4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
11 - తృణావర్తవధము
శ్రీనారాయణ ఉవాచ :
నారాయణముని పల్కెను:
ఒకసారి రేపల్లెలో ఇంటిపనులలో మునిగియున్న నందుని గృహిణియగు యశోదాదేవి తన కుమారుని తన వక్షస్థలమున చేర్చుకొని యుండెను, సుడిగాలి రూపమున గోకులమును చేరవచ్చుచున్న తృణావర్త రాక్షసుని శ్రీకృష్ణుడు ముందుగా తెలిసికొని తన దేహము తల్లికి భాధమగునట్లు మార్చిను. అప్పుడు యశోద బరువైన బాలకుని మోయజాలక దించి పడకపై పండబెట్టి యమునా నదికీ వెల్లెను.
ఇంతలో సందుని మందిరమునకు సుడిగాలీ రూపుదాల్చిన రాక్షసుడు వచ్చి బాలుని లేవనెత్త (ఆకాశములో) త్రిప్పి నూరు యోజనముల దూరము వరకు పోయి అప్పటికప్పుడే గోకులమంతట చిమ్మచీకటి చేసి గాలితో చెట్ల కొమ్మలను విరిచి చివరకు నేల మీద పడిపోయెను. వాడు రాక్షసుడైనను హారీ స్పర్శ వలన తన కర్మను నొశము చేసుకొని (శరీరము వదిలి దివ్యదేహము దాల్చి) సుందరమైన రథము నెక్కి హరీ మందిరమునకు పోయెను. (పూర్వజన్మలో పాండ్య దేశమున బుట్టిన రోజు దూర్వాసుని శాపము వలన రాక్షసుడై శ్రీకృష్ణుని చరణములను స్పృశించినందు వలన గోలోకమునకు పోయెను.
సుడిగాడ్పు తగ్గగానే గోపాలురు గోపికలు భయముతో మనస్సు చెదరి ముంచములో పండుకొని యున్న బాలకుని చూడక భయముతో శోకముతో వ్యాకులులై తమ తమ రొమ్ములను కొట్టుకొనిరి. కొందరు మూర్ఛిల్లిరి. కొందరు దుఃఖించరీ. వెదడుచు పోయి ప్రజములో బయట ఒక ప్రదేశమున నీరు నిండియున్న సరస్సు ఒడ్డున ఒక పుష్పోద్యానములో పడియున్న బాలుని చూచిరి. శరీరమంతయు దుమ్ముతో నిండియుండెను. ఆకాశమును చూచుచు భయముతో బెదరుచు మాటి మాటికేదో మాటాడుతున్న బాలుని నందుడు స్వీకరించి త్వరగా వక్షః స్థలమున కదుముకొనీ మాటి మాటికి బాలుని ముఖము చూచుచు దుఃఖముతో నేడ్చెను. యశోదయు రోహిణియు బాలునీ చూడగనే ఏడ్చి మాటి మాటికి ముద్దులు పెట్టుకొనిరి. వక్షః స్థలముననదుముకొనిరి. యశోద కలకలలాడు ముఖముతో ప్రసన్నమైన . చూపులతో పిల్లవానిని స్నానమాడింపజేసి మంగళ రక్ష చేయించి స్తన్యము (చనుబాలు) నిచ్చెను.
నారద ఉవాచ :
నారదుడు పల్కెను:
ఓ పరమాత్మా! పాండ్యదేశరాజును దుర్వాసుడెందుకు శపించెను? ఈ ప్రాచీనమైన ఇతిహాసమును బాగుగా ఆలోచించి చెప్పుము.
