4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

87 - అధ్యాయము

మూ॥ నంద ఉవాచ :

శ్రీనారాయణ ఉవాచ:

అను II నందుడిట్లన్నాడు:

స్వయముగా వేదమునకు ప్రభువైన నిన్ను వేదములు కూడా తెలుసుకొనలేవు. సురలు, బ్రహ్మ శివుడు, శేషాదులు, మునులు, అట్లాగే సిద్ధాదులు తెలుసుకొనలేరు. (1) నీవెవరో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉండి అదంతా నీయదార్థ విషయాన్ని ఒంటరిగా నాకు చెప్పండి. ఓ ప్రభు! (2) శ్రీనారాయణుని వచనమిట్లా - ఇంతలో కృష్ణుని చూడటానికి అక్కడికి మునీశ్వరులు, బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న వారు త్వరగా వచ్చారు, ఓవత్స! (3) పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, అంగిరుడు, ప్రచేతుడు, వసిష్టుడు, దుర్వాసుడు, కణ్వుడు (4) కాత్యాయనుడు, పాణిని, కణాదుడు, గౌతముడు, సనకుడు, సనందుడు, సనాతనుడు (5) కపిలుడు, ఆసురి, వాయువు, పంచశిఖుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, కశ్యపుడు, పరాశరుడు (6) విభాండకుడు, మరీచి, శుక్రుడు అత్రి, బృహస్పతి, గార్యుడు, వాత్యుడు, వ్యాసుడు, జైమిని (7) తక్కువగా మాట్లాడే ఋష్యశృంగుడు, యాజ్ఞవల్క్యుడు, శుకుడు, సౌభరి, శుద్ధమైన జడలు గల భరద్వాజుడు, సుభద్రకుడు (8) మార్కండేయుడు, లోమశుడు, ఆసురి, విటంకణుడు, అష్టావక్రుడు, శతానందుడు, వామదేవుడు, భాగురి (9) సంవర్తుడు, ఉతథ్యుడు, నరుడు, నారదుడు అంతా వచ్చారు. జాబాలి, పర్పురాముడు, అగస్త్యుడు, పైలుడు (10) యుధామన్యువు, గౌరముఖుడు, ఉపమన్యువు, శ్రుతశ్రవుడు, మైత్రేయుడు, చ్యవనుడు, వరరుచి, అర్షి వీరంతవచ్చారు. (11) వారిని చూచి త్వరగా లేచి చేతులు జోడించి నమస్కరించి ఆదరంతో అందమైన సింహాసనముల పై కూర్చో పెట్టాడు. (12) శాస్త్ర ప్రకారము కుశలప్రశ్న పూర్వకముగా పూజించాడు. పరస్పరము అందరితో మాట్లాడి, మధ్యలో ఆ కృష్ణుడు కూర్చున్నాడు. (13) ఇంతలో ఆ కృష్ణుడు తేజోరాశిని చూశాడు. ఆమునులు కూడా ఆకాశంలో వెలిగిపోతున్న కాంతిని చూశారు. (14) ఓవత్స! తేజస్సు మధ్యలో బంగారు కాంతిగల కుమారుని ఐదు సంవత్సరాల వయస్సు వానిని నగ్నంగా ఉన్న బాలుని కోరతగిన వానిని చూచారు. (15) ఓ నారద! సభామధ్యంలో త్వరగా ఆవిర్భవించాడు. త్వరగా సభలో పైకి వస్తున్న దానిని చూచి మునిపుంగవులంతా.

సనత్కుమార ఉవాచ –

శ్రీ కృష్ణ ఉవాచ

సనత్కుమార ఉవాచ

శ్రీభగవానువాచ:

సనత్కుమార ఉవాచ:

శ్రీకృష్ణఉవాచ :

పడు సనత్కుమార ఉవాచ:

