4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
113 - అధ్యాయము
మూII శ్రీనారాయణ ఉవాచ :
పార్వత్యువాచ :
నారాయణుడిట్లన్నాడు :
శిష్యులతో కూడా దుర్వాసుడు ద్వారకపురినివదిలి భక్తితో ఈశ్వరుని శంకరుని చూడటానికి కైలాసానికి వెళ్ళాడు. (1) ముని కైలాసానికి వెళ్ళి శివునకు పార్వతికి నమస్కరించాడు. చాలా భక్తితో శుచిగా శిష్యులతో కూడి నమస్కరించి ఆనందింపచేశాడు. (2) శ్రీహరియొక్క ఆ వృత్తాంతాన్నంతా చెప్పాడు. తన తపస్సు యొక్క తత్వాన్ని తన మనస్సుయొక్క వైరాగ్యాన్ని చెప్పాడు. (3) ముని మాటను విని ఆసతి పార్వతి నవ్వి సాక్షాత్తుగా శంకరుని ఎదుట ఆతనికి హితమైన సత్యమైన మాటను చెప్పింది. (4) పార్వతి ఇట్లా - నిన్ను నీవు ధర్మిష్ణుడిననకుంటావు. ధర్మతత్వము నీకు తెలియదు. ఓ ముని! సంతానములేని భార్యను వదిలి తపస్సుకు వెళ్తున్నావా? (5) సంతానములేని, వయస్సులో ఉన్న, కులమునందు పుట్టిన, పతివ్రతయైన దానిని, వదలి సన్యాసికాని, బ్రహ్మచారికాని, యతికాని ఐతే (6) వాణిజ్యానికో, ప్రవాసమునకై చాలా దూరానికిపోతే, తీర్థములకో, తపస్సుకో, మోక్షము కొరకు జన్మనాశము కొరకు పోతే (7) వాడిక ఇమోక్షము రాదు. ధర్మమునుండి పతుతుడౌతాడు నిశ్చయము. భార్యశాపం వల్ల ఇక్కడ పైన నరకమే, నిశ్చయము. ఇక్కడైతే కీర్తినశిస్తుంది అని బ్రహ్మ అన్నాడు. (8) ఓ విప్రుడ! ద్వారకకు వెళ్ళు. ఇప్పుడు నీ ధర్మాన్ని దక్షించు. ఒక అంశను, నా అంశను కలిగిన ఆమెను ధర్మంగా రక్షించుకో (9) పాదపద్మములచే ఆర్జించబడిన పాదపద్మము అందరికి సుఖంగా లభించేదికాదు. ఎప్పుడు శివునిచే పొగడబడేది సనకాది మునీంద్రులు మెచ్చేది. (10) పరమాత్మయైన కృష్ణుడొక సురతరువు వంటివాడు. ఆతనిని వదిలి ఓ వత్స! తపస్సునకు వెళ్తున్నావా, మనోహరమైన సుధను, వదలివెళ్తున్నావా (11) ఓముని! శ్రీకృష్ణుని పాదపద్మములను స్వప్నంలో జపించినవాడు, నూరు జన్మలలో చేసిన పాపం నుండి ముక్తుడౌతాడు ఇందులో అనుమానం లేదు. (12) బాల్యకౌమార, వృద్ధాప్య, యౌవనములందు ఇష్ట పూర్తిగాని, తెలియక కాని చేసిన పాపాలు భస్మమౌతాయి (13) భారతదేశంలో సాక్షాత్తుగా శ్రీకృష్ణ చరణాంబుజములను చూసినవాడు, వెంటనే పూజ్యుడౌతాడు. జీవన్ముక్తుడౌతాడు, నిశ్చయము. (14) కోటి జన్మల నుండి చేసిన సంపాదించిన పాపము నుండి వెంటనే ముక్తుడౌతాడు అన్ని తీర్థములు నిత్యము అతని వల్లనే పవిత్రమైనాయి. (15)
శిశుపాల ఉవాచ :
కృష్ణ సంబంధముగల వ్రతము, వ్రతము, తపము తపము. అదే సత్యము, అదే పుణ్యము అదే పూజనము. అది సఫలమైంది. అతి తన జన్మను నశింపచేస్తుంది కదా (16) బ్రాహ్మణుడు వేదపారగుడు ఐయ్యుండీ కృష్ణభక్తి లేకపోతే, అట్టివాని సహవాసం చేస్తే అతనితో మాట్లాడితే ఈ భక్తుని భక్తి నశిస్తుంది. (17) కృష్ణుడి ఎంగిలి తినేవాడు కృష్ణునంతవాడు. కృష్ణుడు స్వయంగా బ్రాహ్మణుడు. అగ్ని వాయువులున్నంత కాలము ఆతడు పవిత్రుడు. జగత్తును పవిత్రముగా చేయుటకు సమర్థుడు. (18) ఓద్విజ! శ్రీకృష్ణుని వదలి తపస్సుకు వెళ్తున్నావా. శ్రీకృష్ణుని స్మరిస్తే చాలు తపస్సుల