4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

81 - అధ్యాయము

మూ॥ శ్రీకృష్ణఉవాచ-

బ్రహ్మోవాచ-

అను! శ్రీకృష్ణుని వచనమిట్లా - ఇంతలో శుక్రుడు దేవతాశ్రేణినిచూచాడు. ఆకాశ మార్గంలో వస్తోంది.యుద్ధ సంబంధ శస్త్రాస్త్రములు ధరించింది (1) మూడుకోట్ల ఝండాలు, నూరుకోట్ల మహారథములు, గజేంద్రములు, నూరుకోట్లు, అందుకు నాల్గింతలు రధములు, (2) గుఱ్ఱములు దానికి నూరింతలు. వీటి సమూహము చాలా దారుణంగా ఉంది. పదాతుల సమూహము గుర్రములకన్న ఆరింతలెక్కువ. (3) దుందుభి వాద్యభాండములు ఐదు లక్షలు. పటహములు మూడు లక్షలు డిండిమములు (వాద్యం) మూడు లక్షలు. (4) ఐరావతం పై మహేంద్రుడు, తెల్లని గుర్రం పై ధర్ముడు,కుబేరుడు, వరుణుడు, అగ్ని గాలివీరు రథం పై ఉన్నారు. (5) మహిషము పై యముడు, రథము పై సూర్యుడు, వృషభశ్రేష్ఠము పై ఈశానుడు, నాగవాహనము పై అనంతుడు (6) ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సిద్ధగంధర్వ కిన్నరులు,సూర్యకాంతి గల జీవన్ముక్తులైన మునుల సమూహము. (7) వీరందని చూచి, భయంలేకుండా శుక్రుడు, చంద్రుని ఊరడించి, ఓ వ్రజేశ్వర! దేవతల కన్న రెట్టింపు సైన్యమును తెప్పించాడు. (8) రత్నమాల నదీతీరమందు, హుతాశనుని ప్రియమైన ఆశ్రమమందు, పుణ్యకరమైన పాలసముద్రపు ఒడ్డుయందు, అక్కడ రాక్షస సైన్యముంది. (9) ఇంతలో శుక్రుడు, సరస్సుయొక్క ఒడ్డుయందు దగ్గరలో, పుణ్యమైన ఆశ్రమంలో, అక్షయవటమందు, దేవ సైన్యమునుండి వచ్చిన (10) వృషభము పైకూర్చున్న ,అందరికి మేలు చేకూర్చే శంకరునిచూచాడు. ఆతని చేతిలో త్రిశూలముంది. అడ్డకత్తి ఉంది. శ్రేష్ఠమైన వ్యాఘ్రచర్మము వస్త్రంగా ఉంది. (11) తేజఃస్వరూపుడు, పరముడు, భక్తులననుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు, అన్ని సంపదలనిచ్చేవాడు, సర్వజ్ఞుడు, అన్నింటికి కారణుడు (12) సర్వేశ్వరుడు, సర్వపూజ్యుడు, సర్వస్వరూపుడు, సనాతనుడు, శరణాగతులైన దీనులను బాధనుండి రక్షించుటలో ఆసక్తిగలవాడు. (13) చిరునవ్వుగలవాడు, పరమాత్మకలవాడు, బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. భయపడి, త్వరగా లేచి, ఆతని పాదములకు నమస్కరించాడు. (14) సుప్రసన్నుడై పరాత్పరుడు ఆతనికి శుభాశీస్సులనిచ్చాడు. ఆదరంగా ఆతనిని రత్నసింహాసనముపై కూర్చోబెట్టాడు. (15) ఇక అంతలో ఓ విపుత్రు! ఎదురుగా ఆతడు ఆతనిని (బ్రహ్మను) చూచాడు. శాంతుడు, స్వయంగా విధాత, రత్నరథమందు అందంగా ఉన్నాడు. (16) వహ్నిశుద్దమైన వస్త్రాన్ని ధరించాడు. రత్నమాలను అలంకరించుకున్నాడు. ప్రసన్నంగా ఉన్నాడు. నవ్వుతున్నాడు. శుద్దుడు. లోకాలకీ శ్వరుడు, పరుడు ఆతడు. (17) కర్మలకు ఫలమిచ్చేవాడు తపస్వులకు తపోరూపుడు. వేదములకు జనకుడు. వేదముల ప్రసవించినవాడు (కన్నవాడు). కానుడు, మనోహరుడు. (18) అప్పుడు భయపడి, చేతులు జోడించి సురేశ్వరునకు నమస్కరించాడు. భక్తితో రత్నసింహాసమున పై అందమైన దాని పై ఉంచాడు. (19) వారి పాదపద్మములను భక్తితో పూజించాడు. కుశలప్రశ్న తగదు కనుక వేయలేదు. ఎందుకంటే వారికి కళ్యాణమేగదా. (20) జగత్తునకు విధాతయైన బ్రహ్మ ఎదురుగా ఉన్న శుక్రాచార్యుని, నీతిమంతునితో శివుని అనుమతితో, ప్రయత్నపూర్వకముగా ఇట్లా అన్నాడు. (21) బ్రహ్మ వచనమిట్లా - ఓ సుత! శుక్ర! చంద్రుని దుర్నీతిని చెబుతాను, విను. ముల్లోకాలకు, సిగ్గు కల్గించేది, ఈపని. వేదములు బహిష్కరించాయి (22) స్నానం చేసి గృహంవైపు బయలుదేరిన గురుపత్ని, పతివ్రత, ఐన తారను స్వీకరించి పట్టుకొని) నిన్ను శరణువేడాడు. ఇప్పుడు ఈపాపి.

