4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

27 - గోపికావస్త్రాపహరణ ప్రస్తాపము

శ్రీనారాయణ ఉవాచ –

నారాయణ మహర్షి పలికెను :

ఓ నారదా! మరల శ్రీకృష్ణచరీతము (ఒక ఘట్టము) చెప్పుదును వినుము. గోపీకా వస్త్రాపహారణము మరియు వారు (గోపికలు) కోరిన వరములనిచ్చుట అన్న ఘట్టమీది.

హేమంత ఋతువులోని మొదటి మాసమగు మార్గశిరములో కామమోహితలైన (శ్రీకృష్ణుని విషయములో) గోపికలు మొత్తము నెల భక్తిశ్రద్ధలు గలవారై హవిష్యము (పొంగలి) సిద్ధము చేసి యమునానదిలో స్నానమొనర్చీ ఆ నదీతీరముననే ఇసుకతో పార్వతీదేవిని సిద్ధము చేసి నిర్మించి మంత్రముతో ఆవాహనచేసి ప్రతిదినము పూజించుచుండిరి.

మనోహరములైన శ్రీచందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు దైవము నానావిధపుష్పములు వివిధములైన పూలదండలు ధూపదీప నైవేద్యములు వస్త్రములు నానావిధ ఫలములు మణులు ముత్యములు పగడములు సమర్పించి నానావిధ మంగళవాద్యములతో అర్చించిరి.

ఓదేవీ! జగన్మాతా! సృష్టి స్థితిలయములు చేయుదానా! భక్తపాలనమను మంచి ప్రతము గలదానా! నందగోపుని సుతుడైన శ్రీకృష్ణుని మాకు కాంతునిగా నిమ్ము.

పై మంత్రముతో దేవ దేవియగు గౌరిని ప్రార్థించి ప్రాయశ్చిత్త విధీచేసికొని తరువాత దేశకాల స్మరణముతో సంకల్పము చేసి మూలమంత్రముతో పూజించుచుండిరి.

ఆ గోపికలు పఠించిన మంత్రము సామవేదమున చెప్పబడినది. బీజాక్షర యుక్తము. ఒక జాములో ఫలము కూర్చునది. అది ఓం శ్రీదుర్గాయై సర్వవిఘ్నవినాశిన్యై నమః అనునది.

సంతోషముతో ఆ గోపికలందరు ఆ దేవత మీది భక్తితో ఆ మంత్రము చెప్పుచు పుష్పములు పూలదండలు ధూపదీప నైవేద్యములను సమర్పించిరి.

భక్తితో ఈ మంత్రమునే పగడముల జపమాలతో వేయి మార్లు జపించి స్తుతించి భూమిపై శిరస్సు ఆనించి నమస్కరించిరి.

“సర్వమంగళములకు మంగళమైనదానా! సర్వకామములు ఇచ్చుదానా! శివనామురాలా! శంకరప్రియురాలా! దేవీ నీకు నమస్కారము. నా వాంఛితము (కోరిక) నిమ్ము” అని పలికి నమస్కరించి బ్రాహ్మణులకు నైవేద్య దక్షిణలు సమర్పించి గోపికలు తమ గృహములకేగిరి.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి పలికెను :

పీడితః వరీతుష్టావ మూలప్రకృతిమీశ్వరీం

ఓ నారదమునీ! గోపికలు ఏ శ్రేష్ఠమైన స్తవముతో పార్వతీదేవిని భక్తితో స్తుతించిరో అన్ని కోరికల ఫలమిచ్చునట్టి ఆ స్తోత్రమును వినుము. ఈ సృష్టి మొత్తము చంద్రసూర్యులు లేనిదై కాటుక రంగు నీటిలో చరాచరములన్నియు మునిగీ ఘోరమైన ఒకే సముద్రముగా నుండగా ఆ పూర్వకాలమున జలశాయిగా నున్న (నీటిమీద పడుకొన్నవాడు) శ్రీహరి బ్రహ్మకు దీనినుపదేశించెను. ఆ జగత్పతి మరల నిద్రాయోగములో నుండగా - అతని నాభి కమలమున నున్న సృష్టికర్త (బ్రహ్మ) ను మధుకైటభులు వచ్చి పీడించిరి. అప్పుడు బ్రహ్మ మూలప్రకృతియైన ఈశ్వరిని (ఈస్తుతితో) స్తుతించి సంతోషపరచెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మా పలికెను :

ఓ.దుర్గా! శివా! మాయా! నారాయణీ, సనాతనీ, జయా! సర్వమంగళా! నీకు నమస్కారము. నాకు మంగళ (శుభము} మిమ్ము, దకారము దైత్యులను నాశము చేయుట అను అర్థము చెప్పు శబ్దముగా ప్రశంసింపబడినది. ఉకారము విఘ్నములను నాశము చేయుట అను అర్థము తెలుపు పదముగా వేదపంగీకరించినది. రకారము రోగనాశకమన్న అర్థము తెల్పు పదము. గకారము పాపము నశింపజేయు అను అర్ధము తెల్పు పదము. ఆకారము భయమును శత్రువులను నశింపజేయు అను అర్థము తెలుపు శబ్దముగా కీర్తింపబడినది. స్మృతులందు చెప్పబడిన (ఏదేవి నామము కలదో) ఆ “దుర్గా" అను పదమును స్మరించుట వలన సమష్టిగా ఫైన భయ మూలములన్నియు నశించును అన్నది నిశ్చితము. అందువలననే దుర్గాదేవి హరియొక్క శక్తి అని శ్రీహరిచేత కీర్తింపబడినది. (18, 19 శ్లోకములలో ద్ + ఉ + ర్ + గ్ + ఆ = దుర్గా అను నామములోని ఒక్కొక్క అక్షరము యొక్క మహిమ వర్ణింపబడి 20 శ్లోకములో ఆ నామమహిమ కలిపి చెప్పబడినది. ఇక ముందు గూడ ఇట్లే దుర్గా నామ నిర్వచనము చేయబడినది).

దుర్గ అన్న శబ్దము ఆపద అను అర్థమిచ్చును. ఆకారము (దీరము) గోశము అను అర్ధమిచ్చును. ఏ దేవి దుర్గము (ఆపద) ను నశింపజేయుచున్నదో ఆమె దుర్గా అని కీర్తింపబడినది .

దుర్గ అను పదము దైత్యేంద్రుని తెలుపు పదము. ఆకారము (దీర్ఘము) నాశమును తెలుపు పదము, ఆ దేవి పూర్వము (ఇకముందు ఇతర నామముల నిర్వచనము చెప్పబడినది) ఆ రాక్షసుని నశింప జేసినందున బుధుల చేత దుర్గా అని కీర్తింపబడినదీ.

శకారము కల్యాణ వాచక వర్ణము, ఇకారము ఉత్కృష్ట (శ్రేష్ఠు వాచకవర్ణము మరియు సమూహవాచకము, వాకారము ధాతృ (ఇచ్చునట్టిది) వాచక పదము. ఈ చెప్పిన దానిని బట్టి శ్రేష్ఠమైన శ్రేయోగణమును (శుభసమూహమును) ఇచ్చు దేవి కనుక శివా (శ్ + ఇ +వ్ ఆ) అని కీర్తింపబడినది. శివా అనగా రూపుదాల్చిన మంగళము అని మరియొక నిర్వచనము కనుక శివా అని ప్రశంసింపబడినది. శివ అను పదము మోక్షవాచకము ఆకారము దాతృవాచకము కనుక శివా అని ఆయెను. తాను స్వయముగా నీర్వాణము (ముక్తి) నీచ్చునది ఏ దేవియో ఆమె శివా అని కీర్తింపబడినది.

“అభయ” అను పదము భయనాశకము అనియు, ఆకారము దాతృవాచకము (పూర్వము వలెనే) కనుక ఏ దేవి వెంటనే అభయము (భయము లేని స్థితిని నిచ్చునో ఆమె “అభయా” అని చెప్పబడినది.

