4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

116 - అధ్యాయము

బాణ ఉవాచ:

అనిరుద్ధ ఉవాచ :

వహ్నిరువాచ : 

శ్రీరామ ఉవాచ :

బాణుడిట్లా - అనిరుద్ద! నీవు తెలివి కలవాడివి. నీవు చెప్పింది సత్యమే. శంభువు కూడా ఇట్లాగే చెప్పాడు. నామనస్సుతో అంతా తెలుసుకున్నాను. (1) నీవు చెప్పావే, శంకరుని వరం వల్ల, ఐదుగురు స్వాములకు ప్రియ, మహాభాగ! ద్రౌపది అని దానిని నాకు వివరించాలి. (2) ఇదివరలో నీతల్లి రతి, శంబరుని చేత ఎట్లా తీసుకుపోబడింది. దేవతలు ఎట్లా ఇచ్చారు. వాడు దేవతలను ఎట్లా జయించాడు (3) అనిరుద్ధుడిట్లా - ఒకసారి రఘునాధుడు, సీత, లక్ష్మణులతో కలసి, రమ్యమైన పంచవటీ తటమందు ఉంటూ సరస్సులో స్నానం చేశాడు. (4) సీత పంచవటి తటమందు ఉంది. హేమంత ఋతువుయందు నీరు రుచికరంగా, నిర్మలంగా ఉంది. అన్నము, కూరలు, రమ్యమైన అన్ని వస్తువులు చాలా చల్లగా ఉన్నాయి. (5) రాముడు పండును తెంపి ఆనందంగా సీతకిచ్చాడు. ఆపై లక్ష్మణునకిచ్చాడు. ఆ తరువాత ప్రభువు తాను . తింటాడు. (6) లక్ష్మణుడు దాన్ని తీసుకుని ఆ పండును తినలేదు, నీరుత్రాగలేదు. మేఘనాథుని చంపేకొరకు, సీతను ఉద్ధరించేకొరకు (7) నిద్రపోడు, తినడు, ఇట్లా పదునాలు సంవత్సరాల దాకా. ఇట్టి పురుషుడు, యోగి ఐన వానిచేతిలో రావణుని కొడుకు చస్తాడు. (8) ఇంతలో, కమలలోచనుడైన రాముని చూడటానికి, వహ్ని అక్కడికి వచ్చాడు. కృపానిధికి, బ్రాహ్మణుడుగా వచ్చాడు. శ్రుతికటువైన మాటను, భవిష్యత్తును చెప్పసాగాడు. (9) వహ్ని ఇట్లా - ఓరామ! మహాభాగ! సీతను దాచి పెట్టు. (10) ఏడు రోజులలోపల దుష్టరాక్షసుడు, రావణుడు, నివారింప శక్యముకానివాడు, ప్రాక్తన కర్మననుసరించి జానకిని తీసుకుపోతాడు. (11). ఇది బ్రహ్మవ్రాసినమ్రత. ప్రాక్తనమైన దానిని ఎవడూ తప్పిచలేడు. నలుగురు దేవతలు చెప్పారు. దైవముకన్న పరమైనది, శ్రేష్టమైనది లేదు. (12) శ్రీరాముడిట్లా - సీతను తీసుకుని వెళ్ళు. ఛాయ (నీడ) ఇక్కడే ఉండని. భార్యను విచి పెట్టటమనే కర్మ అందరికి జుగుప్స కల్గించేదే. (13) ఏడుస్తున్న సీతను తీసుకొని అగ్ని వెళ్ళాడు. రాముని సన్నిధిలో సీతతో సమానమైన నీడ ఉంది. (14) ఆ నీడను ఇదివరలో రావణుడు అవలీలగా తీసుకెళ్ళాడు. బంధువులతో గూడా వానిని చంపి, రాముడు ఆమెను ఉద్దరించాడు. (15) వహ్నిలో పరీక్షాకాలమందు, ఆ ఛాయవహ్నిలో ప్రవేశించింది. అగ్ని ఛాయను కూడా రక్షించి, రామునకు జానకిని ఇచ్చాడు. (16) రాముడు ఆమెను స్వీకరించి తన ఆశ్రమానికి ఆనందంగా వచ్చాడు. ఛాయ హృదయంలో బాధపడుతూ వహ్ని పక్కన ఉన్నది. (17) నారాయణ సరోవర మందు తపస్సుచేసింది. దేవతల వేయి సంవత్సరాల కాలము శివుని గూర్చి ఆమె తపస్సు చేసింది. (18)