మునులంతా నమస్కరించారు. శారికూడా ఆతనికి నమస్కరించాడు. చిరునవ్వుతో, స్నేహ పూర్వకపు చూపులతో, ఆదర పూర్వకంగా తగిన విధంగా పలకరించాడు. (17) ఆతడు అందరికి ఆశీస్సులను చేసి సభలో కూర్చున్నాడు. వారితో, సనాతనుడైన భగవానుడైన శౌరితో ఇట్లన్నాడు. (18) సనత్కుమారుని వచనమిట్లా - ఓమునులారా ! మీరు క్షేమమేనా! ఎల్లప్పుడు మీ తపస్సుకు తగిన ఫలితం లభిస్తోందా, మంగళకరమైన బీజము గల కృష్ణుని కుశలప్రశ్న వేయుట వ్యర్థము. (19) మీరుకుశలమేనా. పరమాత్మదర్శనమైంది. పరుడైన ప్రకృతికి గూడా భక్తులు అభ్యర్థించటం వలన దేహధారణము కల్గింది. (20) నిర్గుణుడు, నిరీహుడు (నిష్కాము) తన తేజస్సుతో అందరికి బీజభూతుడు. ఇప్పుడు భూభారం తగ్గించే కొరకే అవతరించినవాడు. (21) శ్రీకృష్ణుని వచనమిట్లాశరీరము ధరించినా కుశలప్రశ్న వేయాలి. ఓ విప్రుడ! నన్ను కుశల ప్రశ్న వేయవేమిటి. (22) సనత్కుమారుని వచనమిట్లా - ప్రాకృత శరీరమందును ఎప్పుడూ శుభమే ఉంటుంది, ఓనాథ! నిత్యమైన దేహం విషయంలో, క్షేమమునకు బీజమైన దానికై కుశలప్రశ్న అనర్దకమైనది. (23) భగవంతుడిట్లా- శరీరాన్ని ధరించిన వారంతా ప్రాకృతికులే. నిత్య ప్రకృతి తప్ప దేహంలేదు, ఓవిప్రుడ! (24) సనత్కుమారుడిట్లా- రక్తము, బిందువుల వల్ల కల్గినవి శరీరాలు అవన్నీ ప్రాకృతికములు. ప్రకృతి నాథుడవైన నీకు బీజునకు ప్రాకృత శరీరమెట్లా వస్తుంది. (25) అన్ని బీజములకు అన్నిటికి మొదలు నీవు స్వయంగా భగవానుడవు. అన్ని అవతారములకు ప్రధాన బీజమువు. అవ్యయుడవు. (26) నిన్ను ప్రధానుణ్ణి చేసి వేదములు, నిత్యమైనది, నిత్యమైనది సనాతమైనది అని చెప్తున్నాయి. జ్యోతి: స్వరూపుడవు. పరముడవు పరమాత్మవు, ఈశ్వరుడవు. (27) మాయతో సగుణుడవు, మాయకు ఈశుడవు, నిర్గుణుడవు, పరమైనవాడివి, అని వేదాంగములు, అట్లాగే వేదవిదులు అంటారు ఓ ప్రభు! (28) శ్రీకృష్ణుడిట్లన్నాడు - ఇప్పుడు నేను వాసుదేవుడను. రక్త వీర్యముల నాశ్రయించిన శరీరమిది. ఓ విప్రుడ! ప్రాకృతుడను ఎట్లా కాకుండాపోతాను. క్షేమప్రశ్న అడగవలసినదే. (29) సనత్కుమారుడిట్లన్నాడు - వాసు అనగా అందరికి నివాసము, ఆతని రోమములలో అన్నిలోకములున్నాయి. ఆతని శరీరము పరబ్రహ్మము. అందుకే వాసుదేవుడని పిలువబడ్డాడు. (30) వాసుదేవుడనే పేరు నాలుగు వేదములందు పురాణ ఇతి హాసములందు యాత్రాదులందుకన్పిస్తుంది. (31) రక్త వీర్యాశ్రితమైన నీ దేహము వేదములలో ఎక్కడ చెప్పబడింది. మునులు సాక్షులు. అంతటా ధర్మమే. నాకు వేదములు సూర్యచంద్రులు ఇప్పుడు సాక్షులు.

మూII భృగురువాచ :

సనత్కుమార ఉవాచ :

శ్రీకృష్ణ ఉవాచ:

సనత్కుమార ఉవాచ :

శ్రీకృష్ణ ఉవాచ:

ఋషయ ఊచుః

సనత్కుమార ఉవాచ :

అను!! భృగువిట్లన్నాడు :

