4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
88 - అధాయ్యము
మూ!! శ్రీకృష్ణ ఉవాచ:
శ్రీనంద ఉవాచ:
అను!! శ్రీకృష్ణుడిట్లన్నాడు:
ఓతండ్రి! మేలుకో. ఓ తండ్రి మేలుకో. సచరాచరమైన సంసారమంతా నీటి బుడగలాటిది. (1) ఓ మహాభాగ! దీనిమీద మోహాన్ని విడిచి పెట్టు. పరాత్పరమైన మాయను, స్తుతించు. ఆమె పరమ, బ్రహ్మస్వరూపురాలు, మోహాన్నంతా నశింపచేసేది, ముక్తినిచ్చేది, మహాభాగ ఆమె. విష్ణుమాయ, సనాతని. (2) త్రిపురవధ కాలంలో ఘోరమైన మహాయుద్ధంలో భయంతో వ్యాకులమైన వేళ, ఆమెను స్తుతించి, శంభుడు, ఆరాక్షసుణ్ణి చంపాడు. (3) మోహములనన్నిటిని నవింపచేసే ఆస్తోత్రరాజాన్ని నీకు చెబుతాను. ఓనంద! ఆస్తోత్రము అన్ని వాంఛలను తీర్చేది. ఈసభలో విను. (4) నందుడిట్లన్నాడు - విఘ్నములన్నీ నశించే కొరకు, దుఃఖం కమించే కొరకు, ఐశ్వర్యము, కీర్తి వీనికొరకు, నరులకు వాంఛాసిద్ది కొరకు (5) మహాదేవి జగన్మాత యొక్క స్తోత్రాన్ని ఒకటి ఇస్తావా, ఓ జగత్ర్పభూ దుర్గతిని నశింపచేసే, సుదుర్లభమైన ఆస్తోత్రాన్ని బాగారక్షించాలి. (6) ఓ భక్తవత్సల! భక్తుడనైన వినీతుడనైన నాకు ఆ స్తోత్రాన్ని ఇవ్వు. నీవు వేదములకు జనకుడవు. నిర్గుణుడవు. పరాత్పరుడవు.
మూ॥ శ్రీభగవానువాచ:
శ్రీమహాదేవఉవాచ:
అను II భగవంతుని వచనమిట్లా: ఓ వైశ్యశ్రేష్ఠ ! పరమాద్భుతమైన స్తోత్రాన్ని చెబుతాను విను. మోహపాశాన్ని కత్తిరించే దాన్ని, అన్ని విఘ్నముల నాశం కొరకు చెబుతాను. (8) యుద్ధంతో భయపడిన శంకరుడు, విభువు చేసినస్తోత్రాన్ని, నారాయణుని ఉపదేశంతో, బ్రహ్మతో ప్రేరేపింపబడిచేసిన స్తోత్రాన్ని విను. (9) శత్రువులతో పట్టుబడ్డ శివుని చూచి హరిబ్రహ్మతో అన్నాడు. బ్రహ్మరథమందు, యుద్ధంలో పడిపోయిన శంకరునితో అన్నాడు. (10) శూర! సంకటములు నశించే కొరకు, దుర్గతిని నశింపచే సే దుర్గను, మూలప్రకృతిని, ఆద్యను బ్రహ్మ స్వరూపిణియైన ఆమెను స్తుతించు (11) ఓ సురేశ్వర! హరి పంపగా వచ్చి నేను నీకు బోధిస్తున్నాను. శక్తి యొక్క సహాయం లేకుండా ఎవడు ఎవ్వణ్ణి జయించటానికి సమర్థుడు? (12) బ్రహ్మమాటను విని శంకరుడు దుర్గను స్మరించాడు. భక్తితో తలను వంచినవాడై, చేతులు