“మా” పదము రాజ్యలక్ష్మిని తెల్పునది. “యా” పదము పొందించు అనువర్థమిచ్చును. అందువలన ఏ దేవి (శరణు పొందిన) వెంటనే రాజ్యలక్ష్మిని సమకూర్చుతో ఆమె మాయా అని చెప్పబడినది. “మా” పదము మోక్షమను అర్థమిచ్చును. “యా” పదము పొందించు అనుసర్థమిచ్చును. అందువలన ఏ దేవి శాశ్వత మోక్షమును కల్గించునో ఆమె మాయా అని కీర్తింపబడినది.

నారాయణుని యొక్క అర్థశరీరము వంటిదియు తేజన్పులో అతనితో సమానురాలును ఎల్లప్పుడతని శరీరమందే నిలిచి ఉండునదియు ఐనందున “నారాయణి” అని చెప్పబడినది.

ననాతన శబ్దము నిత్యము నిర్గుణము అన్న అర్ధములను తెలుపును. ఏ దేవి ఎల్లప్పుడు నీత్యురాలు, నిర్గుణురాలో ఆమె సనాతనీ అని కీర్తింపబడినది.

'జయ' శబ్దము కల్యాణ (శుభ్ర) మను అర్థమును తెలుపును. యాకారము ఇచ్చుట అను అర్థమును తెలుపును. ఏ దేవి ఎల్లప్పుడు జయము (శుభము) నిచ్చునో ఆమె “జయా” అని కీర్తింపబడినది.

 “సర్వమంగళ” శబ్దము సంపూర్ణిశ్వర్యమును తెలుపును. ఆకారము “ఇచ్చుట” అను అర్థమును తెలుపును. అట్లు సంపూర్తైశ్వర్యము నిచ్చునది ఆ దేవియే కనుక “సర్వమంగళా" అని చెప్పబడినది.

తన నాభి కమలముందున్న బ్రహ్మకు దేనిని నారాయణుడుపదేశించినో సారభూతమైన ఆ నామాష్టక స్తోత్రము (దుర్గా, శివా, అభయా, మాయా, నారాయణీ, సనాతనీ, జయా, సర్వమంగళా అను ఎనిమిది నామములు కలది) నామముల అర్థముతో కూడినది. ఆ జగత్పతి బ్రహ్మకుపదేశించి నిద్రించిన కాలముననే మధుకైటభులు వచ్చి బ్రహ్మను సంహరింపబూనుకొనిరి. అప్పుడు బ్రహ్మ దుర్గాదేవి నీ స్తోత్రముతో స్తుతించి నమస్కరించెను. అప్పుడు మహామాయ అగు దుర్గాదేవి సాక్షాత్తుగా స్తుతించబడినందున బ్రహ్మకు సర్వరక్షణమను పేరుగల శ్రీకృష్ణకవచమును దివ్యకవచమును ఉపదేశించి అంతర్ధానమయ్యెను.

శ్రీకృష్ణ కవచముతో తమను రక్షించుకొని నిద్రాదేవిని (సముద్ర పై శయనించిన స్వామితో కూడి ఉన్న దేవిని) స్తోత్రమొనర్చినవారు నిద్రాదేవి అనుగ్రహము వలన ఈ స్తోత్రమహిమ వలన వెంటనే (శ్రేయమును పొందుదురు).

(ఈ శ్లోకములు క్రమము తప్పినట్లున్నవి. 40,41,38,39ల వరుసలో తాత్పర్యము వ్రాయబడుచున్నది.)

 ఈ స్తోత్రప్రభావము చేతనే బ్రహ్మ శ్రేష్ఠమైన కవచమును (శ్రీకృష్ణ కవచమును) పొంది భయరహితుడయ్యెను. ఇది నిశ్చయము. బ్రహ్మ ఈ స్తోత్ర కవచములను మహేశ్వరునికి ఉపదేశించెను. త్రిపురాసురులతో యుద్ధము సంభవించినప్పుడు రథముతో బాటు శంకరుడు పడిపోయెను. అప్పుడే ఈ ఉపదేశము ఘటించెను. అట్టి శంకరునికి జయము కళించుట కొరకు శక్తి రూపిణియైన దుర్గాదేవితో బాటు వృషభరూపము ధరించి విష్ణుభగవానుడు ఆ యుద్ధభూమికి వచ్చెను. రథముతో బాటు శంకరుని తల పైకెత్తుకొని మిక్కిలి ఉన్నతస్థానమునకు చేర్చెను. అప్పుడు జయాదేవి శంకరునికి జయము చేకూర్చెను.

ఆ శంకరుడు స్తోత్ర కవచములను పొంది నిద్రాదేవితో కూడియున్న శ్రీహరిని స్మరించి బ్రహ్మాస్త్రము స్వీకరించీ త్రిపురవాసులను సంహరించెను.

ఈ స్తోత్రముతో గోపికలు దుర్గాదేవిని స్తుతించి దీని మహిమ వలన శ్రీహరినీ (శ్రీకృష్ణుని) ప్రియ భర్తగా పొందిరి. గోపకన్యలోనర్చిన సర్వమంగళ మను పేరు గల ఈ స్తోత్రము వెంటనే కోరిన ఫలములనిచ్చునది. సర్వవిఘ్నములను నశింపజేయునది. శైవుడైనను వైష్ణవుడైనను శక్తిభకుడై నను భక్తియుకుడై ఎల్లప్పుడు మూడు సంధ్యాకాలములలో దీనిని పఠించునో వాడు దాటరానీ ఆపదల నుండి విముక్తుడగును. ఓక కార్యార్థమై రాజద్వారమున ప్రవేశించునపుడు - శ్మశానమునందును, కారుచిచ్చు చుట్టుకొని ప్రాణభయమేర్పడినపుడు క్రూరజంతువుల వలన భయపడునప్పుడు - మహాసముద్రములో ఓడ మునుగుచున్నప్పుడు, యుద్ధములో శత్రువు చేతికి చిక్కినప్పుడు - కారాగార బంధనము, ఆపద ఏర్పడినపుడు - గురు శాపము గాని బ్రాహ్మణ శాపము గానీ బంధువులతో భేదాభిప్రాయ మేర్పడినపుడు గాని, ఒక స్థానము నుండి (పదవి) భ్రష్టుడైనపుడు గానీ ధనము పోయినపుడు గాని - జాతీభ్రష్టుడైనప్పుడు గాని, దుఃఖము సంభవించినపుడు గాని - భర్తతో భేదాభిప్రాయము కలినప్పుడు గానీ - పుత్రులతో భేదాభిప్రాయము ఏర్పడినప్పుడు గాని - ఖల (క్రూర)మైన సర్చవిషము వ్యాపించినప్పుడు గానీ - ఈ స్తోత్రమును స్మరించినందువలననే వెంటనే భయము నుండి విడుదల పొంది నిర్భయుడగును. స్మరించిన వెంటనే కోరిన అత్యుత్తమమైన ఐశ్వర్యము లభించును. పార్వతీదేవి అనుగ్రహము వలన ఇహ లోకములో దృఢమైన హరిభక్తిని - ఎడతెగనీ దైవస్మృతిని - శరీరాంతములో శ్రీకృష్ణ దాస్యముక్తిని మానవుడు పొందును. ఇది బ్రహ్మవైవర్త పురాణములోని గోపకన్యలు స్తుతించిన సర్వమంగళా స్తోత్రము.

ఆ ప్రజమందలి స్త్రీలు (కన్యలైన గోపికలు) మొత్తము మాసము పరమ భక్తితో ప్రతిదినము ఈ స్తవరాజములో ఈశ్వరిని స్తుతించి నమస్కరించిరి. ఇట్లు ఆ మానము ముగియగా ప్రత సమాప్తి దినమునాడు గోపికలు స్నానము చేయుటకు గాను ఒడ్డున వస్త్రములుంచి నీటిలోనికి వెళ్లిరి. నానావిధ ద్రవ్యములు రత్నములతో వెలగట్టదగిన {కొనదగిన) పసుపుపచ్చని, ఎర్రని, తెల్లని, రంగుల సుందర వస్త్రములు ఒడ్డున అసంఖ్యాకముగా నుండి వాటితో ఆ తీరము మంగళకరముగా నుండెను. చందన ఖ్యాకముగా నుండి వాటితో ఆ శ్రీరము మంగళకరముగా నుండెను. చందనము అగురు కస్తూరి వాసనలు గల గాలితో పరిమళవంతమయ్యెను. వివిధములైన నైవేద్య పదార్థములతో, ఆ కాలమున ఆ దేశమున ఫలించిన ఫలములతో, ధూపదీపములతో సిందూరము కుంకుమ పూవు పొడితో ఆ తీరము ప్రకాశించెను.