శంభురువాచ-

శుక్రఉవాచ –

అను!! ఓవత్స! ఇప్పుడు యుద్ధసన్నద్దమైన దేవసైన్యాన్ని చూడు. నేను, శంభుడు, ఇద్దరము నీ దగ్గరకు అతని కొరకై వచ్చాము. (24) శంభువిట్లన్నాడు - ఓవిప్ర! నీకు క్షేమం జరగాలనుకుంటే చంద్రుని తీసుకురా. త్రిశూలంతో ఆపాపి శరస్సును ఖండిస్తాను (25) లేదా క్షణకాలంలో రాక్షసులనందరిని సంహరిస్తాను. నేను కోపగిస్తే రాక్షసులకు రక్షకుడెవడున్నాడు, ఓ ద్విజుడ! (26) వెంటనే పాశుపతాస్త్రంతో, వాయ్వస్త్రంతో ఇప్పుడు, దేవతల శత్రువులైన వారిని (రాక్షసులను) అవలీలగా హరిస్తాను. (27) నా అంశమైన దుర్వాసుని గురువు, ఆతనికి అంగిరసుడు " ముని గురువు. పరస్పరము సంబంధమున్నందువల్ల గురుపుత్రుడు నాకు గురువు. (28) బృహస్పతి తేజస్వంతుడు. ఆతనిని భస్మంచేయడానికి ఈశ్వరుడు సిద్దపడలేదు. దయగలవాడు, అదిగాక ప్రియశిష్యుడైనందువల్లను (29) ఉతథ్యుని భార్యను చూచి ఆతడు ఇదివరలో తన కోరికతో రమించాడు. ఆమె భర్త శాపంతో ఈతని ప్రియసతి ఇతరులతో గ్రహింపబడింది. (30) నా గురువు పుత్రుని భార్యను, మనోహరమైన తారను ఇవ్వు. నాశత్రువైన చంద్రుని భ్రాతృ భార్యను అపహరించేవానిని (31) శరణాగతుడైన దీనుని ఆర్తుని యతీశ్వరుడు రక్షించరాదు. పదునాలుగురింద్రుల కాలపర్యంతము నరకమందు వండబడతాడు (32) పాపిష్టుడు శరణాగతుడైతే నాకు విచారం లేదు. పాపి ఎవనిని శరణు వేడుతాడో వాడుకూడా పాపియే అనుమానం లేదు. (33) పాపి, మాతను పొందిన వానిని, వానిని ఓ బ్రాహ్మణశార్దూల అప్పగించు. తారాసాధ్వితో కూడిన వానిని నీ ఆశ్రమం నుండి బహిష్కరించు. (34) శుక్రుడిట్లన్నాడు - దేవతలకు రాక్షసులకు అందరికి లోకములకు కూడా భగవాన్! నీవేశాసకుడవు. సురుడు అసురుడైతే శాసించేవాడెవడు (35) దేవతలకు సహాయం చేసి రాక్షసులనెట్లా చంపుతావు. జగత్తులనంతా సంహరించేవానికి రాక్షస సమూహ. మందు పౌరుషం చూపటం అదెంత (నీచం) (36). నీవు జ్యోతివి, పరబ్రహ్మవు.. సగుణుడవు నిర్గుణుడవు స్వయంగా గుణభేదం వల్ల బ్రహ్మ విష్ణు శివాత్మకముగా మూర్తి భేదము. (37) బలియొక్క ద్వారమందు గదచేత ధరించి ఉన్నవాడివి స్వయంగా నీవే. ఓ ప్రభు! స్వయంగా ఇంద్రునకిచ్చావు. ఆతనికి అవలీలగా నికూడా ఇచ్చావు. (38) ఓ భగవన్ శంభు! క్షమించు. క్రోధమునుహరించు ఉపసంహరించు. మీరు బ్రాహ్మణుని హింసిస్తే అదేమంత పౌరుషకార్యము. (39) నేను బ్రతికుండగా చంద్రుని అప్పగించను. శరణాగతుడు దీనుడు ఆర్తుడు, సిగ్గుపడుతున్నాడు.పాపయుక్తుడాతడు. (40) ఓ శంకర! నీపాదాంబుజముల పై నేను శరణు పొందుతున్నాను. ఓవిభు! నీకు తోచినట్లు చేయి. అట్లాగే జగత్తునంతా చేయి. (41) శుక్రుని మాటను విని భగవంతుడైన శివుడు ప్రసన్నుడై ఇట్లన్నాడు - చంద్రుని తీసుకురా. శుభంకలుగుతుంది అని (42) ఇంతలో బ్రహ్మ, విభువు శుక్రుని బోధించాడు. ఓ ప్రజ! తారతో పాటు నిశానాథుని తీసుకువచ్చి (43) శివుని పాదాంబుజముల పై సమర్పించాడు. ప్రీతికలవాడై శివుడు, ఆతనిని వక్షస్సు పై ఉంచుకున్నాడు.