శ్రీమహాదేవ ఉవాచ :

ఓ భద్ర! నీవు వరమును కోరుకో, అని శంకరుడు ఆమెతో అన్నాడు. ఆమె శంకరునితో భర్త దుఃఖంతో దుఃఖితురాలై వ్యగ్రురాలై ఇట్లా అంది. (19) భర్తను ఇవ్వు అని ఐదుసార్లు ఆమె శివుని వరాన్ని కోరింది. అన్ని సంపదలనిచ్చేవాడు సంతోషించి ఆ శివుడు ఆమెకు వరమిచ్చాడు. (20) శ్రీమహాదేవుడిట్లా - నీవు వ్యాకులురాలవై ఓసాధ్వి! భర్తను ఇవ్వు అని ఐదుమార్లన్నావు. ఐదుగురు ఇంద్రులు, హరి అంశలు నీకు ప్రియులౌతారు. (21) వారంతా ఆ ఐదుగురింద్రులు ఇప్పుడు పంచపాండవులు. ఆఛాయ ద్రౌపది, యజ్ఞ కుండంలో పుట్టినది. (22) కృతయుగంలో వేదవతి, త్రేతాయుగమందు జనకుని కూతురు. ద్వాపరంలో ద్రౌపది ఆఛాయ. అందువల్ల కృష్ణ (స్త్రీ) మూడుకాలాల్లో ఉన్నది. (23) వైష్ణవి, కృష్ణభక్తురాలు అందువల్ల ద్రౌపది 'కృష్ణా' అని పిలువబడుతోంది. మహేంద్రులకు స్వర్గలక్ష్మి. ఆమె తరువాత జన్మిస్తుంది. (24) స్వయంవరంలో రాజుకన్యను ఫాల్గుణునకు ఇచ్చాడు. ఆవీరుడు, తల్లితో నేను ఇప్పుడు ఒక వస్తువును పొందాను. ఏం చేయాలని అడిగాడు. (25) అతనితో తల్లి స్వయంగా భ్రాతలతో కలిసి తీసుకో అని అన్నది. ఇదివరలో శంభుని వరముతో తరువాత తల్లి ఆజ్ఞతో ఇట్లా ఐంది. (26) అందువలన పంచపాండవులు ద్రౌపదికి యజమానులయ్యారు. పదునాలుగురింద్రులలో ఐదుగురింద్రులు పంచపాండవులు. (27) ఆతల్లి, భయ పెడుతూ, శంకరునితో శపింపబడింది. శివుని కోపాగ్నితో నీ భర్త భస్మమైనాడు. (28) హర అని నేను నిన్ను శపించాను. అందువలన ఇప్పుడు రాక్షసునితో తీసుకపోబడతావు (హరణం). దేవతలను, ఇంద్రుని జయించి శంబరుడు నిన్ను తీసుకుపోతాడు. (29) మళ్ళీ అడుగగా చెప్పాడు ఇట్లా చేస్తే నీగతీత్వము వస్తుంది అని వరమిచ్చాడు. నీఛాయను రాక్షసునకిచ్చి నీవు ఆ ఇంట్లో ఉండు, నీభర్త బ్రతికేవరకు అని అన్నాడు. (30) అని నీకు పురాతనమైన ఇతిహాసాన్నంతా చెప్పాను. ఓదైత్యేంద్ర! ఇప్పుడు దేవతల గుప్త చరితమును విను. (31) ఇంతలో మహాబలుడైన వసుభద్రుడు వచ్చాడు. వాడు కుభాండునిభ్రత, బలవంతుడు, బాణుని సేనాధిపతి, సమర్థుడు. (32) బాణుని యుద్దమందు అదిరించి శస్త్రము చేత ధరించి మహారథుడు శ్రీకృష్ణుని పౌత్రుని పై ప్రళయానగ్ని వంటి శూలమును వేశాడు. (33) కాముని పుత్రుడు, అర్ధచంద్రాకార బాణంతో ఆ శూలమును ఛేదించాడు. భద్రుడు నూరుగురు సూర్యులతో సమానమైన కాంతిగల శక్తిని వేశాడు. (34) కాముని పుత్రుడు దాన్ని వైష్ణవాస్త్రంతో ఛేదించాడు. సుభద్రుడు యుద్ధరంగంలో నారాయణాస్త్రాన్ని వేశాడు. (35) బలవంతుడైన మదనుని పుత్రుడు భయం లేకుండా నమస్కరించి నిద్రించాడు. నూరుగురు సూర్యుల సమానకాంతిగల ఆ అస్త్రము, పైన తిరుగసాగింది. (36)