శ్రీకృష్ణునికి మనస్సునర్పించిన గోపికలు కోరికతో జలక్రీడకు సిద్ధమై నీటిలో నగ్నముగా క్రీడించుచుండిరి.

శ్రీకృష్ణుడు తీరమందలి వివిధ ద్రవ్యములను వస్త్రములను చూచీ గోపాలకులతో కలిసి ఆ పదార్థములన్నీ భుజించీ వస్త్రములను తీసుకొనెను. వస్త్రములను మొదలు మూటలు గట్టి ఉల్లాసముగా దూర ప్రదేశమునకు పోయి ఆ కొంటె గోపాలురు చెట్టు కొమ్మల మీద ఉంచి ఒకచోట చేరిరి. శ్రీదాముడు సుదాముడు వసుదాముడు సుబలుడు సుపార్శ్వుడు శుభాంగుడు సుందరుడు చంద్రభానుడు వీరభానుడు సూర్యభానుడు వసుభానుడు రత్నభానుడు అని పన్నెండుగురు గోపకులు. శ్రీకృష్ణుడు బలదేవుడు పై వారితో కలిసి ముఖ్యులు పదునాల్గురు. గోపాలకులందరు శ్రీకృష్ణుని వయస్సువారే గుంపులు గుంపులుగా అసంఖ్యాకులుండిరి. వారందరు వస్త్రముల మూటలు ఒకచోట చేర్చి ఆ తీరమునకెదురుగా నిలిచియుండిరి.

శ్రీకృష్ణుడు కొన్ని వస్త్రములను తీసుకొని మూటగట్టి సంతోషముతో కడిమి చెట్టు మీదికెక్కి గోపికలతో ఇట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :

ఓ గోపికలారా నే మాట విని ఆ తరువాత మీ కోరిక ప్రకారము క్రీడించండి. ప్రతకర్మను శాస్త్రానుసారము చేసి చివరికి మీరందరు నష్టపోతిరి. ప్రతమునకు యోగ్యమైన ఈ మాసమందు ఒక మంగళకర్మ సంకల్పించి (ఆచరించి) వ్రతము యొక్క అంగమైన స్నానఫలమునకు హాని కల్గించుకొనుచు జలములో నగ్నముగా మీరిట్లు ప్రవేశించితిరి. మీరు ధరించు వస్త్రములను పూలమాలలను ప్రతయోగ్యమైన పదార్థములను ఇప్పుడెవడు తీసుకొని పోయెను ? ప్రతకాలములో ఏ స్త్రీ నగ్నముగా స్నానమాడునో ఆమెపై వరుణుడు అతని సేవకులు కోపించి వస్త్రములను అపహరించిరి. ఇక మీరు నగ్నముగా గృహములకెట్లు పోదురు? వ్రతము యొక్క వ్యవహారమే మగును? వ్రతము చేత పూజింపబడిన ఆ దేవి మీ వస్తువులను ఎట్లు రక్షింపదు ? విచారించండి. ఆ పూజ్యురాలిని ఈశ్వరిని ఒక బలవంతుడు స్తుతించి (వస్తువులను గ్రహించెనేమో!) ఇటువంటి మీ దేవి వస్తువులను రక్షించుటలో శక్తురాలు కానప్పుడు - ఆ సురేశ్వరి ప్రతఫలమును ఇచ్చుటకు ఎట్లు సమర్ధురాలగును? ఫలమిచ్చు శక్తి గలదైనచో అన్ని కర్మలయందు శక్తురాలే అగును.

శ్రీకృష్ణుని మాటలను విని రేపల్లె స్త్రీలు (గోపికలు) యమునాతీరము వైపు చూడగా అక్కడ వస్త్రములు లేకుండెను. నీటిలో నగ్నముగానున్న వారప్పుడు దుఃఖము పొంగివచ్చి భోరుమని ఏడ్చిరి. “మా వస్త్రములు ద్రవ్యములు ఈ ఒడ్డున పెట్టినవెక్కడపోయెను?” ఇట్లు సంతాపపడి ఆ గోపకన్యలందరు భక్తి వినయములతో చేతులు జోడించి ఆ జలమునుండి ఇట్లు పలికిరి.

గోపాలికా ఊచుః - గోపాకన్యలిట్లనిరి;

ఓ మహాప్రభూ! మీ దాసీజనమైన మేము ధరించు వస్త్రములను నీవు తాకుట యోగ్యమేనా? ఆలోచించుకొనుము. ఓ వేదవేతా! వ్రతములో ఉపయోగింపదగిన దేవద్రవ్యమును దైవమున కర్పింపక ముందు నీవు గ్రహించుట తగునా ? మా వస్త్రములను మాకిమ్ము. వాటిని ధరించి మేము ప్రతము చేతుము. పూజకొరకని కూర్చుకొన్న పదార్థములను కాకుండ ఓ గోవింద ఇతర పదార్థమును గ్రహించి భుజింపుము.

ఇంతలో శ్రీదాముడు ఆ గోపికలకు వస్త్రముల మూటలను చూపించి వాటిని పట్టుకొని వారి ముందునుండి దూరముగా పరుగెత్తాను, వస్త్రముల మూటలతో అట్లు పోవుచున్న గోపాలుని చూచి ఆ గోపికలందరికి పరమేశ్వరి ఐన రాధాదేవి కోపము పొంది నదీజలములో సుండియే తన చెలులతో నిట్లు పలికెను.

శ్రీరాధికోవాచ - శ్రీరాధాదేవి పలికెను :

ఓ సుశీలా! శశీకలా! చంద్రముఖీ మాధవీ! కదంబమాలా! కుంతీ! యమునా! సర్వమంగళా! పద్మముఖీ! సావిత్రీ! పారిజాతా! జాహ్నవీ! సుధాముఖీ! శుభా! పద్మా/ గౌరీ! స్వయంప్రభా! కాళికా! కమలా! దుర్గా! సరస్వతీ! భారతీ! అపర్ణా! రతీ! గంగా! అంబికా! సతీ! కృష్ణప్రియా! మధుమతీ! చంపొ! చందస నందినీ! మీరందరు నీటిలో నుండి బయటకు పోయి ఆ గోపాలుని పట్టుకరుడు.

రాధాదేవి ఆజ్ఞతో వారందరు వెంటనే నీటినుండి లేచి ఒక చేతిలో మర్మస్తాసమును దాచుకొని కోపముతో నగ్నముగనే పరిగెత్తిరి. వాళ్ల చెలికత్తెలైన గోపికలు కూడ వేనవేలమంది కోపముతో కన్నులెర్రబడగా ఆదే రూపములలో పరుగెత్తిరి.

వస్త్రముల మూట పట్టుకొని వేగముగా పరిగెత్తుచున్న శ్రీదాముని వెంటబడి ఆ గోపబాలికలందరు వేగముగా పరుగెత్తిరి. మూటలు పట్టుకొని ఉన్న ఇతర గోపాలురున్న చోటికీ శ్రీదాముడు పోగా బలవేగములతో గోపికలందరు వాని వెంట పరుగెత్తి తన వస్త్రములను దొంగిలించిన గోపాలురను చుట్టు ముట్టిరి. వీరికీ భయపడి గోపాలురు వస్త్రములతో శ్రీకృష్ణుడున్న చోటికి పోయిరి. గోపికలక్కడికీ చేరవచ్చీ శ్రీకృష్ణునితో బాటు అందరినీ చుట్టుముట్టిరి. గోపికలకు భయపడి గోపాలురు తాము తెచ్చిన వస్త్రములను మాధవుని కిచ్చిరి. వాటన్నిటిని స్వీకరించి మాధవుడు (శ్రీకృష్ణుడు వాటిని కదంబ వృక్షము యొక్క కొమ్మ కొమ్మకు తగిలించెను. నానా వర్ణములు గల వస్త్రములతో ఆ కడిమి చెట్టు అందముగా ప్రకాశించెను. వస్త్ర పుంజికలను (మూటలను) అన్నింటినీ అట్లు కొమ్మల మీద పెట్టి శ్రీకృష్ణుడు గోపికలతోనిట్లు పరిహాస వాక్యములు పల్కెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :

