4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

86 - అధ్యాయము

మూ॥ నంద ఉవాచ :

శ్రీభగవానువాచ-

నందుడిట్లన్నాడు కేదారకన్యా ప్రస్తావ సందర్భంలో కర్మ యొక్క కీర్తనను చెప్పారు. స్త్రీల ప్రసంగంలో చేయతగినదన్నారు. దాన్ని విస్తరంగా చెప్పండి, ప్రభు! (1) కేదార కన్య ఎవరు, కేదార భూపతి ఎవరు, ఆతని జన్మ ఏ వంశంలో, దానిని నాకు వివరించండి. (2) శ్రీ భగవంతుని వచనమిట్లా - ఇదివరలో బ్రహ్మపుత్రుడు స్వాయంభువమనువున్నాడు. అతని భార్యశతరూప. స్త్రీలతో గౌరవింప తగినది, మాన్యురాలు (3) వారికి ప్రియవ్రత ఉత్తానపాదులని ఇద్దరు పుత్రులు జన్మించారు. ఉత్తానపాదుని పుత్రుడే ధ్రువుడు, మహాశయుడు (4) ఆతని పుత్రుడు నందసావర్ణి. ఆతని పుత్రుడు కేదారుడు. ఆతడు ఏడు దీవులకధిపతి, శ్రీమంతుడు, స్వయంగా వైష్ణవుడు కేదారుడు. (5) ఆతని రక్షణ కొరకు , ఆసభలో సుదర్శనమును, (చూడతగిన) కొత్తవి శుద్ధమైని, బంగారు కొమ్ములు గలవి అలంకరింపబడ్డవిఇట్టి లక్ష గోవులు, (6) వహ్ని శుద్ధమైన వస్త్రములు, వరుణుడిచ్చాడు. అట్లాగే లక్ష బంగారు నాణెములు, అన్ని పంటలు గల భూమిని ఇచ్చాడు. (7) మణిరత్నము, ముత్యములు ఉత్తమ వజ్రము, మాణిక్యము, రత్నముల్లాంటి లక్ష గుర్రములు, ఏనుగులు లక్ష (8) వెండి, పగడము, మధురాన్నము. నూరు, ధాన్యముల కొండలు ఇచ్చాడు. ప్రతిరోజు బ్రాహ్మణులకు, రత్నభూషణములిచ్చాడు రాజు. (9) ప్రతిరోజు నూరు లక్షల బ్రాహ్మణులను భుజింపజేశాడు రాజు. బంగారువి, జలపాత్రలు, భోజనపాత్రలు ఇచ్చాడు రాజు. (10) బంగారు యజ్ఞోపవీతములు మంచి ఉంగరములు దానమిచ్చాడు. ఆనందంతో బ్రాహ్మణులకు, బంగారు, రత్నములు గల ఆసనముల నిచ్చాడు. (11) రాజునకు వంట బ్రాహ్మణులు లక్ష ఉన్నారు. వడ్డించే బ్రాహ్మణులు రెండు లక్షలు. (12) నెయ్యి కాలువలు, తేనె కాలువలు, పెరుగు కాలువలు, మనోహరంగా ఉన్నాయి. కాల్వల కొద్ది బెల్లము, కాల్వల కొద్దిపాలు, ప్రతిరోజు కావలసింది కోరటమే (13) ప్రొద్దుటి నుండి సాయంకాలం దాకా బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. దుఃఖితులకు, భిక్షులకు తగినట్లుగా ధనం దానం చేశారు. (14) రాజు ఫలములు, గడ్డలు తినేవాడు, వైష్ణవుడు, జితేంద్రియుడు, అంతా నాకే అర్పించి, రాత్రింబగళ్ళు నన్ను జపిస్తూ (15) ఉండేవాడు ఒక రోజు వంటవాడు ఆరాజుతో ఇట్లా అన్నాడు. భోజనం కొరకు పదిలక్షల బ్రాహ్మణులొచ్చారు. (16) ఓ ప్రభు! ఈవేళ బ్రాహ్మణులు కరుకైన అన్నాన్ని (ప్రేమలేని) తింటున్నారు. రాజా! ఆ బ్రాహ్మణులు పప్పు మొదలగు వానితో భోజనం చేయని (17) రాజుకు నాలుగు యోజనముల వరకు అధికారము. దానికి నూరింతల అధికారం గలవాడు మండలేశ్వరుడు.

