4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

64 - అధ్యాయము

మూ॥ శ్రీనారాయణ ఉవాచ:

సత్యక ఉవాచ:

కంసఉవాచ :

శ్రీ నారాయణుడిట్లన్నాడు. పురోహితుడైన సత్యకుడు పరామర్శ అంత చేసి బుద్దిమంతుడైన శుక్ర శిష్యుడు,ఆతనికి హితము చెప్పాడిట్స్, ఓ ముని! (1) సత్యకుడిట్లన్నాడు. ఓ మహాభాగుడ! భయాన్ని వదులు.నీకు,నేను (తోడు) ఉండగా భయమెందుకు అన్ని అరిష్టములను నాశనం చేసే మ హేశుని యాగాన్ని చేయి.(2) యాగం పేరు ధనుర్యాగము. అధికమైన అన్నదానము, అధిక దక్షిణలు కలది. శత్రు భీతిని నాశనం చేసేది దుఃస్వప్నములను నశింపజేసేది (3) ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఎక్కువైన ఆధి భౌతికము, ఈమూటివల్ల ఉత్పన్నమయ్యే బాధలను ఖండించేది. ఐశ్వర్యం పెంచేది (4) యాగం సమాప్తి అయ్యాక శివుడు, ముసలితనము, మృత్యువులను హరించే వరమును, సాక్షాత్కరించి ఇస్తాడు. అన్ని సంపదలనిచ్చేవాడు (5) ఈ యాగమును ఇదివరలో మహాబలుడైన బాణుడు చేశాడు. నంది, పరశురాముడు, బలవంతులలో శ్రేష్ఠుడైన భల్లుడు చేశాడు. (6) ఇదివరలో ఈ ధనువును శివుడు నందీశ్వరునికిచ్చాడు. యాగంతో సిద్ధుడై (దేవయోని) ఆధార్మికుడు బాణునికిచ్చాడు. (7) యాగంచేసి మహాసిద్ధుడై పుష్కరక్షేత్రమందు రామునకిచ్చాడు. కృపానిధియై ఆపరశురాముడు కృపతో నీకిచ్చాడు. (8) ఓ రాజా! అదిపొడుగులో వేయిచేతుల పరిమితమైది. అతికఠినమైనది. పదిహస్తముల ప్రశస్తికలది, శంకరుని ఇచ్చతో నిర్మించబడినది. (9) పశుపతి యొక్క పాశుపతము జతలబండ్లతో కూడా మోయరానిది.

నారాయణుడు తప్ప మిగిలినవారంతా విరచటానికి సమర్ధులుకారు. (10) యాగమందు శంకరుని ధనుఃపూజను చేయి. శుభము కొరకై శంకరుని పూజను త్వరగా చేయి. అందరిని నియంత్రణము చేయి. (11) ఓ రాజ! ఈ యాగంలో ధనుర్భంగమైతే, యజమానుని నాశనమేర్పడుతుంది, అనుమానం లేదు (12) ధనుస్సు, భగ్నమైతే యాగముకూడా భగ్నమౌతుంది, నిశ్చయము. కర్మపూర్తికాకపోతే ఇక్కడ ఫలితమె వరిస్తారు. (13) ధనుస్సు మూలమందు బ్రహ్మ మధ్యలో నారాయణుడు స్వయంగా ఉన్నారు. ఓ మహామతి ధనుస్సు అగ్రమందు ఉగ్రప్రతాపంగల మహాదేవుడున్నాడు. (14) ధనుస్సు, మూడు వస్తువుల వికారము (మూడు వస్తువులతో చేయబడింది. మంచిరత్నములు పొందగబడినది, ఉత్తమమైనది. గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యుని కాంతిని కప్పిపుచ్చగలది. (15) మహాబలుడైన అనంతుడు వంచటానికి అశక్తుడు.సూర్యుడు కార్తికేయుడు వీరే వంచలేకపోయినారు. ఇతరుల సంగతి చెప్పేదేముంది, ఓ రాజ! (16) త్రిపురారి ఇదివరలో దీనితో త్రిపురసంహారం ఆనందంగా చేశాడు. మహోత్సవ మందు మంగళమున కరమైన వాటిని, నిర్భయంగా, స్వచ్ఛందంగా చేయి. (17) సత్యకుని మాటలను విని, చంద్రవంశాన్నివృద్ధిపరచేరాజు కంసుడు, ఎల్లప్పుడు హితాన్నికోరే సర్వార్థునితో అన్నాడు. (18) కంసుడిట్లన్నాడు - నన్ను చంపేవాడు, కులనాశనుడు వసుదేవ గృహమందు పుట్టాడు. నందనందనుడు నందుని గృహమందు స్వేచ్ఛగా పెరుగుతున్నాడు. (19) శూరులైన నా బంధువర్గాన్ని, సువిశారుదులైన మంత్రులను, పవిత్రమైన,నా చెల్లెలు పూతనను, బలవంతుడైన ఈ బాలకుడు చంపాడు.

