక్తుడు. ఆతడు ఎప్పుడు అవమానింపబడుతాడు.(16) కలిలో స్త్రీలు అందరు జారుని సేవలో తత్పరులౌతారు. వారికి తమ జారుని యందు (ఉపపతి) నూరుగురు కొడుకుల మీదున్నంత ప్రేమ ఉంటుంది. (17) మగనికి ఆహారాన్ని భృత్యునకిచ్చినట్లు కోపంతో ఇస్తుంది. జారునకు నవ్వుతూ, ఓరచూపులు చూస్తూ, అమృతపు దృష్టితో ఎప్పుడూ ఆహారమిస్తుంది. (18) జారునికోరికతో చూస్తుంది. పతిని ఎప్పుడూ విషదృష్టితో చూస్తుంది. జారుని బంధువుల పై ఎల్లప్పుడు గౌరవము. వారిపై స్నేహము గూడా. (19) ప్రతిరోజు భర్తను చేతితో కొడ్తుంది. మధురమైన ఆహారాన్ని శ్రద్దతో భక్తితో జారునకిస్తుంది.
స్త్రీ, వేషం వేసుకొని ఉంటుంది (అలంకరించుకొని) జారుని సేవకు తత్పరురాలై ఉంటుంది. ప్రాణములు, బంధువు, గతి, ఆత్మ ఇవన్నీ స్త్రీకి కలిలో జారుడే (21) అతిథి సేవలోపిస్తుంది. విష్ణు సేవలోపిస్తుంది. పితరుల అర్చన,దేవతల అర్చనకూడా లోపిస్తుంది. (22) నరుడు విష్ణు ద్వేషి, వైష్ణవ ద్వేషి ఔతాడు, ఎప్పుడూ. వామమంత్రాల నుపాసిస్తారు,నాలుగు వర్ణముల వారు దానియందే ఆసక్తులై తారు. (23) సాలగ్రామము, తులసి, కుశలు, గంగాజలము వీటిని మేచ్ఛాచారపరుడై ధూర్తమానవుడు ఎప్పుడూ ముట్టడు. (24) కారణములకు కారణాన్ని, అందరికి అన్నిటికి బీజాన్ని నేను, సుఖమిచ్చేవాడిని, మోక్షమిచ్చేవాడిని, ఎప్పుడూ అన్ని సంపదలనిచ్చే వాడిని (25) నన్ను వదలి మిక్కిలి భక్తితో క్షుద్ర సంపదలనిచ్చే వేదములను చంపే వామమంత్రాన్ని విప్రుడు మాయవల్ల జపిస్తాడు. (26) సనాతనియైన విష్ణుమాయ వానిని వంచిస్తుంది. నా ఆజ్ఞతో భగవతిలోకులకు దాటరానిది (27) కలిలో పదివేలసంవత్సరాలు నా పూజభూమి పై ఉంటుంది. అందులో సగము సంవత్సరాలు గంగ, భూమిని పవిత్రం చేసేదిగా ఉంటుంది. (28) తులసి, విష్ణు భక్తులు, గంగ ఉన్నంత వరకు, కీర్తన ఉన్నంతవరకు, స్వల్పపురాణములు అంతవరకే ఉంటాయి. (29) ఓవజ! దీని అంతంలో కలిలో నన్ను గూర్చిగొంతెత్తి కీర్తన చేయుటము ఉండదు. కిరాతులు, బలవంతులు, శఠులు ఒకే వర్ణము వారౌతారు. (30) పితృసేవ గురు సేవ దేవతల, విప్రుల సేవ వీనిని, నరులంతా వదలి పెడతారు, అట్లాగే అతిథి సేవకూడా చేయరు. (31) భూమిపంటలు లేకుండా ఔతుంది. అది ఎల్లప్పుడూ వర్షాలు లేకుండా ఔతుంది. చెట్లు పండ్లు లేకుండా ఔతాయి, నదులు నీళ్ళు లేకుండా ఔతాయి. (32) బ్రాహ్మణుడు వేదం లేకుండా ఔతాడు. రాజు బలం లేకుండా ఔతాడు. జనులంతా జాతిహీనులౌతారు. మ్లేచ్ఛుడు రాజౌతాడు. (33) కొడుకు, తండ్రిని సేవకుని కొట్టినట్టు కొడాడు. శిష్యుడు గురువును అట్లాగే చేస్తాడు. భార్య, భర్తను కొడుతుంది. గృహస్థు లుబ్ధురాలైన కోడివలె (లుబునివద్ద