4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
26 - ఏకాదశీవ్రత నీరూపణము
నారద ఉవాచ - నారదుడిట్లనెను :
ఓ నారాయణ మహర్షీ! ద్వాదశి తిధిలో సకాలమున పారణము (ఉపవాసానంతర భోజనము) చేయక ఉల్లంఘించుట వలన కలుగు దోషమును నీద్వారా విన్నాను, దుర్వాసమునికి జరిగిన అవమానము శ్రీహరి రాజును రక్షించుట అన్నవి వింటిని. ఆశ్చర్యము. ఇప్పుడు నాకు అందరి కోరికలు తీర్చు ఏకాదశీ వ్రతము చేయు విధానమును వివరించి చెప్పుము. వేదము ద్వారా కొంతవిని తెలిసికొన్నను మతభేదమును బట్టి (భిన్నభిన్నములుగా తెలియ వచ్చినందున ఇది యిట్లని దృఢము కాలేదు. ఇప్పుడు శ్రుతులకు మూలమైన నీ వలన వినుటకు కుతూహలముతో (ఆనకీ) ఉన్నాను.
నారాయణ ఉవాచ - సారాయణ మహర్షి పలికెను :
శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైన ఈ ఏకాదశీ వ్రతము తపస్విజనులకు శ్రేష్ఠమైన తపస్సు. దేవతలకు దుర్లభమైనదీ సుమా. దేవ గణములలో శ్రీకృష్ణుని వలె, దేవీ గణములో మూల ప్రకృతి వలె, వస్త్రములలో బ్రాహ్మణుని వలె, విష్ణు భక్తులలో పరమ శివుని వలె, పూజ్యులలో ప్రథమపూజ్యుడగు గణేశుని వలె, విద్యావంతులలో సరస్వతి వలె, శాస్త్రములలో వేదముల వలె, పుణ్యతీర్థములలో గంగానదీ వలె, తేజస్సు గల ద్రవ్యములలో బంగారము వలె, జీవులలో వైష్ణవుని వలె, ధనములలో విద్య వలె, సంగము కలవారిలో భార్య వలే, ప్రమధులలో రుద్రుని వలె, శ్రేయము గూర్చు వారిలో మతి (ముందూహించు బుద్ధి) వలె, ఇంద్రియములలో ఆత్మ వలే, చంచల పదార్థములలో మనస్సు వలె, గౌరవించదగిన స్త్రీలలో తల్లి వలె, బంధువులలో భర్తవలె, శత్రువులలో రోగము వలె, కీర్తి గలవారిలో కీర్తి వలె, గృహస్థులలో గృహము వలె, హింసించువారిలో క్రూరుని వలె, దుష్టస్త్రీలలో జారిణి వలె, తేజోవంతులలో గ్రహరాజు (సూర్యుడు) వలె, ఇతరుల దోషమును సహించుకొనువారిలో భూదేవి వలె, తిను పదార్థములలో అమృతము వలె, కాల్పువారిలో అగ్నివలె, ధనమిచ్చువారిలో లక్ష్మిదేవి వలె, స్త్రీలలో పతివ్రత వలె, ప్రజాపతులలో బ్రహ్మ వలె, జలస్థానములలో సాగరము వలె, వేదములలో సామము వలె, మంత్రములలో గాయత్రి వలె, వృక్షములో అశ్వత(రావి) వృక్షము వలె, పుష్పములలో తులసీదళము వలె, మాసములలో మార్గశిరము వలె, ఋతువులలో వసంతము వలె, ఆదిత్యులలో అదితి సంతానము) సూర్యుని వలె, రుద్రులలో శంకరుని వలె, వసువులలో భీష్ముని వలె; వర్షము(భూభాగము) లలో భారతవర్షము వలె, దేవర్షులలో నీ వలె, (నారదుడు) బ్రహ్మరులలో భృగువు వలె, నృపులలో శ్రీరాముని వలె, సీదులలో కపిలుని వలె, జ్ఞానయోగులలో శ్రేష్ఠుడైన సనత్కుమారునీ వలె, గజేంద్రములలో ఐరావతము వలె, మృగములలో శరభము వలె, శైలములలో హిమాద్రి వలె, మణులలో కౌస్తుభము వలె, నదులలో పుణ్య స్వరూపిణి ఐన సరస్వతీనది వలె, గంధర్వులలోచిత్రరధుని వలె, యక్షులలో కుబేరుని వలె, రాక్షసులలో సుమాలి వలె, స్త్రీజాతి మొత్తములో శ్రేష్ఠురాలైన శతరూపాదేవి వలె, మనువులలో స్వాయంభువ మనువు వలె, సుందర స్త్రీలలో రంభవలె, మాయా విద్యలు గలవారిలో విష్ణుమాయ వలె, ఓ నారదమహర్షి ప్రతములలో ఏకాదశీవ్రతము మిక్కిలీ ఉత్తమము శ్రేష్ఠమునైనది.
