4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

124 - అధ్యాయము

మూ॥ నారాయణ ఉవాచ :

శ్రీగణేశ ఉవాచ :

నారాయణుడిట్లా - విధిప్రకారము,రాధలంబోదరుని పూజించి స్తుతించి, ఆసతి అమూల్యమైన రత్నములతో నిర్మింపబడ్డ ఆభరణములను అన్ని అవయవములందుకూర్చింది. రాధ పూజ - శ్రీనాథుని స్తుతినివిని, పూజను, వస్తువులను చూచి. శాంతురాలు, త్రిలోకముల మాతయైన ఆమెతో, శాంతుడై మధురంగా ఇట్లన్నాడు (2) శ్రీగణేశుడిట్లా – ఓజగన్మాత! నీవు చేసిన పూజ, శుభమైనది, లోకులకు తెలిపే కొరకుచేసినది. నీవు బ్రహ్మ స్వరూపురాలవు, కృష్ణుని వక్షఃస్థలమందుండే దానివి (3) చాలాదుర్లభమైన, సాటిలేని నీపాదపద్మములను ధ్యానిస్తారు, దేవతలు, బ్రహ్మ ఈశ, శేషాదులు, మునీంద్రులు,సనకాదులు (4) జీవన్ముక్తులు, భక్తులు, సిద్ధేంద్రులు, కపిలాదులు ధ్యానిస్తారు. అతనికి ప్రాణముల అధిదేవివి నీవు. ప్రాణములకన్న అధికమైన దానివి, ప్రియమైన దానివి, పరురాలవు. (5) ఎడమ భాగమందురాధ కూర్చబడింది, కుడిభాగమందు మాధవుడు. జగన్మాత, మహాలక్ష్మి నీ ఎడమ అంగములనుండి నిర్మింపబడింది. (6) అంతట నివసించే వసునకు జననివి నీవు, పరమేశ్వరివి. వేదములకు జగత్తుకు మూలప్రకృతి ఈశ్వరి (7) ఓతల్లి! సృష్టిలోని సర్వప్రాకృతికములు నీ విభూతలే. విశ్వములు కార్యరూపములు, నీవు కారణరూపిణివి. (8) ప్రళయమందు బ్రహ్మపడిపోతే హరికి అది నిమేషము. తొలుత రాధను చెప్పి తరువాత పరాత్పరుడైన కృష్ణుని చెప్పాలి. (9) ఆతడే పండితుడు, యోగి, అవలీలగా గోలోకానికి వెళ్లుతాడు. తలక్రిందుల ఉచ్చరిస్తే (రాధాకృష్ణ అనాలి. కృష్ణ రాధ అనరాదు) మహాపాపీ ఔతాడు. బ్రహ్మహత్య పాపాన్ని పొందుతాడు, నిశ్చయము. (10) జగత్తులకు నీవు తల్లివి, పరమాత్మ హరి, తండ్రి మాత తండ్రికే గురువు. పూజ్యురాలు, నమస్కరింపతగినది. పరముకన్న పరమైనది. (11) ఇతర దేవునిభజిస్తే, సర్వకారణుడైన కృష్ణుని భజిస్తే, మహామూఢుడై పుణ్యక్షేత్రమందు రాధికను నిందిస్తే (12) వానికి వంశహానిఔతుంది. ఇక్కడే దుఃఖశోకములు కల్గుతాయి. సూర్యచంద్రులున్నంత వరకు ఘోరమైన నరకమందు వండబడుతాడు. (13) గురవనగా జ్ఞానము స్పష్టంగా బోధించేవారు. మంత్రతంత్రముల జ్ఞానం కలవాడు. ఆ మంత్రము ఆతంత్రము ధ్రువులైన వారి ఇద్దరి భక్తి కావలెను. (శాశ్వతమైనవారిది). (14) దేవతల మంత్రమును సేవించి జీవులు జన్మజన్మలలో, సుదుర్లభమైన, దుర్గ పాదపద్మములందు భక్తులౌతారు. (15) జగత్తునకు కారణమైన శంభుని మంత్రాన్ని సేవించి, చాలా దుర్లభమైన మీ పాదపద్మములను చేరుతాడు. (16) దుర్లభమైన మీ పాదపద్మములను పొంది, పుణ్యవంతుడు, క్షణంలో సగభాగాన్ని, పదహారవ భాగాన్ని, దైవవశాత్తు వదలడు.

