4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
28 - రాసక్రీడా ప్రస్తావము
నారద ఉవాచ - నారదుడు పలికెను :
మూడు మాసములు గడచిన తరువాత ఆ గోపికలకు ఏ ప్రకారముగా శ్రీకృష్ణునితో శరీరసంగమము జరిగెను. బృందావన మెటువంటిది? రాసముండల మెట్టిది? శ్రీకృష్ణుడొకడు. గోపికలు అనేకులు. ఏ విధముగా వారి క్రీడ సాగెను ? దీనిని వినుటకు నాకు క్రొంగొత్త కోరిక ఏర్పడుచున్నది. ఓ మహానుభావా! కథాశ్రవణము నామసంకీర్తనముల వలన పుణ్యము కూర్పు స్వామీ! చెప్పుము. ఆశ్చర్యము. శ్రీహరి యొక్క రాసలీల పురాణ సారమైన కథ. ఈ భూమి మీద శ్రీహరి లీలా విలాసములు అన్నియు ప్రతి వ్యక్తి మనస్సును హరించునవి కదా!
సూత ఉవాచ - సూతుడనేను :
నారదుని మాట విని నారాయణ మహర్షి తానును నవ్వి సుప్రసన్నమైన ముఖముతో చెప్పుటకారంభించెను.
శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ ఋషి ఇట్లనెను :
ఓ మునీ! ఒకసారి శ్రీకృష్ణుడు శుభమైన చైత్ర శుక్ల త్రయోదశి నాటి రాత్రివేళ నిండుగా చంద్రుడుదయించిన కాలములో బృందావనమునకేగెను. అడవి మొల్ల, జాజి, మొల్ల, బండి గురివింద ఫూలగాలితో పరిమళించుచు తుమ్మెదల యొక్క అవ్యక్త మధురమైన ధ్వనితో ఆ ప్రదేశము మనోహరముగా నుండెను. క్రొత్తగా చిగిర్చిన చిగుళ్లతోను గండుకోకిలల ధ్వనులతోను మనస్సునుహరించెడి తొమ్మిది లక్షల రాసమండలులతో ఆ ప్రదేశమొప్పెను. ఆ గృహములు చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు అనెడి పరిమళ ద్రవ్యములలో సువాసనలు వ్యాపింపజేయుచు పచ్చ కర్పూరముతో కూడిన తాంబూలములు మొదలైన భోగద్రవ్యములతో కూడి యుండెను. సంపంగి పూలతోను కస్తూరీ చందన ద్రవ్యములతోను శృంగార క్రీడకు తగినట్లు సిద్దపరచిన అనేక శయ్యలతోను చక్కగా శోభించుచుండెను. అగురు ధూపములతో పరిమళించునట్లు రత్నదీపములతో ప్రకాశించునట్లు ఏర్పరుచబడి నానావిధ పుష్పముల మాలలతో విరాజిల్లుచుండెను. అక్కడ రాసక్రీడామండలము అన్ని వైపుల గుండ్రముగా (వలయముగా) నుండి చందసము అగురు కస్తూరీ కుంకుమ పువ్వు చూర్ణములతో అలంకరింపబడెను. అంతట పుష్పించిన ఉద్యానవనములు జలక్రీడ కనుకూలమైన సరోవరములు (సరస్సులు) హంసలతో కన్నె లేళ్లతో నీటికోళ్ల కూజితముల (కూతలు - పలుకులు) తో ఇంపుగా నుండెను. ఆ సరస్సులు చాల సుందరముగా శృంగార క్రీడ యొక్క శ్రమను తొలగించునట్టి నిర్మలమైన జలముతో నిండియుండెను. ఆ నీరు స్పటికమణుల వలె ప్రకాశించుచుండెను. క్రీడకనువుగా నుండెను. పెరుగు కడవలు శుక్షధాన్యము జలము నింపిన కడవలు అరటిబోదెలు అందముగా శోభించు చుండెను. మామిడి చిగుళ్లతో సూత్ర బంధములో సుందరముగా కూర్చబడిన సిందూర చందన లేపములతో మంగళ ఘటములు శోభించుచుండెను. జాజి పూలహారములతో నారికేళ ఫలముతో అవి అలంకరింపబడి ఉండెను. అటువంటి రాసమండలమును చూచి శ్రీకృష్ణుడు నవ్వెను.