జోడించి స్మరించాడు. (13) స్నానం చేసి, కాళ్ళు కడిగికొని ఉతికినవస్త్రాలు ధరించి, ఆచమించి, కుశలు చేత ధరించి, శుచిగా, విష్ణువును కూడా స్మరిస్తూ స్మరించాడు. (14) మహాదేవుని వచనమిట్లా - దుర్గతిని నశింపచేసే ఓదుర్గ! ఓ మహాదేవి నన్ను రక్షించు రక్షించు. నేను నీభక్తుణ్ణి. నీ యందనురాగం కలవాణ్ణి, శత్రువులు నన్ను పట్టారు. నా పై దయచూపు (15) ఓ విష్ణుమాయ! సనాతని! మహాభాగే! నారాయణి! బ్రహ్మస్వరూపిణి ! పరమా! నిత్యానంద స్వరూపిణి! (16) ఓ జగదంబిక! నీవు బ్రహ్మాది దేవతలకు అంబికవు. నీవు గుణముల వల్ల సాకారరూపిణివి. గుణములు లేకుండటం వల్ల (నిర్గుణ) నిరాకారిణి. (17) మాయతో పురుషత్వం కలదానవు. మాయతో స్వయంగా ప్రకృతివి. ఆరెంటికి పరమైనది బ్రహ్మ. ఆ పరబ్రహ్మను నీవు భరిస్తున్నావు, ఓ సనాతని! (18) వేదములకు జననివి నీవు. సావిత్రివి, పరాత్పరవు. వైకుంఠంలో మహాలక్ష్మివి, సర్వసంపదల స్వరూపిణి. (19) పాలసముద్రంలో మర్త్యలక్ష్మివి,శేషశాయికి కామినివి. స్వర్గంలో స్వర్గలక్ష్మివి. భూతలమందు రాజలక్ష్మివి. (20) పాతాలంలో నాగాది లక్ష్మివి గృహంలో గృహదేవతవు. అన్ని పంటల రూపము నీవే. అన్ని ఐశ్వర్యముల కూర్చే దానివి నీవే (21) రాగాధిష్ఠాతృ దేవతవు నీవే బ్రహ్మకు సరస్వతివి. ప్రాణములకు అధిదేవతవు నీవు, కృష్ణ పరమాత్మకు (22) గోలోకంలో రాధవు, శ్రీకృష్ణుని వక్షంలో ఉంటావు. బృందావనంలోనే ప్రతి వనంలో గోలోకాధిష్ఠిత దేవివి నీవు. (23) బృందావనంలో వినోదించే, శ్రీరాసమండలమందుండే, రమ్యవునీవే శతశృంగాధి దేవివి నువ్వే. నీ పేరు చిత్రావలీ అని (24) ఒక కల్పంలో దక్షకన్యవు. ఒక కల్పంలో శైలజవు. దేవమాతయైన దితివి నువ్వే. అందరికి ఆధారమైన వసుంధరవు నువ్వే. (25) గంగ, తులసి, స్వాహా, స్వధా, సతీ ఇవి నీవే. నీ యొక్క అంశాంశాంశ కలతో వచ్చిన వారే దేవాది స్త్రీలంతా (26) నీవు స్త్రీ రూపిణిని, అతిపురుష రూపమునీవే, నీవే నపుంసకము. వృక్షములకు వృక్షరూపిణివి, సృష్టి (ఉత్పత్తి)లో అంకుర రూపానివి (27) అగ్నిలో కాల్చేశక్తివి, నీళ్ళలో చల్లదనానివి. సూర్యునిలో తేజోరూపిణివి. ఎప్పుడూ కాంతిరూపిణివి.
