4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
22 - ధేనుక వధము
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
ఒకనాడు రాధానాధుడగు శ్రీకృష్ణుడు బలదేవునితో బాలకులతో బాటు బాగుగా పండిన ఫలములు గల తాళవనమున కేగెను. ఆ వృక్షముల రక్షకుడు ఖర (గాడిద) రూపముననున్న ధేనుకుడను దైత్యుడు. వాడు కోటి సింహముల బలము గలవాడు. దేవతల - దర్పమును నశింపజేయువాడు. పోనీ శరీరము పర్వతమంత, రెండు కన్నులు చేద బావులవలె పోని పలువరుస నాగలి కర్రుల వలే వానీ నోరు పర్వత గుహలె వాని నాలుక నూరు హస్తముల పొడవున భయంకరముగా నుండును, పోనీ నాభి ఒక సరస్సు వలెను వాని శబ్దము భయానకముగాను సుండును, గోపబాలకులా తాభవనమును చూచి చాల సంతసించి ఆసక్తితో నవ్వుచు గోపాల బాలకులు శ్రీకృష్ణునితో నిట్లు పలికిరి.
బాలా ఊచుః - బాలకులు పలికిరి :
ఓ కృష్ణా! దయాసముద్రుడా! దీనులకు బంధూ! జగత్పతీ! ఓ మహాబలశాలీ! బలభద్రుని తమ్ముడా! సమస్త బలవంతులలో శ్రేష్టుడా! ప్రభూ! ఒక సగము క్షణము మా నివేదనను చిత్తగించుము. ఓ భక్తవత్సలా!మేము నీ భక్తులము. పసివారము. ఆకలిగొని ఉన్నవారము. కన్నులకింపుగా నాల్కకు రుచిగా సున్న తాళ ఫలములను చూడుము. ఎన్నెన్ని రంగులలో నున్నవో ఎంత పుష్టిగా పెరిగినవో. ఈ ఫలములింకొక చోట లభించవు. ఆ ఫలములను తినుటకు చెట్ల నూపుటకు-పండ్లు రాల్చుటకు నీ వాజ్ఞ " ఇత్తువేని స్వామీ కృష్ణా! ఆ పనిచేయుటకు మేము సమర్శలమగుదుము.
కాని ఒకమాట. ఖరరూపమున నున్న బలవంతుడైన ధేనుకుడన్న రాక్షసుడు సర్వదేవతల చేత గెలువ శక్యము కానివాడు : మహాబలము పరాక్రమము గలవాడు ఈ వనమునకు రక్షకుడు (యజమాని) వాడు కంసునికి మహామంత్రి. అందరికిని అడ్డుకొనరానివాడు.
సర్వజీవులను హింసించు వాడు. కాబట్టి ఓ జగన్నాథుడా! విచారించి చక్కగా మాట్లాడు స్వామీ! మేము కోరు పనీ యోగ్యమైనదా కాదా చేయదగినదా కాదా చెప్పుము.
గోప బాలకుల వాక్యము విని భగవంతుడును మధురాక్షసనాశకుడు నగు శ్రీకృష్ణుడు వారికి సుఖకారణముగా తీయని మాట పలికెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
ఓ బాలులారా! మీరు నా సహచరులు. మీకు దైత్యుని భయమేల ? చెట్లనూపి విరిచి భయము లేకుండ ఫలములు భుజింపుడు.
నారదా! శ్రీకృష్ణుని ఆజ్ఞను స్వీకరించి బలశాలులైన బాలురు ఆకలిగొని యున్నందున ఫలముల తినగోరుచు చెట్ల చివరల వరకొక్కసారి ఎగిరిపడిరి. సౌనావిధ వర్ణములతో సుందరముగా నున్న రుచిగల పండిన ఫలములను రాలగొట్టిరి. కొందరు చెట్లనూపిరి. మరికొందరు చెట్లనే విరగగొట్టిరి. కొందరు పెద్దగా అలజడి చేసిరి. " మరికొందరు నాట్యము చేసిరి. అట్లు బలశాలులైన బాలురు చెట్లనుండి దిగి ఫలములను గ్రహించి నడచుచుండగా రాక్షస రాజు కన్పించెను.