ఆ ప్రదేశములో శ్రీకృష్ణుడు తనయందు కాముకులైన గోపికల యొక్క కామమును వృద్ధిపొందించునట్లు వినోదార్ధము ధరించిన మురళీని ఆసక్తితో మ్రోగించెను. ఆ మురళీ గానమును విని రాధాదేవి మదన తాపముతో శరీరము మీద స్మృతి తప్పి శరీరము స్తంభించి ధ్యానమగ్నురాలయ్యెను. క్షణము సేపటికి మరల తెలివికి వచ్చి ఆ ధ్వని మరల ఏనెను. కొంత సేపట్లుండి మరల మరల లేచి నిలబడుచుండగా చిత్తము నిలకడ తప్పెను. అవశ్యముగా చేయవలసిన పనిని గూడ త్యజించి గృహము నుండి వేగముగా బయలు దేరెను. నలువైపుల చూచి ఆ శబ్దము వచ్చు వైపు పోయెను. మహానుభావుడైన శ్రీకృష్ణుని పాదపద్మములను ధ్యానించుచు రత్నాభరణముల తేజముతో అంతటిని ప్రకాశింపజేయుచు పోగా మిగిలిన గోపికలు తమ నాథుడు తమ మనసులను హరించగా కులధర్మము త్యజించి సందేహము వదిలి కామమోహితలై సంభ్రమముతో బయట పడిరి (ఇండ్లు వదిలి పోవుచుండిరి). గోపికలలో శ్రేష్ఠురాండ్రును, రాధాదేవికి మిక్కిలి ప్రియమైన వారును ఐన సుశీల మొదలగు ముప్పది ముగ్గురు వయస్యలు (సఖులు)ను, వారివెనుక వేషము వయస్సు రూపము గుణమును బట్టి వారితో సమానమైన గోపికలును వెళ్లిరి. వారి సంఖ్యను వివరింతును. వినుము.
ఆ రేపల్లె నుండి (జము) సుశీల ననుసరించి 16 వేలమంది గోపికలు, చంద్రముఖి వెనుక 16 వేలమంది గోపికలు, మాధవి చెలులు 11 వేలమంది, కదంబమాల చెలులు 13 వేలు, కుంతి సఖురాండ్రు 16 వేలమంది, యమున ననుసరించిన 14 వేలమంది, జాహ్నవి సహచారిణులు తొమ్మిది వేల మంది, పద్మముఖీ చెలికత్తెలు తొమ్మిది వేలమంది, సావిత్రి సఖురాండ్రు 15 వేలమంది, పారిజాత వయస్యలు 10 వేలమంది, స్వయంప్రభననుసరించినవారు 7 వేలమంది, సుధాముఖికి చెందిన గోపికలు 14 వేలమంది, శుభ చెలికత్తెలు 14 వేలమంది, పద్మననుసరించిన గోపికలు 14 వేలమంది, గౌరీనాయిక పాదములే లక్ష్మిగా భావించు గోపికలు. 14 వేలమంది, సర్వమంగల చెలులు 16 వేలు, కాలిక చెలికత్తెలు 16 వేలు, కమల సఖురాండ్రు 13 వేలమంది, భారతి వెనుక 10 వేలమంది, అపర్ణ సహచారిణులు 14 వేలమంది, రతీ వయస్యలు 10 వేలమంది, గంగ చెలికత్తెలు 14 వేలమంది, అంబిక వేనుక 16 వేలమందీ, సతి 3 వేలమంది గోపికలు, నందిని సహచారిణులు 10 వేలమంది, సుందరి వెనుక 13 వేలమంది, కృష్ణప్రియ వెనుక 16 వేలమంది, మధుమ వెనుక 16 వేలమందీ, చంప ననుసరించి నడచు గోపికలు 13 వేలనుందీ, చందన చెలులు 16 వేలమంది (ఇట్లు 33 రాధాదేవి సఖులు తమ తమ చెలులతో) రాధాదేవి పోయిన మార్గమున పోయిరి.
వారందరొక చోటచేరి సంతోషముతో కొద్ది సేపక్కడ నిలిచిరి. అక్కడికి కొందరు గోపికలు పూలదండలు చేతబట్టుకొని మరికొందరు సుందరమైన చందన పాత్రలు చేత బట్టుకొని ప్రజము నుండి అక్కడికి చేరవచ్చిరి. శ్వేతచామరములు పట్టుకొనికొందరు, కస్తూరి పాత్రలను పట్టుకొని మరికొందరు, కుంకుమ పువ్వుపొడి పాత్రలను పట్టుకొని ఇంక కొందరు తాంబూల పాత్రలు ధరించి మరికొందరు గోపికలు అక్కడికి చేరవచ్చిరి. కొందరు గోపకన్యలు కాంచన వస్త్రముల మూటలు మోసుకొని అక్కడికి వచ్చిరి. వారందరు వెన్నెల బయటకు చేరవచ్చిరి. వారందరొక చోట చేరి చిరునవ్వుతో ఆనందముతో రాధాదేవి వలె అలంకరించుకొని ఆ స్థానము నుండి సంతోషముతో ముందుకు పోయిరి.