ధర్మఉవాచ :

వృందోవాచ:

ధర్మ ఉవాచ:

వానికన్న పదింతలెక్కువ అధికారంగల రాజు రాజేంద్రుడుగా చెప్పబడుతాడు. ఐదు లక్షల రాజేంద్రులు ఎప్పుడూ కేదారుని సభయందుంటారు. (19) అమూల్యమైన రత్నములు మాణిక్యము, ముత్యాల హారము శ్రేష్ఠమైన మణిని, శ్రేష్ఠమైన ఏనుగు, గుర్రము, వీనిని కేదారునకు పన్నుగా (కప్పం) ఇచ్చారు. (20) కమల (లక్ష్మి) కాంతితో పుట్టిన, యజ్ఞకుండమందుద్భవించిన, వహ్నితో శుద్ధమైన వస్త్రము ధరించిన, రత్నభూషణములతో అలంకరింపబడిన (21) సంభోగేచ్ఛగల, స్త్రీలలో శ్రేష్టురాలైన కమలముల వంటి కళ్లుగల, కన్య వచ్చి ఓ మహారాజ! నేను నీకూతురును, అని రాజుతో ఆమె పలికింది. (20) రాజు ఆమెను భక్తితో పూజించి భార్యకు అప్పగించి నిల్చున్నాడు. ఆమెను తల్లిగా గుర్తించి, తండ్రినిగా వినయంగా ఆనందంగా అతని ననుమతించి (23) రమ్యమైన పుణ్యమైన వనమునకు, యమునానది సమీపమునకు తపస్సు కొరకు వెళ్ళింది. ఆమె తపస్సు చేసి నందువల్ల ఆవనము వృందావనమని పిలువబడింది. (24) తపస్సుతో ఆమె, వరములకు వరమైన నన్ను వరంగా కోరింది. తరువాత కృష్ణుని పొందుతావు అని ఆమెకు బ్రహ్మ వరమిచ్చాడు. (25) ఒకరోజు ఆమె వసంతమాసంలో నదీతీరమందు చిరునవ్వు నవ్వుతూ, రత్న ఆభరణములతో అలంకరించుకొని, పుష్పముల పడకయందు పడుకుంది. (26) సుమనోహరమైన ఆ సాధ్విని పరీక్షించుటకు బ్రహ్మ వచ్చాడు. ఆ కన్య రహస్య ప్రదేశంలో ఉత్తముడైన పురుషుణ్ణి యువకుణ్ణి చూచింది. (27)రత్నభూషణములు అలంకరించుకున్నాడు, వంటి నిండా చందనం పూసుకున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు కామేచ్ఛగలవాడు, అందగాడు, స్త్రీలకూ కోరతగినవాడు, (28) పదహారు సంవత్సరాల వయస్సుగల కుమారునిలా ఉన్నాడు. బంగారమేని కాంతివాడు, కోటి మన్మథుల విలాసం వంటి విలాసం కలవాడు పీతాంబరమును ధరించినవాడు, శ్రేష్టుడు (29) శరత్పూర్ణిమ నాటి చంద్రునివంటి ముఖకాంతిగలవాడు, శరత్కాలమందలి పద్మములవంటి కనులుగలవాడు, అట్టి వానిని చూచి ఆమె లేచి తన సన్నిధిలో కూర్చోబెట్టుకుంది. (30) భక్తితో పూజించింది. ఆనందంగా పండ్లు, గడ్డలు ఇచ్చింది. వవాసనగల నీరును (మంచి) త్రాగుటకు ఇచ్చి ఆనందంగా నమస్కరించింది. (31) పూజను స్వీకరించి, ఆనందించి, ఆదరముగల ఆమెతో ఇట్లన్నాడు. ఆతడు భగవన్! బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. భోగేచ్చగల స్త్రీలకు కోరతగినవాడు, సతులకు దుష్కరుడు ఓప్రజ! (32) ధర్ముడిట్లన్నాడు - నీవు ఎవరికన్యవు, ఓ మనోహరి! నీ పేరేమి, రహస్యంగా ఏమిచేస్తున్నావు, దాన్నినాకు చెప్పండి (33) ఏకారణంగా తపమాచరిస్తున్నావు. ఓ సుందరి! నీవు ఏమి కోరుకుంటున్నావు. నీకు మనస్సులో ఏది కావాలని ఉందో, ఆ వరాన్ని కోరుకో, నీకు క్షేమమగుగాక, అని. (34) వృంద ఇట్లా అంది - ఓ బ్రాహ్మణ! నేను కేదారుని కన్యను, నేను వృందను. వృందావనమందున్నాను. రహస్యంగా తపస్సు చేస్తున్నాను. హరిని పతిగా కోరుకుంటున్నాను. (35) ఇవ్వటానికి సమర్ధుడవైతే, నేను కోరిన వరాన్ని ఇవ్వు. అసమర్ధుడవైతే వెళ్ళిపో. ఓ బ్రాహ్మణ! నీప్రశ్నతో పనేమి (36) ధర్ముడిట్లన్నాడు - నిరీకాడు ఊహించరానివాడు (కందని) పరమాత్ముడు, ఈశ్వరుడు, నిర్గుణుడు, నిరాకారుడు, భక్తులనను గ్రహించుటకై రూపమెత్తినవాడు (37) ఆతనిని భర్తగా పొందుటకు ఎవతేసమర్ధురాలు, లక్ష్మి, సరస్వతులు తప్ప, వైకుంఠమందు నిదురించే హరికి, నాలుచేతుల వానికి ఇద్దరు భార్యలు. (38) గోలోకమందలి రెండు చేతుల వానికి కూడా, వేణువు నూదేవానికి, కిశోరంగా (బాల) గోపవేషమందున్న వానికి, పరిపూర్ణతమునకు.