నాల్గు వర్ణముల వారికిది ఆచరింపదగినది. విశేషించి యతీశ్వరులకు విష్ణుభక్తులకు బ్రాహ్మణులకు తప్పక ఆచరణీయము సుమా.
సత్యముగా బ్రహ్మహత్యాది సమస్త పాపములు ఏకాదశీదినమునాడు అన్నమునాశ్రయించి యుండును. ఏ మందబుద్ధి ఆ రోజున అన్నము తినునో వాడు పాపములనే భుజించును కనుక అతిపాపియైనవాడు అంత్యమున నరకము పొందుట నిశ్చయము. ఆనాడు ఏకాదశీ ఎన్నిగడియలుండునో అన్ని యుగములు వాడు మహాఘోరమైన కుంభీపాక నరకములో ఉండి చండాలుడుగా భూమి పైన జన్మించును. ఆ తరువాత ఏడు జన్మలు గొంతువ్యాధితో బాధలు పడి పాపము నుండి అప్పటికి విముక్తుడగునని బ్రహ్మచెప్పెను.
ఓ బ్రాహ్మణా! ఏకాదశినాడు భుజించినందువలన ఏ దోషము కల్గునో అది ఇట్లు చెప్పితిని. ద్వాదశి పారణ సతిక్రమించిన దోషము పూర్వమే చెప్పగా వింటివి.
పూర్వము ధర్మఋషి (నరనారాయణుల గన్నతండ్రి) వేదసారమునుద్ధరించి తానుగా దేనిని. నాకు చెప్పెనో దానిని దశమి నుల్లంఘించుట వలన (ఆనాటి కృత్యము పాటింపనందున) కలుగు దోషమును నీకు చెప్పెద వినుము. ఉదయకాలమున కళామాత్రముగా దశమి ఉన్న దినమును ఏ మూడుడు అజ్ఞానముతో (ఆనాడు శాస్త్రము విధించిన నియమము పాటింపక, ఉల్లంఘించునో అతనికి లక్ష్మీదేవి క్రూరమైన శాపమిచ్చి ఆ గృహము నుండి వెంటనే వెళ్లిపోవును. ఈ లోకమున హనికి వంశహాని కీర్తిహాని సంభవించుట నిశ్చయము. మరణానంతరము వాడు సూరు మన్వంతరముల కాలము అంధకూపనరకమున వసించును.
ఏనాడు (ఏదినమందు) దశమి ఏకాదశి మరియు ద్వాదశి (ఒక సూర్యోదయము నుండి మరునాడు సూర్యోదయము వరకు మూడు తిథులు) ఉండునో ఆ స్థితిలో ఆనాడు భుజించి మరునాడు ద్వాదశీ తిథినాడు) ఏకాదశ్యుపవాసవ్రత మాచరించవలెను. ఆ పరిస్థితిలో ద్వాదశినాడు ఏకాదశీవ్రతమాచరించి తరువాతి త్రయోదశినాడు పారణము చేయవలెను. ఇట్లు చేయుట వలన ద్వాదశినాడు పారణము చేయక ఉల్లంఘించిన దోషము వ్రతమాచరించు వారికి లేదు. (అనగా దశమీతో కూడిన ఏకాదశినాడుపవసించరాదని భావము).