వారందరు మార్గములో మాటి మాటికీ హరి శబ్దమును జపించుచు రమ్యమైన బృందావనమును చేరిరి. స్వర్గసీమల కంటే సుందరమైన దృశ్యములు గలదియు, పున్నమి చంద్రుని కిరణములతో (వెన్నెల కాంతి) కూడినదియు, జనరహితమును, పుష్పించిన వృక్షములు గలదియు, పూలగాలితో పరిమళించునదియు ఐన రాసమండలమును దర్శించిరి. అక్కడ ఆ గోపికలందరును మునులకు వ్యామోహము కల్గించునదియు, స్త్రీలకు కామము పుట్టించునదియు ఐన గండు కోకిల యొక్క అవ్యక్త మధుర ధ్వనిని వినీరి. పూలయందలి తేనె త్రాగి మత్తుగొన్న ఆడ తుమ్మెదల సంగము నందు చిక్కుకొన్న గండు తుమ్మెదల యొక్క మనోహరమును అతి సూక్ష్మ మధురమైన ధ్వనిని కూడ వినిరి.
రాధాదేవి శుభముహూర్తములో మొత్తము చెలులతో బాటు శ్రీకృష్ణ పాదపద్మములను ధ్యానించుచు రాసమండలమును ప్రవేశించెను.
తన సఖురాండ్ర నడుమునున్నదియు, రత్నాలంకార భూషితురాలును, దివ్య వస్త్రములను ధరించినదియు, చిరునవ్వు క్రీగంటి చూపులు గలదియు, గజరాజు వంటి గమనముతో సుందరముగా ముని జనుల మనస్సునే మోహింపజేయునదియు, క్రొత్త క్రొత్తగా కన్పించు వేషము వయస్సు రూపములతో తనకు మిక్కిలి మనోహరురాలునగు రాధాదేవినీ దూరమునుండియే శ్రీకృష్ణుడు చూచి మదనుని చేత బాధితుడై సంతోషానురాగములు-చిరునవ్వుతో ఎదురుగా పోయి అక్కడికి చేరెను. వక్షః స్థలము - నడుము క్రింది భాగముల యొక్క భారముతో అందమైన సంపంగి పూవు వన్నె గల శరీరముతో శరత్కాల చంద్రుని వంటి ముఖ మండలముతో, జాజిపూలదండలు ధరించిన పెద్ద కొప్పులో ఆ దేవి శ్రేష్ఠురాలుగా నుండెను.
బౌలరూపమున నుండియు నవ యావన సంపద గలవాడును శ్యామ (నల్లని) వర్ణముతో సుందరముగా నున్నవాడును, రత్నాలంకారములు ధరించినవాడును, కోటి మన్మథుల లావణ్య (శరీర కాంతి) విలాసములకు స్థానమైనవాడును మిక్కిలి అద్భుతమైన రూపముతో పోలికలేనంతగా మనోహరుడును విచిత్రాలంకారములు గలిగి కొండె కొప్పు ధరించిన వాడును చిరునవ్వు చిందించుచున్న శ్రీకృష్ణుని రాధ దర్శించెను. తనను క్రీగంటి వాలు చూపులో చూచుచున్న ప్రాణాధికయగు ప్రియురాలిని అతడును చూచెను. ఆ సాధ్వి కనుచివరల నుండి వ్యాపించు ప్రక్క చూపులతో మరల మరల చూచి చిరునవ్వు సిగ్గులతో ముఖమును (పైట కొంగుతో) కప్పుకొనెను. శరీరావయములన్నియు పులకలెత్తగా కామ బాణ పీడితురాలై చైతన్యము దెబ్బతిని వెంటనే ఆమె మూర్ఛిల్లెను.
ఆమె కటాక్షములనెడి మన్మధ బాణముల చేత కొట్టబడిన వాడైన శ్రీకృష్ణుడు శృంగార క్రీడారసమున పేక్షించి మూర్ఛాగ్రస్తుడయ్యెను. నేలమీద పడిపోక ఒక స్తంభము వలె కదలిక లేక) నిలిచిపోయెను. అతని చేతినుండి మురళీ, విలాసముగా ధరించిన కమలము జారి పడెను. పైన ధరించిన రెండవ పచ్చని వస్త్రము (ఉత్తరీయము) నెమలి పింఛము కూడ శరీరము నుండి జారిపడినవి. క్షణములో చైతన్యము పొంది కృష్ణుడు సంతోషముతో రాధ వద్దకేగి ప్రేమతో ఆమెను వక్షఃస్థలమున చేర్చుకొని బిగ్గరగా ఆలింగనము చేసికొని ముద్దు పెట్టుకొనెను.
శ్రీకృష్ణుడు తనను స్పృశించినంతలోనే రాధ చైతన్యము పొంది ప్రాణాధికుడైన ప్రాణనాధుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను.
