4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
35 - రాధాకృష్ణ సంవాదము
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :
నారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లనెను :
ఓ రాధా! ఆ గంగనందరు చూచీ నామాయగా భావించిరి. నారాయణుడు కృపతో బ్రహ్మను గూర్చి ఇట్లు పలికెను. “ఓ చతుర్ముఖా! లెమ్ము, పొమ్ము! నీకు క్షేమమగును. మిక్కిలి శపింపబడిన నీవు నా ఆజ్ఞచేత ఈ నదిలో స్నానము చేసి పవిత్రుడవు కమ్ము. నీవు స్వయముగా పవిత్రుడవైనను ఆ జలములు నీ స్పర్శను కోరుచున్నవి. సర్వతీర్థములు విష్ణు భక్తులకు ప్రభువైనవానివే, ఎవ్వరికైనను అహంకారమన్నది అమంగళమైన పాపమునకు విత్తనము కనుక ప్రకృతిని అవమానించుట వలన నీవు ఇందులో స్నానమాడి శాపముక్తుడవగుము. పిదప శీఘ్రముగా ముక్తి స్థానములలో శ్రేష్ఠమైన నా నివాసమగు గోలోకమునకేగుము. అక్కడ నీవు మంగళముల నిచ్చునట్టి ప్రకృత్యంశయైన భారతిని పొందగలవు.. కల్పాంతము వరకు నీవు తపస్సు చేసితివి కనుక సృష్టికి బీజ స్వరూపిణియైన ఆ ప్రకృతిని {భారతిని భజింపుము. వేశ్యయొక్క శాపము వలన ఇక ఎవరు గూడ నీ మంత్రమును గ్రహింపరు. నీవే జగత్కర్తవు కనుక ఆత్మారాముడవు కనుక అన్నిచోట్ల అన్ని దేహముల యందును సర్వరూపములు గలవాడవై స్త్రీలకు పూజ్యుడవగుదువు. నీకు ప్రత్యక్షముగా కాక అన్యదేవతల పూజయందే నీ పూజ ఇకముందు జరుగును.
అప్పుడు నా ఆజ్ఞచేత బ్రహ్మ గంగా జలములో స్నానమాడి నాకు నమస్కరించి శీఘ్రముగా గోలోకమున కేగెను. అక్కడి దేవతలు మునులందరు పవిత్రమైన నా కీర్తిని మాటి మాటికి పాడుకొనుచు తమ తమ స్థానముల కెగిరి. బ్రహ్మ గోలోకమును జేరి నా ముఖ పద్మము నుండి సృష్టింపబడినదియు సర్వవిద్యలకు అధిదేవతయు వాగీశ్వరీయు ఐసీ భారతీ సతిని {సరస్వతిని} పొంది మిక్కిలి మోదము పొందిన వాడై మన్మథుని అస్త్రముల యొక్క వ్యాపారమును స్వయముగా అంగీకరించెను. అక్కడి నుండి వచ్చి నాకు నమస్కరించి ఏకాంత ప్రదేశములందక్కడక్కడ ఆ త్రైలోక్య మోహినితో ఆ భగవానుడు (బ్రహ్మ) క్రీడించెను. చాలకాలమామెతో రమించి తృప్తి చెందిన బ్రహ్మ వాగీశ్వరితో ఇట్లు పలికెను.
ఒక సాధ్వి తన నుకృత బలము చేత స్థిరమైన యావసము గలదియు పూజ్యురాలును అగును. నీ కర్మ విశేషము చేత ఓ సుందరీ! యువకుని {సన్ను) చూడుము. కామక్రీడయందు నైపుణ్యము గల స్త్రీకి అదే నేర్పు గల పురుషునితో సంగమించుట గుణవంతముగా నుండును. ముసలితనము చేత బాధపడు వృద్దుడను తపస్విని విష్ణుభక్తుడను విప్రుడను. వ్యవహారములో అస్వతంత్రుడను. ధర్మమునకు భగవంతునకు అధీనుడను. అట్టి నాకు జారీణులయందు ఆసక్తి ఎక్కడిది?” అని పలికి బ్రహ్మ ఆమెతో కూడి తిరిగి తన లోకమును చేరవచ్చెను.