ఓ గోపికలారా! నగ్నముగా నున్న మీరిప్పుడేమి చేయుదురు. వస్త్రము లిమ్మనీ యాచించుటకుగాను చేతులు జోడించి నమస్కరింపుడు. మీ ఈశ్వరియైన రాధాదేవి వద్దకు పోయి “నా వద్దకు శీఘ్రముగా వచ్చి చేతులు జోడించి వస్త్రములను యాచించు"మన్నానని చెప్పుడు. “అట్లు చేయనిచో మీకు వస్త్రములనీయను. మీ నాయకురాలు నన్నిప్పుడేమి చేయగలదు? ప్రతముతో పూజింపబడు ఆ దేవీ మాత్రము నన్నేమీ చేయగలదు. ఈ మాటలన్నీంటినీ మీ రాధకు చెప్పుడు”. శ్రీకృష్ణుని వాక్యములను విని ఆ గోప కన్యలందరు ఓరచూపులతో చూచీ రాధ వద్దకు వెళ్లిరి. శ్రీహరి స్వయముగా నేమి పలికెన్ ఆ మాటలనట్లే రాధకు నివేదించిరి. రాధాదేవి శ్రీకృష్ణ వచనములను విని బాగా నవ్వెను. వెంటనే మన్మధ పీడితురాలయ్యెను.

వారి మాటలు విని శరీరము పులకరించగా సిగ్గుతో చిరునవ్వుతో ఆ రాధాసతి శ్రీకృష్ణుడున్న స్థానమునకు పోలేదు. ఆ జలమందే యోగాసనము వేసికొని బ్రహ్మ శివ అనంత ధర్మదేవతల చేత నమస్కరింపబడువాడు - వాంఛిత ఫలమిచ్చువాడగు - శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములను మనస్సులో ధ్యానించెను. స్వామి పాదారవిందములను స్మరించి స్మరించి ప్రేమాతిశయము వలన కన్నుల సిండ నీరు నిండుగా వైషమ్యాది గుణరహితుడును నీఖీల కల్యాణ గుణ పూర్ణుడును అగు తన ప్రాణసోధునిట్లు సుశీంచెను.

రాధికోవాచ - రాధాదేవి ఇట్లు పలికెను :

ఓ గోలోకనాథుడా! గోపినాథా! మన్నాథా! ప్రాణప్రియా! దీనబంధూ! దీననాథా! సర్వేశ్వరా! నీకు నమస్కారము. గోపాలసాయకా! గోబృందనాథా! యశోదానందమును వృద్ధిచేయువాడా! నందకుమారా! సదానందా! నిత్యానందా! నీకు నమస్కారము, ఇంద్రుని గర్వక్రోధములను భగ్నము చేసినవాడా! బ్రహ్మగర్వమును సొశము చేసినవాడా! కాళీయుని అణచినవాడా! ప్రాణశోథా! నీకు నమస్కారము. శివునకు, అనంతునకు (నాగరాజు) బ్రహ్మకు ప్రభువా! బ్రాహ్మణసాథా! పరాత్పరా! జ్ఞానస్వరూపా! బ్రహ్మజుడా! సృష్టికి బీజకల్యాణ గుణస్వరూపా! త్రిగుణములకు బీజము (విత్తనము) ఐనవాడా! సద్గుణముల కాధారమైనవాడా! గుణేశ్వరా! నీకు నమస్కారము. అణిమాద్యష్ట సీదులకు ప్రభువా! సీదులకు ఫలస్వరూపుడా! జ్ఞానరూపుడా! పరమాత్మా! తపస్సులకు (వేదములకు శాస్త్ర జ్ఞానమునకు బీజభూతుడా! నీకు నమస్కారము. ఇట్లని నిర్వచింపరాని వస్తువేదో - అందువలననే నిర్వచనీయకమునుబడు వస్తువే స్వరూపముగా గలవాడా! నిర్వచనీయ అనిర్వచనీయములకు రెంటికీ బీజభూతుడా! నర్వమునకు బీజమైనవాడా! నీకు నమస్కారము. నేను సరస్వతి లక్ష్మి దుర్గాదేవి గంగాదేవి వేదమాతయగు గాయత్రి ఏ ప్రభువు పాదముల నర్చించుట వలన పూజ్యురాండ్రమైతిమో అట్టి నీకు నమస్కారము. ఏ భగవంతుని భృత్యులను స్పృశించుట వలన రేబవళ్లు ధ్యానించుట వలన పుణ్య తీర్ధములు (పుణ్యక్షేత్రములు) పవిత్రములగుచున్నవో అట్టి దేవునకు నమస్కారము.

ఇటు స్తుతించి రాధాదేవి తన శరీరమును జలముందే ఉంచి మనః ప్రాణములను శ్రీకృష్ణుని యందే ఉంచి ఒక స్తంభము వలె (చలనము లేక) నీలిచెను (ఉండెను). రాధ పఠించిన ఈ స్తోత్రములు మూడు సంధ్యలలో పఠించు నరుడు హరిభక్తి హరిదాస్యముక్తిని రాధాగతిని పొందగలడు.

ఆపత్కాలములో భక్తితో పఠించిన వ్యక్తి వెంటనే సంపత్తిని పొందును. చాలకాలము క్రింద అపహరింపబడిన నష్టపోయిన ద్రవ్యమును వాడు పొందును. వానీకి బంధువృద్ధి అగును. మనస్సు ప్రసన్నమగును. విచారగ్రస్తుడు భక్తితో పఠించినచో గొప్ప ఆనందమును పొందును. పతి, పుత్రులు విభేదము, మిత్రులు కనిపించని సంకట దశలో ఒక మాసము భక్తితో పఠించిన యెడల వెంటనే వారి దర్శనము లభించును. కన్య ఒక సంవత్సరకాలము భక్తితో ఈ స్తోత్రమును వినినయెడల నీశ్చయముగా శ్రీకృష్ణుని వంటి గుణవంతుడైన భర్తను పొందును.

ఇది బ్రహ్మవైవర్తములో శ్రీకృష్ణ జన్మఖండములో రాధాదేవీ చేసిన శ్రీకృష్ణ స్తోత్రము సమాప్తము.

జలములో నున్న రాధాదేవి శ్రీకృష్ణుని పాదపద్మములను స్తుతించి కన్నులు తెరచి ప్రపంచమంతటిని కృష్ణమయముగా జూచెను. ఓ నారదా! యమునా తీరమును వస్త్రములతో పూజాద్రవ్యములతో నిండిన దానినీగా చూచెను. అట్లు చూచి నిశ్చేష్టురాలై అది కల అనుకొనెను. ఏ స్థానములో దేని మీద ఏ ద్రవ్యము ముందుంచబడెనో వస్త్రములతో బాటు ఆ మొత్తమును గోపకన్యలు పొందిరి. గోపిక లందరు నీళ్లలో నుండి లేచి వచ్చి తల పెట్టిన వ్రతమును చేసి గౌరీదేవి వలన వరమును పొంది తమతమ గృహములకేగిరి.

నారద ఉవాచ - నారదుడిట్లనెను :

ఆ వ్రతము పేరేమి? అది చేయవలసిన విధానమేమి? ప్రభూ! అది ఏమి ఫలమిచ్చును. ఆ వ్రతములో దానమొనర్పవలసిన ద్రవ్యము లేమి? ఏమి దక్షిణ (పూజచేయించిన వానికి) ఈయవలెను. గోపికలోనర్చిన ప్రతము తరువాత మనోహరమైన ఏ రహస్య సంఘటన జరిగెను? ఓ మహానుభావా! నారాయణునకు శ్రీకృష్ణునకు సంబంధించిన ఆ కథను విస్తారముగా వివరించి చెప్పుము.  (ఈ ప్రశ్నను నారదుడు నారాయణ మహర్షి నడిగెను).

సూత ఉవాచ - సూతుడు (మహర్షులతో) పలికెను :

నారదుని వాక్కు విని నారాయణ మహర్షి నవ్వీ కవులకు గురువులకును గురువైన ఆ మునిరాజు కథను చెప్పుటకారంభించెను.