శ్రీదుర్గోవాచ :
శ్రీమహాదేవ ఉవాచ:
భగవత్యువాచ –
అను II భూమియందు గంధరూపిణివి, ఆకాశంలో శబ్దరూపిణివి. చంద్రునిలో కాంతిరూపానివి, పద్మసంఘమందు కూర్చంటావు, నిశ్చయము. (29) సృష్టియందు సృష్టి స్వరూపానివి పాలనయందు పాలించేదానివి. సంహారమందు మహామారివి, జలమందు జలరూపిణివి (30) ఆకలివి, దయవు, నిద్రవు, దప్పికవు, బుద్ధిరూపానివి. తుష్టివి, పుష్టివి, శ్రద్దవు, క్షమవు. (31) శాంతివి, భ్రాంతివి, కాంతివి, కీర్తివి, సిగ్గువు, మాయవు, భుక్తిముక్తి స్వరూపిణివి (32) శక్తి స్వరూపమంతా నీవే, అన్ని సంపదలనిచ్చే దానివి నీవే. వేదంలో వాక్కులతో నిర్వచింపరాని దానివి. నిన్నెవరు తెలుసుకోలేరు. (33) ఓసురేశ్వరి! నిన్ను స్తుతించటానికి, వేయి శిరముల (నోరుల) వాడు కూడా అసమర్థుడే. వేదములు, అసమర్థములు (నీవిషయంలో). ఏ విద్వాంసుడు కానీ, సరస్వతి కానీ అసమర్థులే.(34) విధాత అశక్తుడు. సనాతనుడైన విష్ణువు కూడా అసమర్థుడే. నా ఐదు ముఖాలతో ఏం స్తుతించగలను. నేను రణమందు భయపడ్డవాణ్ణి ఓ మహేశ్వరి (35) ఓ మహామాయ! దయజూపునా పై. నా శత్రువుల నాశనం చేయి, అని పలికి దీనంగా రథమందుండి, యుద్దంలో పడిపోగా (36) కోటి సూర్యుల కాంతిగల ఆదుర్గ ప్రత్యక్షమైంది. పరమాత్మయైన నారాయణునితో కృపతో ప్రేరేపింపబడింది. (37) శివుని ఎదురుగా వచ్చింది, శబవునకు జయం కలిగే కొరకు, త్వరగా వచ్చింది. మాయాశక్తితో రాక్షసుని జయించు అని మహాదేవి పలికింది. (38) దుర్గావచన మిట్లా - నీకు క్షేమం, నీ మనసులోని కోరిక ఏమిటో, ఆవరం కోరుకో. దేవతలకన్నా నీవు శ్రేష్టుడవు. నీకుజయాన్ని కల్గిస్తాను. (39) మహాదేవుని వచనమిట్లా - దైత్యుడు, నశించుగాక ఇదే నా వరము ఓ ఈశ్వరి, దీన్ని ఇవ్వు మిక్కిలి ఆద్యురాల! సనాతనీ! ఓ దుర్గ! ఇదే నావాంఛితము, అని (40) భగవతి వచనమిట్లా - హరిని స్మరించు, ఓ మహాభాగ! జగద్గురు! రాక్షసుని జయించు. నీవు స్వయంగా విధాతవు భగవంతుడవు. నీవు జ్యోతివి ఈశ్వరుడవు. (41) ఇంతలో విష్ణువు వృషరూపుడైనాడు. మూర్ధ భాగంతో శూలపాణి రథమును, విభువు ధరించాడు. (42) ఊర్ద్వ చక్రమును, ప్రకృతిని ఉగ్రముగాను చేశాడు, విష్ణువు. మంత్రపూతమైన అస్త్రమును ఇచ్చాడు. ఆపై రథమును ఎత్తాడు. (43) శివుడు శస్త్రాన్ని గ్రహించి, విష్ణువును, మహేశ్వరిని ధ్యానించి, వేగంగా త్రిపురాసురుణ్ణి చంపాడు. వాడు భూమి పై పడ్డాడు. (44) దేవతలు శంకరుని స్తుతించారు. పుష్ప వర్షం కురిపించారు. దుర్గ అతనికి శూలాన్ని ఇచ్చింది. విష్ణువు పినాకాన్ని ఇచ్చాడు. (45) బ్రహ్మ ఆశీస్సులిచ్చాడు. మునులు ఆనందించారు. దేవతలంతా నాట్యం చేశారు. గంధర్వులు, కిన్నరులు పాటలు పాడారు. (46) ఇంతలో (కు) ఓ తండ్రి ఇది ఉత్తమమైన స్తోత్ర రాజము. విఘ్నములకు విఘ్నాన్ని కూర్చేది. త్వరగా శత్రువుల సంహరించేది (47) ఐశ్వర్యము నిచ్చేది, సుఖమిచ్చేది. పరమమైనది. శుభమైనది. నిర్వాణమోక్షమిచ్చేది. హరిభక్తిని కల్గించేది, నిశ్చయము (48) గోలోకవాసాన్ని కల్గించేది. సర్వసిద్ధి ప్రదము, వరమైనది. ఈస్తోత్రరాజం చదవటం వల్ల పార్వతి ఎప్పుడూ ప్రసన్నురాలౌతుంది.