ఆతనికి పరాత్పరురాలైన, మహాలక్ష్మి, రాధ స్వయంగా భార్య. ఆమె బ్రహ్మ స్వరూప, ఉత్తమురాలు. పరమాత్మయైన ఈశ్వరుని (40) శాంతుని చాలా అందమైన వానిని శ్యామసుందరుని ఎప్పుడూ సేవిస్తోంది. కోటికందర్పుల సౌందర్యమును నిందించే అందగాడు, మంచి శరీరం కలవాడు (41) అమూల్యమైన రత్నముల ఆభరణములు కలవాడు, సత్యరూపుడు, శాశ్వతమైన విగ్రహం (శరీరం) కలవాడు, పీతాంబరము ధరించినవాడు, అందగాడు, అన్ని సంపదలనిచ్చేవాడు (42) ఆతడు శ్రీకృష్ణుడు రెండు రూపములు కలవాడు రెండు చేతులవాడు, నాలుగు చేతులవాడు, వైకుంఠంలో నాలుగు చేతులవాడు, గోలోకంలో స్వయంగా రెండు చేతులవాడు. (43) ఓ వృంద! బ్రహ్మపతనమైతే ఆతనికి నిమేషము (రెప్పపాటు), ఇరవై ఐదువేల యుగములతో ఇంద్రుని పతనము (44) పదునాలుగు ఇంద్రులంత కాలమైతే బ్రహ్మకు పగలు. ఆ విధాతకురాత్రి కూడా అంతే జగత్తులకు కూడా (45) ఈవిధంగా ముప్పది దినములతో మాసము. పన్నెండు నెలలు ఒక సంవత్సరం. ఇట్లా ఆతనికీ నూరేళ్ళు అని తెలుసుకో. అతడు బోధనయందు తత్పరుడు. (46) సనకాదులు బ్రతికినంతకాలంఆతనిని సేవిస్తారు. ఆవిభు, కోటికోటి కల్పములకైనా సాధ్యుడు కాడు. (47) వేయినోళ్ళుగల శేషుడు కూడా సేవిస్తాడాతనిని. ఎప్పుడూ జపిస్తాడు. నూర్లనూర్ల కోట్ల కల్పముల కాలము రాత్రింబగళ్ళు భక్తితో సేవించినా (48) ఆతడు సాధ్యుడు కాడు. ఆతడు హితం చేసేవాడు. అతికష్టంగా ఆరాధించతగినవాడు, పరాత్పరుడు బ్రహ్మ, బ్రహ్మస్వరూపుడైన ఆతనిని జన్మజన్మలలో భజించాలి (49) నాలుగు ముఖములతో బ్రహ్మ ఎప్పుడూ స్తుతిస్తాడు. ఎప్పుడూ ఆసనాతనుని స్తుతిస్తాడు. వేదములందు అనిర్వచనీయుడు వేదములకు జనకుడు, విధి . (50) విధాత, ఫలదాత, అన్ని సంపదలదాత. అతడు కాలమును, కాలాన్ని అంతంచేసే వానికి అంతకుడు, ఆ భగవంతుడు సాధ్యుడుకాడు. (51) రుద్రుని రూపంతో ఆకళతో జగత్సంహారం చేసేవాడు. ఆతడు ఐదు ముఖములతో స్తుతిస్తున్నాడు. ఇతరుడెవడున్నాడు. ఇతరుల సంగతి చెప్పేదేముంది. (52) ఓ వృంద! భగవత్పరమైన వాడు ప్రియుడు భగవంతునికి లేడు, విను. దుర్గతిని నశింపచేసే దుర్గ సర్వశక్తి స్వరూపురాలు. (53) బ్రహ్మ స్వరూపురాలు, పరమమైనది. మూలప్రకృతి, ఈశ్వరి. నారాయణి, విష్ణుమాయ ఆమె సనాతనమైనది, వైష్ణవి. (54) ఆమె మాయతో జగత్తు భ్రమ చెందింది. ఎల్లప్పుడు అనిత్యమైన దానిలో తిరుగుతోంది. ఆమె భక్తితో ఆదేవుని స్తుతిస్తోంది, ఓ వృంద! మనస్సులో రాత్రింబగళ్ళు స్తుతిస్తోంది. (55) గణపతి, కుమారస్వామి వీరు తమ శక్తి కొలది భక్తితో స్తుతిస్తారు. అన్నింటికి మొదట ఎవని పూజ చేస్తారో ఆ గణేశుడు ఆతనిని ధ్యానిస్తాడు. (56) భగవంతుడు, సర్వదేవతలకు ఈశుడు, జ్ఞానులకు, గురువుకు గురువు. సిద్దేంద్రులలో,దేవేంద్రుని యందు, యోగీంద్రుని యందు జ్ఞానులకు గురువుగా (57) గణేశుని మించిన విద్వాంసుడు లేడు గణేశుడు, సురాధిపుడు. పరమేశ్వరి సరస్వతి ఆతనిని స్తుతించుటకు అశక్తురాలు. (58) భక్తితో పాదపద్మములను రాత్రింబగళ్ళు సేవిస్తుంది. పద్మను సేవించదు. ఆతని దయవల్ల జగమంతా పర్ణిపూర్ణమైనది. మంగళకరమైనది. (59) ఆతని భయంవల్ల గాలి వీస్తోంది, సూర్యుడు వేడి నిస్తున్నాడు. ఇంద్రుడు వర్షిస్తున్నాడు, అగ్ని కాలుస్తున్నాడు, ప్రాణులలో మృత్యువు తిరుగుతోంది. (60) సర్వప్రాణులకాధారమైన వసుంధర, భూమి ఆతని సేవతో నిలుస్తోంది, సముద్రాలు నిశ్చలంగా ఉన్నాయి. పర్వతాలు కదలటం లేదు ఆతనికి భయపడి, ఓ సుందరి!