ఓవిప్రేంద్ర! నిజం చెబుతున్నావు. నీవే వైష్ణవులలో అగ్రణివి. స్వాగతము, కుశలమేనా ఎప్పుడూ. ఎందుకొరకు ఇక్కడి కొచ్చావు. (33) సనత్కుమారుడిట్లా - ఓ మునులారా! అంతా వినండి. ఓ కృష్ణ! ఇప్పుడు, విను. ఏకారణంగా చాలా త్వరగా ఇక్కడికి వచ్చానో ఆ కథ విను. (34) కృష్ణుని వచనమిట్లా - ఓ భగవంతుడ! అన్ని ధర్మములు తెలిసినవాడ! ఇక్కడికి ఎందుకొచ్చావు. ఓ సర్వజ్ఞ! అన్ని నీకు తెలుసు. నీవు విద్వాంసులలో శ్రేష్టుడవు. (35) సనత్కుమారుడిట్లా - ఓ భగవన్! ఎప్పుడూ ధన్యుడవు, జగత్తునకంతా మాన్యుడవు కూడా. నీవు సర్వేశ్వర, ఈశ్వరుడవు. విశ్వంలో నీకన్నపరుడు లేడు (36) శ్రీకృష్ణుడిట్లా - ఓ ద్విజశ్రేష్ఠ! యజ్ఞములకు, వ్రతములకు తపస్సులకు ఎప్పుడూ, ఫలమిచ్చేవాడిని నేను . దక్షిణలతో సహా, అని (37) దానిని విని కుమారులు కూడా, వారు వేగంగా వెళ్ళారు. ఈ మాటనువారు ఆశ్చర్యంగా భావించి వారు, ఆతనిని వారించారు. (38) ఋషులిట్లన్నారు - ఓ సిద్దేంద్రుడ! మహాభాగ! కుమార! దయామయ! భగవంతుడైన కృష్ణుని సన్నిధిలో ఏశంకించదగిన కథ (చెప్పదలచారు) చెప్పారు. (39) ఓపుత్ర! ఏదైనా ఆశ్చర్యాన్ని చూచారా, ఎక్కడైనా ఏదైనా విన్నారా. దానిని పెద్దగా చేసి వివరించి మాకు చెప్ప సమర్థుడవు. (40) ఇంతలో బ్రహ్మ పార్వతితో సహా శంకరుడు, అనంతుడు, ధర్ముడు, శ్రీసూర్యుడు, చంద్రుడు, (41) ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు దిక్పాలాదులు దేవతలు వచ్చారు. శ్రీకృష్ణుడు త్వరగా లేచి, విడివిడిగా అందరిని గౌరవించాడు. (42) మధుపర్కాదులు ఇచ్చి భక్తితో పూచించాడు. ఋషులంతా శేషుని, శంభుని, బ్రహ్మను పార్వతిని నమస్కరించారు. (43) ద్విజులకు దేవులకు పరస్పరం సంభాషణ జరిగింది. ఆసనంలో వారిమధ్య కుమారుడు బంగారు కాంతి గలిగిన వాడై కూర్చున్నాడు. ద్విజదేవతలమధ్యకూర్చొని ఆసభలో కథను చెప్పటం ఆరంభించాడు. (44) సనత్కుమారుడిట్లా - నేను గోలోకానికి వెళ్ళాను. అక్కడ రాధికాపతి కన్పించలేదు. అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాను. అక్కడ ఆచతుర్భుజుడు లేడు. (45) ఆపై పాలసంద్రానికి వెళ్ళాను. అక్కడ హరి స్వయంగా లేడు. అలసిపోయి విచారిస్తూ పాలసంద్రపు ఒడ్డున స్నానం చేశాను. (46) విస్తరించిన ఇసుకమధ్యలో సూరు యోజనముల విస్తారమైన తాబేలు కన్పించింది. భయపడుతూ, వణుకుతూ, దుఃఖిస్తూ, బక్కచిక్కి కన్పించింది. అది (47) మహాత్ముడైన రామునితో మీనంతో తొలగింపబడ్డావు. నీవు ధన్యుడవు అని నేనన్నాను. ఆతడు, నేను ధన్యుణ్ణి కానని అన్నాడు. (48) పాలసముద్రము సాగరము ధన్యము, నాలాంటి జంతువులెన్నో ఉన్నాయి కూడ. నాకంటే పెద్దవి, అసంఖ్యాకంగా ఉన్నాయి. ఓమహాముని! (49) ఓ పాలసముద్రమా! నీవు ధన్యురాలవు అని అనగా అది నాతో అంది. ఈ వసుంధర, దేవి ధన్యురాలు, దీని పైనే గదా ' ఏడు సముద్రాలున్నాయి. (50) ఓవసుధ! నీవు ధన్యురాలవు అని అనగా ఆమె అంది నేనే ధన్యురాలను కాదు, అని నాకు ఆధారమైన అనంతుడు ధన్యుడు. ఆనాగరాటైన విభువు కృష్ణుని అంశ.