మహా బలవంతుడు గొప్ప శరీరము గలవాడు ఘోరమైన గాడిద రూపము ధరించి మహావేగముగా పరుగెత్తి వచ్చుచు భయంకరముగా ధ్వని చేయుచున్న రాక్షసుని చూచి గోపబాలురందరు భయముతో ఫలములు జారవిడిచి అనేక విధములుగా నేడ్చిరి. కృష్ణా కృష్ణాయని మిక్కిలి గొంతెత్తి పిలిచిరి.
ఓ కృష్ణ! ఓ కరుణానిధీ! రమ్ము మమ్ము రక్షించుము. ఓ బలదేవా! పోనవుని వలన మాప్రాణములు పోవుచున్నవి. మమ్ము రక్షించుము. కృష్ణా! కృష్ణా! హరీ! మురారీ! గోవిందా! దామోదరా! దీనబంధూ! గోపీనాధా గోపాల నాయకా! అనంతా! నారాయణా! నంసార సముద్రమందున నున్న మమ్ము రక్షింపుము రక్షింపుము. స్వామీ! ఈ భవార్డములో (సంసార సాగరము) భయకాలమందు గాని క్షేమకాలమందు గాని శుభకాలమందు అశుభ కాలమందు గాని సుఖములందు గాని దుఃఖములందు గాని ఓ మాధవా! ఓ దీననాధా! మాకు నీవు తప్ప వేరు శరణము లేదు. కాపాడుము. కాపాడుము. ఓ గుణ సముద్రుడా! నీకు జయము జయము. భక్తులకు ముఖ్యమైన బంధూ! కృష్ణా! మిక్కిలి భయముతో నున్న ఈ బొలకులను రక్షింపుము, రక్షింపుము. రాక్షస కులములో బలదర్పములు గలవాడు మాకు యముని వలెనున్న ఈ రాక్షస నాథుని సంహరింపుము. వానిని చంపి మమ్ము వర్ధిల్లజేయుము.
భక్తులయందు వాత్సల్యము గలవాడును భయమును నశిపంజేయువాడును అగు మాధవుడు బాలుర ఆక్రందనము (దుఃఖము - మొర) వీని బలరామునితో గూడి ఆ చిన్న పిల్లలున్న చోటికి భయము లేదు, భయపడకుడు అని పలుకుచు త్వరగా పరుగెత్తి వచ్చెను. చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖమండలము గలవాడై ఆ శిశువుల కభయమిచ్చెను.
బలరామకృష్ణులను చూచి బాలురు భయము వదిలి నృత్యము సల్పిరి. పారిస్మరణము అభయమును సర్వమంగళముల నిచ్చునట్టిది కదా!
తనముందు చిన్నపిల్లలను నోటితో పట్టుకొనుచున్న దానవుని చూచి శ్రీకృష్ణుడు బలవంతుడైన బలరాముని పిలిచి ఇట్లు పలికెను
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
“ఓ బలదేవా! వీడు రాక్షసుడు. బలి చక్రవర్తి) పుత్రుడు. గొప్ప బలశాలి. దీని పేరు సాహసికుడు. పూర్వము దూర్వాసముని శపించిన కారణముగా గర్దభరూపి (గాడిద) ఐనాడు. వీడు గొప్ప బల పరాక్రమములు గలవాడు కనుక ఈ పాపి నాచేత మాత్రము చంపబడును, వీనిని నేను చంపుదును. నీవీ గోపాల బాలకులను తీసుకొని దూరముగా పోయి వారిని రక్షింపుము" అని పలికెను.
శ్రీకృష్ణుని ఆజ్ఞతో బలరాముడు వారిని తీసుకొని త్వరగా వెళ్లాను.
గొప్ప బలపరాక్రమములు గల ఆ దానవేంద్రుడు శ్రీకృష్ణుని చూచి కోపము పొంది అగ్నిశిఖవలె నున్న ఆ స్వామిని లీలగా పట్టుకొని నమిలి మ్రింగెను. చావదలచినట్లుగా ఆ కర్మ చేసినవాడు స్వామీ యొక్క గొప్పతేజస్సుతో మిక్కిలి దహించి పోయెను. దానికి భయపడి, వాడు అగ్ని తేజోమూర్తియగు ఆ విభుని మరల వెడలగ్రక్కెను. ఒక్కసారి ఎగిరిపడిన ఆ ఈశ్వరుని ఆ దైత్యుడు వదిలి పెట్టి మిక్కిలి సుందరుడు బ్రహ్మతేజస్సుతో వెలుగుచున్న ఆశాంత స్వరూపుని చూచి - కృష్ణ దర్శన మాత్రము చేత పూర్వ స్మృతి కలిగి - తానెవరో తెలిసికొనెను. జగత్తులకు మూలమైన శ్రేష్ఠుడైన కృష్ణుని తెలిసికొనెను. తేజస్వరూపుడైన ఆ పరమాత్మను చూచి ఆ దానవుడు శాస్త్రానుగుణముగా స్వామి అవతారములకనుగుణముగా వేదములకతీతుడు త్రిగుణములకతీతుడునైన స్వామిని స్తుతించెను.