నారాయణ ఉవాచ - నారాయణ ఋషి పల్కెను :

నాయనా! గౌరీవ్రతమన్నది స్త్రీలచేత మార్గశిరమాసమున ఆచరింపబడు ప్రసిద్ధమైన వ్రతము. ఆ వ్రతమును చేయు విధానమంతటిని నావలన వినుము. ఇది పురుషులకు చతుర్విధ పురుషార్ధములనిచ్చు కృష్ణ భక్తి ప్రధానమైన వ్రతము. ఇది వేరు వేరు ప్రాంతములందును వెనుక ముందు ఆచరించబడు ప్రసిద్ధవ్రతముగా చెప్పబడినది. కోరికలు గలవారికి కోరికలను తీర్చునది. ప్రధానముగా (కన్యలకు! భర్త సంబంధమైన ఫలమునిచ్చును. (చక్కని యోగ్యుడైన వరునీ సమకూర్చును). ముందురోజు నియమముగా (కార్తీక అమావాస్య లేదా సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించుటకు ముందురోజు) శుచియై వస్త్రములను నీళ్లలో పిండి ఆరవేసుకొని ఆ రాత్రి ఉపవాసము చేయవలెను. మార్గశీరము (ధనుస్సు) ప్రవేశించిన నాటి ప్రాతఃకాలమున భక్తితో నదీ తీరమునకేగి (నానా ద్రవ్యములు సంపాదించుకొని) కన్య స్నానము చేసి పిండి ఆరవేసిన వస్త్రములను ధరించవలెను. ఒక కలశమును వేదిక మీద స్థాపించి దానిమీద గణేశుని సూర్యుని అగ్నిని నారాయణుని శివుని దుర్గను ఆవాహసము చేసి ఇట్లు ఆ ఆరురు దేవతలను పంచోపచారములతో (ఆవాహన చేసి గంధము, పుష్పము, ధూపము, దీపము నైవేద్యము అను ఐదు ద్రవ్యములర్పించుట) పూజించి ఇక వ్రతమాచరించవలెను. కలశము దిగువభాగమున చతురస్రాకారముగా వెడల్పుగా ఇసుక తిన్నె చేసి దాని పై పది భుజములతో దుర్గాదేవి బొమ్మను నిర్మించీ చందనము అగురు కస్తూరి కుంకుమపువ్వుపొడితో చక్కగా అలంకరించి స్థాపించవలెను. ఆ దేవి నుదుట సిందూరముతో తిలకము సలంకరించి ఆ దిగువన చందనముతో చంద్రరేఖ వ్రాయవలెను. అప్పుడు చేతులు మోడ్చి దేని ఈ క్రిందిమంత్రమును పఠించుచు ధ్యానించీ ఆవాహన చేసి పూజనారంభించవలెను.

ఓ గౌరీదేవి! శంకరుని ప్రియురాలా! శంకరుని అర్ధాంగమైన తల్లీ! నీవు భర్తకు ప్రియురాలవైనట్లు ఓ కల్యాణీ! నన్ను కూడ నీవలెనే మిక్కిలి దుర్లభమైన భర్తకు ప్రియురాలుగా చేయుము అని ఈ మంత్రము పఠించి జగన్మాతను ధ్యానించవలెను. ఓ నారదా! సామవేదోక్తమైన సర్వవాంఛలను తీర్చునట్టి రహస్యమైన ధ్యాన మంత్రమును చెప్పెదను వినుము. ఇది మునీంద్రులకు దుర్లభమైనది. సిద్ధులందరును ఈ మంత్రముతోనే మహాదుర్గములను (గొప్ప ఆపదలను) నశింపజేయు దుర్గాదేవిని ధ్యానింతురు.

‘శివా’ నామము గల శివప్రియ శివ భక్తురాలు శివుని వక్ష స్థలమందున్నదియు, చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖము గలదియు మంచి కీర్తి గలదియు మంచి నేత్రములు గలదియు నవయౌవనమను సంపద కలదియు రత్నాలకంకణములు దండకడియములు రత్నసూపురముల (పాదముల అందెలు) వంటి రత్నాభరణములతో అలంకరింపబడినదియు, చెక్కిళ్లపై ప్రకాశించు రత్నాలకుండలములు గలదియు, మాలతీ పుష్పమాలల యందు చిక్కుకొన్న తుమ్మెదల వంటి తలవెండ్రుకల కొప్పు గలదియు, సుందరమైన కస్తూరి చుక్కబొట్టుతో బాటు ఆ పైన ఎట్టిని సిందూర తిలకము ధరించినదియు, అగ్నివలె ప్రకాశించు పట్టు వస్త్రములు రత్నకిరీటముతో మిక్కిలి మనోహరముగానున్నదియు, శ్రేష్ఠమైన మణులతో కూర్చిన రత్నహారముతో వెలిగిపోవుచున్నదియు, శరీరమున వ్రేలాడుచున్న పారిజాత పుష్పమాలలు గలదియు, పుష్టిగా కఠినముగా నున్న నితంబములు గలదియు స్తనభారముచే కొద్దిగా వంగినట్లున్నదియు, నవయావన భారము చేత ఇంపుగా కొంచెము వంగినట్లున్నదియు, బ్రహ్మాదులచేత స్తుతింపబడునదియు కోటీసూర్యుల తేజస్సుగలదీయు, పండిన దొండపండు వంటి క్రింది పెదవి గలదియు, సుందరమైన సంపంగి పూలవంటి శరీరకాంతి గలదియు, ముత్యాల వరుసను క్రిందుపరచు సుందరమైన పలువరుసతో విరాజిల్లునదియు శరత్కాలచంద్రునివంటి ముఖమండలము గలదియు, కోరిన కోర్కెలను ముక్తిని ఇచ్చునదియునగు దేవినీ భజించుచున్నాను.

వ్రతము చేయు వ్యక్తి ఇట్లు ధ్యానించి దేవి శిరస్సు మీద పుష్పముంచి మరల నొక పుష్పము తీసుకొని భక్తితో మరల ధ్యానించి పూజించవలెను. ప్రతిదినమాప్రదేశమందే నిండు హర్షముతో షోడశోపచారములు సమర్పించి భక్తి సంతోషములతో ఈ వ్రతమందు ముందు చెప్పిన మంత్రముతో పూజ చేయవలెను. ముందు చెప్పిన స్తోత్రముతో (133 నుండి 140 వరకు గల శ్లోకములు) స్తుతించి భక్తితో నమస్కరించి శ్రద్ధగా వ్రతకథను వినవలెను.

నారద ఉవాచ - నారదుడు పలికెను :

“ఓ సందేహములను నశింప్లజేయు స్వామీ! వ్రతమును దాని నాచరించు విధానమును దాని వలన లభించు ఫలమును అద్భుతమైన స్తోత్రమును వింటిని. అన్నియు అద్భుతములు. ప్రస్తుతము శభమైన గౌరీవ్రతకథను వినగోరుచున్నాను. పూర్వము దీనినెవడాచరించెను? భూలోకముననెవడు దీనిని పరిచయము చేసెను? దీనినంతయు విస్తరించి చెప్పుము”.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

కుశధ్వజుని యొక్క కూతురు వేదవతి యన్న పేరు గల సాధ్వీ పుష్కర క్షేత్రములో ఈ వ్రతమునాచరించెను. ప్రతసమాప్తినాడు పరమేశ్వరియైన జగదంబిక కోటి సూర్యులకాంతితో - కనకరథము పై లక్షసంఖ్యగల యోగినులతో కొలువుదీరి వేదవతికి సాక్షాత్కరించి చిరునవ్వుతో ప్రసన్నముగా ముఖముతో ప్రతనిష్ఠలో సున్న వేదవతితో ఇట్లనెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి పలికెను :

ఓ నారదా! ప్రత్యక్షమైన పార్వతీదేవి “ఓ వేదవతీ! నీకు మంగళమగు గాక. నీకిష్టమైన వరము కోరుకొనుము. నీ వ్రతము చేత నేను సంతుష్టురాలనైతిని. నీవు కోరుకున్నదీ (నీకు లభించునట్లు వరము) ఇత్తును”. హర్షించిన మనస్సుతో ఇట్లు పల్కిన పార్వతి వాక్కు విని ఆ సాధ్వి (వేదవతి) దోసిలీ జోడించి నమస్కరించి ఇట్లనెను.