సత్యక ఉవాచ:

రాజేంద్ర ఉవాచ:

వసుదేవ ఉవాచ:

బలవర్ధనుడైన బాలుడు ఒకచేతితో గోవర్ధనాన్ని ఎత్తాడు (ధరించాడు) శూరుడైన మహేంద్రుని అవమానపరిచాడు. (21) చరాచరమైన బ్రహ్మ రూపమును, బ్రహ్మను చూపించాడు. బాల,వతుల సమూహమునకు కృత్రిమంగా, ఆనందాన్ని కల్గించాడు. (22) సత్యక! బలవంతుడైన ఆతనిని చంపటానికే ఆలోచన చేయి. ఆతడు కాకుండా, మరోశత్రువు నాకు, ఈ భూమియందు లేడు. (23) స్వర్గంలో లేడు. పాతాళంలో లేడు. ముల్లోకములలో లేడు, నిశ్చయము. సజ్జనులైన రాజులు, నా బంధువులు అంతటా ఉన్నారు. (24) మహాతపస్వియైన బ్రహ్మ స్వయంగా తపస్వియైన శంకరుడు, అంతటా, అన్ని ఆత్మలను సమంగా చూచేవాడు (అన్ని ఆత్మలలో ఉన్న సమదర్శి), సనాతనుడు విష్ణువు (నా బంధువులు), (25) నందపుత్రుణ్ణి చంపి, నేను ముల్లోకములలో పూజనంది సార్వభౌముణ్ణతాను. గొప్పగా సప్తద్వీపములకు ఈశ్వరుణ్ణితాను. (26) దుర్బలుడు, దైత్యులతో జయింపబడ్డవాడైన ఇంద్రుని స్వర్గమందు చంపి, మహేంద్రుణ్ణితాను. సూర్యుని జయించి (27) నా పూర్వపురుషుడు, క్షయరోగియైన ఇరంద్రుని, వాయువును, కుబేరుని, వరుణుని, యముని తప్పకుండా జయిస్తాను. (28) నందవ్రజమునకు త్వరగా వెళ్ళు నందుని, నందనందనుని, ఆతని అన్నయైన బలవంతుడైన బలరాముని ఇప్పుడు తీసుకురా. (29) కంసుని మాటను విని ఆ సత్యకుడు ఆతనితో ఇట్లన్నాడు. మితమైనది, సత్యమైనది, నీతిసారము గలది. అట్లాగే మిక్కిలి, సమయానుగుణమైన మాటఅన్నాడు. (30) ఆసత్యకునిమాట ఇట్లా- అక్రూరునికాని, ఉద్ధవుని కాని, వసుదేవునికాని, నీకిష్టమైన నందవ్రజమునకు వారిని పంపించు, ఓ మహాభాగ! (31) సత్యకుని మాటను విని, ఆ సభలో ఉన్న, స్వర్ణసింహాసన మందు కూర్చున్న వసుదేవునితో ఆతడిట్లన్నాడు (32) రాజేంద్రుని పలుకులిట్లా - నీతిశాస్త్రముల తత్వమెరిగిన వాడివి, ఉపాయములందు విశారదుడవు నీవు (ఉపాయం=పొందు). ఓ బంధు! వసుదేవసుతుని ఆలయమునకు నందవ్రజమునకు వెళ్ళు (33) వృషభానుని నందుని, బలరాముని, నందనందనుని, గోకులంలో ఉండే అందరిని యజ్ఞంకై త్వరగా తీసుకురా. (34) నాలుదిక్కులకు పత్రికను తీసుకొని దూతలువెళ్ళని. రాజులకు, మునులకు, అందరికి విజ్ఞాపన చేయటానికి, ఆనందంగా వెళ్ళని. (35) రాజుమాటవిని, కంఠము, తాలువు, పెదవులు ఎండిపోగా, హృదయంలో తనను తాను నిదించుకుంటూ (పరితపిస్తూ) బ్రహ్మ (వసుదేవుడిక్కడ) ఇట్లా మాట్లాడాడు. (36) వసుదేవుని వచనము - ఓ రాజేంద్ర! ఇక్కడ, ఇప్పుడు నేను వెళ్ళటము తగదు. వసుదేవనందనునకు విజ్ఞాపన చేయటానికి నందవ్రజానికి నేను వెళ్ళతగదు. (37) నీ యాగమందు, మహోత్సవ మందు నందపుత్రుడు వస్తే నీతో కూడా ఆతనికి తప్పకుండా విరోధమౌతుంది. (38) నేను ఆతనిని తీసుకువచ్చి యుద్ధం చేయిస్తాను, అనేది నాకు క్షేమంకాదు. దానికి విఘ్నమౌతుంది. నీకూ విఘ్నమౌతుంది. (39) తండ్రితీసుకుపోయినాడు, కృష్ణుడు చచ్చాడు అని అందరంటారు. లేదా వసుదేవుడు, కొడుకుద్వారా రాజునే చంపించాడు అనైనా అంటారు. (40) ఇద్దరిలో ఒకరికి వెంటనే మృత్యువు కలుగుతుంది. శూరులు పడిపోతారు. మాంసం లేకుండా (చావకుండా) యుద్ధంలేదు. (41)