ఫలమంతా వస్తుంది. (19) పరమాత్మయైన శ్రీకృష్ణుని యందు భక్తి లేకపోతే, అలాంటి గురువు పరమ శత్రువు. వాడు తన జన్మను (మనది) నిష్ఫలంగా చేస్తాడు. (20) పార్వతి మాట - విని శంకరుడు ప్రేమతో చలించి, ఒంటినిండా పులకాంకురములురాగా పరమేశ్వరిని మెచ్చుకున్నాడు. (21) శివుడు పార్వతి వీరి పాదములకు దుర్వాసుడు నమస్కరించి,కృష్ణుని పాదములను స్మరిస్తు తిరిగి ద్వారకకు వచ్చాడు. (22) అక్కడికి వెళ్ళి హరిని చూచి పరమేశ్వరుని (కృష్ణుని) స్తుతించాడు. ఏకానం శాలయమునకు వెళ్ళి ఆమెతో రమించాడు. (23) యుధిష్ఠిరుడు ధ్యానించగా కృష్ణుడు హస్తినా పురికి వెళ్ళాడు. కుంతితో, రాజుతో, భ్రాతలతో మాట్లాడి, చాలా ఆనందించి (24) ఉపాయముగా జరాసంధుని చంపి, శాల్వుని చంపి, శాస్త్రంలో చెప్పిన విధంగా దక్షిణలిచ్చి యజ్ఞం చేయించాడు. (25) మునీంద్రులు, రాజేంద్రులు వీరితో రాజసూయాన్ని కోరినదాన్ని చేయించి ఆతడు, యజ్ఞంలో శిశుపాలుని దంతవక్రుని చంపాడు. (26) సభలో సురలను రాజులను చాలా నిందించటం వల్ల చంపాడు. వాడి శరీరం పడిపోయింది. జీవుడు హరిస్థానానికి దగ్గరకు) చేరాడు. దానిని చూచి అక్కడ సర్వేశుని మాధవుని, సమీపించి పొగిడాడు. (27) శిశుపాలుడిట్లా - వేదములకు వేదాంగములకు నీవు తండ్రివి, ఓ మాధవ! (28) సురలు, అసురులు, ప్రాకృతులైన ప్రాణుల సూక్ష్మముగా జేసి సృష్టిని కల్పభేదమును చేస్తావు. (29) మాయవల్ల స్వయంగా బ్రహ్మ శంకరుడు, శేషుడు, మనులు, మునులు, వేదములు, సృష్టిపాలకులు మోహితులైనారు.(30)
కళలోని భాగమైన నీ కళతో దిక్పాలురు, గ్రహాదులున్నారు. నీవు స్వయంగా పురుషరూపుడవు. స్వయంగా స్త్రీవి. స్వయంగా నపుంసకుడవు. (31) స్వయంగా కారణము నీవు. కార్యముగూడా. నీవు జనకుడవు, స్వయంగా జన్యమైన వస్తువువు. యంత్రము యొక్క గుణదోషములు మంత్రికి అని శ్రుతిలో విన్నాము. (32) అందరు యంత్రాలు, నీవు యంత్రివి. నీలో అన్ని ఉన్నాయి. నా అపరాధాన్ని క్షమించు, నేను మూడుణ్ణి నీ ద్వారపాలకుడిని (33) బ్రహ్మ శాపం వల్ల, చెడు బుద్ధివల్ల అపరాధం నుండి ఓ జగద్గురు నన్ను రక్షించు, రక్షించు. అని పలికి క్రమంగా జయ విజయములు (34) ఆనందంతో వారు శీఘ్రంగా ఇష్టమైన వైకుంఠ ద్వారము దగ్గరకు వెళ్ళారు. శిశుపాలుని స్తోత్రంతో వారంతా ఆశ్చర్యపడ్డారు. (35) ఈశ్వరుడైన కృష్ణుని పరిపూర్ణతముడని భావించారు. రాజసూయము చేయించి బ్రాహ్మణులను భుజింపచేశాడు. (36) వారికి విభేదం కల్పించి కురుపాండవ యుద్ధము చేయించాడు. ఆ కృపానిధి భూభారాన్ని తగ్గించాడు. (37) రాజు ఆజ్ఞతో చాలా కాలము ఉండి, పిదప మళ్ళీ ద్వారకకు వెళ్ళాడు. బ్రాహ్మణుని పిల్లవాళ్ళు చనిపోతే, ఆపుత్రులను బ్రతికించాడు. (38) చనిపోయిన స్థానము నుండి తెచ్చి పిల్లవాళ్ళను, వాళ్ళ తల్లికిచ్చాడు. అది చూచి దేవకి ఆనందపడి తన చనిపోయిన పుత్రులను తెచ్చి ఇవ్వమని అడిగింది. (39) మృతస్థానము నుండి తెచ్చి, తన తల్లికి తన సోదరులను ఇచ్చాడు (బ్రతికించి). సుదాముడను బ్రాహ్మణుని దారిద్ర్యమును వెంటనే తొలగించాడు. (40) తన ఇంటి నుండి