బ్రహ్మలోక వాసులు తెల్లని వస్త్రముతో చిరునవ్వుతో రమణీయముగా నున్న మిక్కిలి సౌందర్యవతియగు ఆ దేవిని మిక్కిలి ఆసక్తితో దర్శించిరి. ఆ దేవి శరదృతువునందలి చంద్రుని వంటి ముఖమండలము శరత్కాల పద్మముల వంటి నేత్రములు పండిన దొండపండు యొక్క కాంతినపహరించు చిగురు వంటి పెదవి కలిగి ముత్యములను తిరస్కరించు మనోహరమైన పలువరుసతోను రత్నాల దండకడియములు కంకణములు రత్ననూపురముల (కాలిఅందెలు తోసు ప్రకాశించుచుండెను. చెవులకు రత్నకుండలము వక్షస్నలమున శ్రేష్ఠమైన రత్నాల హారము ప్రకాశించుచుండెను. అగ్ని వర్ణము గల సన్నని వస్త్రము ధరించి పుష్టిగా నున్న పీరుదులు స్తనమండలము గల సవ యావనవతి భక్తమనోహారిణియై వీణను పుస్తకమును వ్యాఖ్యానముద్రను ధరించిన హస్తములతో నున్న సరస్వతీ దేవిని దర్శించి ఆ బ్రహ్మలోకవాసులు మిక్కిలి మంగళకరముగా స్వాగత మిచ్చిరి.
బ్రహ్మను భారతీదేవిని వారు పట్టణమున ప్రవేశ పెట్టిరి, బ్రహ్మ ఆమెతో మిక్కిలి సుఖసంభోగమున మునిగి రేయిపగలు ముదముగా క్రీడించెను. ఈ విషయము పురాణములలో రహస్యమైనది. రాధా! ఇంక ఏమి వినగోరుదువు? అని కృష్ణుడు పలికెను
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
ప్రాణనాథుని మాట విని పరమేశ్వరి ఐన రాధాదేవి ఆ సరస వృత్తాంతమునకు నవ్వి మనస్సున ఇంకను తెలిసికొనవలెనన్న ఆసక్తి గలదై తిరిగి ప్రశ్నించెను.
శ్రీరాధికోవాచ - శ్రీరాధాదేవి పలికెను :
కర్మ క్షేత్రమైన భూమండలమున జీవులొనర్చిన కర్మలకు ఫలము నీచ్చువాడైన బ్రహ్మ కర్మ క్షేత్రముగాని దేవలోకమున రహస్య ప్రదేశమున స్వయముగా తనను జేరవచ్చిన వేశ్యనెందుకు స్వీరించలేదు. చేరవచ్చిన స్త్రీని (కోరి వచ్చిన దానిని) త్యజించుట మహాదోషమన్న ప్రసిద్ధ విషయము నెరిగి కూడ ఆ సృష్టికర్త మోహినిని ఎందుకు త్యజించెను ?
శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ ముని పలికెను:
ఆ శ్రీహరి రాధాదేవి మాటకు నవ్వి ఆ ప్రశ్నకు మూలకారణమైన వృత్తాంతమును పాద్మకల్పమునకు సంబంధించిన కథను రాధాదేవికి చెప్పెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లు పలికెను :
ఓ ప్రియురాలా! నీచేత కోరబడిన ఆ వృత్తాంతమును పూర్వము జరిగిన దానిని చెప్పగూడని రహస్యమును గొప్పవారు మిక్కిలి నిందించిన దానిని చెప్పుచున్నాను వినుము. బ్రహ్మ ఒకసారి ప్రజాసృష్టికి ప్రేరణను పొంది - బ్రహ్మతేజస్సుతో ప్రకాశించెడి పుత్రులను మనస్సంకల్పముతోనే సృష్టించెను. సనకుడు సనందుడు సనాతనుడు సనత్కుమారుడు వోడుడు కవి పంచశిఖుడు అసితుడు కపిలుడు అను సిద్ధులు వారు. వారినట్లు సృష్టించిన బ్రహ్మ ఐదు సంవత్సరముల వయస్సులో నగ్నరూపములతో నున్న వారిని చూచి మీరు ప్రజలను సృష్టించుడని పలికెను. అట్లు ప్రజా సృష్టిచేయుమని ప్రేరేపించిన తండ్రిని నాయొక్క ధ్యానార్చనల యందే ఆసక్తి గలవారు తండ్రిమాట కాదని అగౌరవపరచి వెంటనే తపస్సు చేయుట కొరకు వెడలిపోయిరి.