శ్రీనారాయణ ఉవాచ :
పాండ్య దేశపు ప్రభువు సహస్రాక్షుడన్న రాజు గొప్ప ప్రతాపవంతుడు. అతడు గొప్పశక్తి సాధించిన యోగీంద్రుడు. అతడొకసారి వేయిమంది తన స్త్రీలను (భార్యలను) వెంటబెట్టుకొని మనోహరము జనరహితము ఐన గంధమాదన పర్వత ప్రాంతమున నున్న పుష్ప భద్రాతీరమున సుందర పుష్పోద్యానమున విహరించుచు తన యోగశక్తితో వేయి రూపములు ధరించి కామీనీ జనమును నఖక్షత దంతక్షతములు విపరీత కాముకక్రీడలు నానావిధ శృంగార చేష్టలతో అనుభవించెను. స్థలవిహారము తరువాత ఆరాజు స్త్రీలు వస్త్రములు వదలి నగ్నము గా భర్తతో జలక్రీడలొనర్చిరి.
ఇంతలో అక్కడికి లక్షమంది శిష్యులతో బాటు కైలాసమునకు శంకరదర్శనమునకై పోవుచు దూర్వాస మహర్షి వచ్చెను. కామ మదమత్తుడై యున్న సహస్రాక్ష నృపతి మునిని చూచియు లేచి నిలబడుట గాని నమస్కరించుట గాని మాటమాత్రము పలుకుట గాని ఎట్టి ఆదరము చేయలేదు. అది చూచీ కోపించి ముని వణకుచున్న పెదవులతో ఇట్లు శపించెను.
ఓ పాపాత్ముడా! నీ యోగశక్తి భ్రష్టమై పోయి భూమి మీద రాక్షసుడుగా జన్మింతువు గాక. నరాధముడా! నీవు లక్షీండ్లు అట్లు భారత వర్షమున నుందువు. ఆ తరువాత శ్రీహరి పాదస్పర్శ వలన గోలోకమును పొందగలవు. ఇది సత్యము. నీ భార్యలు అదే భారతవర్షమున అక్కడక్కడ రాజేంద్రుల యిండ్లలో నీ కన్న సుందరాంగులుగా జన్మింతురుగాక" ఇట్లు పలికి దూర్వాసముని శంకరాలయమున కేగెను. దయావంతులైన అతని శిష్యులు అయ్యో! హా అనుకొనుచు వెళ్ళిరి.
మునీంద్రుడు వెళ్లిన తరువాత ఆ నదీ తీరమున రాజు గడచిన దానికి మిక్కిలి ఏడ్చెను. అంతవరకు సుఖమనుభవించిన ఆ సుందరీమణులు అతని ఎడబాటుకు భయపడుచు ఇట్లు దుఃఖించిరి. “ఓ నాథుడా! ప్రేమమూర్తీ! నీవు లేకుండ మేమెక్కడికి పోదుము మేము లేకుండ నీవెక్కడికేగుదువు? ఏకాంత ప్రదేశమున ఇక మేము నీతో విహరించబోము కదా! నీవిక రాజ్యమేలవుకదా! మనము రాజగృహమునక్క ఫోముకదా! శరత్కాల చంద్రుని కాంతిని దొంగిలించిన నీ ముఖమునిక చూడజాలము. చాచిన చేతులతో మమ్మిక నీదగ్గరకు తీసుకోవు కదా.
రాజు ముందర నీట్గా స్త్రీలు దుఃఖించి అతని పాదములు పట్టుకొని మూర్ఛిల్లిరి. ఆ నదీ తటమున రాజు అగ్నిగుండ మేర్పరచి శ్రీహరి పాద పద్మములు స్మరించుకొనుచు భార్యలతో బాటు మండుచున్న అగ్నిలో ప్రవేశించి శరీర త్యాగము చేసిను. ఆకాశమున నున్న దేవతలది చూచుచూ హా హా యని అరచిరి. మునులు అన్నిటి కన్న దైవము మిక్కిలి బలమైనది” అని పలికిరి. ఆ రోజు తృణావర్తుడుగా జన్మించి హరిపాద స్పర్శతో గోలోకము పొందెను. అతని భార్యలు భారత వర్షమున కోరుకున్న జన్మలెత్తిరి. ఇట్లు సహసాక్షనృవతీ దూర్వాసముని శాప మూలముగా జన్మరాహిత్యము పొందిన శ్రీహరి మహిమ నీకెరింగించితిని.
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో తృణావర్త వధయను పదకొండవ అధ్యాయము సమాప్తము.