అను!! విశ్వసంహారమునకు కారణమైన అస్త్రము ఆకాశంలో లీనమయ్యాక, అస్త్రం పోయాక ఆ అనిరుద్దుడు పెద్దకత్తిని తీసుకొని (37) భద్రుని రధాన్ని భంజించాడు. అశ్వములను సారథిని చంపాడు. అవలీలగా యుద్దరంగంలో ఆసుభద్రుని కూడా చంపాడు. (38) సుభద్రుడు చనిపోయాక, మహాబలపరాక్రమము గల బాణుడు యుద్ధరంగంలో నూరు బాణములను వేశాడు. (39) కాముని కొడుకు అగ్ని బాణంతో ఆతడు బాణముల సమూహాన్ని కాల్చాడు. సృష్టి సంహార కారణమైన బ్రహ్మాస్త్రమును బాణుడు వేశాడు. (40) కాముని కొడుకు, చూచి త్వరగా, బీజాక్షరములతో సహమంత్రపూర్వకముగా బ్రహ్మాస్త్ర ముతోనే దానిని త్వరగా అవలీలగా సంహరించాడు. (41) బాణుడు కోపంతో పాశుపతాస్త్రాన్ని వేయటానికి ఆరంభించాడు శివుడు, స్కందుడు, గణేశుడు ఆతనిని వారించారు. (42) ఆ అనిరద్దుడు దానిని చూచి ధనుర్బాణముల సమూహంతో గల బాణుని చూచి త్వరగా జృంభకాస్త్రాన్ని యుద్ధంలో బాణుని పై ఆతని సారథి పైన వదిలాడు. (43) బాణుడు యుద్ధరంగంలో నిశ్చేష్టుడు జడుడుఐనాడు. తిరిగి నిద్రాస్త్రాన్ని వదిలాడు. ఆబాణుని ఆతడు నిద్రపోయేట్టు చేశాడు. (44) నిద్రిస్తున్న ఆ బాణుని చూచి ఉత్తమమైన ఖడ్గాన్ని తీసుకొని బాణుని చంపటానికి సిద్దమైన అనిరుద్ధుని కార్తికుడు, నివారించాడు. (45) స్కందుడు, నూరు బాణములతో అవలీలగా వారించాడు. మహాభాగుడైన, బలవంతుడైన, ధనుస్సు ధరించిన అనిరుదుని వారించాడు. (46) తప్పించుకో వీలులేని శక్తితో త్వరగా అనిరుద్ధుడు, శ్రేష్ఠరత్నముల సారముతో నిర్మింపబడ్డ కార్తికుని రథాన్ని విరుగగొట్టాడు. (47) కార్తికుడు క్రుద్ధుడై గదతో, ఆనందంతో, అవలీలగా యుద్ధంలో క్షణంలో అనిరుద్ధుని రథాన్ని విరుగగొట్టాడు. (48) అనిరుద్ధుడు అర్ధచంద్రాకారంగల, కత్తి అంచుతో అవలీలగా, భల్లా స్త్రముతో కూర్చబడిన కార్తికుని ధనుస్సును ఛేదించాడు. (49) కార్తికుడు దానిని, అంతములేని గదతో కొట్టాడు. మదనుని కొడుకు వేగంగా ఆతని చేతినుండి గదను తీసుకున్నాడు. (50) - శూలాన్ని తీసుకొని తనను చంపటానికి వస్తున్న స్కందుని, - దూరంనుండే కోపంతో అనిరుద్ధుడు ప్రేరేపించసాగాడు. (51) కార్తికుడు తిరిగి వచ్చి కామపుత్రుని పట్టుకొని చేతితో పట్టుకొని భూమిపై పడవేయసాగాడు. (52) మహాబలుడు అనిరుద్ధుడు కత్తితీసుకొని లేచాడు. వారి విరోధాన్ని గణేశుడు దూరం చేశాడు. (53) కార్తికుడు ఇంటికివెళ్ళాడు. మన్మథుని కొడుకు పార్వతి ఇంటికి వెళ్లాడు. అంతా చెప్పటానికి గణేశ్వరుడు శంభుని ఇంటికి వెళ్ళాడు. (54)

 అని బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు బాణుని యుద్దమందు నూటపదహారవ అధ్యాయము.