రక్షక ఉవాచ :

భక్తితో మీమంత్రాన్ని వైష్ణవుని నుండి స్వీకరించి, పఠిస్తే అదిస్తవమైనా కవచమైనా కర్మల మూలాన్ని నశింపచేస్తుంది. (18) పుణ్యక్షేత్రమైన భారతమందు మిక్కిలి భక్తితో పఠిస్తే, వేయిమంది పురుషులను తననుగూడా ఉద్దరించుకుంటాడు. (19) శాస్త్ర ప్రకారము వస్త్ర అలంకార చందనములతో గురువును పూజించి కవచమును మదిలో ధరిస్తేవాడు విష్ణుతుల్యుడౌతాడు, నిశ్చయము. (20) ఓతల్లి! నాకిచ్చిన వస్తువులనన్నీ సార్థకము, చేయి. నా ప్రీతికొరకు బ్రాహ్మణులకివ్వు. అప్పుడు నేను తింటాను. (21) దేవునకిచ్చిన దానములు (ఇవ్వవలసిన) దేవునకిచ్చే దక్షిణ, అదంతా బ్రాహ్మణునకివ్వాలి. అది అనంతఫలాన్ని ఇస్తుంది. (22) ఓరాధ! బ్రాహ్మణుల ముఖమనేది దేవతల ముఖ్యముఖము. బ్రాహ్మణుడు తిన్న పదార్థమును దేవతలు పొందుతారు. (23) ఆ రాధిక సతి, దానినంతా బ్రాహ్మణులతో భుజింపచేసింది. ఆక్షణంలోనే లంబోదరుడు సంతుష్టుడైనాడు, ఓముని! (24) ఇంతలో దేవతలు బ్రహ్మ, ఈశ, శేష అను పేర్లు గలవారు, దేవపూజ కొరకు, వటమూలమునకు వచ్చారు. (25) అక్కడికివెళ్ళి శివుని అనుచరుడు దేవతలకు, దేవతల స్త్రీలకు ఇట్లా చెప్పాడు. ఆ భటుడు, కంఠం ఎండిపోగా, భయముతో వణికిపోతూ కృష్ణునితో ఇట్లన్నాడు. (26) రక్షకుడిట్లా - ఒక శుభక్షణమందు అందరికన్న ముందుగా గణేశుని, వృషభానుసుతయైన రాధ, స్వస్తివాచనాన్ని మొదలు పెట్టి పూజించసాగింది. (27) మూడువందల కోట్ల గోపికలతో ఆమెకూడి ఉంది. బలవంతురాలు. బలిష్ఠులైన, వారితోనేను వారింపబడ్డాను. ఆవిషయం మీకు చెబుతున్నాను. (28) అందరికంటే మొదలు ఎవరు పూజిస్తే వారికి అనంతఫలం లభిస్తుంది. మధ్యలో పూజిస్తే మధ్యరకమైన ఫలము, చివరపూజిస్తే స్వల్పమైన ఫుణ్యము అని విన్నాను. (29) దేవేంద్రులు, మునీంద్రులు, దేవస్త్రీలు ఉండగా, గోపికలతో కూడా ఆరాధ పరుని పూజించింది. (30) దూతవాక్యమును విని దేవతలంతా నవ్వారు. మునులు, మనువులు, రాజులు, దేవతా స్త్రీలు నవ్వారు. (31) రుక్మిణి మొదలగు స్త్రీలు ఉన్న దేవేరులు అంతా ఆశ్చర్యపోయారు, సరస్వతి, సావిత్రి, పరమేశ్వరి పార్వతి ఆనందించారు.