అప్పుడాస్థితికి కోపము పొందిన బ్రహ్మ మరల ఏకాదశ రుద్రులను సృష్టించేను. వారు భయంకరాకారములతో రోదించుచు జన్మించిరి. వారిని సృష్టి కార్యమందు నియమించి వెంటనే మరల ధ్యాసయోగముతో ధ్యానించి తన ఆత్మయందే ఆనందించునతడు తన శరీరము నుండి పుత్రులను సృష్టించెను. వారు వసిష్టుడు పులపోడు క్రతువు అంగిరసుడు భృగువు అత్రి పులస్త్యుడు దక్షుడు కర్దముడు మరీచి అనువారు. వారిని గూడ ప్రజా సృష్టికి ఆజ్ఞాపించి సంతుష్ట మనస్సుతో ఒక పుత్రుని ఒక కన్యను సృష్టించెను.
ఆ పుత్రుడే కామదేవుడు. అతడు పుత్రవాంఛగల కృష్ణునకు (అవతార కాలములో} పుత్రుడై జన్మించెను. ఆ కన్య రత్నాభరణములతో అలంకరింపబడినదై పదహారు సంవత్సరముల వయస్సు కలదై యుండెను. ఇతరుల మనస్సును హరించగలవాడు తనయందే తానానందించువాడు నా కళ యొక్క అంశతో జన్మించినవాడు వారింప శక్యము గానీ శక్తి గలవాడై తనముందు మిక్కిలి ప్రకాశించుచున్న ఆ కుమారుని చూచి బ్రహ్మ ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ నలికెను :
నీవు నా చేత స్త్రీపురుషుల యొక్క సుఖక్రీడ కొరకు ముదముతో సృష్టింపబడితివి. హర్షము కూర్చుట చేత అందరియందు అధివసించి ఉందువు. సమ్మోహనము మిక్కిలి ఉద్వేగకరము బీజస్తంభ కారణము ఉన్మత్త బీజము జ్వలదము మాటి మాటికీ చైతన్యమును హరించునది అనెడి నాచేత ఈయబడు ఈ శరములను స్వీకరించి సర్వ జీవులను సమ్మోహము పొందునట్లు చేయుము. నా వరము వలన లోకముల యందు నీవు నివారింప శక్యము కాని వాడవగుదువవు. ఇట్లు పలికి మిక్కిలి హర్షించి జగత్కర్త అతనికి బాణము లిచ్చి తన ముందున్న బిడ్డను చూచి వరమీయ బూని ఇట్లు పలికెను.
ఇంతలో మన్మథుడు మనస్సులో ఒక ఆలోచన చేసి తన (బ్రహ్మ ఇచ్చిన) శస్త్రములను (వాటి శక్తిని) పరీక్షించుటకుగాను బ్రహ్మపై మంత్రపూతములైన - సహింపరాని వీర్యము (శక్తి) గల బాణములను స్మరించి ప్రయోగించెను. మహాయోగియైన బ్రహ్మ వాటిచేత మిక్కిలి కొట్టబడి చైతన్యము నశించి మూర్ఛిల్లెను, ఒక క్షణము తరువాత తిరిగి చైతన్యము పొంది (స్మృతికి వచ్చి) తన ముందున్న కన్యను చూచి ఆమెను సంభోగించుటకు మనస్సు పడెను తలచెను) ఆ సాధ్వీ భయముతో పరిగెత్తెను.
వివేకము నశించి తన వెనుక పరిగెత్తుచు వచ్చుచున్న తండ్రిని చూచి ఆమె శీఘ్రముగా తపస్వులైన అన్నలను శరణు పొందెను. వారామెను తమ దగ్గర ఉంచుకొని కోపముతో హితము సత్యము వేదోక్తము నీతిసారము శ్రేష్ఠమునైన వాక్యమును తండ్రితో ఇట్లు పలికిరి.
ఋషయ ఊచుః - అమలు పలికిరి :
తండ్రీ! ఏమి ఈ ఆశ్చర్యము. నీవు చేసెడి పని మీక్కిలీ నిందింపదగినదిగా నున్నది. ఓ జగత్కర్తా! నీవు చేయు పని నీచులొనర్చునది. ఎవరు పరస్త్రీని కన్నబిడ్డవలె చూతురో ఆ సత్పురుషులు జితేంద్రియులు కనుక ఇహ పరలోకములందు అంతట పూజ్యులగుదురు. నీవు వేదశాస్త్రకర్తవు. స్వయముగా కన్నకూతురును సంభోగింపగోరుచున్నావు! కన్నకూతురు మాతృ వర్గములో ప్రవేశించినట్లు (చేర్చినట్లు! వేదమునందు చెప్పబడినది.