వేదవత్యువాచ - వేదవతి పలికెను :

“దేవీ నేను మనస్సులో సంకల్పించుకొన్నట్లు శ్రీమన్నారాయణుడే నాకు కాంతుడ (ప్రియభర్త) గునట్లు వరమిమ్ము. ఆతని పాదములందు దృఢభక్తిని కూడ వరమిమ్ము. నాకు వేరొక వరుని యందు {వివాహమాడు పురుషుడు) కోరిక లేదు”. వేదవతి వాక్కును జగదంబిక మినీ నవ్వి వెంటనే రథమునుండి దిగి ఆ హరిప్రియతో (హరినే ప్రియునిగా దలచునది) నిట్లు పలికెను

పార్వత్యువాచ - పార్వతి ఇట్లనెను :

ఓ జగన్మాతా! నీవు స్వయముగా లక్ష్మీసాధ్వివీ అని తెలిసికొంటిని, భారతవర్షమును నీ పాదధూళీతో పవిత్రము చేయుటకు నీవు వచ్చితివి. నీ పాదధూళిచేత వసుంధర (భూమి) వెంటనే పవిత్రమైనది. ఓ పరమేశ్వరీ! నీఖిల తీర్థములు పూతమైనవి. ఈ నీ వ్రతము లోకుల కిట్లు చేయవలెనని తెలియజెప్పుటకే తపమాచరించితివి. నీవు నారాయణుని ప్రియపత్నిగా జన్మజన్మకు అవతరించుచుంటివి. విష్ణువు భూభారమును తొలగించుటకు వసుధ మీదికి వచ్చును. నారాయణుడు పూర్ణరూపుడైన దశరథ రాముడై దుష్టులను అణచివేయుటకు - బ్రాహ్మణుల శాపము వలన భూమి మీద బడిన తన భక్తుల (జయవిజయులను ద్వారపాలకులను) ను శాపవిముక్తులను చేయుటకు త్రేతాయుగములో అయోధ్యలో అవతరించును. నీవును శిశురూపము ధరించీ మిథిలకు పొమ్ము. అయోని సంభవయేన (మనుష్య గర్భ సంబంధము లేకుండ జన్మించిన) నిన్ను జనకుడు బిడ్డగా పొంది శ్రద్ధతో పాలించును. నీవు సీతానామము ధరింతువు. రాముడు మిధిలను చేరి నిన్ను వివాహామాడును. ప్రతి కల్పములో నీవు నారాయణుని పత్నివగుదువు” ఇట్లు పలికి పార్వతి ఆమెను (వేదవతి)ని కౌగిలించుకొని తన స్థానమునకేగెను.

ఆ సాధ్వి (వేదవతి) శిశురూపము గ్రహించి మిథిలను చేరి తన మాయాశక్తితో నాగలి చాలులో (భూమిలో) నిలిచెను. జనకుడు కన్నులు మూసుకొని నగ్నరూపమున నుండి - కరిగిన బంగారు పన్నితో - గొప్ప తేజస్సుతో కూడి - ఏడ్చుచున్న ఆ శిశువును చూచి ఎత్తుకొనీ వక్షఃస్థలమున చేర్చుకొనసు, ఆ శిశువునేతుకొని ఫోవుచుండగా ఆకాశవాణి “ఓయీ! అయోనిసంభవమైన ఈ శిశువు లక్ష్మి, ఈమెను గ్రహించి పోషించుము. నారాయణుడే నీ అల్లుడగును” అని పలుకగా ఆ దేవవాణిని వినీ రాజర్షి ఆ కన్యను పాలించుట కోసము తన భార్యకొసగెను. ఆ కన్య యావనపతియై దశరథ పుత్రుడైన రాముని భర్తగా పొందెను. ఈ వ్రత ప్రభావము వలన ముల్లోకము లకు ప్రభువైన స్వామిని కాంతునిగా పొందెను. ఈ విషయమును వశిష్ఠ మహర్షి భక్తితో ఈ లోకమున ప్రకటీంచెను.

రాధాదేవి ఈ ప్రతము చేసి తన ప్రాణవల్లభుడైన శ్రీకృష్ణుని పొందినది. గోపాంగనలు కూడ ఈ ప్రతప్రభావము వలననే శ్రీకృష్ణుని పొందగల్గిరి. నారదా! ఇట్లు గౌరీవ్రత కథ చెప్పబడినది. భారతవర్షములో ఏ కన్య ఈ వ్రతమొనర్చునో ఆమె కృష్ణునితో సమానుడైన భర్తను పొందునన్నది నిస్సంశయమైన మాట.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి పలికెను :

మాసము దినములు గోపికలు ఈ విధముగా (పైన చెప్పిన నియమము ప్రకారము) గౌరీవ్రతమాచరించి ముందు చెప్పిన స్తోత్రముతో ప్రతిదినము స్తుతించిరి. ఇట్లు సంతోషముతో గోపికలు వ్రతమొనర్చి సమాప్తి దినమునాడు కణ్వశాఖలో చెప్పబడిన ప్రకారముగా - సత్యపరాయణ యైన సీతాదేవి ఏ స్తోత్రమును స్తుతించి పద్మముల వంటిలోచనములు (కన్నులు) గల రామచంద్రుని నాధునీగా పొందినదో - అదే స్తోత్రముతో పరమేశ్వరిని స్తుతించిరి.

జానక్యువాచ - జానకి దేవి పలికెను :

అందరు జీవులకు శక్తి స్వరూపములో నుండి అందరీకాధారమైనదానా! శుభగుణములకు ఆశ్రయమైనదానా! ఎల్లప్పుడు శంకరుని కూడియుండు దానా! నాకు పతినిమ్ము, నీకు నమస్కారము. సృష్టి స్థితిలయములొనర్చునట్టి బ్రహ్మవిష్ణు రుద్ర రూపములు ధరించుదానా! సృష్టి స్థితిలయములకు మూలకారణమైన వాటికి బీజము వంటిదానా! నీకు నమస్కారము. ఓ గౌరీదేవీ! పతిరహస్యమెరిగిన దానా! పతిని ప్రతనిష్ఠతో భజించుటయందాసక్తి గలదానా! ఓ పతివ్రత! పతీయందు దృఢసక్తి గలదానా! నీకు నమస్సులు. నాకు పతినిమ్ము, జీవుల సర్వమంగళములకు బీజభూతురాలా! ఓ సర్వమంగళా! నీకు నమస్కారము, సర్వప్రాణులకు ప్రియమైనదానా! సర్వమంగళ గుణములు. గలదానా! లోకమున సర్వమంగళముల చేత మంగళ భూతురాలా! ఓ సర్వమంగళా! నీకు నమస్కారము. సర్వప్రాణులకు ప్రియమైనదానా! సర్వ శక్తులకు బీజమైనదానా! సర్వవిధములైన అశుభములను నశింపజేయుదానా! సర్వమునకు ఈశ్వరీ! సర్వమును సృష్టించుదానా! ఓ సనాతనీ! నిత్యరూపిణీ! సాకార నీరాకార రూపములన్నియు నీవే ఐనదానా! నీకు నమస్కారము. ఓ నారాయణీ! ఆకలి దప్పి కోరిక దయ శ్రద్ధ నిద్ర సోమరితనము స్మృతి (జ్ఞాపకశక్తి) క్షమ ఇవి యన్నియు నీ ఆంశలే. నీకు నమస్కారము. లజ్ఞ మేధ తుష్టి పుష్టులు (మనస్తృప్తి శరీరపుష్టి) శాంతి సంపద అభివృద్ధి ఇవి యన్నియు నీ కళలే. సర్వరూపిణీ! నీకు నమస్కారము. కన్నులకు కన్పించునట్టి మరియు కన్పించనట్టి స్వరూపములు గలదానా! ఆ రెండు రకముల స్వరూపములకు బీజమును ఫలమును ఇచ్చుదానా! సర్వవిధముల నిర్వచింపరానీ మహామాయా! నీకు నమసామ్రు. ఓ శీవా! శంకరుడన్న సౌభాగ్యము గలదానా! సౌభాగ్యము (ముత్తైదువు తనము) నీచ్చుదానా! నాకు సౌభాగ్యమును మరియు శ్రీహరిని భర్తగాను ప్రసాదించుము. నీకు నమస్కారము.

