4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
58 - అధ్యాయము
మూ! శ్రీమన్నారాయణ ఉవాచ:
శ్రీనారాయణుడిట్లన్నాడు:
అన్నిటికి ఆధారము నేనే అని పృథివికి దర్పమేర్పడింది. ఆ దర్పాన్ని పృథు మహారాజుద్వారా ప్రభువు సంహరింప చేశాడు. (1) వేదమాతను నేనే అని సావిత్రికి దర్పమేర్పడింది. ఒక సందర్భంలో పుత్రులతో కూడిన ఆమెను కన్పించకుండా చేశాడు.(2) నేనే నిర్వాణాన్ని ఇచ్చే దాన్ని అని గంగకు దర్పమేర్పడింది. జగత్పతి ఆమె' దర్పాన్ని జహ్నుద్వారా హరింపజేశాడు (3) ఓ ముని! ఇది వరలో మనసదర్పమును దుర్గ ద్వారా హరింపజేశాడు. విరజను చేరిన కృష్ణుని కోపంతో బెదిరించసాగింది. (4) రాస గృహంలో ప్రవేశిస్తున్న వానిని గోపికలు నివారించారు. ద్వారపాలకులు, వేత్రహస్తులు దర్పంతో అతనిని కొట్టారు (5) తన భక్తుడైన సుదామునితో రాధ శపింపబడింది. త్వరగా దైవంతో తోసివేయబడి గోలోకం నుండి భూలోకానికి వచ్చింది. (6) వృషభాను భార్యయందు కలావతి యందు పుట్టింది, ఓ నారద (కృష్ణుడు) ఆమెను అనుసరిస్తూ కంసుని భయమనే నెపంతో (7) నందుని గృహమునకు వచ్చాను. అందుకే నన్ను నందనందను డంటారు. సుదాముని శాపవిచ్ఛేదమును పాలించే కొరకు జగత్పతి వచ్చాడు (8) తిరిగి మధురకు వెళ్ళాడు అని బ్రహ్మ అన్నాడు. ఈతని గొప్ప అభిప్రాయాన్ని ఎవరు తెలుసుకుంటారు, ఓ నారద! (9) ఎట్లా పుట్టాడు, మధుర నుండి గోకులానికి ఎట్లా వచ్చాడు, 'అని ఈవిధముగా చెప్పినది అంతా ఇంకా విను అని (10) నందుని నుండి నందనందనుడు మధురకెట్లా వెళ్ళాడో, నందుడు యశోద, దైవం వల్ల దుఃఖాన్నేట్లా పొందారో (11) ఎట్లా గోపులు, గోపికలు, ఆవులు, వృందావన మందు దుఃఖించారో విను. ప్రతి అడవి యందు వనంలో నివసించే వాళ్ళున్నారు. ఆ వన్యులు ఏదో కొంచెం తెలుసుకొని ఉంటారు. (12) అందమైన అడవి ఆ ఆడవి స్థానాన్ని కూడా వదలి ప్రతి అడవిలో, శ్మశానం, శ్మశానంకాని చోట, ఆమె తిరిగింది. ఓ ముని! (13) చేతనా చేతనములన్ని కొంతకాలము ఊళ్ళను వదిలి తిరిగాయి. పండగఅనేది లేకుండా ఆమె ప్రతిక్షణము ప్రార్థిస్తూ తిరిగింది. (14) ప్రతిక్షణము నిట్టూర్పు విడుస్తూ, క్షణకాలము చింతిస్తూ, క్షణ కాలం పడక యందుచేరి, కొంత సేపు లేచి కూర్చొని ఉండేది (15) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మ ఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు ఏబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