ద్వారకకు శరణార్థిగా వచ్చిన ఆసుదామునకు నిశ్చలమైన రాజలక్ష్మిని ఏడు తరముల వరకు నిలిచి ఉండేట్టుగా ఇచ్చాడు. (41). భక్తవత్సలుడు, భక్తుని అటుకులలో ఒక కణాన్ని (కొద్దిగా) తిని అంత ఐశ్వర్యమిచ్చాడు. అతని రాజ్యము ఇంద్రుని అమరావతిలా ఐంది. (42) కుబేరుడెట్లా ధనవంతుడో, ఆతడు అట్లా ఐనాడు. నిశ్చలమైన హరి భక్తిని, చాలా దుర్లభమైన దాస్యమును ఇచ్చాడు. (43) నాశంలేని గోలోకమందు యథేష్టమైన (కోరిన) ఉత్తమ స్థానమిచ్చాడు. పారిజాతమును, ఇంద్రుని అహంకారమును హరించాడు. (44) సత్యభామతో కోరిన పుణ్యక వ్రతాన్ని చేయించాడు. ఓముని! అంతట నిత్యమైన నైమిత్తికమైన కార్యాలు పెంపొందించాడు.(45)
ఆవ్రతంలో కుమారునకు తనను దక్షిగా ఇచ్చుకున్నాడు. బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు. వారికి ఆనందంగా రత్నమిచ్చాడు. (46) అన్నివిధాల సత్యభామా అతిమానమును పెంచాడు. రుక్మిణి యొక్క అతిసౌభాగ్యము ఇతర స్త్రీలకు చాలానూతనమైనది. (47) వైష్ణవులను, దేవతలను, బ్రాహ్మణులను పూజించాడు. ఓముని! అంతట నిత్యనైమిత్తిక కర్మల పెంచాడు. (48) ప్రభువు! మిక్కిలి శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉద్ధవునికిచ్చాడు. యుద్ధక్షేత్రంలో అర్జునునకు గీతను బోధించాడు. (49) కృపానిధి, కృపతో శత్రువులు లేకుండా చేశాడు. ప్రభువు! యుధిష్ఠిరునకు పృథివి రాజ్యలక్ష్మిని ఇచ్చాడు. (50) దుర్గను వైష్ణవి అనే గ్రామదేవతగా చేశాడు. కోటి హోమములతో కూడిన శుభమైన యజ్ఞాన్ని చేయించాడు. (51) రకరకాల నైవేద్యాలతో, మనోహరమైన ధూపదీపములతో పార్వతి ప్రీతికొరకు బ్రాహ్మణులను భుజింపచేశాడు. (52) రమ్యమైన రైవతపర్వతమందు అమూల్యరత్నమందిరమందు, దేవతలకు ఈశ్వరుడైన పరుడైన గణేశుని పూజింపచేశాడు. (53) రుచికరమైన, చాలా మనోహరమైన లడ్డులను నువ్వులతో చేసిన వానిని ఐదు లక్షలు నైవేద్యమిచ్చి ఆనందంతో ఆతనిని సంతోషపరిచాడు. బియ్యపు పిండితో చేసిన మూడు మూలలుగల లడ్డులను అమృతము వంటి వాటిని ఏడు లక్షలు నైవేద్యమిచ్చాడు. (54) శర్కర యొక్క నూరు రాసులను గణేశ్వరునికిచ్చాడు. పండిన అరటిపండ్లు, పదిలక్షల అప్పాలు నైవేద్యమిచ్చాడు. (55) మధురాన్నము, రమ్యమైన పాయసము మంచిరుచి గల స్వస్తిక ఆకారము గలిగిన పిండిని పెట్టాడు. నేయి, వెన్న, పెరుగు, పాలు అమృతంలాంటివి ఇచ్చాడు. (56) ధూపము, దీపము, పారిజాత పూలమాలను కోరతగినదానిని ఇచ్చాడు. వాసనగల చందనము, గంధము, అగ్నితో శుద్దమైన వస్త్రము ఇచ్చాడు. (57) శుభమైన కోటిహోమ (గుండ) ములుగల యజ్ఞము చేయించాడు. బ్రాహ్మణులను భుజింపచేశాడు. గణేశ్వరుని సంతోషపరిచాడు. (58) పదిరకాల వాద్యములను వాయింపజేశాడు. కుష్టువ్యాధి పోయే కొరకు సాంబుడు సూర్యుని పూజించాడు. (59) తల్లితో కూడా ఆ సాంబునితో హవిష్యము చేయించాడు. ఉత్తమమైన ఉపహారములతో ఒక సంవత్సర కాలము చేయించాడు. (60) భాస్కరుడు స్వయంగా సాంబునకు స్తోత్రమును వరమును ఇచ్చాడు. (61)
అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు గణేశపూజ అనునది నూట పదమూడవ అధ్యాయము.