అను!! చాటలో ఆవగింజంత వేయి తలల మధ్యలో నేను నాగరాజు తలలో ఉండటం, అంది వసుధ. ఓ శేషుడ! నీవు ధన్యుడవనగా, ఆతడు నేను ధన్యుడనుకానన్నాడు. (52) నాకు ఆధారం ఆదికూర్మము.కనుక ఓముని! అక్కడకువెళ్ళు, అని శేషుడన్నాడు. ఓ కూర్మమ! నీవు ధన్యురాలవు అనగా, ఓ ముని! నేను ధన్యురాలనుకాను (53) నన్ను గాలి ధరిస్తోంది. కనుక నాకన్న వాయువు ధన్యతముడన్నాడు. వాయువుతో, నీవు ధన్యుడవనగా, నేను ధన్యుడను కాదన్నాడు. భగవాన్, బ్రహ్మజగత్తులకు విధాత, ఆతడు ధన్యుడన్నాడు. (54) ఓ ధాత! నీవు ధన్యుడవనగా, నేను ధన్యుడను కానన్నాడాయన. మహేశ్వరుడు ధన్యుడు., యోగీంద్రులకు దేవుడు, గురువునకు గురువు. (55) అందరికి ఆరాధ్యుడు, పూజ్యుడు, ధర్మరూపుడు, సనాతనుడు. కాలమునకు కాలము, సంహారకర్త. ఆప్రభువు స్వయంగా మృత్యుంజయుడు ఆతడు ధన్యుడు అనగా, ఓ శంభు! నీవు ధన్యుడవనగానేను ధన్యుడనుకానన్నాడాయన (56) అన్నింటి మొదట ఎవరిని పూజస్తారో జ్ఞానులకు గురువునకు ఎవరు గురువో, దేవతలలో ప్రవరుడెవరో, పరుడెవ్వడో, ఆ గణేశుడు ధన్యుడన్నాడు. (57) సిద్దేంద్రులలో, మునీంద్రులలో, దేవేంద్రులలో, యోగీంద్రులలో, ప్రాజ్ఞులలో, గణేశుని మించినపురుషుడు లేడని శ్రుతులలో విన్నాము (58) క్రిందుగా ప్రవహించే నదులలో గంగ, తీర్థములలో పుష్కరతీర్థము ఎట్లాగో అట్లా, వేదం చెప్పింది ధర్మం. దానికి విరుద్ధమైంది అధర్మం. (59) వేదమనగా సాక్షాన్నారాయణుడే. శాస్త్రం చెప్పిన నియమాన్ననుసరించి (వ్యవస్థ) ఆతని పూజించాలి. ఆవేదముల నుండే శాస్త్రాలు, అన్ని పురాణాలు ఏర్పడ్డాయి. (60) ఆ వేదం నుండే ధర్మం నిరూపించబడింది, ఇతి హాసము, సంహితలు అన్నీను అదుండే. అందువల్ల ఆ వేదములు ధన్యమైనాయి, అని బుద్ధిమంతులంటారు. (61) అప్పుడు నేను వేదములతో, మీరు ధన్యమైనవారు, మాన్యులు అని అన్నాను. మేము ధన్యులము కాము యజ్ఞసంఘములు ధన్యమైనవీ అని అవి అన్నాయి. (62) మేము వ్యవస్థను చేసే వాళ్ళము. యజ్ఞసమూహము స్వయంగా ఫలమిస్తాయి కనుక అవే ధన్యమైనాయి అక్కడికి వెళ్ళు ఓముని! అని అనగా (63) ఓ విభు! నేను వానిదగ్గరకు వెళ్ళి, ఓయజ్ఞసంఘమా! మీరు ధన్యము అని అనగా అవి అన్నాయి, మేము ధన్యులం కాదు. శుభ కర్మ ధన్యమైంది అని అవిఅన్నాయి. (64) శుభకర్మతో, నీవు ధన్యురాలవు అని అనగా, నేను ధన్యురాలను కానంది. కర్మలకు హేతువు, కర్మఫలము నిచ్చేవాడెవో వాడు ధన్యుడు. (65) ధాత కు విధాత, భగవంతుడు, సర్వాది, సర్వకారకుడు, పరమాత్మ శ్రీకృష్ణుడు ధన్యుడు. మాన్యుడు, నిశ్చయము. (66) ధర్మాలయమునకు వెళ్ళి జగదీశ్వరుడు కన్పించకపోతే, పరిపూర్ణతముడైన ప్రభువును చూడటానికి మధురకు వచ్చాను, ఆతడు ఇక్కడికి వచ్చాడు కనుక. (67) యజ్ఞములకు, తపస్సులకు, వ్రతములకు, శుభకర్మలకు ఫలదాత ఈశ్వరుడు (ప్రభువు). పరమాత్మ (68) కారణకారణుడు, బ్రహ్మాదులందరికి మొదటివాడు. అందుకే ధన్యుడవు అని నేనన్నాను, దక్షిణలతో కూడా అని. (69) భగవంతుడన్న దానికి సర్వకారణాన్ని చెప్పాను. యజ్ఞము దక్షిణలతోనే ఫలాన్నిస్తుంది. దక్షిణలేని యజ్ఞం వ్యర్థము. (70) బ్రాహ్మణునకు యజ్ఞంలో అప్పుడేదక్షిణ నివ్వాలి. ఇవ్వకపోతే, ఒకరాత్రి గడిస్తే ఈయవలసిన దానం రెట్టింపౌతుంది. (రెట్టింపు ఇవ్వాలి).