శ్రీవృందోవాచ:

ఆ గంగ తీర్థముల సారము పవిత్రమైనది, ముక్తినిచ్చేది. ఆమె పాదాబ్జములను సేవిస్తే ఆమెలోకములను పవిత్రం చేసేది. (62) తులసిదేవి పవిత్రమైనది. ఆమెను స్మరిస్తే, సేవిస్తే నవగ్రహములు, దిక్పాలురు ఆమె ప్రతాపానికి భయపడుతారు. (63) బ్రహ్మాండములన్నింటిలో బ్రహ్మవిష్ణు శివాత్మకులెవరున్నారో, ఇతరులైన ఏఏ దేవతలున్నారో శేషాదులు, మునులున్నారో (64) కొందరు కలస్వరూపులు, కొందరు అంశరూపులు. కొందరు కృష్ణుని కలలో అంశములు, కొందరు పరమాత్మకలాంశలు. (65) ఓ కల్యాణి! భర్త కావాలనుకుంటే ప్రకృతికి పరుడైన ఈశ్వరుని కోరితే ఆతడు గోలోకంలో రాధికకు సాధ్యుడు, ఇతరులకు ఎప్పుడూకాదు. (66), ఓ మహాభాగిని! నృపులకు ఈశ్వరుడనైన నన్ను పతిగా పొందు. దేవతలకన్న, దైత్యులకన్న బలవంతుణ్ణి ఓవరానన! (67) ముల్లోకములలో ఉన్న సుఖములన్నీ ఓ కల్యాణి! ఆవన్నీ! నా అనుగ్రహంతో అనుభవించు, అనుమానం లేదు. (68) ఓవర! ఏడు సాగరముల ఆవల బంగారుమయమైన, అందమైన పురమును దేవతల క్రీడ కొరకు బ్రహ్మనిర్మించాడు. (69) అక్కడికి వెళ్ళు, నీకు శుభమౌతుంది. ఓరామ! (స్త్రీ) నాతో రమించు. పుష్పోద్యానములతో కూడిన మహేంద్రుని ప్రియమైన వనము(70)నకు వెళ్ళు. నానా రత్నములతో అలంకరింపబడిన స్వర్ణమయమైన లంకకు వెళ్ళు. అక్కడికే వెళ్ళు నీకు మేలౌతుంది. ఓ రామ! (అందమైనదాన) నాతో రమించు. (71) మంచి కదలికలు కలది, మంచి వాసస్థానమైనది, ఆనందింప చేసేది, పుష్పములతో శుభమైనది అక్కడికి వెళ్ళు. (72) సుమేరుగుహకుకాని, మనోహరమైన పాలసంద్రానికిగాని వెళ్ళు. (73) సత్యలోకము బ్రహ్మలోకము రహస్య స్థలమునకు, । అందమైన గృహమునకు వెళ్ళు. (74) మహేంద్రముల సారముతో నిర్మింపబడిన, అందమైన మలయ పర్వత నివాసమునకు ఎప్పుడు మంచివాసనగల, చందనపు గాలితో శుద్దమైన (75) మాలతిపూల సమూహంతో అందమైన, మొగిలి, మాధవి వృక్షములు గల, అందమైన చంపక పుష్పముల గంధముతో చాలా మనోహరమైన అక్కడికి వెళ్ళు. (76) కోయిలల, తుమ్మెదల మధుర ధ్వని అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళు (77) ఇంద్రుని, వరుణుని, వాయువు, యముడు, కుబేరుడు, అగ్ని, ధర్ముడు చంద్రుడు (78) వీరిలోకముల మధ్యలో అందమైన లోకము కావాలనుకుంటే, ఓదేవి! అక్కడికి వెళ్ళు. (79) రత్నదీపము, మణిద్వీపము, అందమైన చంద్ర సరోవరము అక్కడున్నాయి అక్కడికి వెళ్ళు. నీకుమేలౌతుంది. ఓరామ! నాతో రమించు అక్కడ (80) అని పలికి అనుభవించుటకు వెళ్తున్న ఆతనితో ఆమె అంది. ఆతడు వ్యాజంగా, ఆమె సతీత్వమును తెలుసుకొనుటకు (నిజంగా ఆచరించటానికి కాదు) వెళ్ళాడు. (81) అప్పుడు ఆ రాకుమారి, కోపగించిన ముఖం, పెదవులు (నోరు) కళ్ళు గలదై ఇట్లా అంది. ఆ మాటలు హితమైనవి, సత్యమైనవి, పొందికైనవి, ధర్మముకొరకైనవి, కీర్తికరమైనవి. (82) వృంద వచనమిట్లా - ఓ మహాభాగ! ధైర్యం వహించు (బలహీనుడవు కాకు) జాతులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణులకు తపస్సు, సత్యము, వేదవతము, ధృతి మూలమైనవి (ప్రధానం).