గురువు భార్య, రాజుభార్య, బ్రాహ్మణుని భార్య, అన్న భార్య, పుత్రుని భార్య, మిత్రుని భార్య, తల్లిదండ్రులను గన్న స్త్రీ, మేనత్త, అన్నకూతురు, భార్యను గన్న తల్లి, తన పుత్రికలు, కన్నతల్లి, సవతి తల్లీ, ఆడ తోబుట్టువు {అక్క, చెల్లెలు), కామధేనువు {దేవతాధేనువు), తనకు నచ్చిన దైవము యొక్క భార్య, చిననాడు పెంచిన దాది, అన్నము పెట్టి ఆదుకొన్న స్త్రీ గర్భము ధరించిన స్త్రీ, తన పేరు గల స్త్రీ, ప్రాణ భయము నుండి రక్షించిన వాని భార్య, వీరందరు కూడ జనులందరికి తల్లులనీ వేదమందు చెప్పబడిరి. వీరందరిలో ఎవరును తక్కువవారు కారు.
తనకు కన్యాదానము చేసినవాడు, అన్నము పెట్టినవాడు, జ్ఞానదానము చేసినవాడు, ఆపత్కాలమున అభయమిచ్చి రక్షించినవాడు, కన్నతండ్రి, మంత్రోపదేశము చేసినవాడు, పెద్ద అన్న వీరు తండ్రులని చెప్పబడిరి. ఏ మూఢులు ఫైన చెప్పబడిన మాతృ వంశములోని వారిని వివాహమాడుదురో {కామింతురో, ఎవరు ఈ తండ్రులను అవమానింతురో వారు ఒక బ్రహ్మ జీవితకాల పర్యంతము నరకబాధలనుభవింతురు. వారిని యమదూతలు అంధకూప నరకములో నిలిపి దూరము నుండియే తాడింతురు (కర్రలతో కొట్టుదురు) మల మూత్రములను త్రాగింతురు.
నీవు విశ్వకర్తవు. మయుని గూడ శాసించువాడు. జగత్తుల యొక్క విధాతవు. ఆ కారణము చేతనే స్వయముగా నీ కన్న కూతురును పట్టుకొనుచుంటివి. ఓ కామరోగపీడితుడా! మా ముందునుండి దూరముగా బొమ్ము. నిన్ను భస్మమొనర్చు శక్తి గలవారమై కూడ మేము తండ్రివైన నిన్నట్లు చేయుము. పండితులు గురువు యొక్క వేయి దోషములను క్షమింతురు (ఓర్చుకొందురు). నీతిజ్ఞులు తమ గురువు తప్ప ఇతరుడివడైన సర్వధర్మములను నాశమొనర్చునేని వానిని నౌశము చేయుదురు. తమ సర్వస్వము స్వీకరించినను, నిష్ఠురముగా శపించినను (నిందించిసను) సాధువులు తమ గురువును భక్తితో నమస్కరింతురు గాని నిందింపరు. దేవతల కంటే శ్రేష్ఠుడైన గురువును ఎవరు ద్వేషింతురో ఎవరు నిందింతురో వారు సూర్య చంద్రులున్నంత వరకు అంధకూపీ నరకములో పాపమనుభవింతురు. యముని దెబ్బలతో మనస్సులో క్షోభ పొంది రాత్రింబగళ్లు సర్పము లంత పెద్దగా నున్న క్రిమి కీటముల చేత కరువబడుదురు. మలమును భుజింతురు. ఇట్లు పలికీ మునులు అతని పాద పద్మములకు నమస్కరించిరి. అందరును దైవము వలన ప్రశాంతమైన మనస్సు గలవారగుదురు. ఇట్లు పలికి మునులు తమ కర్మయందు (తపస్సులో) ఉన్ముఖులైరి (తపస్సునకేగిరి).