ఓ మునీ! శ్రీకృష్ణుడు రాధ మనస్సును రాధ అతని మనస్సును హరించెను. ఆ రసికుడు రాధతో రతిగృహమున కేగెను. ఆ శయ్యామందిరము రత్నదీపములతో రత్నాల దర్పణములతో చందనములో ముంచిన సుందరమైన సంపంగి పూలు పరచిన శయ్యలతో కర్పూరముతో గూడిన తాంబూలము మొదలగు భోగద్రవ్యములతో కూడియుండెను. అక్కడ కృష్ణుడు రాధతో గూడి సంతోషముతో నివసించెను.
రాధ యిచ్చిన తాంబూలమును ఆ మధుసూదనుడు నమిలెను. కృష్ణుడొసగిన తాంబూలమును ఆ రాసేశ్వరి ముదముతో తినెను. కొంత నమిలీన తాంబూలమును ప్రభువు స్వామి) రాధ కీయగా మన్మధ పీడితురాలైన ఆమె నవ్వి వెంటనే దానిని గ్రహించి నమీలేను. అప్పుడు మాధవుడు ముదముతో రాధ నమిలిన తాంబూలమును తనకిమ్మని అడిగెను. అది విని భయపడిన రాధ తాంబూలమీయక అతని పాద పద్మములపై పడెను.
ఇంతలో కోరిక గల హరి సుఖాసక్తి గలవాడై మనోహరమైన ఆ శృంగార శయ్య మీద రాధతో గలిసి శయనించెను. ఆ రసిక శేఖరుడు కాముకురాండ్రైన స్త్రీలకు మనస్సున కింపగునట్ను కామశాస్త్రమందు రహస్యముగా నున్న అష్టవిధ శృంగారమును అష్ట విధ చుంబనములను నఖదంతకర ప్రహారములను ఆయా కాలస్థాన దశలకు తగినట్లు ఆచరించెను. ఆ మన్మధ బాధితుడు కాముకీ జనమునకు ను:ఖము కల్గునట్లు తన అంగ ప్రత్యంగములతో ఆమె అంగ ప్రత్యంగములను కౌగిలించుకొనెను. కామశాస్త్ర పండితులును శృంగార క్రియలందు నేర్సు గల ఆ ఉభయులకు విరామము లేకుండ ఆ క్రీడ సాగెను .
ఈ విధముగా మిక్కిలి మనోహరముగా నున్న ఆ రాసమండలములో సుందరమైన ప్రతి గృహములోను స్వోమి అనేక విధముల రూపములను ధరించి గోపాంగనలతో రమించెను.
ఓ మునీ! ఆ రాసమండలములో తొమ్మిది లక్షలమంది గోపికలు పదునెనిమిది లక్షల మంది గోపాకులు అందరును తల వెండ్రుకల ముడులు ఊడిపోయి భూషణములు తెగిపోయి ధరించిన వేషములు (అలంకారములు) చెదిరిపోయి మన్మధావేశముతో మత్తెక్కి నగ్నరూపములతో మూర్ఛిల్లిరి. కాళ్లఅందేలు చేతుల గాజులు దండకడియములు రత్నాల (పాదాభరణములైన) అందెలు ఆగకుండ ధ్వనించుచుండెను. ఇట్లు ఆ గోపికా సమూహములు స్థల క్రీడ అనుభవించి సంతోషముతో నదీజలములలో ప్రవేశించిరి. ఆందులో జలక్రీడలు సలిపి మిక్కిలి అలిసిపోయిరి.
త్వరగా జలము నుండి లేచి వచ్చి వస్త్రములను ధరించి మంచి రత్నాల అద్దాలలో తమ ముఖ పద్మములను చూచుకొనిరి. చందనము అగురు కస్తూరీ అను సుగంధ ద్రవ్యములను పుష్పమాలలను ధరించి అప్పుడు సాధారణ చైతన్య స్థితికి వచ్చిరి. అందరు ఆసక్తిగా కర్పూర తాంబూలములను భుజించి స్వచ్ఛమైన రత్న దర్పణములలో (అద్దాలు) తమ ముఖ పద్మములను మరల చూచుకోనిరి.