ఈ స్తోత్రముతో పార్వతీదేవిని ప్రత సమాప్తి దినమునందు ఏ స్త్రీలు (కన్యలు) స్తుతించి గొప్ప భక్తితో నమస్కరింతురో వారు శ్రీహరినే భర్తగా పొంది ఇహలోకమున ప్రియమైన పతిసుఖముననుభవించి పరములో దివ్యరథమునెక్కి శ్రీకృష్ణ సన్నిధికి ఏగుదురు. ఇది సీతాదేవి స్తుతించిన పార్వతీదేవి స్తోత్రము.

ప్రతసమాప్తి దినమునాడు గోపికలతో కలిసి రాధాదేవి గౌరీదేవిని స్తుతించి నమస్కరించి ప్రతము సంపూర్ణమొనర్చెను. బ్రాహ్మణులకు వేయి గోదానములు చేసి ప్రతము చేయించిన పురోహిత బ్రాహ్మణునకు నూరు బంగారు నాణెములను దక్షిణగా ఇచ్చెను. ఆదరముతో వేయి మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి భిక్షుకులకు ధనము దానమొనర్చి మంగళకరముగా అనేక వాద్యములను మ్రోగింపజేసెను. తరువాత స్వగృహమునకు ప్రయాణమయ్యెను.

ఇంతలోనే ఆపదలను నశింపజేయు దుర్గాదేవి బ్రహ్మతేజస్సుతో వెలుగుచు ఆకాశము నుండి ఆ ప్రదేశమునకు దిగివచ్చెను. ఆమె వంద యోగినులతో గూడి రథము పై సింహమునందు గూర్చుండి యుండెను. చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము పదిహస్తములు గల ఆ దేవీ రత్నాలంకార భూషితురాలై యుండెను. శ్రేష్ఠమైన రత్నముల చేత అలంకరింపబడిన బంగారు రధము నుండి ఆమె దిగి వచ్చి రాధికాదేవిని వక్షస్థలమునకాలింగనము చేసికొనెను. ఆ దేవిని దర్శించి ముదముతో గోపికా కన్యలందరు నమస్కరింపగా “మీ వాంఛలు సిద్ధించును” అని దుర్గాదేవి వారినాశీర్వదించెను. ఇట్లు వారికి వరము లిచ్చి ఆదరముగా పల్కరించి ముఖపద్మమున చిరునవ్వు వెలుగుచుండగా రాధాదేవితో ఇట్లు పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను :

రాధా! సర్వేశ్వరునికి ప్రాణముల కంటే అధికముగా ప్రియమైన జగదంబా! కపటముగా మనుష్యరూపము ధరించిన దానా! నీ ప్రతము. ఇట్లు చేయవలెనని లోకులకు నేర్పుటకే (వీవీ వ్రతమాచరించితివి.) గోలోకమును, ఆ గోలోకనాథుని, మీరుభయులు విహరించు శ్రీశైలమును, గిరిజా (నది) తటమును, మనోహరమైన బృందావనములోని దివ్యరాసముండలమును, కామ శాస్త్రపండితును స్త్రీల మానసము హరించువాడును ఐన ఆ రతీచోరుని {కృష్ణుని) చరిత్రను, స్మరించుచున్నావా (జ్ఞాపకము చేసికొనుచున్నావా!) సుందరీ! నీవు శ్రీకృష్ణుని అర్ధాంగము నుండి సంభవించినదానవు. తేజస్సులో కృష్ణునితో సమానురాలవు. దేవ స్త్రీలందరు నీ అంశలో కళామాత్రలు (16వ భాగము) ఇక నీవెట్లు మనుష్య స్త్రీవైతివి? నీవా హరికి ప్రాణము. నీకు హరి ప్రాణము. వేదమందు మీ ఉభయులకు భేదములేదని చెప్పబడినది. ఇక నీవెట్లు మనుష్య స్త్రీవి? బ్రహ్మపూర్వమరువది వేలేండ్లు తపస్సు చేసి కూడ నీ పాదపద్మమును దర్శింపలేకపోయెను నీవెట్లు మనుష్య స్త్రీవి? ఓ దేవీ! నీవు కృష్ణుని {గోలోకనాథుడు) ఆజ్ఞవలన గోపీరూపము కూర్చుకొని భూమి మీదికి వచ్చిన శాంతమూర్తివి నీవెట్లు మనుష్య స్త్రీవి? నీ మనువంశమున బుట్టిన సుయజ్ఞుడన్నరాజు నీ కృప వలన గోలోకమును పొందెను. నీవెట్లు మనుష్య స్త్రీవి? భృగురాముడు ఇరువది యొక్క మార్లు భూమిని రాజులు లేనిదానిగా రాజులను సంహరించి) నీమంత్ర, కవచ ప్రభావము చేతనే చేయగలెను. ఇక నీవెట్లు మనుష్య స్త్రీవి? నీ మంత్రమునతడు శంకరునీ ఉపదేశము వలన పుష్కర క్షేత్రములో జపించి సిద్ధిపొంది కార్తవీర్యార్జునుని సంహరించెను. అట్టి మహిమ గల నీవెట్లు మనుష్య స్త్రీవి? అతడే గర్వముతో మహానుభావుడైన గణేశుని దంతమును విరిచి నీకు భయపడెను. నీవెట్లు మనుష్య స్త్రీవి? నేను తీవ్రకోపముతో అతనిని భస్మము జేయబూనగా ఈశ్వరుడు వెంటనే వచ్చి రక్షించెను. అట్లు రక్షించుటకును నేనంగీకరించితని (నీమీది గౌరవముతో) అట్టి మహిమలు గల నీవెట్లు మనుష్య స్త్రీవగుదువు ?

ఓ జగన్మాతా! ప్రతికల్పములోను నీ జన్మజన్మకు కృష్ణుడే నీ పతి. కేవలము లోకహితము కొరకే ఈ వ్రతము చేసితివి. గోలోకములో శ్రీరాముని శాపకారణముగా భూభారము తోలగించుట కొరకు భూమి పై నీకు ఉనికి ఏర్పడినది. ఇక నీవు మనుష్య స్త్రీవెట్లు ? నీవు ఇతరుల జన్మమృత్యువులను ముసలితనమును తొలగించి ముక్తినిచ్చుదానవు. కళావతి సుతవైనను పుణ్యమూర్తివి, అయోనిసంభవవు. ఇక ఎట్లు మనుష్య స్త్రీవి? ఇప్పటి నుండి మూడు మాసములు గడచిన తరువాత మనోహరమైన వసంత చైత్రమాసములో నిర్జన ప్రదేశములో నిర్మలమైన (వెన్నెల కాంతిగల} రాత్రియందు యోగ్యమైన రాసముండలములో బృందావనములో మొత్తము గోపికలతో బాటు హరముగా నీకు శ్రీహరితో క్రీడ ప్రవర్తిల్లగలదు. ఈ భూమి మీద ప్రతికల్పములో శ్రీహరితో నీకు విహారక్రీడను విధాత లిఖించేను, దానినెవడు నివారించగలడు. శ్రీహరిప్రియా! నేను శంకరుని యొక్క దాంపత్యఋతో ఎట్లు సౌభాగ్యవతినో నీవల్లే కృష్ణుని దాంపత్యముతో సౌభాగ్యవతీవగుము. పాలలో తెల్లదనము, అగ్నియందు వేడి, భూమియందు గంధము నీటియందు చల్లదనము ఎట్లు స్థిరమో కృష్ణుని యందు నీ ఉనికి అట్టే స్థిరము, దేవ గంధర్వ మనుష్య రాక్షస స్త్రీలలో ఏ ఒక్కతే కూడ నీకంటె సౌభాగ్యవతి ఇంతకు ముందు లేదు. ఇకముందుండబోదు.