దానవ ఉవాచ - దాసవుడిట్లు పలికెను :
స్వామీ! అన్ని అవతారములకు మూలమైన సనాతనుడవు. ఆ మూర్తీయొక్క ఒక అంశతో వామనావతారమెత్తితివి. నీవు సర్వేశ్వరుడవు. భక్తులయందు వాత్సల్యము గలవాడవు. మాతండ్రి యొక్క యజ్ఞమందు భక్షకుడవై వచ్చి రాజ్యమును సంపదను హరించి వేసి భక్తివశుడైన ఆ వీరునికి (బలి) సుతలమును నివాసస్థానముగా నిచ్చితివి. శాపము వలన గార్ధభ రూపము పొందిన పాపినగు నన్ను త్వరగా సంహరించుము. దుర్వాసముని శాపము వలన నిట్టి నీచ జన్మ వచ్చినది. ఓ జగత్చతీ! ఆ మునీయే నీ వలన నాకు మృత్యువని చెప్పెను. గొప్ప తేజస్సు గల వాడియైన, పదునారంచులు గల చక్రముతో నన్ను సంహరించుము. ఓ జగన్నాథా! మోక్షప్రదాతా నాకు సద్బక్తి కలిగించుము. నీవు భూమీనుద్దరించుటకు ఒక అంశతో ఆదివరాహరూపుడవైతివి. హిరణ్యాక్షుని సంహరించి వేదములను రక్షించితివి. దేవతలను రక్షించుటకొరకు ప్రహ్లాదుని అనుగ్రహించుట కొరకు హిరణ్యకశిపుని వధయందు స్వయముగా పూర్ణాంశతో నీవు నరసింహుడవైతివి. ఓ దయాసముద్రా! నీ అంశారూపమైన మత్స్యావతారముతో వేదములనుద్ధరించితివి. దేవబ్రాహ్మణుల రక్షణ కొరకు వైవస్వతమనువునకు జ్ఞానదానమొనర్చుటకెత్తిన అవతోరమది. నీ అంశయే సృష్టికారణముగా శేషునకాధారముగా ఆదికూర్మమైతివి. సహస్ర బాహువులతో విశ్వమున కాధారమైనది నీవే. ఆ విశ్వము నీవే. దశరధపుత్రుడగు రాముడవు నీవే. జానకిని లంకనుండి ఉద్ధరించి' తెచ్చుటకు గాను దశకంఠుని సంహారమునకు గాను సముద్రము మీద సేతువు నిర్మింపజేసితివీ, ఒక అంశతో జమదగ్ని సుతుడగు పరశురాముడవైతివీ. ఓ జగత్పతీ! అపుడు ఇరువది యొక్క పర్యాయములు దుష్టరాజులను సంహరించితివీ. ఒక అంశతో సిద్ధులలో గురువులకు గురువువై యోగశాస్త్రము రచియించి తల్లియైన దేవహూతికి జ్ఞానదానము చేసితివి. ఒక అంశతో నీవు ధర్మఋషి పుత్రుడవై జ్ఞానులలో శ్రేష్టుడవై నరనారాయణ ఋషుల జంటగా (కవలలు) వెలిసితివి. లోకము విస్తరింపజేసితివి. ఇప్పుడు నీ పరిపూర్ణతమమైన లక్షణముతో స్వయముగా శ్రీకృష్ణ రూపమెత్తితివి (ఆవతారము).