బ్రహ్మ తన ప్రవర్తనకు సిగ్గుపడి శరీరమును త్యజించుటకు పూనుకొనెను. సర్వప్రాణ వాయువులను నిరోధించి యోగశక్తితో షట్చక్రములను భేదించి బ్రహ్మరంధ్రమునకు జీవుని జేర్చి బ్రహ్మ రంధ్రమార్గముగా శరీరమును త్యజించెను. అంతకు ముందు మనస్సులో శ్రీహరిని తలచి నమస్కరించి "స్వామీ! అల్పముగా గూడ పరద్రవ్యమందు నామనస్సు పడకుండుగాక, కీర్తిమంతులకు ప్రాణ త్యాగము కంటే అపకీర్తి మిక్కిలి దుఃఖమైనది” అని హృదయమును స్థిరపరచుకొని ఆ బ్రహ్మ పరమాత్మ యందు లీనమయ్యేను. తండ్రి అట్లు మరణించుటను చూచి ఆ కన్య మాటి మాటికి మిక్కిలి విలపించి యోగశక్తితో దేహమును త్యజించి ఆమె కూడ పరబ్రహ్మమందు లీనమయ్యేను. తమ కోపము వలన తండ్రియు సోదరియు మరణించుట చూచి ఆ మునులు దు:ఖించి శ్రీహరిని స్మరించిరి.
సో అంశ గల శ్రీమన్నారాయణుడు (వైకుంఠవాసుడు) త్వరగా కృపతో వచ్చి బ్రహ్మను అతని పుత్రికను బ్రదికించెను. బ్రహ్మ తనముందున్న శ్రీహరిని చూచి అతని పాదములయందు విడదీయరానీ నిశ్చల భక్తిని తన కోరికగా వరము కోరుకొనెను. సంతోష హీనుడై యున్న బ్రహ్మను చూచి దయానిధియైన స్వామి సత్యమును నీతిసారమునైన ఉపదేశ వాక్యమును మనోహరముగా ఇట్లు పలికెను.
శ్రీనారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడు వల్కెను :
ఓ సృష్టికర్తా! బ్రహ్మా! నేను చెప్పుచున్న మాటను ముఖమెత్తి వినుము. హృదయమునకు తాపకారణమైన సిగ్గును త్యజింపుము. క్షుద్రులకు గొప్పవారికి అందరికిని సత్కీర్తిగాని అపకీర్తి గాని మంచి ప్రతిష్ఠగాని ఆపద గాని తమతమ కర్మచేతనే సంభవించుచున్నది. అందరికిని అన్ని కారణముల కంటే తాము చేసిన పుణ్యపాపకర్మయే మిక్కిలి బలమైనది. అందువలననే ఎల్లప్పుడు సత్పురుషులు శాశ్వతమైన సత్కర్మనే చేయుచున్నారు. కొంతమంది హరి పాద పద్మములందే మనస్సు గలవారు, తముచేత చేయబడిన బలవంతమైన కర్మఫలమును అనుభవించి సర్వకర్మలను నిర్మూలము (మిగులకుండ) చేయుచున్నారు. దుష్కర్మ వలన అపకీర్తియు సిగ్గును సంభవించుట నిశ్చయము. సత్కర్మ వలన మంచి ప్రతిష్ఠయు (గౌరవ మర్యాదలు} స్వచ్ఛమైన కీర్తియు అంతట ఏర్పడును.
ఓ విధీ! కాలమును బట్టి రజోగుణమును బట్టి బలము రూపము శుభాశుభకర్మలు సత్వరజస్తమోగుణ సంబంధమైన కీర్తియు అపకీర్తియు మోహమును సంభవించును. ఋణము ప్రణములు (గాయము} దోషము చేయకుండ ఆపవాదు కాలమును బట్టి ఏర్పడుచున్నవి. పైన చెప్పబడిన ఆ రెండు కారణములు తప్ప వేరొకటి ఏదియు లేదు. పరస్త్రీల యందును పరద్రవ్యములందును అపకీర్తి ఎల్లప్పుడు నివసించి యుండును. అందువలననే తమ దుఃఖములకు మూలములైన ఆ రెంటీని {పర స్త్రీ, పరద్రవ్యము) సత్పురుషులు స్వీకరించరు. ఓయీ! ప్రతిదినము బ్రాహ్మీముహూర్తములో నీ మనస్సులో నన్ను ధ్యానించుము. సాకు సంబంధించిన దానినే చేయుము. వినుము. దాని వలన నీ మనస్సు పరుల వస్తువుల మీదికి చలించదు.