ఒక దినము సంపూర్ణముగా ఏకాదశి తిథి యుండి మరునాడు ప్రభాతకాలమున కొద్దిగా ఏకాదశితిథి ఉన్నచో రెండవ నాడే ఉపవసించవలెను. ఐతే తరువాతి ద్వాదశి వృద్ధిలో ఉండవలెను. అనగా ఉపవాసము దినము తరువాతీనాడు ద్వాదశి తిథి ఉండవలెను.
అరువది గడియల కాలపరిమాణములో (ఒక సూర్యోదయము నుండి మరియొక సూర్యోదయము వరకు) తిథిత్రయము ఏర్పడినచో (దశమీ ఏకాదశీ ద్వాదశి తిథులు ఉన్నచో) ఏ ప్రభాత కాలమున ద్వాదశి కలదో దానికన్న ముందు దినమే గృహస్థులును యతీశ్వరులు - మొదలైన వారును ఉపవసించవలెను.
తరువాతి దీనము కూడ (ఏకాదశీ వృద్ధిలో) ఉపవసించవలెను. లేనిచో నిత్యకృత్యము వ్రతమందలీ జాగరణము మొదలైనవి అన్ని బుధుడు పూర్వదినము నందే ఆచరించవలెను.
పూర్వదినమందే ఉపవాస వ్రతమైనప్పుడు అది ఆచరించి తరువాతి దినము నందు ఏకాదశి గడచిపోగా ద్వాదశితిథిలో పారణము చేయవలెను.
విష్ణుభక్తులు యతులు విధవాస్త్రీలు సన్యాసులు బ్రహ్మచారులు అన్ని ఏకాదశులలో ఉపవాసము చేయవలెను. (శుక్షకృష్ణ పక్షముల భేదము వీరికి లేదు!
ఓ నారదా! వైష్ణవులు కానట్టే గృహస్థులు శుక్లపక్షమందలి ఏకాదశీ ఉపవాసమునే చేయుచున్నారు. కృష్ణపక్ష ఏకాదశిని ఉల్లంఘించినందున (ఉపవాసము చేయనందుని వేదములలో వారికి దోషము లేదని చెప్పబడినది.
గృహస్తుడు (37 శ్లోకమునందలి వాడు కాక ఇతరుడు) శయనైకాదశి నుండి బోధనైకాదశి వరకు ఆ నడుమ వచ్చు అన్ని కృష్ణవక్ష ఏకాదశులలో మాత్రమే ఉపవాస వ్రతము చేయవలెను. ఇతరములైన కృష్ణపక్ష ఏకాదశులలో చేయరాదు. ఓ బ్రాహ్మణా! వేదముల ద్వారా వినవచ్చిన ఈ ఏకాదశ్యుపవాస నిర్ణయము నీకు చెప్పితిని. (ఆషాఢ శుక్ల ఏకాదశి శయనైకాదశి. కార్తీక శుక్ల ఏకాదశినీ బోధన (ఉత్థాన) ఏకాదశి అందురు. ఈ రెంటి నడుము వచ్చు కృషైకాదశులు అనగా ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజమాసములలో వచ్చు కృష్ణపక్ష ఏకాదశులలో సాధారణులు కూడ అన్ని ఏకాదశుల వలె ఉపవాస వ్రతమాచరించవలెనని భావము).
ఇక ఈ వ్రతమాచరించు విధానము నీకు చెప్పుదును వినుము.