త్రిగుణాతీతుడు బ్రహ్మాదుల చేత నమస్కరింపబడువాడు పరాత్పరుడు ఐన శ్రీకృష్ణుడు నా వరము వలన తానే స్వయముగా నీకధీనుడగును. ధ్యానము చేత సాధింపరానీ వాడును ఆరాధించుటకు కష్టసాధ్యుడును (సర్వయోగులకు), బ్రహ్మ, అనంత, శీవులచేత ఆరాధింపబడువాడును అగు హరి నీవశమగును. రాధా! నీవు మిక్కిలి భాగ్యవంతురాలివి. స్త్రీ జాతీలో నీకంటే శ్రేష్ఠురాలు లేదు. ఈ జన్మ తరువాత శ్రీకృష్ణునితో బాటు నీవు గోలోకమునకు పోగలవు. ఇట్లు పలికి పార్వతీదేవి వెంటనే అక్కడ అంతర్ధానమయ్యెను. రాధాదేవి గోపికలతో బాటు గృహమునకేగ పూనుకొనెను.

ఇంతలో రాధాదేవి ముందుకు శ్రీకృష్ణుడు విచ్చేసెను (ప్రత్యక్షమయ్యెను) అతడు బాలరూపము లోనున్న శ్యామసుందరమైన మూర్తి, ఆ వర్ణమునకు తగినట్లు పసుపుపచ్చ వస్త్రమును ధరించి నానావీధ భూషణములలంకరించుకొని యుండెను. మోకాళ్ల వరకున్న మాలతీ పుష్పమాలను “వనమాల” యను దానిని ధరించి ఉండెను. సర్వాంగమున చందనము పులుముకొనీ శరత్కాల పద్మములవంటి లోచనములతో (కన్నులు} మందహాసము (చిరునవ్వు)తో ప్రసన్నముగా నున్న ముఖముతో భక్తుల ననుగ్రహించవలెనన్న తొందరతో శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వంటి ముఖమండలము పైన రత్న కిరీటకాంతితో అతడు ప్రకాశించుచుండెను. పండిన దానిమ్మ పండులోని విత్తులవంటి వన్నె గల పలువరుసతో మిక్కిలి మనోహరముగా నుండెను. వినోదముగా మురళిని, విలాసముగా పద్మమును హస్తములందు ధరించి యుండెను. కోటి మన్మధుల లావణ్యము (శరీరమందలి తళుకు) గలిగి మనోహరమైన లీలలకు నివాసస్థానమైన ఆ స్వామిని రాధాదేవి దర్శించెను. (ఇంతవరకు కన్నులకు ప్రత్యక్షమైన ఆకారము వర్ణించబడినది. ఇక పరమాత్మ యొక్క మహిమ వర్ణించబడుచున్నది) ఆ స్వామి త్రిగుణములకతీతుడు. బ్రహ్మ అనంతుడు శివుడు మొదలగు మహాజ్ఞానుల చేత సుతింపబడువాడు. దృశ్యాదృశ్యమైన సర్వ ప్రపంచము తన స్వరూపమైనవాడు, వేదములచేత గూడ ఇట్లని నిరూపింప బడజాలని బ్రహ్మణ్య మూర్తి. నామరూపముల చేత వ్యక్తము కానివాడు. అక్షర (నాశములేని) మైన అవ్యక్త స్వరూపుడు. సనాతనుడైన జ్యోతిరూపుడు. మంగళములకు కారణమైనవాడు. ఆధారమైనవాడు. మంగళప్రదుడైన “మంగళ” నోముడు.

ఆ అద్భుతమైన రూపమును చూచి సంభ్రమము (భయము త్వర ఆదరము గల మానసిక స్థితి)తో అతనికి నమస్కరించి రాధాదేవి అతని సౌందర్యము వలన మన్మధబాణముల చేత పీడితురాలై మూర్ఛిల్లెను. ఓరచూపులతో అతని ముఖపద్మమును మరల మరల చూచి చూచి చిరునవ్వు, సిగ్గులతో ముఖమును (వస్త్రముతో) కప్పుకొనెను. గోపికాగణము ముందు నిలిచిన శ్రీహరి ప్రసన్నమైన ముఖము చూపులతో చూచి రాధతో ఇట్లనెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :

నాప్రాణములకంటే అధిక ప్రియమైన రాధా! కోరుకున్న వరముగిడుగుము. ఓ గోపికలారా! మీరందరును కోరిన వరము నడుగుడు (ఇచ్చెదను) కృష్ణుని మాట విని రాధాదేవియు, మిక్కిలి సంతసించిన గోపికలును సర్వవిధముల కోరికలు తీర్చు ఆ కల్పవృక్ష స్వరూపునీ నుంది. ఇది కాపలెనని వరమును వరించిరి (కోరిరి).

రాధికోవాచ - రాధాదేవి ఇట్లనెను :

 “ప్రభూ! నీ పాదపద్మమునందు నా మనసును తుమ్మెద ఎప్పుడును తిరుగుచుండును గాక. పద్మమందలి తేనెను త్రాగు తుమ్మెదవలె అది భక్తిరసమును పానము చేయు గాక. నాకు జన్మజన్మకు నీవే ప్రాణనాధుడవు కమ్ము, మిక్కిలి దుర్లభమైన నీ పాద పద్మభక్తినీ నాకిమ్ము. స్వప్నములో మెలకువలో రాత్రింబగళ్లు నా మనస్సు నీ స్మృతియందు నీ కల్యాణ గుణముల యందు ఎల్లప్పుడు నిమగ్నమై ఉండుగాక. ఇదియే నేను తలచుకొన్న కోరిక”.

గోపాలికా ఊచుః - గోపాలికటట్లు పలికిరి :

ఓ ప్రాణబంధూ! ప్రతిజన్మయందును రాధాదేవిని వలనే మమ్ము గూడ రేబవళ్ళ కాపాడుము, ప్రాణనాధుడవగుము.

ప్రసన్నమైన పదసము గలవాడును యశోద ఆనందమును వృద్ధిపొందించు వాడునగు హరి వారి వాక్కులు విని తథాస్తు (అట్లే అగుగాక) అని పలికీ రాధాదేవికీ సహస్ర దళములు గల తన విలాన పద్మమును, సుందరమైన మాలతీ మాలను ప్రీతితో నిచ్చెను. ఆ గోపికాపతి గోపికలకును పరమ ప్రీతితో పుష్పగుచ్ఛములను పూలమాలలను ఇచ్చి నవ్వి ఇట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :

మూడు మాసములు గడచిన తర్వాత బృందారణ్యములోని సుందరమైన రాసమండలములో మీరు నాతో విహార క్రీడ లాడగలరు. నేనెట్లో మీరును నాకట్లే, నేను మీ ప్రాణమును. ప్రభువైన నాకును మీరు ప్రాణములే. వేదమందు మనమధ్య భేదము వినిపించదు. ఓ ప్రియకన్యలారా! మీరాచరించిన ఈ వ్రతము లోకమునకు తెలిపి వారిని రక్షించుటకే కాని మీ స్వార్థమునకు కాదు. నాతో పాటే మీరును గోలోకము నుండి భూమి మీదికి వచ్చితిరి. మరల నాతో కలిసియే మీరక్కడికి పోవుట సంభవించును. జన్మజన్మకు మీరు నాకు ప్రాణములకంటే అధికమైన వారనుటలో సందేహము లేను. ఇక మీరు శీఘ్రముగా మీయిండ్లకు పొండు. ఇట్లు పలికి శ్రీహరి యమునా నదీ తటమున నీలిచెను. ఆ గోపికలందరును శ్రీకృష్ణుని మరల మరల చూచుచు నిలిచిరి. అందరు మిక్కిలి హర్షమును ప్రకటించు ముఖములతో చిరునవ్వుతో ప్రక్క చూపులతో శ్రీకృష్ణుని ముఖచంద్రుని తమ కన్నులనెడు చకోర పక్షులతో ప్రీతిగా పానము చేసిరి. (తృప్తిగా ఆసక్తిగా చూచిరి).

శ్రీకృష్ణునికీ జయమంగళములు మాటి మాటికీ పలుకుచు గోపికలు శీఘ్రముగా తమ గృహములకెగిరి. శ్రీకృష్ణుడును ప్రసన్నుడై గోపాల బాలురతో బాటు తన గృహమునకేగెను. ఈ విధముగా సర్వజీవులకు సుఖము గూర్చునట్టి గోపికా వస్త్రాపహరణమనెడి శ్రీకృష్ణుని మంగళ చరిత్ర మొత్తము చెప్పబడినది.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన గోపికావస్త్రాపహరణ ప్రస్తావన అను ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.