(మరల ఆ జగన్మోహనుని దర్శించి వ్యామోహము పొందిన గోపికల విలాసములను వర్ణించుచున్నాడు ఒక కామిని ఆసక్తితో కృష్ణుని బలముగా తనవైపు లాగుకొని అతని చేతి నుండి మురళిని లాగి పట్టుకొని అతని వస్త్రములు లాగివేసెను. కామమతురాలైన ఇంకొకతి శ్రీకృష్ణుడు ధరించిన పీతాంబరము లాగి నగ్నముగా జేసి నవ్వి మరల వస్త్రమిచ్చెను. నా రహస్య యుక్తిని వినుమని ఒకటే స్వామిని దగ్గరకు తీసుకొని బిగ్గరగా కౌగిలించుకొని చెక్కిలి మీద దొండపండువంటి పెదవి మీద మాటి మాటికి ముద్దులు పెట్టుకొనెను. ఇంకొకతే చిరునవ్వుతో కడకంటి చూపుతో చంద్ర బింబము వంటి తన ముఖమును స్తనముల ఉన్నతిని సుందరమైన పిరుదులను కామముతో చూపెను. ఇంకొకతె ప్రియుడైన కృష్ణుని చేత బట్టుకొని తన ఒడిలో కూర్చుండ బెట్టుకొని చక్కగా తలవెండ్రుకలు దువ్వి ముడిచి జాజిపూలదండనలంకరించెను. వేరొకతె కొండె కొప్పును పట్టి లాగి దాని పై నేమిలి పింఛము నలంకరించాను. ఇంకొకతే గురివింద పూసల దండను కొండెకొప్పున చుట్టెను. ఇంకొక కామిని ఆసక్తితో శ్రీకృష్ణునికీ తన మీద ప్రేమ వృద్ధి జెందవలెనని మరియొక సుందరిని నగ్నను చేసి శ్రీగంధములు పులుపుకొన్న కృష్ణుని ఒడిలోనికి (కౌగిలికి) పంపి అట్లు స్వామికి సమర్పించెను. కొందరు శ్రీకృష్ణుని బట్టుకొని నర్తనము చేసిరి. కొందరు పాడిరి. ఒకటే శ్రీకృష్ణుని బలవంతపరచి నర్తనము చేయించెను. శ్రీకృష్ణుడు ఆసక్తితో ఒకదానీ వస్త్రము లాగివేసెను. మరోక సుందరిని నగ్నను జేసి దాని వస్త్రమునీంకొక దానీకిచ్చెను.
శ్రీకృష్ణుడు రాధాదేవిని దగ్గరకు చేరదీసుకొని తన వక్షస్థలమున కానుకొని కూర్చుండబెట్టుకొనెను. ఆమె వెండ్రుకలను సంస్కరించి చక్కగా కొప్పు ముడిచెను. ఆమె నుదుట సిందూర తిలకము పెట్టి దానిచుట్టు చిన్న చిన్న కస్తూరి చుక్కలు చేర్చి ఆసక్తితో దాని క్రింద చందనముతో చంద్రరేఖను పెట్టెను.. కపోలముల మీద (చెక్కిళ్లు - చెంపలు) సుందరముగా మకరికాపత్రరేఖలను తీర్చెను. (కుంకుమ పువ్వు ద్రవముతో మొసలి ఆకారముగా, ఆకులు పూవులుగా రేఖలు తీర్చుట). అగ్ని వర్ణము గల వస్త్రము ధరింపజేసెను. పాదములకు రత్నాల అందేలు తొడిగి కాలిగోళ్లను బాగుగా తుడిచి పోటీకందముగా లతుక రంగు పెట్టెను. ఆభరణములతో అలంకరించి సుగంధ లేపనమును శరీరమంత పులిమేను. మాలతీ పుష్పముల మాలనలంకరించి తనివిదీర ముద్దులు పెట్టుకొనెను. సుందరమైన నేత్రపద్మములకు కాటుక పెట్టి ముక్కుకు అపురూపమైన ఏనుగు ముత్యమును అలంకరించెను. కటి ప్రదేశమున స్తనమండలము పైనను నఖక్షతములు పండిన దొండపండు వంటి క్రింది పెదవి పై దంత క్షతమును కూర్చెను.
యోగులకు పరమ గురువు గోపికల చిత్తములను హరించిన వాడు ఐన శ్రీకృష్ణుడు సుందరమైన సరస్సు ఒడ్డున, నిర్జనమైన పుష్పోద్యానములో, ఉదయించిన చంద్రుని వెన్నెలలో, పుష్పములతో గంధముతో అలంకరింపబడిన ప్రదేశములో, అగురు చందనముల గాలి వీచి సువాసనలు వెదజల్లు స్థానములో, తుమ్మెదల ఝుంకార ధ్వనులు గండుకోకిలల కుహూ స్వరము వ్యాపించిన చోట తాననేక రూపములు ధరించి గోపికలతో విహరించెను. ఆ శృంగార క్రీడలో చేతి కంకణములు మొలనూలి మువ్వలు పాదముల అందెలు మ్రోగుచుండెను. ఆ క్రొత్త అనుభవమునకు గోపికలందరు శరీరములు పులకరించీ కనురెప్పలు మూతపడీ మూర్ఛపొందిరి. తరువాత మరల స్మృతిలోనికి వచ్చిరి.