అను ॥ అధర్ములకు పరస్త్రీలతో సంభోగము స్వభావము. ఓ విప్ర! అధర్మంతోనే దుష్టుడు అశుభములను పొందుతాడు. ఆ పైన శత్రువు జయి స్తే, వీడు మూలంతో సహనశిస్తాడు. (84) బలాత్కారంగా పతివ్రతలను పొందితే, వెంటనే తల్లిని పొందినంత పాపి ఔతాడు, నిశ్చయము. నూరు బ్రహ్మహత్యల పాపం పొందుతాడు. (85) సూర్యచంద్రులున్నంత వరకు కుంభీపాక నరకంలో వండబడుతాడు. కాగిన నూనెలో కాల్చబడ్డా చావడు. సూక్ష్మదేహంతో ఉంటాడు. (86) యమదూతలచే లోహదండములతో తల పై కొట్టబడుతాడు. క్షణకాల సుఖము చిరకాల దుఃఖానికి కారణము. అంతా నశించటానికి కారణము. (87) చేరరాని దానిని చేరి, ధర్మిష్ణుడు దుఃఖాన్ని తెచ్చుకోడు. క్షమించు. వెళ్ళు నీకు మేలు కలుగని. ఓ బ్రాహ్మణ! జ్ఞానదుర్బల! (88) దీప శిఖను చూచి (తాకి) పురుగు తప్పకుండా పడిపోతుంది. గాలం చివర మాంసాన్ని చూచి లుబ్దమీనము నశిస్తుంది. మృగం అట్లాగే (89) ఆకలిగొన్న భోక్త విషం కలిసిన తను పదార్థాన్ని తింటాడు (చస్తాడు). దుష్టుడు విషము లోపల కలిగి పైకి పాలవంటి స్వచ్ఛమైన ముఖంగల దుష్టుని చేరుతాడు. (90) అట్లా మనోహరమైన పరస్త్రీ, పద్మం లాంటి ముఖాన్ని చూచి మోహంతో భ్రాంతుడై లంపటుడౌతాడు. ముఖము రుచిరమైంది. పిరుదులు, స్తనములు అందమైనవి. కామమునకు ఆధారము. నాశనమునకు బీజము. అధర్మమునకు స్థానము. (92) లాల మూత్రములతో కూడిన భాగము (యోని) నరక కుండము. దుర్గంధము కలది. పాపమైనది. యముని దండనమునకు కారణము. (93) స్త్రీల యొక్క పాపమైన యోనియందు, లింగము (పురుష మర్మావయవం) ప్రవేశించగానే పురుషుడు ప్రతియుగంలో రౌరవనరకంలో ప్రవేశిస్తాడు. (జంట) (94) రహస్యమైన ఆపదను చూచి నీవు నన్ను తిరస్కరింప చూస్తున్నావు. ఇక్కడే దేవతలు, లోకపాలురు అంతా, ఓ బ్రాహ్మణ! (95) వెలుగుతూన్న ధర్మము సాక్షిగా ఉన్నారు. కర్మలకు శాసకుని యముని దండకర్తగా విష్ణువు స్వయంగా స్థాపించాడు. (96) స్వయంగా కృష్ణుడు ధర్మాత్ముడు. జ్ఞానరూపుడు, మహేశ్వరుడు. దుర్గ బుద్ధి. బ్రహ్మ మనస్సు. ఇంద్రియములు దేవతలు (97) ప్రాణులందరిలో కర్మలకు సాక్షిగా వీరుంటారు. ఓద్విజ! గుప్తమైనది, రహస్యమైనది, ఎక్కడుంది, ఓ జ్ఞాన దుర్బలుడ! బ్రాహ్మణ! (98) క్షమించు, వెళ్ళు, నీకు క్షేనుంకలగని బ్రాహ్మణ జాతిని చంపరాదు. నేను నిన్ను భస్మంగా చేయగలను, సమర్థురాలిని. కాని ఓవత్స! సుఖంగా వెళ్ళు. (99) నూట ఎనిమిది యుగముల నుండి నేను తపస్సు చేస్తున్నాను. నా తండ్రి గోత్రం లేదు. నాకు తల్లిదండ్రులు లేరు. (100) సర్వాంతరాత్ముడైన భగవాన్ కృష్ణుడు నన్ను రక్షిస్తున్నాడు, ఓ ద్విజ! కృష్ణుడు స్థాపించిన ధర్మమునన్ను ఎల్లప్పుడూ రక్షిస్తోంది (101) సూర్యుడు, చంద్రుడు. గాలి, అగ్ని ,బ్రహ్మ, శివుడు, భగవతి దుర్గ వీరు నన్ను ఎప్పుడూ రక్షిస్తున్నారు (102) హంసలను తెల్లగా సృష్టించినవాడు, చిలుకలను పచ్చగా చేసినవాడు, నెమళ్ళను రకరకాల రంగులు కలవానిగా చేసిన ఆ దేవుడే నన్ను రక్షిస్తాడు (103) అనాధలు బాలలు, వృద్ధులు, వీరిని దేవతలంతా రక్షిస్తారు. సాధారణ స్త్రీగా భావించి ధర్మాన్ని వదిలి, ఎప్పుడూ నన్ను చేరరాదు. (104) తల్లినైన నన్ను వదిలి, ఓ వత్స! సుఖంగా వెళ్ళు, అని పలికి ఆ దేవి అక్కడ భూమిలాగా నిలబడింది.