స్వామీ! యశోదా దేవికి నీవు ప్రాణమవు, నందునికి శ్రేష్టమైన ఆనందము వృద్ధించువాడవు. గోపికల ప్రాణములకధి దేవతవు - (ప్రధానదైవము) రాధాదేవికి ప్రాణములకన్న మిక్కిలి ప్రియమైనవాడవు. వసుదేవ సుతుడవు. శాంతమూర్తివి. దేవకీ దేవి దుఃఖములను నశింపజేసినవాడవు. గర్భవాసము లేని జన్మగలవాడవు. లక్ష్మీవల్లభుడవు. భూభారము తొలగించువాడవు. పూతనకు మాతృదశను ఇచ్చిన దయానిధివి. బకుడు, కేశి, ప్రలంబుడు అను వారికి నాకును మోక్షము కల్గించువాడవు. ఓ స్వేచ్ఛాపూర్ణుడా! త్రిగుణములకతీతుడా! భక్తుల భయము భంజించు నశింపజేయు వాడా! రాధికానాథా! అనుగ్రహించుము. అనుగ్రహించి నన్ను శాపశరీరము నుండి విడిపింపుము.
ఓ నాధా! ఈ గర్దభ (గాడిద) జన్మనుండి - సంసార సముద్రము నుండి నన్నుద్ధరింపుము. నేను మూర్ఖుడను. ఐనను నీ భక్తుని - పుత్రుడను. నన్నుద్ధరించుటకు నీవే సమర్థుడవు కనుక తగుదువు. వేదములు - బ్రహ్మాది దేవతలు - మునీంద్రులు ఎవని స్తుతించుటకు శక్తి. గలవారు కారో అట్టి గుణాతీతుని, మొదట రాక్షసుడను ఇపుడు ఖరమును (గాడిద) అగు నేనెట్లు స్తుతింతును ? ఓ దయాసముద్రుడా! నాకు మరల జన్మలేకుండ అనుగ్రహింపుము. నీ పాద పద్మములను దర్శించి మరల ఎవడు జన్మనెత్తును?! బ్రహ్మ నిన్ను స్తుతించెను. ఈ ఖరుడు స్తుతించెను అని నన్ను అపహాస్యము చేయకు స్వామీ! సర్వజ్ఞుడగు పరమేశ్వరునకు యోగ్యుని యందు అయోగ్యుని యందు కృప సమానముగా నుండును కదా!” ఇట్లు పలికి ఆ రాక్షసుడు శ్రీహరి ముందు నిలచేను. ఆ శ్రీనాధుడు మీక్కిలి సంతోషించి ప్రసన్నమైన ముఖము గలవాడాయెను.
ఖరదైత్యుడొనర్చిన ఈ స్తోత్రమును నిత్యము భక్తితో పఠించిన వ్యక్తి - ఇహలోకమున విద్యను సంపదను మంచి కవితాశక్తిని పుత్రపౌత్రులను కీర్తిని పొంది - హరి భక్తి కలవాడై శరీరము విడిచిన తరువాత మిక్కిలి దుర్లభమైన సాలోక్య సారూప్య సామీప్య ముక్తి దశలతో బాటు అనాయాసముగా శ్రీహరి యొక్క దాస్య ముక్తిని పొందగలును.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
ఆ దయాసముద్రుడు దైత్యేంద్రుని స్తోత్రమును విని (కోరిక తీర్చుటకు) అంగీకరించెను. “ఇటువంటి భక్తుని ఎట్లు సంహరింతును? ప్రభువైనవాడు దుష్టముగా నిందించువానిని వధించవలే తప్ప స్తోత్రము చేయువానినని వధింప దగదు గదా" అనీ తలచిన శ్రీహరి స్వయముగా. వాని స్మృతిని (తనజన్మ భగవంతుని అవతారముల యొక్క జ్ఞానమును) హరించి వేసెను.
ఆ దానవుడు విష్ణుమాయ తన పై ప్రసరించుట వలన మరల తన దుష్టత్వమును చురుక్తులను నిందావాక్యములను జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతని కంఠములో దుష్టవాక్కులు ఎక్కి కూర్చుండిను. నారదమునీ! వాడు అప్పుడే చావ గోరి దైవము చేత పట్టుబడి తెలివి తప్పి కోపముతో పెదవులు వణకగా శ్రీహరినీ గూర్చి ఇట్లు (నిందావాక్యములు) పలికెను.