ఉభయులు (ఒక కృష్ణుడు గోపిక) నఖదంత ప్రహారములు పరస్పరము చేసికొనిరి. శ్రీకృష్ణుడు గోపికల కఠిన శ్రేణి దేశముల పై వక్షస్థలముల పై నఖచిహ్నములు చేసెను. ఆ స్థితిలో గోపికల కొప్పు ముడులు మొలనూలులు జారిపోయెను. కోక ముడులు వదులై జారిపోయెను. సుందరాలంకారములును వస్త్రములును దూరమయ్యెను. ఆ రసికేశ్వరుడు ఆ కాముకుడు నవవిధాలింగనములతో అష్ట విధచుంబనములతో షోడశ విధ శృంగారక్రియలతో అంగాంగముల ఆలింగనములతో ఆ స్త్రీలను ఆ కాముకీ జనమును ప్రీతితో సంతృప్తి పరచెను. స్త్రీ జనమునకు శరీరమున పదహారు శృంగార కళాస్థానములుండును. కాలభేదమును బట్టి ఆయాస్థానములను కామశాస్త్రవేత్త లెరుగుదురు. ఆ శాస్త్రమున నిరూపించబడిన ద్వాదశ ప్రకృతులును కలవు. ఆ రసికేశ్వరుడైన శ్రీకృష్ణుడు అంతకు మించి క్రీడారంభములో మధ్యలో చివరను స్త్రీల తృషికి చేయవలసిన కర్మలను చెప్పబడిన దాని కన్న అధికముగా ఆచరించెను. అప్పుడు గోపికల కంకణముల రేఖలతోను గోపికల పాదముల పారాణి గుర్తులతోను శ్రీకృష్ణుని దేహము గైరికధాతువులతో గూడిన పర్వతము వలె ప్రకాశించెను.
ఇట్లు రాసమండలము పూర్ణ శృంగార మయము కాగా దేవతలందరు భార్యలతో పరివారముతో బంగారు రథముల మీద తమ తమ గణములతో కూడి ఆసక్తిగా చూడవచ్చిరి. ఆ దృశ్యము చూచి సర్వాంగములు పులకలెత్తగా మన్మధ బాణపీడితులైరి. ఋషులు మునులు సిద్ధులు పితృదేవతలు విద్యాధరులు గంధర్వులు యక్షరాక్షస కిన్నరులు తమ తమ భార్యలతో చేరవచ్చి మోదముతో దర్శించిరి.
బంగారముతో నిర్మించబడిన దివ్యరధమును మణులతో శోభించుచున్న దానిని, రత్నాలంకారములు గల దానిని అన్నీ వర్ణము గల పట్టు వస్త్రము చుట్టిన దానినీ, అందువలన మనోహరమై శ్వేతచామరములతో రత్న దర్పణములతో పద్మములతో గూడి మంచి రత్నముల పొడిలో నిర్మితమైన కలశములు శిఖరమందు గలిగి, సూరు చక్రములతో మనోహరమైన చిత్రములతో గూడి మనస్సు యొక్క వేగముతో నడచు దానీని (రథమును) ఎక్కి పార్వతీదేవితో బాటు భగవంతుడైన శంకరుడక్కడికి వచ్చెను. అతనికి ఎడమవైపున మహాకాలుడును, కుడివైపున నందికేశ్వరుడు ముందు గణపతియు కుమారస్వామియును ఆ దంపతుల చుట్టుగా అన్ని వైపులలో పింగళాక్షుడు మొదలగు పార్షదులు క్షేత్రపాలులైన ఎనమండుగురు భైరవులును ఉండిరి. పరమేశ్వరుని వక్షఃస్థలమున నున్న దుర్గాదేవి (పార్వతి) చిరునవ్వుతో ప్రక్కచూపుతో వెలసియుండెను.
బంగారు రథమెక్కి భారతీదేవితో (సరస్వతి) బ్రహ్మ ఎడమ ప్రక్కన సప్తర్సులు కుడిప్రక్కన సనకసనందనాదులు సేవింపగా విచ్చే సెను. జీవుల కర్మలకు సాక్షియైన ధర్మదేవత సువర్ణ రథమెక్కి బ్రహ్మలేజస్సుతో వెలుగుచున్న పార్షదులు చుట్టు ముట్టి ఉండగా వక్షఃస్థలమున మూర్తి అనుభార్యను ధరించి వచ్చెను. ఆ సతి చిరునవ్వుతో వాలుచూపులతో రాసక్రీడను చూచుచు కామ భావన గలదయ్యెను. శచీదేవీతో మహేంద్రుడును రోహిణీతో చంద్రుడును స్వాహాదేవితో అగ్నిహోత్రుడును సంజ్ఞాదేవితో సూర్యుడును చేరవచ్చిరి. రతీదేవిని వక్షఃస్థలమున ధరించి మన్మథుడు వచ్చెను. సర్వగ్రహములు దిక్పాలకులు భార్యలతో చేరవచ్చిరి. ఆకాశమందు నీలిచీ ఆసక్తితో రాసముండలమును చూచుచు కొందరు మోహము పొందగా మరికొందరు మూర్ఛిల్లిరి. ఒక ముహూర్త కాలము దేవతలందరు సంతోషముతో చందన ద్రవమును పుష్పములను వర్షించిరి. మునీశ్వరులు కస్తూరీతో గూడిన పూలదండలను వర్షించిరి. ఆ రాసమండలమును చూచి దేవ పత్నులందరు కామబాణముల చేత పీడింపబడిరి.