దశమినాడు మధ్యాహ్నమునకు ముందే హవిష్యము (బియ్యము కడుగకుండ పప్పు శాకములు కలిపిన బియ్యమునకే చోట ఉడికించి నైవేద్యము పెట్టిన అన్నము) భుజించి ఇక ఆనాడు రాత్రికి మంచినీరు కూడ త్రాగక దుర్భలపై ఒక్కడే పడుకోవలెను. మరునాడు బ్రాహ్మీ ముహూర్త కాలములో (సూర్యోదయము కన్న ఐదు గడియల ముందు) నిద్ర లేచి ప్రాతఃకృత్యము (దేహవిధులైన, మలమూత్ర విసర్జనలు దంతధావనము} లాచరించి స్నానము చేయవలెను. ఏకాదశీవ్రతోపవాసము చేయుదునని శ్రీకృష్ణప్రీత్యర్థము సంకల్పించి సంధ్యావందనము దేవ ఋషి పితృతర్పణములు జపహోమాదులు ఆహ్నికవిధులు {నిత్యకృత్యములు - నిత్యకర్మ) ఆచరించవలెను. తన ఇష్టదైవము యొక్క నిత్యపూజను చేసి ఒక ప్రతమునకు కావలసిన ద్రవ్యమును సంపాదించవలెను. షోడశోపచార పూజకు తగినట్లు ఆయనపీఠము అలంకరించు వస్త్రము అర్ఘ్యపాద్యములకు తగిన సుగంధజలము పుష్పములు మంచి గంధము ధూపమునకు ఊదుమొదలైన పొగ దినుసులు. దీపము యజ్ఞోపవీతము భూషణములు నైవేద్య పదార్థము స్నానజలము (అభిషేకమునకు) మధుపర్కము పానీయజలము ఇట్టి వాటిని పగలు సమకూర్చుకొని ఆ రాత్రి ప్రతమాచరించవలెను.
సాయంత్రము స్నానసంధ్యలు చేసి పవిత్రుడై ధౌత వస్త్రములు ధరించి ఆసనమందు కూర్చుండి ఆచమనమొనర్చి శ్రీహరికి నమస్కరించి స్వస్తివాచనము చేయవలెను. శుభముహూర్తములో ధాన్యపీఠము మీద చందనము పూసి మామిడాకులు టెంకాయతో కూడిన మంగళ కలశమునుంచవలెను. మంత్రవేత్తలతో కూడి వేదోక్త రీతిలో ఇతర ధాన్యపీఠముల మీద గణేశుని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, పార్వతిని ఆవాహన చేసి (ఆర్గురు దేవతలను) ప్రశస్తముగా గంధపుష్ప ధూపదీప నైవేద్యములనెడి పంచోపచారములతో వారిని పూజించి నమస్కరించి ఆ తరువాత వారిని స్మరించుచు వ్రతము చేయవలెను. ఈ ఆర్గురు దేవతలను పూజించకుండ ప్రతకర్మ చేసినచో నిత్యనైమిత్తిక కర్మలన్నియు నిష్ఫలమై పోవును. ఓ మహామునీ! నీకిట్లు కణ్వ శాఖలో చెప్పబడిన ఏకాదశీవ్రతమునకంగభూతమైన దానిని మొత్తము చెప్పితిని. ఇక ఇష్టమైన ఏకాదశీ వ్రత (విధానము) మును వినుము.
శ్రీకృష్ణ పరమాత్మను సామవేదమునందు చెప్పబడిన ధ్యానముతో ధ్యానించి శిరస్పున (కలశముపై - విగ్రహము పై) పుష్పముంచీ మరల ధ్యానించవలెను. అందరికి వాంఛితమైన రహస్యమైన ధ్యానమును చెప్పుదును వినుము. ఇది భక్తులకు తమ ప్రాణముల కంటే శ్రేష్ఠమైనది. భక్తుడు కానీ వానికిది తెలుపరాదు.