పార్వత్యువాచ :

రోహిణి, సతి (సంజ్ఞ) స్వాహ మొదలగు దేవతాస్త్రీలు, పతివ్రతలు, మునిపత్నులంతా ఆనందంతో వచ్చారు. (33) మునులు, అందరు మనువులు దేవతలు, నరులు వచ్చారు. తనగణములతో కూడా శ్రీకృష్ణుడు ఇతరులైన వారంతా కూడా తమ తమ వారితో ఆనందంగా వచ్చారు. (34) శుభక్షణమందు వారంతా శుభమైన రకరకాల వస్తువులతో పూజచేశారు. బలవంతులు, బలహీనులు ఇట్లా క్రమంగా, విడివిడిగా అంతా పూజించారు. (35) లడ్డుల రాశులు శతకోట్లు ఐనాయి. శర్కరరాసులు అందులో సగము, స్వస్తికముల రాసులు అంతే ఐనాయి. (36) అన్నము, భవ్యమైన వస్తువులు నూరుకోట్లైనాయి. లెక్కింపరాని పండ్లు, రుచికరమైనవి మధురమైనవి ఉన్నాయి. (37) తేనే కాలువలు,పాలకాలువలు, పెరుగు కాలువలు, అట్లాగే నేయి కాలువలు, నూర్లకొలది ఐనాయి. ముల్లోకముల వారు పూజించుటచే ఐనాయి. (38) పూజచేసివారంతా, సుఖమైన ఆసనములందు కూర్చున్నారు. చాలా ప్రీతితో పార్వతి రాధ ఉన్నచోటికి వచ్చింది. (39) ఆ రాధ పార్వతిని చూచి వేగంగా లేచి, తగిన విధంగా సంబాషణను, ఆదరంతో ఆనందంగా చేసింది. (40) ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ముద్దాడినారు. రాధను తనవక్షమందు చేర్చుకొని దుర్గమధురంగా మాట్లాడింది. (41) పార్వతి ఇట్లా - మంగళమునకు నిలయమైన నిన్ను రాధను ఏమి అడగాలి. శ్రీదాముని శాపం తొలగిపోగానే నీ విరహజ్వాల పోయింది. (42) నా ప్రాణములు, మనస్సు ఎప్పుడు నీయందే, నా పై కూడా నీవు అట్లాగే ఈవిధంగా మనిద్దరికి భేదము లేదు. శక్తి పురుషులకు అట్లాగే (43) నాభక్తులు నిన్ను నిందిస్తే నీ భక్తులు నన్ను నిందిస్తే, వారు సూర్యచంద్రులున్నంత వరకు కుంభీపాకనరకంలో వండబడుతారు. (44) రాధ మాధవులకు భేదం పాటించే నరాధముల వంశం నాశనమౌతుంది. చాలా కాలము