దైత్య ఉవాచ - దైత్యుడిట్లు పలికెను :
ఓ దుర్బుద్ధీ! మానవ బాలకా! నీవు నిజముగా చావగోరుచున్నావు. నేడు నిన్ను యముని మందిరమునకు పంపింతును. ఓ శిశూ! బ్రతుక గోరి నా తాళవనమునకు వచ్చితివా? మరల ఇంటికి పోవు. నీ బంధువులను చూడజాలవు. కంసుడు జరాసంధుడు నరకుడు వీరెవ్వరు నాతో సమానులు కారు. దేవత లెప్పుడును నాకు భయపడి వణికిపోదురు. ఈ భూమి మీద నాకు సాటి మరివ్వరు?
సంహారకర్తయైన రుద్రుడు కూడ నన్ను సంహరింపజాలడు. బ్రహ్మ విష్ణువు మృత్యువు కాలపురుషుడు ఎవ్వడును నన్నేమి చేయజాలడు. నా తాళవనమును భగ్నము చేసి పండ్లు రాలగొట్టి హఠాత్తుగా ఎవని తేజస్సుతో అహంకరించుచున్నాను ఆశ్చర్యము. చిన్నవాడా! నీవెవడవు. సత్యము చెప్పుము. చూచుటకు కోరదగినంతగా మిక్కిలీ అందముగా వున్నావు. దుర్లభమైన జీవితమును నాకిచ్చుటకిచ్చటికెందుకు వచ్చితివి?
ఇట్లు పలికి బలి మృత్యువుకు ఎదురుగా నడచినట్లు శ్రీకృష్ణుని తన తలమీదికి చేర్చుకొని త్రిప్పి త్రిప్పి దూరముగా పడవే సెను. నేలమీద పడగొట్టి తన కొమ్ములతో కొట్టెను. కృష్ణ శరీరమును తాకగనే వాని కొమ్ములు విరిగిపోయెను. ఓ మునీ! ఆ దైత్యుడు కొమ్ములు విరిగి కూడ స్వామికి కోపము తెప్పించుచు నమిలివేయుటకని దంతములతో పట్టుకొనెను. స్వామి తేజస్సు వలన అతని దంతములు కాలిపోయి వెంటనే విడిచి పెట్టెను. అట్లు చాల బాధపడి కోపముతో మండిపోవుచు వాడు భూమిని డెక్కలతో చీల్చివేసెను. తోకను గిరగిర త్రిప్పుచు భయంకరముగా ఓండ్ర పెట్టుచు వాడు గోపాల బాలురున్న చోటికి పరిగెత్తాను. బాలకులు భయపడి దూరముగా పారిపోయిరి.
మహాబలవంతుడగు ఆ రాక్షసుడు బలదేవుని తన తలపై ఎత్తీ శ్రీప్పెను. బలదేవుని వానిని పిడికిటితో గ్రుద్దెను. అపుడు వాడు మూర్ఛిల్లెను.
ఒక్క క్షణములో వాడు మూర్ఛ తేరి స్మృతికి వచ్చి శ్రీకృష్ణుని సమీపమునకేగెను. మరల బలదేవుని పిడికిలి పోటుకు వ్యధ చెంది తిరిగి మూర్ఛిల్లెను. మరల తెలివికి వచ్చి బాధతో భయముతో లేచి నిలబడి పెద్ద పెద్ద మలపు ముద్దలు మూత్రము విసర్జించెను. వానికి భయమేర్పడెను. ఒక్క క్షణములో అవకాశము లభించి మహాబలపరాక్రముడగు ఆ రాక్షసుడు శ్రీకృష్ణుని శిరస్సున ధరించి గుండ్రముగా తిప్పేను. మరల మరల అటు త్రిప్పి నేలపై పడవేసెను. మాధవుడు ఒక తాలవృక్షమును పెరికి దానితో దానవుని కొట్టెను. కత్తి దెబ్బలకు ఎంతటి వ్యధకలుగునో అంత బాధ తాడిచెట్టు దెబ్బల వలన ఆ రాక్షసునకు కలిగెను. ఓ మహామునీ! సమర్థుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును పెకలించి ఆ రాక్షసుని పైకి విసరికొట్టెను. ఆ పర్వతరాజము వేగముగా వచ్చి వాని మీద పడెను.