మహాదేవ ఉవాచ

అతనికి పాదరేణువునిచ్చి పాపరహితునిగా ఆతనిని చేశాడు. ఆతనితల పై చేయి ఉంచి, అభయమిచ్చాడు, దయగల ఆస్వామి (45) శంకరుడు పాలసంద్రమందు ప్రాయశ్చిత్తపూర్వకముగా స్నానం చేయించి బ్రహ్మతో కూడి చంద్రుణ్ణి పాపరహితుని, శుచిని చేశాడు (46) యోగీంద్రుడు శివుడు ఆ చంద్రుని యోగశక్తితో రెండు భాగములు చేశాడు. సగభాగాన్ని తలలో ఉంచుకొని రక్షించాడు. ఆతడు మిగిలిన సగభాగాన్ని బ్రహ్మముందుంచాడు (47) ఈరకంగా మహాదేవుడు చంద్రశేఖరుడైనాడు. అక్కడ దేవసభయందు, కలంకితుడైన మృగాంకుడు సిగ్గుపడ్డాడు. (48) లజ్జవల్ల తనయోగశక్తితో ఆతడు తన దేహాన్ని విడిచి పెట్టాడు. ఆశరీరాన్ని బ్రహ్మ, పాలసముద్రంలో వేశాడు. ప్రేమతో, అత్రి, బాధతోను పాల సముద్రపు ఒడ్డులో దుఃఖించాడు. (49) ఓ ప్రజ! అత్రి యొక్క ఆకన్నీరు ఆనీటిలో పడింది. అందునుండి పాపరహితుడై చంద్రుడు వచ్చాడు. దేవసభకొచ్చాడు. (50) బ్రహ్మ భగవంతుడైన శంభువు ఆతనికి అభిషేకం చేశారు. మహాదేవుడు, నిర్భయంగా దేవసభలో ఆతనితో ఇట్లన్నాడు. (51) మహాదేవుని వచనమిట్లా - ఓపుత్ర నీస్థానానికి వెళ్ళునీవు. ఆనందంతో నీ పనులు చేయి. ఆ పైన, ఆమె శాపం ప్రకారము క్షయరోగానికి గురి ఔతావు. (52) ఈశుడైనా పతివ్రతా శాపాన్ని వ్యర్థపరచటానికి అసమర్థుడు. ఆశీర్వచనంతో క్షయ రోగానికి ప్రతీకారము కలుగుతుంది. (53) భాద్రపద చవితియందు గురుపత్నిని గాయపరిచావు కనుక అందువల్ల ఆరోజున ఓ వత్స! ప్రతి యుగంలో నిన్ను చూస్తే పాపం వస్తుంది. (54) నూరుకోట్ల కల్పములకాలానికైనా కర్మఫలము అనుభవించకుండా నశించదు. శుభమైనా అశుభమైనా చేసిన కర్మను తప్పకుండా అనుభవించాలి (55) ఓవత్స! శరీర త్యాగముతో కర్మ అనుభవించటము తప్పిపోదు. ప్రాయశ్చిత్తం వల్లనైతే తప్పకుండా నశిస్తుంది, అనుమానం లేదు. (56) తారను