లోభము, మోహము, కామము, క్రోధములను, కర్మమూలములను నశింపచేసేది, బలము, బుద్ధి వీనిని ఇచ్చేది, జన్మము, మృత్యువు వీనిని నశింపచేసేది, ఈస్తోత్ర పఠనము. (50) నరులకు ధనము, పుత్రులు, ప్రియురాలు, భూమి అన్ని సంపదలను ఇచ్చేదిది. శోకదుఃఖములను హరించేది, అన్నిటిని సిద్ధింపజేసేది, వరమైనది (51) ఈ స్తోత్రరాజాన్ని చదివితే గొప్ప గొడ్రాలు కూడా సంతతి నందుతుంది. దుఃఖితుడు బంధనం నుండి ముక్తుడౌతాడు. భయము నుండి ముక్తుడౌతాడు, నిశ్చయము. (52) రోగి, రోగమునుండి ముక్తుడౌతాడు. దరిద్రుడు ధనవంతుడౌతాడు. దావాగ్ని మధ్యంలోనివాడు చావడు. గొప్ప సముద్రంలో నావ భగ్నమైనవాడు చావడు. (53) దొంగలబారినపడ్డవాడు, శత్రువులకు చిక్కినవాడు, హింసించే జంతువుల పాలబడినవాడు, నరుడు ఈ స్తోత్రం చదివితే కల్యాణాన్ని పొందుతాడు ఓ వైశ్యశ్రేష్ఠ! (54) కాంతివంతమైన వానిలో రత్నము, ఆశ్రమములలో (కు) బ్రాహ్మణుడు ఎట్లాగో , నదులలో గంగ, మంత్రములలో ప్రణవము, (55) ఆకులలో తులసి, భూములలో వసుంధర (ధరించేవానిలో), పుష్పములలో పారిజాతము, కట్టెలలో చందనము (56) తపస్సుచేసే వారికి విష్ణుపూజ, వ్రతములలో ఏకాదశీవ్రతం, జ్ఞానులలో శివుడు, సిద్ధులలో గణేశ్వరుడు (57) దేవతలలో విష్ణువు, శాస్త్రములలో ప్రధానమైన వేదములు, దేవతా స్త్రీలలో దుర్గ, శాంతరూపులలో లక్ష్మి (58) విద్వాంసులలో సరస్వతి, సుందర స్త్రీలలో రాధిక ఎట్లో అట్లాగే సోత్రములలో ఈ స్తోత్రము అలాటిది. దీన్నిమించింది లేదు, ఓప్రజ! (59) ఇదివరలో, సూర్య పర్వమందు పుష్కర తీర్థంలో దైత్యులకు పట్టుబడ్డ భయపడ్డ బ్రహ్మకు ఇవ్వబడిందీ స్తోత్రం. సర్వదుర్గములను (పోలేనివి) తొలగించేది, వరమైనది. (60) నా ఆజ్ఞతో శత్రుగ్రస్తుడైన శివునకు బ్రహ్మ ఇచ్చాడు. శివుడు, సనకాదులకు, దుర్వాసునకు ఇది వరలో ఇచ్చాడు. (61) భగవాన్ సనత్కుమారుడు దయతో గౌతమునకిచ్చాడు. పులహునకు, పులస్త్యునకు, ఆంగిరసునకు, సంతోషంతో ఇచ్చాడు. (62) అట్లాగే చంద్రునకు సూర్యునకు ఇచ్చాడు. సూర్యుడు యమునకిచ్చాడు. యముడు