సనాతనుడైన ఆ పూర్ణబ్రహ్మ శ్రీకృష్ణుడిట్లు భూమి మీద రతిసుఖమనుభవించి రాధతో గలిసి యమునా జలములోని కేగెను. మాయా కృష్ణులందరును అట్లే క్రీడలాడిరి. మాధవుడు రాధ మీదకి జలము చల్లేను. రాధయు కామారుడైన మాధవుని మీద మూడు దోసిళ్ల నీరు చల్లెను. అతడామె వస్త్రమును లాగివేసి పూమాలను తెంచి వేసి కొప్పును విప్పి వేసెను. ఆమె నగ్నురాలయ్యెను. హరి జలము చల్లుట వలన మకరికా పత్రములు కనుబొమలకు తీర్చిన రంగు కన్నుల కాటుక పెదవుల రంగు చెదిరిపోయి రాధాదేవి వేషాలంకారము లోపించెను. అంతయు బోసిపోయి నగ్నముగా నున్న రాధను స్వామి కౌగిలించుకొని నీళ్లలో మునిగి క్రీడలాడెను. సిగ్గుతో క్రీడతో వంగిపోయి యున్న ఆమెను నగ్నత్వముగా చేసి నీటిలో చాలదూరమునకు నెట్టివేసెను.
రాధాదేవి నీటిలో నుండి వేగముగా లేచి మాధవుని బలముగా పట్టుకొని కోపముతో మురళిని తీసుకొని దూరముగా విసిరివేసెను. పీతాంబరమును లాగివేసి వనమాలను తెంచి అతనిని కూడ దిగంబరుని జేసి మరల మరల నీళ్లు చల్లెను. హరిని తన వైపు లాగుకొని జలములో త్రోసి వేసెను. ఆ జగత్పతి లోతైన యమునా ప్రవాహములో మునిగిపోయెను. మాధవుడు శీఘ్రముగా నీటినుండి లేచి నవ్వుచు ఆమెను పట్టుకొని ఆ నగ్నమూర్తీనే వక్షఃస్థలమున చేర్చుకొని మరల మరల చుంబించెను. ఈ విధముగా మయాకృష్ణులు గూడ ఆసక్తితో సర్వ గోపికలను గూడి మనోహరమైన యమునా జలములో జలక్రీడలాడిరి.
ఇట్లు గడిపిన శ్రీహరి రాధతో ఒడ్డుకు చేరెను. ఆమె అతనిని వస్త్రమీమ్మని యాచించెను. చిరునవ్వుతో సున్న ఆ సాధ్విని అతడును అట్లే యాచించేను. మాధవుడు రాధకు వస్త్రమును సుందరమైన పుష్పమాలనిచ్చెను. ఆ రాసేశ్వరి హరికీ వస్త్రమును మురళీనిచ్చెను. తన ముందు ఇసుక తిన్నె పై కూర్చున్న కృష్ణునికి గొప్ప భక్తితో రాధాదేవి చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు ద్రవములను సర్వ శరీరమున పులిమేను. కానీ చిత్తములను మోహింపజేయునట్లుగా సుందరమైన కొండె కొప్పు నిర్మించి మంగళకరమైన పూలతీ పుష్పదామమును చుట్టెను. శ్రీకృష్ణుడు రాధకు వెండ్రుకల కొప్పును మనోహరముగా ముడిచి చెపులకు కుండలములలంకరించి చెంపల మీద మకరికా పత్రములు లిఖించెను, నుదుట ఎర్రని సిందూర తిలకము పెట్టి చుట్టు కస్తూరితో చుక్కలు పెట్టి దాని క్రింద మనోహరముగా సన్నని చంద్రరేఖను చందనముతో నిర్మించెను. స్తనముల పై ఊరుపులపై గోటి గుర్తులు అలంకరించి అగ్ని పర్ణము గల పట్టు వస్త్రమునామకు అలంకరించెను. చందనము అగురు కస్తూరి కుంకుడు ద్రవములను ఆమె వక్షస్థలమున పులిమి కంఠము. ఆలింగనము చేసికొని మరల మరల చుంబించెను. భూషణములతో అలంకరించి పాదములకు ఆండిలు తొడిగి కాళ్లకు పారాణి గోళ్లకు ఎత్తిని రంగును అలంకరించెను. ఈ విధముగనే అందరు గోపాలురు (కృష్ణరూపులు) గోపికలకు వేరు వేరుగా విలాసములను పంచిరి.