నరకంలో వారు వండబడుతారు. (45) నూరుమంది పితరులతో గూడ సూకరయోనులలో జన్మిస్తారు. అరవైవేల సంవత్సరాలు మలము యందు క్రిములౌతారు. (46) గణేశ్వరుని నీవే పూజించావు, నేను పూజించలేదు. అన్నింటికి మొదట ఈతడు అందరికి పూజ్యుడు నీకెట్లాగో, నాకు అట్లాగే పూజ్యుడు. (47) బ్రతికున్నంతకాలము విచ్ఛేదముకలగరాదు. ఓదేవి! ముగ్ధతకు, ధావల్యమునకు ఈరెంటికి భేదం లేనట్లే రాధా మాధవులకు కూడా, భేదం లేదు. (48) సిద్ధాశ్రమమందు, మహాపుణ్యక్షేత్రమందు, మహాతీర్థమందు, భారతదేశంలో, విఘ్నములను నశింపచేసే వానిని పూజించి, అడ్డులేకుండా గోవిందుని పొందుము. (49) నీవు రాసేశ్వరివి, రసికురాలవు, శ్రీకృష్ణుడు రసికేశ్వరుడు. పండితురాలికి, పండితునితో సమాగమము గుణవంతంగా ఉంటుంది. (50) ఓసతి! నూరు వత్సరముల తర్వాత శ్రీరాముని శాపం నుండి విడువబడ్డావు. నా వరంతో ఈవేళ కృష్ణునితో కూడా సంగమమును పొందు. (51) ఓ సుందరి! నా ఆజ్ఞతో, దుర్లభమైన ఆజ్ఞతో మంచివేషం ధరించు. స్త్రీలకు సత్పురుషునితో సంగమము చాలా దుర్లభముకదా. (52) పార్వతి ఆజ్ఞతో రాధకు, ఆమె ప్రియమైన చెలికత్తెలు మంచివేషం వేశారు. (53) ఈశ్వరిని, రమ్యమైన రత్నసింహాసనంలో కూర్చోబెట్టారు. ఎదురుగా రత్నమాల అను ఆమె, రత్నమాలను కంఠంలో వేసింది.(54) రాధయొక్క కుడిచేతి యందు మనోహరమైన క్రీడాపద్మముంచారు. ఒక పద్మముఖి, రాధ పాదపద్మముల యందు లత్తుకను పూసింది. (55) ఒక గోపిక, సుందరురాలు, ఉత్తమమైన సుందరమైన సిందూరాన్ని పెట్టింది. చందనముతో కూడిన సిందూరాన్ని పాపట క్రింది భాగంలో ప్రకాశవంతంగా పెట్టింది. (56) మాలతి అనుస్త్రీ రమ్యమైన చాలా అందమైన కేశపాశాన్ని తీర్చిదిద్దింది. అది మునులకు గూడా మనోహరంగా ఉంది. మాలతి మాలను కొప్పులో అలంకరించింది.