చిత్రగుప్తునకిచ్చాడు, ఇదివరలో దయతో, (63) గోలోకం పోవటానికై ఈ స్తోత్రాన్ని రోజు చదివితే , ఓ తండ్రి! ఆ పార్వతినే ఇక్కడ సాక్షాత్తుగా చూస్తావు. (64) ఎవడో ఒక పాపికి ఇవ్వరాదు. పాపినుండి దీన్ని రక్షించాలి. నారాయణుని భక్తునకు, శాంతునకు, విద్వాంసునకు (65) అన్ని తెలిసిన విప్రునకు ప్రయత్నపూర్వకంగా ఇవ్వాలి. ఎద్దులను తోలే విప్రునకు, గొడ్రాలి పతికి, (66) శూద్రులకు వంటచేసే వానికీ, శూద్రశ్రాద్ధాన్నాన్ని భుజించే వానికి, కన్యను విక్రయించేవానికి, ప్రత్యేకించి బ్రాహ్మణునకు (67) ఇస్తే, ఆతనికి ఈ స్తోత్రం సిద్ధిస్తే, అన్ని సిద్ధులను (సర్వసిద్ధి) పొందుతాడు. లక్షసార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే స్తోత్రసిద్ధిని పొందుతాడు నరుడు (68) అగ్ని స్తంబము, ‘జలస్తంబము, మట్టి స్తంబనము, మన స్తంబనము, వేయి అశ్వమేధములు, భూప్రదక్షిణము, (69) సర్వతీర్థముల స్నానము వీటన్నిటికన్న ఈ స్తోత్రము పుణ్యమునిచ్చేది. ఓ ప్రజ! నేను నీకు దీన్ని ఇచ్చాను. ఇది నాకు ప్రాణసమమైనది, ఓ తండ్రి! (70) ఇప్పుడు నా సభలో పార్వతీ స్తవాన్ని చెయ్యి. ఈ కృష్ణుని మాటలను విని, నందుడు తల పై పార్వతిని స్తుతించాడు.
ఓ విప్రేంద్ర! ఈ స్తుతితో , అన్ని సంపదలనిచ్చే , కోరతగిన, గోలోకవాసమును వరముగా, ఆతనికి దుర్గ ఇచ్చింది. (72) ఓముని! ఇది వేదములలో విన్పడనిది (చెప్పనిది) దుర్లభమైనది, పరమజ్ఞానము ఇది. గోలోకంలోను నీవు రాజేంద్రుడవే, చాలా దుర్లభమైన కృష్ణభక్తిని పొందుతావు. (73) తరువాత ఆదాస్యమును పొందాడు. అది చాలా గొప్పది సిద్దమైనది. శంభునితో మాట్లాడి, వరమిచ్చి దుర్గ వెళ్ళిపోయింది. నందనందనుని స్తుతించి దేవతలు, మునులు వెళ్ళిపోయారు. (74) నందునితో శ్రీకృష్ణుడన్నాడు - ప్రజవాసులతో కూడి నందమునకు వెళ్ళు. దుర్లభమైన బోధతో ఆనందించాడు నందుడు. ఆతని మోహం పోయింది. (75) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీభగవన్నంద సంవాదమందు ఎనుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