కోడివలె) ఉంటాడు. (34) కలిమిగులుదలలో పాపులు, లోకములన్ని నశిస్తాయి. కొందరు, సూర్యుల వేడిమి వలన కొందరు నీటి సమూహంతో చస్తారు. (35) ఓవైశ్య శ్రేష్ఠ! కలి ఉండగా భూమి నశించదు. తిరిగి సృష్టి ఔతుంది, నిజము. సృష్టికి సత్యమే బీజము. (36) ఇంతలో ఓవిప్ర! మనోహరమైన రథము వైశాల్యంలో నాలుగు యోజనములు పైన ఐదు యోజనములు కలది (37) శుద్దమైన స్పటికము వలె ప్రకాశిస్తూ, వజ్రములతో నిర్మింపబడి, వాడిపోని పారిజాతపు పూలమాలల సమూహంతో వెలిగిపోతూ (38) కౌస్తుభమణుల అలంకారములతో అలంకరింపబడి, అమూల్యమైన రత్నముల కలశములు కలిగి వజ్రాల హారములు వేలాడుతుండగా (39) మనోహరమైనవేలకోట్ల మందిరములతో కూడుకొని, రెండు వేల చక్రములు, రెండువేల గుర్రాలు కలిగి (40) సూక్ష్మమైన వస్త్రముతో కప్పబడి కోటిగోపికలతో చుట్టబడి ఉన్న గోలోకం నుండి వచ్చిన రథాన్ని, వేగంగలదానిని, ప్రజమందు త్వరగా చూచారు. (41) కృష్ణుని ఆజ్ఞతో దానినెక్కి ఉత్తమమైన గోలోకానికి వెళ్ళారు. కళావతి దేవి, అయోని సంభవ రాధ ఇద్దరు ధన్యలు (42) గోలోకం నుండి వచ్చిన గోపికలు వారంతా అయోనిసంభవలే. వారంతా శ్రుతులకు భార్యలు, తమ శరీరంతో, ఓ నారద!
చాలా నిశ్చితమైన తమ నశ్వర శరీరములను అంతా వదిలి, గోకుల వాసులతో కూడా రాధాగోలోకానికి వెళ్లింది. (44) నానా రత్నములతో ప్రకాశిస్తున్న విరజా తీరాన్ని చూచింది. ఓవిప్ర! దాన్ని దాటి శతశృంగపర్వతానికి వెళ్ళింది. (45) నానా మణుల సమూహంతో నిండిన, రాసమండలంతో అలంకరింపబడ్డదది. పిదపకొద్ది దూరంలోని బృందావన వనానికి వెళ్ళింది. (46) అక్కడ ఆమె అక్షయవటాన్ని చూచింది. పైకి మూడు వందల యోజనముల వరకుంది, నూరుయోజనముల విస్తీర్ణము గలది. నూరుకోట్ల శాఖలతో చుట్టబడింది. (47) ఎర్రరంగు గల ఫలసమూహములు, చాలా పెద్దవి అలంకరించి ఉన్నాయి. వేయికోట్ల గోపికలతో వృందమనోహరంగా ఉంది. (48) వ్రజముననుసరించి ఆదరంగా నవ్వుతూ ఆమె వెళ్ళింది. రథమునుండి వేగంగా దిగిన రాధను ఆమె నమస్కరించింది. (49) ఆరాసేశ్వరితో మాట్లాడి తన ఇంటికి వచ్చింది. రమ్యమైన రత్న సింహాసనమందు, వజ్రాలహారముతో కూడిన (50) ఆమెను వృంద పాద సేవ చేసే కొరకు కూర్చోబెట్టింది. ఏడుగురు సఖురాళ్ళతో తెల్లని చామరములతో సేవింపబడేది. (51) దానిని చూడటానికి ఆపరమేశ్వరిని చూసేందుకు గోపికలంతా వచ్చారు. ఈ రాధ విడివిడిగా నందాదులకు వాసం కల్పించింది. (52) ఆమె పరమానంద రూపురాలు, పరమానంద పూర్వకముగా వాసంకల్పించింది. గోపికలతో కూడా మహారమ్యమైన తన గృహమందు ఉండుటకు బయలుదేరింది. (53) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు నూట ఇరువది ఎనిమిదవ అధ్యాయము.