శ్రీనంద ఉవాచ :

అను ॥ నెలగడిస్తే నూరింతలెక్కువౌతుంది. రెండు నెలలకు వేయింత లెక్కువౌతుంది. సంవత్సరానికి ఎక్కువైతే ఆదాత, నరకానికి పోతాడు. (72) వేల సంవత్సరాలు మూత్రకుండంలో ఉండి, ఆ పైన చండాలుడౌతాడు రోగగ్రస్తుడు, పాతకి ఔతాడు. (73) దాత ఇవ్వకపోతే ప్రతిగ్రహీత దానం తీసుకోకపోతే, ఆ ఇద్దరు నరకానికి పోతారు. వేల సంవత్సరాలు అక్కడుంటారు. (74) యజమానుడు చండాలుడౌతాడు, బ్రాహ్మణుడు వాని పురోహితుడౌతాడు. ఇద్దరు రోగగ్రస్తులై, కర్మఫలం వల్ల పాపులౌతారు. (75) దేవతలు, మునులు అంతా నవ్వారు. ఆశ్చర్యపడ్డారు. నందుడు ఆశ్చర్యపడ్డాడు. కొడుకు అనే భావాన్ని విడిచి పెట్టాడు (కృష్ణుని పై) (76) సభామధ్యలో సిగ్గువిడిచి దుఃఖముతో వ్యాకులుడై ఏడ్చినాడు. మోహమును విడిచి పెట్టు అని, పార్వతి అతనికి బోధించసాగింది.నందుడిట్లన్నాడు - కు(నీచ) జన్మగలవాని ఇంట్లో అమూల్య రత్నము, మాణిక్యము ఉన్నట్లు, కృష్ణుడు ఉన్నాడు మా ఇంట్లో ఓ దేవేశ! ప్రభు! నేను వంచింపబడ్డాను. (78) ప్రకృతికీపరమైనవాడ ఓభగవాన్! నా అపరాధాన్ని క్షమించు. తిరిగి ఇంటికి, గోకులానికి, యమునాతటానికి వెళ్ళను. (79) ఓగదాగ్రజ! ఆవాసము వృందావనము. క్రీడకు ఆవాసము. అదంతా యశోదకు, గోపికల సమీపానికి (80) యశోదకు ఏమి చెప్పాలి, ప్రేయసియైన రాధికకు ఏమి చెప్పాలి. ప్రేమపాత్రులైన గోపబాలురకు ఏం చెప్పను. (81) ఇట్లా పలికి సభామధ్యలో నందుడు మూర్చనొందాడు, ఓ నారద! అప్పుడు జగన్నాథుడు, ఆతనినితన వక్షః స్థలమందుంచుకొని బోధించసాగాడు. (82) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు, నారాయణ నారద సంవాదమందు, భగవన్నంద సంవాదమందు ఎనుబది ఏడవ అధాయ్యము.