శ్రీభగవానువాచ:

కస్తూరి, కుంకుమతో కూడిన సుందరమైన చందనపు ఆకును, చాలా కఠినమైన ఆమె స్తన యుగ్మమందు, చందన అను స్త్రీ ఏర్పరచింది. (58) వాసనతో మనోహరమైన అందమైన చంపక పుష్పముల మాలను బాగా వికసించిన నవమల్లికలను ఆమెకు మాలావతి ఇచ్చింది. (59) రతులయందు రసికురాలైన ఒక గోపి ఆమెనురత్నభూషణములతో అలంకరించింది. రతి రసముయందు ఉత్సుకురాలైన ఆ రాధను, శ్రేష్ఠురాలను, ఇంకా రసికురాలనుగా చేసింది. (60) శరత్కాల మందలి పద్మదళము వంటి కాంతిగల ఆమెకన్నును కాటుకతో ప్రకాశవంతంగా చేసి, లలిత అనుగ్రీ చాలా లలితమైన వస్త్రము నిచ్చింది. (61) మ హేంద్రుడిచ్చిన పారిజాతపు పూవును, మంచివాసనగల దానిని పారిజాతాన్ని రాధ చేతికి ఇచ్చింది. (62) సుశీల అను గోపిక మంచి శీలమును, తీయగా మాట్లాడటను, భర్త ప్రక్కన ప్రవర్తించవలసిన విధానాన్ని, నీతిని గూర్చి బోధించింది. (63) ఆపదలందు మరిచిపోయిన వాటిని స్త్రీలకు చెందిన పదహారు కళలను వాటిని కళావతి రాధ (మాతకు) గుర్తుచేసింది. (64) శృంగార విషయమందు చెప్పబడ్డ, అమృతం వంటి మాటలను, సుధాముఖి అను భగిని (చెల్లెలు) గుర్తుచేసింది. (65) కమలములు, చంపకములు వీని దళములందు చందనము పూసి వానితో రతి కొరకు తల్పమును త్వరగా కోమలంగా కమల సిద్దంచేసింది. (66) దొప్పయందున్న అందమైన చంపక పుష్పాన్ని, చందనంతో తడిపి పార్వతి సతి స్వయంగా కృష్ణుని కొరకు సిద్ధంచేసింది. (67) కేళికొరకు కదంబముల పుష్పాన్ని గుత్తిని, మనోహరంగా కదంబమాలను కృష్ణుని కొరకు ఉండేట్టుగా ఆమె చేసింది. (68) కర్పూరాదివాసనగల, కోరతగిన రమ్యమైన తాంబూలమును, వాసనగల నీటిని కృష్ణుని కొరకు, కృష్ణుని ప్రియ సిద్ధంచేసింది. (69) ఇంతలో నీరున్న ప్రదేశము, స్థలప్రదేశము ఆశ్రమమంతా గోరోచన కాంతిగలదిగా ఐనట్లు మునులు, దేవతలు సాక్షాత్తుగా చూచారు. (70) వారంతా ఆశ్చర్యపోయి, ఈశ్వరుడైన కృష్ణుని అడిగారు. సర్వజ్ఞుడు, అన్నిటికి కారణమైనవాడు, భగవంతుడు వారితో ఇట్లన్నాడు. (71) భగవంతుడిట్లా - శ్రీరామునితో శపింపబడి రాధిక తన శోభను కోల్పోయింది. నావిచ్ఛేదం వల్ల కలిగిన (విరహ) జ్వరంతో ఆతురురాలై తన జ్ఞానాన్నంతా మరిచిపోయింది. (72) నూరు సంవత్సరాలు గడిచాక ఆమె తన జ్ఞానాన్ని స్మరించుకొన్నది. రాసేశ్వరి యొక్క తేజస్సుతో ఈసిద్ధాశ్రమము పీతవర్ణంగా మారింది. (73) ఆతేజస్సు చాలా ఆనందాన్ని కలిగించేది, కోటి చంద్రులతో సమానమైన కాంతి గలది. సుఖంగా చూడతగినది, కళ్ళకు సుఖాన్నిచ్చేది, ప్రాణులకు కూడా. (74) దానిని విని, మునులు, మనువులు, దేవతాస్త్రీలు,దేవతలు, బ్రహ్మ ఈశానాదులు అట్లాగే అందరు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు.