శ్రీభగవానువాచ :

బ్రహ్మోవాచ :

మహాదేవ ఉవాచ

సూర్య ఉవాచ –

అనంత ఉవాచ –

చంద్ర ఉవాచ –

మ హేంద్ర ఉవాచ –

వరుణ ఉవాచ –

పవన ఉవాచ –

వహ్నిరువాచ –

యమ ఉవాచ –

వృందోవాచ-

సంభోగించుటకు వస్తున్న ఆతనిని మాయబోధనతో, కోపంతోనూ, ఓ బ్రహ్మ బంధు! నీవు నశించిపో అని ఆమె శాపం పెట్టింది (106) ఓ దురాచారుడ నీవు నశించు. ఓ పాపిష్టుడ! నశించు. ఆమె శపించగా, సూర్యుడు స్వయంగా ప్రయత్నపూర్వకముగా నివారించాడు. (107) ఓ తండ్రి! ఇంతలో అక్కడ జగదీశ్వరులైన బ్రహ్మ విష్ణు శివాదులు మిక్కిలి భయపడి వచ్చారు (108) మొద్దులాగా ఉన్న ధర్ముని చూచి త్రిదశేశ్వరులు దుఃఖించారు. తన రొమ్ముపై ఉంచుకొన్న కుహువుకు (రాహువుకు) భయపడిన, చాలా కృశించిన చంద్రునివలె ఉన్నాడు,నిశ్చేష్టుడైనాడు మలినుడు, కాలిన వాడు ఐనాడు సతీకోపాగ్నితో, ఆతడు!ఓ ప్రజ! (109) భగవంతుని వచనమిట్లా - ఓ వృంద! నా భక్తురాల! జన్మమృత్యు ముసలితనములను హరించుదాన, క్షమించు. నాభక్తుడైన ధర్ముని రక్షించు. ఓపతివ్రత! ధర్మాన్ని రక్షించు (110) బ్రహ్మవచనమిట్లా - ధర్మం లేకపోతే జగమంతా చీకటితో నిండిపోతుంది. చంద్రసూర్యులు కంపించి పోతారు. శేషుడు కూడా కంపిస్తాడు, ఓ వసుంధర! (111) మహాదేవునివచనమిట్లా - ఓ సుందరి! ధర్మం లేకపోతే లోకమంతా నశిస్తుంది. ధర్ముణ్ణి బ్రతికించు. నీకు శుభం జరుగుతుంది. ఓవరానన! నీకు మంచి జరగని (112) సూర్యుని వచనమిట్లా - ఓ వృంద! నీ మనస్సులో ఏకోరిక ఉందో దాన్ని కోరుకో, నీకు మేలౌతుంది. ధర్ముణ్ణి బ్రతికించు నీకు మేలౌతుంది. ఓ పతివ్రత! సృష్టిని రక్షించు. (113) అనంతుడిట్లన్నాడు - తపస్సుతో ధర్మాన్ని ఆచరిస్తున్నావు. ధర్మాన్నేట్లా సంహరిస్తావు. ధర్ముణ్ణి బ్రతికించు. నీకు మేలౌతుంది. నీకు అన్ని ధర్మాలు సిద్ధిస్తాయి. (114) చంద్రుడిట్లన్నాడు - బ్రాహ్మణ రూపమును ధరించి ధర్ముడు నిన్ను పరీక్షించటానికి వచ్చాడు. బ్రహ్మ పంపగా వచ్చాడు. దోషం లేకుండానే శిక్షింపబడ్డాడు. (115) మ హేంద్రుడిట్లన్నాడు - తపస్సుతో ధర్మాన్ని సంపాదించావు. ధర్మంతో నరులకు ఫలం లభిస్తుంది. ఒకవేళ ధర్మం నశిస్తే తపస్సులకు ఇంకాఫలమేమి ఉంటుంది. (116) వరుణుడిట్లన్నాడు - ఓ ధర్మిష్ఠురాల! ధర్మాన్ని బ్రతికించు సనాతనమైన ధర్మాన్ని రక్షించు. ఓ ధార్మికురాల! ధర్మంలేకపోతే కర్మలు చేసేవారి కర్మ నిష్ఫలమౌతుంది. (117) వాయువిట్లన్నాడు - ఇప్పుడు ధర్ముని బ్రతికించు, ఓ శుభురాల! జగత్తును పవిత్రంగా చేయి. ధర్మం నశిస్తే నీ తపస్సులవల్ల కలిగే అపూర్వము నశిస్తుంది (118) అగ్నివచనమిట్లా - నీ ధర్మమును సంపాదించుట కొరకు భారతమునకు వచ్చావు. తెలియక ధర్మాన్ని చంపుతున్నావు. ఓసుందరి! తిరిగి ధర్మాన్ని బ్రతికించు (119) యముని వచనమిట్లా - విశ్వేశ్వరునకు ఆననమైనదానా (విశ్వేశ్వరుని ఆననంగా కలదానా) వేదోక్తంగా కర్మలు చేసే వారికి నేను ధర్మాన్ననుసరించి ఫలాన్ని ఇస్తాను. త్వరగా ధర్ముణ్ణి జీవింపజేయి (120) దేవతల మాటలను విని లేచి, ఆపతివ్రత, దేవతలందరికి నమస్కరించి, తపస్విని వారితో ఇట్లా అంది. (121) వృందవచనమీట్లో - బ్రాహ్మణ రూపంలో ఉన్నవానిని ధర్మునిగా నేను తెలుసుకోలేక పోయినాను, ఓ దేవతలార! నన్ను పరీక్షించటానికి వచ్చిన ఆతనిని కోపంతో నేను నశింపజేశాను. (122) మీ అనుగ్రహం వల్ల,ధర్ముణ్ణి తప్పకుండా బ్రతికిస్తాను. అని పలికి ఆవృంద, ఇట్లా అంది, ఓ వ్రజేశ్వర!