వసుదేవుని మాటలు విని కళ్ళు ఎర్రతామరల వలె కాగా, నృపతులకు ఈశ్వరుడు (రాజు) ఖడ్గము తీసుకొని ఆతనిని చంపటానికి వెళ్ళాడు (42) మిక్కిలి బలవంతుడైన ఉగ్రసేనుడు హా! హా! అని అంటూ పుత్రుడైన మహారాజును ఆ క్షణంలోనే వారించాడు, ఓ ముని! (43) కోపావిష్టుడై వసుదేవుడు, తన పీఠం నుండి లేచి ఇంటికి వెళ్ళాడు. రాజు, నంద ప్రజానికి వెళ్ళటానికి అక్రూరుని ప్రేరేపించాడు. (44) అట్లాగే అన్ని దిక్కులకు త్వరగా దూతలను బయల్దేరదీశాడు. మునులంతా వచ్చారు తమ పరివారంతో సహ రాజులొచ్చారు. (45) దిక్పాలురు, అందరు దేవతలు, బ్రాహ్మణులు, తపస్వులు, సనక సనందులు నిర్వహణకై, అట్లాగే పంచశిఖులు వచ్చారు. (46) బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ, భగవానుడైన సనత్కుమారుడు కపిలుడు, ఆసురి పైలుడు, సుమంతుడు, సనాతనుడు వచ్చారు. (47) పులహుడు, పులస్త్యుడు, భృగువు, క్రతువు, అంగిరుడు, మరీచి, కశ్యపుడు, దక్షుడు, అత్రి, చ్యవనుడు (48) భరద్వాజుడు, వ్యాసుడు, గౌతముడు, పరాశరుడు, ప్రచేతుడు, వసిష్ఠుడు, సంవర్తుడు, బృహస్పతి (4) కాత్యాయనుడు, యాజ్ఞవల్క్యుడు, ఉత్తంకుడు, సౌభరి, పర్వతుడు, దేవలుడు, జయించాలనే కోరికగల (జైగీషవ్య) జైమిని (50) విశ్వామిత్రుడు, సుతపుడు, పిప్పలుడు, శాకటాయనుడు, జాబాలి, జాంగలి, ఆపిశలి, శిలాలికుడు , (51) ఆస్తికుడు, జరత్కారువు, కల్యాణమిత్రకుడు, దుర్వాసుడు, వామదేవుడు, ఋష్యశృంగుడు,విభాండకుడు (52) పథి, కవి, కణాదుడు, కౌశికుడు, పాణిని, కౌత్సుడు, అఘమర్షణుడు, వాల్మీకి, లోమహర్షణుడు (53) మార్కండేయుడు, మృకండుడు, పరురాముడు, సాంకృతి, అగస్త్యుడు, వాంతుడు అట్లాగే ఇతర మునులు వచ్చారు. ఓముని! (54) శిష్యులు, పుత్రులతో కూడి బ్రాహ్మణులు, తపస్యులు వచ్చారు. జరాసంధుడు, దంవక్తృడు, దాంభికుడు, ద్రవిడాధిపుడు (55) శిశుపాలుడు, భీష్మకుడు, భగదత్తుడు, ముద్గలుడు, ధార్తరాష్ట్రుడు, ధూమకేశుడు, ధూమ కేతువు, శంబరుడు, (56) శల్యుడు, సత్రాజిత్తు, శంకుడు, ఇతరులు మహాబలవంతులైన నృపులు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, మహాబలుడు అశ్వత్థామ, (57) భూరిశ్రవుడు, శాల్వుడు, కైకేయుడు, కౌశలుడు (రాజు) వచ్చారు. వీరందరిని మహారాజు తగిన రీతిగా పలుకరించాడు. శుభక్షణము చూచి సత్యకుడు యజ్ఞదినాన్ని ఏర్పరచాడు అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు కంస యజ్ఞమును గూర్చి చెప్పటమనునది అరువది నాల్గవ అధ్యాయము సమాప్తము II