స్త్రీ రూపము ధరించిన నా మాయ సర్వజనులకు మోహము కల్గించునది. స్వాత్మారామునకు (యోగికి) కూడ ఎప్పుడు విలాసముగా మోహము పుట్టించును. స్త్రీలయొక్క అనేకములైన అవయవములయందు కామి జనమునకు ఎప్పుడును ఆసక్తి ఏర్పడుచుండును. స్తనములన్న పేర నున్న మాంసపు ముద్దల యందు అశుచియైన చోల్లుకు నిలయమైన క్రింది పెదవి యందును భోగాసక్తి పుట్టును. స్త్రీలయొక్క పిరుదులు ముఖము (నోరు) స్తనములు కామదేవునికి నివాస ప్రదేశములు. అందువలన ధర్మమునకు భయపడు సత్పురుషులు పరస్త్రీలను కన్నెత్తి చూడరు. ఎవని మనస్సు పరస్త్రీల యందు చిక్కుకొనునో వానికీక ధర్మమెక్కడిది? గౌరవ స్థానమెక్కడ? తపసెక్కడ? బుద్ధి గాని విద్యగాని దానమహిమ గాని ఎక్కడ నిలుచును?
ఈ లోకమున అపకీర్తి దుఃఖము పరలోకమున నరక వాసము యమకింకరుల దండనము క్రిములు కొరికి తినుట అను దుఃఖము పరస్త్రీ వ్యామోహ ఫలితములు. దైవము చెడ్డచూపు చూచుట వలన లేదా కర్మ దోషము వలన దుఃఖములకు కారణమునైన పరస్త్రీ సేవనమును మూడులు సుఖమని తలచి బుద్ధిపూర్వకముగా సంతోషముగా చేయుదురు. పరవస్తువుల యందు ఎపని మనస్సు తగులుకోనునో - అందులోను పరస్త్రీలయందు పరుల బంగారము నందు వరుల భూమి యందు వ్యామోహమెవనికి కలుగునో వాని కెల్లప్పుడు ఆపదలే సంభవించును. హఠాత్తుగా పరస్త్రీని చూచినవాడు శ్రీహరిని స్మరించి మనస్సును చూపును మరల్చుకొన్న యెడల పవిత్రుడగును. పర సువర్ణమును చూచి హస్త ప్రక్షాళనము (చేతులు కడుగుకొనుట) చేసికొన్నచో శుచి యగును. సత్పురుషులు వివాహమాడిన తమ స్త్రీయందు గూడ ఎల్లప్పుడు కామాసక్తులై ఉండరు. ఎడతెగని కామాసక్తి క్షయవ్యాధి జ్ఞానహానీ లోకనింద అను భయములకు కారణమగునని వారి అభిప్రాయము.
తపస్వులు తపస్సునందు, పండితులు శాస్త్ర విచారము నందు, యోగులు యోగ సంబంధమైన ఆలోచన యందు, వైదికులు వేదార్థమునందు, సాధ్వులు (ఉత్తమ శీలము గల స్త్రీలు) పతిసేవయందు, గృహస్థులు గృహకర్మల యందు, కాముకులు కామ సుఖము నందు, నా భక్తులు నన్ను సేవించుట యందు మనస్సు లగ్నము చేసి నలుగురు కూడి మాట్లాడుకొను సభలయందు ప్రశంసింపబడుదురు. వేదశాస్త్రములలో చెప్పబడిన ప్రకారము ఆచరించుట వలన ప్రశంసను, తద్విరుద్దముగా ప్రవర్తించిన యెడల నిందను పొందుదురు. ఎప్పుడును సన్మార్గమున ప్రవర్తించువారిని లోకజనులందరు ఎల్లప్పుడు ప్రశంసింతురు. దుష్టమైన మార్గములో నడచు వానిని నాగలి దున్నుకోను అజ్ఞానులు కూడ నిందింతురు.
ఓ బ్రహ్మా! నా వరము వలన మరల శరీరమున ప్రవేశించి జీవించుచున్న నీకు పరస్త్రీల యందుగాని పరద్రవ్యము నందుగాని ఈనాటి నుండి మనస్సు తగుల్కొనదు. నేనిచ్చిన ఈ వరము వలన నా విషయమును ధ్యానించి నాకు ప్రియము చేయుము. బాహ్యమైన ఇతర విషయము సంభవించినప్పుడు సమస్త విఘ్నములను నశింపజేయు నా పాద పద్మములను స్మరించి ధ్యానించుము. ఈ కన్య నాపుత్రుడగు కామదేవునికి రతీయను పేరుతో భార్యయే స్త్రీపురుషుల సంయోగసుఖములకు అధి దేవతయగును అని బృందావన వినోదియగు కమలాపతి {శ్రీమన్నారాయణుడు బ్రహ్మతో పలికి ఓదార్చి తన నిత్యనివాసమైన వైకుంఠమున కేగెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధాకృష్ణ సంవాదమను కథా భాగము గల ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.