యావనమత్తులైన వారందరు తిరిగి పండు వెన్నెలతో కూడియున్న సుందర రాసమండలమునకు పోయిరి. ఆ ప్రదేశము బడిగురివింద, మొగిలి మొల్ల, వీరజాజి, సంపెంగ, అడవి మొల్ల, మల్లెపూల వాసనతో సుగంధ వాతావరణము గలదై, జన రహితమై స్త్రీ పురుషుల ఏకాంతక్రీడకు యోగ్యమై ఉండెను.
ఈశ్వరి ఐన (జగత్తంతయు తన సంపద ఐన) రాధాదేవి అంతట వికసించి యున్న పుష్పమాలను చూచి ఆసక్తితో వాటిని తెంపుటకు {పూలు గోయుటకు) సమస్త గోపికలను ఆజ్ఞాపించెను, కొందరు గోపికలను మాలలు నిర్మించుటకు మరికొందరిని తాంబూలములను సిద్ధము చేయుటకు (సుగంధ ద్రవ్యములను చేర్చి తమలపాకులను చుట్టుట) మరికొందరిని గంధము తీయుటకును నియమించెను. గోపికలు సిద్ధము చేసి ఇచ్చిన చందనమును, పుష్పమాలలను తాంబూలమును ఆ సుందరీ (రాధ) క్రీగంటి చూపుతో చిరునవ్వుతో తృప్తిగా శ్రీకృష్ణునికర్పించెను. తరువాత కొందరిని కృష్ణుని గూర్చి గీతములు పాడుటకు మరికొందరిని మృదంగము మురజము (మద్దెల) లను వాయుంచుటకు నియమించెను. ఇట్లు హరితో విలాసముగా రాసమండలములో రమించి రాధాదేవి నిర్జన ప్రదేశములలో అంతట మనోహరముగా విహరించెను.
సుందరమైన పూలతోటలలో, సరస్సుల తటములలో, రమ్యమైన ప్రతి గుహలో, నదీనదముల యొక్క తటములలో (తూర్చు దిశకు ప్రవహించునది నది. పడమర దిశకు ప్రవహించునది నదము} నిర్ణన శ్మశాన స్థలములలో, గిరీ గుహలలో, స్త్రీలు కోరుకొనెడి ముప్పది మూడు వనములలో వారు విహరించిరి. భాండీర వనము, శ్రీవనము, కదంబ (కడిమి చెట్లు) కాననము, బృందావనము (తులసీవనమని మూలము) కుంద వనము (మొల్లలతోట) చంపకవసము {సంపంగి తోట) నింబారణ్యము (వేపచెట్ల అడవి) మధువనము (ఇప్పచెట్ల అడవి) జంబీర కాననము (నిమ్మతోట) నారికేళవసము పూగవనము {పోకచెట్ల వనము) కదళీ వనము (అరటి తోట) బదరీ వనము, బిల్వవనము (మారేడు) నారింగవనము (నారింజలు) అశ్వత కాననము (రావిచెట్లు) వంశ వనము (వెదురు) దాడిమ కాననము (దానిమ్మతోట) మందార వనము {దేవదారు వృక్షముల అడవి) తొలవనము, చూత (మామిడి) వనము, కేతకీ వనము (మొగిలి} అశోకవనము ఖర్జూరకాననము, ఆమ్రతకవసము (జీడిమామిడి) జంబూవనము (అల్లనేరడి) శాలకవనము కటకకాననము పద్మవనము జాజిపూలతోట, న్యగ్రోధ (మర్రి) కాననము శ్రీఖండ కాననము (శ్రీగంధపు చెట్ల అడవి దట్టమైన పొగడ వృక్షముల అడవి, ఇటు రాధాదేవి శ్రీకృష్ణునితో ముప్పది దినములు రాత్రింబవళ్లు కామాసక్తితో విహరించెను. ఐనను ఆమె మనస్సు నిండలేదు.
కామినుల యొక్క కామము నెయ్యి పోసినకొద్దీ అగ్ని మండినట్లు అనుభవించిన కొద్ది అధికముగా వర్ధిల్లునే కాని చల్లారదు. తరువాత దేవతలు దేవ గణము మునులు అందరును ఆ లీలలను చూచి ఆశ్చర్యము పొంది తమ తమ గృహములకు వెళ్లిరి. శృంగార లాలస గల ఆ దేవీగణము కామాగ్ని దగ్ధలై తమ అంశలతో భారత ఖండములో రాజుల గృహములలో ఇంటింట జన్మించిరి. (శ్రీహరినీ సేవించిరి).
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాసక్రీడా ప్రస్తావము అనెడి ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