వానకారులోనీ కొత్త మేఘము వలే శ్యామసుందరమైన ఆకారము గలవాడును, శరదృతువులోని పున్నమ చంద్రుని కాంతిని తిరస్కరించు పవిత్రమైన ముఖమండలము గలవాడును, శరదృతువులో సూర్యోదయ కాలమందలి పద్మముల కాంతినీ దొంగిలించిన కన్నులు గలవాడును, తన అవయవ సౌందర్యశోభలతో ధరించిన రత్నాభరణములకే అలంకారముగా నున్నవాడును, ప్రసన్నములు ప్రేమసూచకములు ఐన గోపికల యొక్క ప్రక్క చూపులతో మాటి మాటికీ చూడబడువాడును, వారి ప్రాణముల చేత నిర్మింపబడినట్లున్న వాడును, రాసమండల మధ్యభాగమున నీలచి రాసక్రీడా వీహారమునందు త్వరగలవాడును, రాధాదేవి ముఖమనెడి శరత్కాలచంద్రునిలోని అమృతమును పానము చేయుచున్న చకోర పక్షియును.
కౌస్తుభమను మణి రాజముతో ప్రకాశించు వక్షసులము గలవాడును, పారిజాత పుష్పముల మాలలతో అలంకరింపబడినవాడును, ఉత్తమ రత్నములతో నిర్మితమైన కిరీట మలంకరించిన శిరస్సు గలపోడును, వినోదముగా మురళి చేత బట్టినవాడును, సురాసురులచేత పూజింపబడువాడును, ధ్యాసమున కందనివాడును ఆరాధింప శక్యము గాని వాడును, బ్రహ్మాది దేవతల చేత నమస్కరింపబడువాడును సృష్టికి మూలమైన అన్నిటికి తానే మూలమైన వాడును ఎవడో ఆ పరమేశ్వరుని నేను భుజించుచున్నాను.
ఓ నారదా! ఈ ధ్యాన శ్లోక సమూహముతో ధ్యానించి అతనినావాహన చేసి పదహారు ఉపహారములు (షోడశోపచారములు) సమర్పించి ఈ (క్రింది) మంత్రములతో భక్తితో పూజించవలెను.
ఓ పరమేశ్వరా! స్వర్ణముతో నిర్మించబడినదియు, శ్రేష్ఠమైన రత్నములతో అలంకరింపబడినదియు, వివిధములైన చిత్ర విచిత్ర శిల్పములు గలదియు నైన ఈ ఆసన పీఠమును స్వీకరించుము. (దీని పై కూర్చుండుము దీనిని పీఠముగా గ్రహింపుము).
ఓ రాధానాథా! విశ్వకర్మచేత నిర్మించబడినదియును, వెలకట్టరానిదియును, అగ్నిచేత పవిత్రము చేయబడినదియు ఐన ఈ దీవ్యవస్త్రమును స్వీకరింపుము.
ఓ కరుణానిధీ! సుగంధ ద్రవ్యము కలుపుట వలన పరిమళము గలదియు, చల్లగానున్నదియు బంగారు పాత్రలోనున్నట్టిది, పొద ప్రక్షాళనకు యోగ్యమైనది అగు ఈ జలమును స్వీకరింతువు గాక.
భర్శలయందు వాత్సల్యము గల స్వామి! పుష్పములు గరికపోచలు శ్రీగంధముతో కూడి, శంఖగర్భజలము చేర్చిన పవిత్రమైన ఈ జలమును నీ హస్త ప్రక్షాళనకు స్వీకరించుము.
చరాచర సమస్త ప్రపంచమునకు మూలమైన స్వామీ! చందనము అగురు ద్రవ్యములతో కూడి పరిమళవంతముగా చేయబడిన నీకు వెంటనే ప్రీతిని కూర్చునట్టి ఈ తెల్లని పుష్పమును గ్రహింతువు గాక.
ఓ శ్రీకృష్ణా! చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు వటవేళ్ల చూర్ణములు కూర్చిన అన్నిటికన్న కోరదగిన ఈ అను లేపము. (శరీరమునకు పులుముకొనెడి గంధము)ను స్వీకరింతువు గౌక.