మూర్తిరువాచ –

శ్రీభగవానువాచ :

వృందోవాచ –

నా తపస్సు సత్యమైతే,నా విష్ణుపూజ సత్యమైతే, ఆ పుణ్యంతో, ఇక్కడి ద్విజుడు వెంటనే జ్వర రహితుడుకాని (124) నా వ్రతము - సత్యమైనట్లైతే, నా తపస్సు శుచిగలది సత్యమైనట్లైతే, ఆ సత్యమైన పుణ్యంతో ఈ బ్రాహ్మణుడు జ్వర రహితుడుకాని. (125) అన్ని ఆత్మలందుండే, నిత్యవిగ్రహుడైన నారాయణుడుసత్యమైతే, జ్ఞానాత్మకుడైన శివుడు సత్యమైతే ఈ ద్విజుడు జ్వరరహితుడుకాని (126) బ్రహ్మ సత్యమైతే ఆ దేవతలు సత్యమైతే ప్రకృతి పరమమైనదైతే, యజ్ఞము తపస్సు ఇవి సత్యమైనవైతే ఈ బ్రాహ్మణుడు జ్వరరహితుడుకాని (127) అని పలికి ఆ వృంద, ధర్ముని తన ఒడియందుంచుకొన్నది. కలారూపంలో ఉన్న ఆతనిని చూచి దయతో ఆసతి దుఃఖించింది. (128) ఇంతో ధర్ముని భార్య దుఃఖంతో కలతచెంది మూర్తి అను పేరు గలది వచ్చి, విష్ణువు పాదమందు శిరముంచి,నమస్కరించి ఆమె ఇట్లా పలికింది. (129) మూర్తి వచనమిట్లా - ఓనాథ! కరుణా సింధు దీన బంధు! నా పై దయజూపు. ఓ! జగన్నాథ! కృపామయ! నా భర్తను త్వరగా జీవింపజేయి. (130) పతిహీనమైన స్త్రీ, ఆమె సంసారసాగరమందుపాపిని, కళ్ళులేని ముఖంలా ప్రాణహీనమైన తనువులాంటిదామె. (131) తండ్రి పరిమితంగానే ఇస్తారు. బంధువులు, తల్లి వీరూ మితంగానే ఇస్తారు. సోదరుడు మితంగానే ఇస్తాడు. కొడుకు మితంగానే ఇస్తాడు. అన్నింటిని ఇచ్చేవాడు, ప్రభువు, పతి. (132) అని పలికి ఆదేవి, అక్కడే నిలిచి, దుఃఖించసాగింది. అప్పుడు సర్వాత్ముడు, ప్రకృతికి పరమైనవాడు అగు భగవంతుడు వృందతో ఇట్లన్నాడు. (133) భగవంతుని వచనమిట్లా - నీవు ఆయస్సును తపస్సువల్ల పొందావు. బ్రాహ్మణునకు నీవు పొందిన ఆయుస్సునే ధర్మునకు ఇవ్వు. ఓ సుందరి! నీవు గోలోకానికి పో (134) ఈ శరీరంతో, తపస్సుతో నన్ను తరువాత పొందుతావు. పిదప గోలోకానికి వచ్చి ఓ వరానన! వారాహమందు నీవు వృషభానసుతవై రాధాచ్చాయమౌతావు. (135) నాకలాంశమైన రాపాణుడు, వివాహమందు నిన్ను గ్రహిస్తాడు. రాసక్రీడయందు, గోపికలతో రాధతో కూడా నన్ను పొందుతావు. (136) రాధ శ్రీరాముని శాపం వల్ల వృషభానసుతయైతే ఆమెనే నిజమైన రాధ, నీవు ఛాయా స్వరూపిణి. (137) వివాహ కాలమందు రాపాణుడు (నీడవైన) ఛాయవైన నిన్ను స్వీకరిస్తాడు. నిన్ను