వేగంగా ఆమె ఉన్నచోటికి వెళ్ళి భక్తితో తమతలలను వంచి, వారంతా చూచారు. త్రైలోక్య మందున్నవారు కూడా రాధికను చూచారు. (76) తెల్లని చంపకపూవురంగు వంటి రంగుగలది, సాటిలేనిది, చాలా మనోహరమైనది, ఊర్ధ్వరేతస్కులైన మునుల మనస్సును కూడా మోహింపచేసేది. (77) మంచికేశసంపద గలది, సుందరి, శ్యామలవర్ణురాలు, మర్రాకువలె అంతట వర్తులముగా గల, కఠినమైన నితంబములతో కూడిన శ్రోణిభాగముగలది (పిరుదులు, మొలభాగము) స్తనముల జంటతోను, ఉన్నతమైన ఆననము గలది. (78) కోటిచంద్రులనిందించే ముఖముగలది, చిరునవ్వు నవ్వుతున్నది. మంచి పలువరుస గలది, ఆసతి. కాటుకతో ఉజ్జ్వలమైన రూపముగలది, శరత్కాల మందలి కమలము వంటి కళ్ళుగలది. (79) మహాలక్ష్మి బీజరూపురాలు, చాలా మొదటిది, సనాతని, పరమాత్మ స్వరూపానికి ప్రాణ అధిష్ఠాతృదేవత (80) స్తుతించ తగినది, పూజింపబడినది. పరమాత్మ కన్నపరురాలు. బ్రహ్మస్వరూపురాలు, నిర్లిప్తురాలు, నిత్యస్వరూపురాలు, నిర్గుణురాలు (81) విశ్వమును అనుసరించుట వలన ప్రకృతి రూపురాలు, భక్తులను అనుగ్రహించే కొరకు రూ పెత్తినట్టిది. సత్యస్వరూపురాలు, శుద్ధురాలు, పవిత్రమైనది, పతితులను పవిత్రం చేసేది. (82) మంచీ తీర్థమువలె పవిత్రురాలు, మంచికీర్తిని బ్రహ్మలకు గూడా కూర్చేది, గొప్పప్రియురాలు గొప్పది, మహావిష్ణువునకు తల్లియైనది. (83) రాసేశ్వరునకు ఈశ్వరి, రమ్యమైనది, రసికురాలు, రసికులకు ఈశ్వరి, వహ్నితో శుద్ధమైన వస్త్రమును ధరించినది, స్వేచ్ఛా (తన ఇష్టమైన) రూపురాలు శుభమునకు ఆలయము. (84) తెల్లవింజామరలు గల ఏడుగురు గోపికలతో ఎప్పుడూ సేవింపబడేది. నలుగురు ప్రియమైన చెలికత్తెలతో, పద్మముల వంటి పాదములందు సేవింపబడేది (85) అమూల్యమైన రత్నములతో నిర్మింపబడ్డ భూషణములతో బాగా అలంకరింపబడినది, అందమైన కుండలముల జంటతో చెవి ప్రక్కని చెక్కిళ్ళ ప్రాంతమందు ప్రకాశించేది. (86) మంచి నాసిక గలది, గజములతలలోని ముత్యములు ధరించుటకు తగిన నాసికగలది. గరుత్మంతుని ముక్కును తీసివే సేది (నిందిత). అంతకన్న బాగైనది. కుంకుమ, లత్తుక, కస్తూరి, మృధువైన చందనము వీనితో పూయబడినది. (87) మంచి చెక్కిళ్లుగలది, కోమలమైన అవయవములు గలది, మంచికాముకి, గజేంద్రమువంటి నడకగలది, రామ, మనోహరమైనది, మంచికామిని (88) మన్మథుని అస్త్రమునకు జయము కల్గించే రూపముకలది, కామునకు కోరతగిన ఇల్లువంటిది, వరురాలు, వాడని క్రీడాకమలాన్ని, పారిజాత పూవును ధరించింది. (89) అమూల్యరత్నములతో నిర్మించిన, ఉజ్జ్వలమైన దర్పణమును ధరించింది, రకరకాల రత్నాలతో విచిత్రంగా ఉన్న రత్నసింహాసనమందు కూర్చున్నది. (90) పద్మములతో, పద్మతో పూజింపబడిన పాదపద్మము గలది. మంగళములకు నిలయము. పరమాత్మయైన కృష్ణుని హృదయ పద్మమందు ధ్యానింపబడేది. (91) పనిలో, మనస్సులో, మాటలో, కలలో, మెలకువలో ఆతని ప్రీతిని, ప్రేమను, సౌభాగ్యమును, నిత్యనూతనంగా స్మరించేది. (92) భావముయందు అనురక్తురాలై తడిసిపోయినది, శుద్ధభక్తురాలు, పతివ్రత. ధన్యురాలు, మాన్యురాలు, తెల్లని వర్ణము గలది, ఎప్పుడూ వక్షఃస్థలమందుండేది. (93) ప్రియమైన స్త్రీలందు, ప్రియమైన భక్తులందు (పురుషులు) చాలా ప్రీతికలది, ప్రియంగా మాట్లాడేది. కృష్ణుని ఎడమ అంగము నుండి పుట్టినది. గుణరూపములందు ఆతనితో భేదములేనిది. (94) గోలోకమందుండేది, దేవదేవి, అందరికి పైన ఉండేది. పుణ్యక్షేత్రమైన భారతమందు ఆమె వృషభాను సుత అని పేరుగలది, ఆమెను చూచారు.