అపహరించటం వల్ల ఓ వత్స! చంద్రమండలమందు కళంకం వస్తుంది. మృగము ఆకారము బాగా ఏర్పడి, ప్రతియుగంలో ఉంటుంది. (57) నామాటవిను. ఇక్కడికి రా ఓతార! పతివ్రత! నిజం చెప్పు, ఆగర్భం ఎవరిది. ఓప్రియా! దాన్ని పోగొట్టుకొన్ని శుద్ధురాలివికమ్ము. (58) ఇష్టం లేకుండా, బలవంతంగా, సాధ్వియైన స్త్రీ చెరచబడితే ఆజారతనదోషం ఉండదు. ఇష్టపూర్తిగా జారత్వం చేస్తే సూర్యచంద్రులున్నంత కాలము నరకానికి పోతుంది. (59) అప్పుడు తార బ్రహ్మతో అంది, నవ్వుతూ, ఈ గర్భము చంద్రునిది, అని. దేవతలంతా నవ్వారు శివుడు, ముని సంఘములు నవ్వారు. (60) ఓవ్రజేశ్వర! సిగ్గుపడుతున్న గురువునకు తారను అర్పించారు. బృహస్పతి, పతివ్రతయైన ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. (61) ఆమె కన్నటువంటి (ప్రసవించిన) సుందరంగా ఉన్న బంగారంలా మెరిసిపోతున్న పుత్రుడిని తీసుకొని చంద్రుడు, బ్రహ్మకు శివునికి నమస్కరించి వెళ్ళిపోయాడు. (62) దేవతలు, మునులు, శంభువు బ్రహ్మ వెళ్ళారు. దైత్యులతో కూడి, ఆనందంతో శుక్రుడు తన గృహమునకు వెళ్ళాడు. (63) ఓనంద! పుణ్యమును కల్గించే, శుభమైన ఈ కథను నీకు చెప్పాను. దీనిని విన్న నరుడు పాపరహితుడు, కలంకరహితుడు ఔతాడు. (64) ధన్యతను కల్గించేది కీర్తి ఆయుస్సులనిచ్చేది. అన్ని సంపదలనిచ్చేది పరమైనది. దుఃఖాన్ని తొలగించేది, ఆనందాన్నిచ్చేది. అంతటా మంగళమైనది. (65) ఓ నంద! శోకాన్ని ఎల్లప్పుడు విడిచి పెట్టు. ఓ ప్రజేశ్వర! ఇంటికి వెళ్ళు. నన్ను గన్నయశోదకు, గోపికాగణములకు ఇదంతా చెప్పు (66) శోకముతో కూడిన ఆ స్త్రీ జాతినంతా మేల్కొలుపగలవు.నేనిచ్చిన జ్ఞానంతో ఎల్లప్పుడు ఆనందం కలవాడవుకా (67) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధ మందు తారనుహరించుట అనునది ఎనుబది ఒకటవ అధ్యాయము.