ఒక విశేష వృక్షము యొక్క జిగురునై ఇతర ద్రవ్యములను కూర్చుట వలన మంచి వాసనగలదిగా నుండీ సుఖము నిచ్చునట్టి ఈ ధూపమును (చూర్ణమును అగ్ని మీద వేయుట వలన ఏర్పడు పొగ) స్వీకరింపుము.
శ్రేష్ఠమైన రత్నముల చేత నిర్మితమై రాత్రింబగళ్లు బాగా వెల్డించబడినదై మరల సంసారమను అంధకారమేర్పడకుండ దానిని నాశము చేయు బీజము (విత్తనము) వంటి ఈ దీపమును స్వీకరింపుము.
ఓ ఆత్మారాముడా! ఆత్మల యందు ఆనందరూపమున వెలువాడు) రుచి గలవీయు సువాసనతో కూడినవియు పవిత్రములు ఐన నానావిధ భోజన ద్రవ్యములు పుడిసిటబట్టి జుర్రేడు పానీయము (చోష్యము) మొదలుగా గల వానిని స్వీకరింపుము.
ఓ దేవదేవేశా! మంచి పనితనము గల వ్యక్తి చేత బంగారు దారముతో నిర్మించబడిన సావిత్రీ గ్రంథి గల (బ్రహ్మముడి అని వ్యవహారము) యజ్ఞోపవీతమును స్వీకరింపుము.
అమూల్య రత్నముల చేత నిర్మించబడి గొప్ప తేజస్సుతో ప్రకాశించుచున్న సర్వాయవములకు అంకరించుకోదగిన ఆభరణములను ఓ నందనందనా స్వీకరింతువు గాక.
ఓ దీనబంధూ! సర్వశుభకర్మలయందు ముఖ్యముగా చెప్పబడునట్టి మంగళకరమైన ఈ గంధమును స్వీకరింతువు గాక.
ఓ భగవానుడా! ఉసిరీక మారేడు పత్రముల నుండి సిద్ధము చేయబడి విష్ణు తైలమను పేర మనోహరమై పరిమళము గలిగి సర్వప్రాణులు కోరదగినట్టి ఈ సుగంధ తైలమును స్వీకరింతువుగాక.
ఓ నాధా! పచ్చకర్పూరము మొదలగు ద్రవ్యముల చేత పరిమళించునదియు అందరు జీవులకు కోరదగినదియు ఐన నాచేత సమర్పింపబడుచున్న ఈ తాంబూలమును స్వీకరింతువు గాక.
ఓ గోపికా మనోహరా! సర్వజీవులకు ప్రీతి కళించునదియు, శుభ్రపరుపబడినదియు రత్నసార పాత్రలో నున్నదియు అగు మధురమైన తేనెను స్వీకరింతువు గాక.
ఓ మధుసూదనా! మిక్కిలి పవిత్రమైన స్వచ్ఛమైన గంగాజలము సువాసన ద్రవ్యములు చేర్చి పరిమళము గలది ఐన ఆచమనీయమును (పుక్కిలించి ఉమియు జలము) పూజాంతమున మరల స్వీకరింతువు గాక.
భక్తుడు సంతోషముతో ఇట్లు షోడశోపచారములు సమర్పించి శ్రద్ధతో ఈ క్రింది మంత్రముతో (నానా ప్రకారపు మైశ్చ) పుష్పములను మాలలను అర్పించవలెను. “ఓ ప్రభూ! నానావిధములైన పుష్పములను తెల్లని దారమున కూర్చబడిన అలంకారములలో శ్రేష్ఠమైన ఈ మాలను స్వీకరించుము”.
వ్రతమాచరించు విద్వాంసుడు ఇట్లు పుష్పాంజలీని మూలమంత్రమునుచ్చరించుచు సమర్పించవలెను. భక్తితో చేతులను మొగ్గగా జోడించి పట్టుకొని క్రింది విధముగా భగవంతుని స్తవనము (స్తుతి) చేయవలెను.