ఇచ్చి వాస్తవమైన రాధ అంతార్ధనమౌతుంది. (138) గోకులమందలి మూడులంతా రాధయనే గ్రహిస్తారు (నిన్ను). రాధ పాదాంబజములను, వల్లవులు , కలలో కూడాచూడలేరు. (139) నిజమైన రాధ నారక్షణయందుంది. ఛాయా రాధ రాపాణుని కామిని. విష్ణువు మాటను విని, సుందరి, ఆయువునిచ్చింది. (140) కాల్చిన బంగారంలా వెలిగిపోతున్న పూర్ణధర్ముడు లేచాడు. ముందుకన్నా సుందరంగా ఉన్నాడు. శోభావంతుడుగా ఉన్నాడు. పరాత్పరునకు నమస్కరించాడు. (141) వృందవచనమిట్లా - ఓ దేవతలారా! తప్పించుకో వీల్లేని నామాటను సావధానంగా వినండి. నామాట అబద్ధంకాదు, వినండి (142) కోపంతో భయంవల్ల 'నశించు', అనేమాటను నేనన్నాను. మూడుసార్లు అట్లా మళ్ళీ అనకుండా, భాస్కరుడు,నన్ను నివారించాడు.

ఇదివరలో ఎట్లాగో ఇప్పుడూ అట్లాగే సత్యంతో పరిపూర్ణమైందిది. త్రేతాయుగమందు మూడు పాదములు, ద్వాపరమందు రెండు పాదములు సత్యము. (144) ఓహరి! కలిప్రథమ పాదమందు ఈ ధర్మము ఒకే పాదం కలదిగా ఉంటుంది. మిగిలిన షోడశాంశకల తిరిగి సత్యమందు ఇదివరలో వలె ఉంటుంది (145) నా నోటినుండి మూడుసార్లు నాశనము అని వచ్చింది అందువల్ల ఆ పిదప క్రమంగా క్రమంగా అట్లే. మనస్సులో మళ్ళీ అనుకుంటుంటే భాస్కరుడు వారించాడు. (146) అందువల్లనే ఈతడు కలిశేష మందు కళామయుడైనాడు. అట్లా శపింపబడి ఉన్నాడు. ఓదుర్గ! కలిశేషమందు అట్లా ఉండటం నిశ్చయము. (147) ఇంతలో ఓ నంద! దేవతలు రథాన్ని చూశారు. గోలోకం నుండి వేగంగా వచ్చింది. చాలా సుందరమైంది, శుభమైంది. (148) అమూల్య రత్నములతో నిర్మింపబడింది. వజ్రముల హారముతో అలంకరింపబడింది. మణుములు, మాణిక్యములు, ముత్యములు, వస్త్ర ములు, తెల్లని చామరములు వీనితో (149) అలంకరింపబడింది. భూషణములతో, అందమైన రత్న దర్పణములతో అలంకరింపబడింది. హరిని, హరుని బ్రహ్మను, దేవతలందరికిని వృంద నమస్కరించింది. (150) రథాన్ని చూచి దాని పైకి ఎక్కి ఆమె గోలోకానికి వెళ్ళింది. దేవతలు తమ స్థానానికి వెళ్ళారు. ఇంకా ఏం వినదలచావు (151) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు నారాయణ నారద సంవాద మందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు భగవంతుడు, నందుడు వీరిద్దరి సంవాదమందు ఎనుబది ఆరవ అధ్యాయము.