మహాబలము గల ఆ రాక్షసుడు పర్వతపు దెబ్బతో అంగములన్నియు శిథిలములై రక్తము క్రక్కుచు మూర్ఛిల్లెను. కొద్ది సేపటికి మరల స్మృతికి వచ్చి అసురుడు లేచి నిలబడి తన మీదికి విసరిన ఆ పర్వతమునే గ్రహించి మాధవుని మీదికి విసిరెను. వేగముగా తన మీదికి ఎగిరి వచ్చుచున్న ఆ పర్వతమును మధుసూదనుడు చూచి చెరకు గడను పట్టుకొన్నట్లు కుడిచేత గ్రహించెను. విలాసముగా దానినీ స్వస్థానమున పాదుకొల్పెను. రాక్షసుని చెవులు పట్టుకొని దూరముగా విసరివేసెను. క్రిందపడిన ఆ దైత్యుడు ఎగిరి వచ్చీ శ్రీకృష్ణుని వేగముగా త్రీ ప్పెను. వాడిన డెక్కలతో భూమిని రాపిడి పెట్టెను. ఆ మహాసురుడు శ్రీకృష్ణుని తన శిరస్సున గ్రహించి నిర్లక్ష్యముగా మనోవేగముతో లక్షయోజనముల ఎత్తు ఎగిరెను. ఆకాశమున ఆ ఉభయులకు ముష్టి యుద్ధము జరిగెను. తరువాత శ్రీకృష్ణుని పట్టుకొని నేలమీద పడెను. మరల భూమి మీద ఆ యిద్దరికి ఒక ముహూర్త కాలముయుద్ధము నడచెను. వాని క్రియకు శ్రీహరి నవ్వి సంతోషముతో వానినిటు ప్రశంసించెను.
నా భక్తుడగు బలి యొక్క పుత్రుడా! నీ జీవనము ధన్యము. శ్రేష్ఠము. నాయనో, దానవేంద్రా! నీకు మంగళమగుగాక, మోక్షమును పొందుము. నా దర్శనమే పరమ శుభమునకు బీజము. మోక్షమునకు మూలము. అన్ని స్థానముల కంటే అధికమైన అన్నిటికంటే శ్రేష్ఠమైన మనోహరమైన ముక్తిని పొందుము. అని పలికి శ్రీకృష్ణుడు కోటి సూర్యులతో సమమైన తేజస్సు గల తన ఉత్తమమైన చక్రమును స్మరించెను. ప్రత్యక్షమైన ఆ సుదర్శనమను పదహారు అంచులు గల అత్యుత్తమ చక్రమును గ్రహించి గిరగిర త్రిప్పి విసరివే సెను. బ్రహ్మవిష్ణు మహేశ్వరులచేత గూడి చంపబడకుండ సున్న ఆ రాక్షసుని లీలగా ఆ చక్రము నరికివేసెను. మహానుభావుడైన ఆ దానవుని శిరస్సు నేలమీద పడెను. వంద సూర్యులతో సమానమైన వెలుగుతో ఒక తేజోరాశి పైకెగి సెను. ఓహో! ఆశ్చర్యము. ఆ తేజస్సు శ్రీకృష్ణుని పాదపద్మములలో లీనమయ్యెను. ఆ దానవ శ్రేష్ఠుడు హరిలోకమును దర్శించి పరమమోక్షమును పొందెను.
ఆకాశమందున్న దేవతలు మునులు మిక్కిలి సంతోషముతో పారిజాత పుష్పములను అక్కడ వర్షించిరి. స్వర్గములో దుందుభులు మ్రోగెను, అప్సరసలు నాట్యమాడిరి. గంధర్వులు గానమొనర్చిరి. మునులు సంతోషముతో స్తుతించిరి. హర్ష పరవశులైన మునులు దేవతలు అందరు స్తోత్రములొనర్చీ తమ తమ స్థానములకు పోయిరి.
ధేనుకుని వధను చూచి గోపాల బాలకులక్కడికి చేరవచ్చిరి. బలవంతులలో శ్రేష్ఠుడైన బలదేవుడు పురుషోత్తముని స్తుతించెను. బాలకులందరు ముదముతో స్తోత్రమొనర్చి సాట్యము చేసిరి. బాగుగా పండిన తాళఫలములను బలదేవ కృష్ణులకు సమర్పించి మిక్కిలి హర్షముతో బాలకులాఫలములన్నింటినీ భక్షించిరి. ఇట్లు శ్రీకృష్ణుడు తిని త్రావి బలదేవునితో బాలకులతో కలిసి దానవేశ్వరుని వధించి శీఘ్రముగా తన గృహమునకు చేరబోయెను.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూషమైన ధేనుక వధ యను ఇరువది రెండవ అధ్యాయము నమాప్తము.