బ్రహ్మోవాచ :

శ్రీమహాదేవ ఉవాచ :

అనంత ఉవాచ :

గోపికలకు ఈశ్వరి, రహస్యరూపమైనది, సిద్ధినిచ్చేది, సిద్ధియే ఆమె స్వరూపము. ధ్యానమునకు సాధ్యురాలుకాదు. ఆరాధించుటకు కఠినమైనది. సద్భక్తులతో నమస్కరింపబడేది, ఆ దేవిని నమస్కరిస్తున్నాను. (96) ప్రతిధ్యానమందు రాధను ధ్యానించే జ్ఞానతత్పరులు, ఇక్కడే జీవన్ముక్తులై వారు పైన కృష్ణుని ప్రక్కనుండే వారౌతారు. (97) బ్రహ్మచూచి, అందరికన్న ముందుగా పరమేశ్వరిని స్తుతించాడు. స్వయంగా బ్రహ్మ జగత్తులకు, బ్రహ్మలకు తల్లిఐన ఆమెను స్తుతించాడు. (98) బ్రహ్మఇట్లా - ఓ పరమేశ్వరి। దేవతల అరవైవేల సంవత్సరాల కాలము, భారతంలో పుణ్యక్షేత్రమైన పుష్కర క్షేత్రమందు తపస్సు చేశాను. (99) నీపాదపద్మముల యందలి తీయని తేనెయందు లుబ్ధమైన మనస్సుతో, లోభంతో ప్రేరితమైన తుమ్మెదవలె మధువ్రతంతో నేను తపస్సుచేశాను, ఓసతి। (100) కోరిన నీపాదపద్మము అటైనా నాకు లభించలేదు. కలలో కూడా చూడలేదు. ఆశరీరవాణి విన్పించింది (101) వరాహకల్పమందు, భారతదేశమందు పుణ్యమైన బృందావన వనమందు సిద్దాశ్రమమందు గణేశుని పాదపద్మాలను చూస్తావు. (102) విషయివైన నీకు రాధామాధవుల దాస్యమెందుకు, ఓమహాభాగ! మరలిపో, ఇది చాలాదుర్లభమైనది, పరమైనది (103) అని విని భగ్నమానసుడనై నేను తపస్సు నుండి విరమించాను. ఆతపః ఫలము, ఆ కోరిక ఇప్పుడు తీరింది (104) శ్రీమహాదేవుడిట్లా - పద్మములతో పద్మపూజించిన పాదపద్మము చాలా దుర్లభమైనది. ధ్యాననిష్టులు, బ్రహ్మాది దేవతలు ఎప్పుడూ ధ్యానిస్తుంటారు. మునులు, మనువులు, సిద్ధులు, సంతులు (సజ్జనులు) యోగులు వీరంతా నిన్ను చూచుటకు అసమర్థులు కలలో కూడా చూడలేరు. నిన్ను ఆతని వక్షఃస్థలమందు చూడలేరు. (106) అనంతుడిట్లా - వేదములు, వేదమాత, పురాణములు ఓ సువ్రతురాల! నేను, సరస్వతి, సజ్జనులు, మేమంతా ఎల్లప్పుడు స్తుతించుటకు సరిపోము (107) మాస్తోత్రం వల్ల ఆమెకనుబొమల కదలిక కూడా చాలా దుర్లభము. నీబెదిరింపు మాటకై భయపడ్డాము. హరికి మాకు భేదము (108) ఈరకంగా దేవతలు, దేవేరులు, వచ్చిన ఇతరులు, నమస్కరించి, మునులు మన్వాదులు కూడా అంతా స్తుతించారు. (109) రుక్మిణి మొదలగు స్త్రీలు సిగ్గుతో తలలు వంచుకున్నారు వారు తమ ఉచ్ఛ్వాసనిశ్వాసములతో రత్నముల అద్దాన్ని మలినంగా చేశారు (110) సత్యభామ, ఆహారం లేక, ఉదరం కృశించి చచ్చినదానివలె ఐంది. ఓ నారద! మనస్సులోని అభిమానాన్ని కూడా అంతటిని వదిలింది. (111) అనిబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు సిద్దాశ్రమతీర్థయాత్రా ప్రసంగమందు గణేశపూజనము, బ్రహ్మ ఈశ, శేషాదులు చేసిన రాధిక స్తోత్రమనునది నూట ఇరువది నాల్గవ అధ్యాయము.