భక్త ఉవాచ - భక్తుడిట్లు పలికెను (పలుకవలెనని భావము) :
ఓ శ్రీకృష్ణా! రాధానాథా! కరుణాసముద్రుడా! ప్రభూ! భయంకరమైన ఘోర సంసారమును సముద్రమున పడీన నన్ను ఉద్ధరింపుము, అనేక జన్మలెత్తుట వలన కల్గిన శ్రమతో మనస్సు చంచలమై కర్మపాశములనెడీ ఇనుప గొలుసుల చేత బంధింపబడి ఉన్న నన్ను వీటినుండి విడిపింపుము. సంసార పాశముల వలన ఏర్పడు ఫలమునకు వెరచి నీ పాదపద్మములందు ప్రణతుడనైన (తలవాల్చి మొక్కిన) శరణాగతుని సన్ను కటాక్షించుము. భక్తిహీనము చేయవలసిన క్రీయా శూన్యము వేదమును బట్టి శాస్త్ర హీనము, ద్రవ్యములు మంత్రములు శూన్యమైన నా పూజ ఏది కలదో దానిని అన్ని నిండుగా గలదానిగా చేయుము స్వామీ! శ్రీహరీ! నేను నీ గురించి చేసిన కర్మ (పూజ) వేదమందు చెప్పబడిన విధానము తెలియనట్టిది భక్తి ద్రవ్యమంత్రములు శూన్యమైనది ఐనను కేవలము నీ నామోచ్చారణము చేతనే సర్వము పూర్ణమగును కదా!
ఈ విధముగా స్వామిని స్తుతించి నమస్కరించీ బ్రాహ్మణునికి దక్షిణ సమర్పించి మహోత్సవము చేసి (స్తోత్రములు, భజనలు, గానము, నృత్యప్రదర్శనము, మంగళ వాద్యముల మ్రోగించుట మొదలగునవి భగవతీతిగా చేయుట) వ్రతమొనర్చు వ్యక్తి జాగరణము చేయపలెను. ప్రజోపవాసములు చేసి ఒకవేళ నిద్రపోయినను జలపానము చేసినను వ్రతములో సగము ఫలమే లభించును. (ఆహారము స్వీకరింపదగిన నిర్ణీత సమయములో దశమి పగలు ద్వాదశీ ఉదయము) ఓ బ్రాహ్మణా! ఈ మంత్రముతో శ్రీకృష్ణుని స్మరించుచు ప్రయత్నపూర్వకముగా ఒక్కసారి మాత్రమే హవిష్యాన్నము స్వీకరించవలెను.
అన్నమే జీవులకు ప్రాణముగా పూర్వము బ్రహ్మచేత నిర్మితమైనది. ఓ ప్రభూ! నీవు విష్ణురూపమైన అన్నమును నాకు ప్రజోపవాసములకు ఫలముగానిమ్ము.
ఇట్లు ఎవడు భారతఖండమున భక్తితో ఈ వ్రతమాచరించునో వాడు తనకన్న పూర్వులనేడు తరముల వారినీ తన తరువాతి ఏడు తరముల వారిని తనను కూడ ఉద్ధరించుకొనుట నిశ్చయము. తల్లిని తోడబుట్టిన వానిని అత్త మామలను బిడ్డను అల్లుని సేవకుని గూడ ఆ మానవుడుద్ధరించును. ఇది సత్యము. ఓ నారదా! ఇట్లు ఏకాదశీవ్రతమును గూర్చి చెప్పితిని. సుఖకరము మోక్షప్రదము సారవంతమైన శ్రీకృష్ణ చరితలోని ఇంకొక కథాఘట్టమును చెప్పెదను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ఏకాదశీ వ్రత నిరూపణమను ఇరువది ఆరవ అధ్యాయము సమాప్తము.
