4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

14 - వృక్షార్జున భంజనము

శ్రీ నారాయణ ఉవాచ :

నారాయణముహర్షి యిట్లు పలికెను :

ఒకసారి నందుని భార్యయగు యశోద స్నానము కొరకు యమునా నదికి వెళ్లగా ఆవులపాడితో నిండియున్న ఇంటిని చూచీ మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) నవ్వను. (తన విలాస లీలలకు సమయము చిక్కినందున). ఇంటియందున్న పెరుగు పాలు నెయ్యి మజ్జిగ మనస్సు నానందపరచు వెన్న మొత్తము తీని - త్రాగీ వస్త్రములతో ముఖమును తుడుచుకొనుటకు ప్రయత్నించుచున్న బాలకునీని స్నానము చేసి ఇంటికి చేరవచ్చిన ఆ గోపిక (యశోద) చూచెను. పాడియంతయు శూన్యమై పగిలియున్న కుండలను బానలను, తేనె మొదలగు పదార్థములు ఏమి లేకుండ శూన్యమైన పాత్రలను ఆమె చూచెను.

అక్కడ నున్న బాలురను చూచీ ఆమె “అబ్బా! ఈ పని చాలా ఆశ్చర్యముగా నున్నది. మీరు సత్యము చెప్పండి. ఎండీ దారుణమైన పనిచేసెను” అని ప్రశ్నించెను. ఆమె మాట విని ఆ బాలురు మొత్తము వృత్తాంతమును చెప్పిరి. “ఈ బాలుడే (శ్రీకృష్ణుడు) మొత్తము తిన్నాడు. ఇది సత్యము. మాకే మాత్రము పెట్టలేదు” అని అనిరి.

బాలురమాట విని నందునీ యిల్లాలు కోపముతో కన్నులు ఎఖదామరపలె కాగా బెత్తము తీసుకొని పరుగెత్తాను. శివుడు మొదలగు దేవతాశ్రేష్ఠుల ధ్యానమునకు లొంగనివాడు (గోచరముగానివాడు) యోగిజనులకు పొందరాసిపోడగు గోవిందుడు పరుగులు పెట్టుట వలన ఆమె అతనిని పట్టుకొనలేకపోయెను. యశోద అటు తిరిగి తిరిగి ఓడలంతయు చెమటలు పోసి - గొంతు దవడల పెదవులు ఎండిపోయి - బాగుగా అలిసి - అతిశయించిన కోపముతో నిలిచిపోయెను. అలిసిపోయిన తల్లిని చూచి దేయదలచినవాడై ఆ పురుషోత్తముడు - జగదీశ్వరుడగు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తల్లిముందర నిలిచెను.

తనకు చిక్కిన కుమారుని చేతబట్టుకోని యశోదాదేవి తన మందిరమునకు వచ్చి ఇంటి ముందున్న వృక్షమునకు వస్త్రముతో కట్టివేసి శ్రీకృష్ణుని తాడించెను (కొట్టెను). అట్లు బంధించి ఆమె యింటిలోనికీ బోయెను. జగత్తులకు పతియగు శ్రీహరి చెట్టు మొదట అట్లే నీలిచియుండెను. ఆ ప్రభువు తాకినంతనే పర్వతమంతయున్న చెట్టు హఠాత్తుగా భయంకర శబ్దముతో నేలగూలెను. ఆ వృక్షము నుండి మంచి అలంకారము గల దివ్యపురుషుడొకడు ఆవిర్భవించి (పుట్టీ - లేచి) స్వర్ణాభరణములు పీతాంబరము ధరించియున్న - జగన్నాధునకు (శ్రీకృష్ణునకు) నమస్కరించి ప్రకాశించేడి రథము నెక్కి తన లోకమునకు వెళ్లిపోయెను.

రత్నాభరణములచేత అలంకరింపబడియున్న ఆ బాలుడు చిరునవ్వు నవ్వుచు తెల్లని కాంతి ప్రసరింప జేసెను.

ప్రజమునకు రాణియైన యశోద వృక్షము పడిపోవుట చూచి భయముతో వణికి చేరవచ్చి ఏడ్చుచున్న ఆ శ్యామసుందరుడగు బాలునెత్తుకొనెను. ఆ ధ్వని వీని గోకులములోని గోపాలురు గోపికలు నందునీ యింటికీ పరుగున వచ్చి ఆ శిశువును ఏడ్వకుండ ఓదార్చుచు యశోదను కోపముతో బెదరించిరి.

ఓ సందరాణీ ! ప్రజేశ్వరీ ! మిక్కిలిగా వయస్సు గడిచిపోయిన ముసలితనమున నీకు కొడుకు పుట్టినాడు. ధనధాన్యములు రత్నములు మొదలగు అమూల్య వస్తువులన్నియు పుత్రుల ఉపయోగము కొరకే కదా ! అమ్మా! నీకు మంచి బుద్ధిశక్తి లేదని మాకు స్పష్టముగా తెలిసినది. పుత్రుడు తినని పదార్థమెంత యున్నయు వ్యర్థమే సుమా. ఓ కఠినురాలా ! పాడి నష్టమైనదని పిల్లవానిని చెట్టుకు కట్టివేసి ఇంటిపనులలో మునిగియుంటివే. దైవికముగా చెట్టుపడిపోయెను. చెట్టుకూలి పోయినను నీ భాగ్యము వలన కొడుకు జీవించినాడు. మూఢురాలా ! ఈ బాలకుడు (పసివాడు) చచ్చిన యెడల నీకు వస్తువులన ఏమి ఉపయోగము ?

అప్పుడు బ్రాహ్మణులు వందీజనులు బాలునకు శుభాశీస్సులు పలికిరి. ఒక సహ్రాహ్మణుని చేత శ్రీహరీ నామ సంకీర్తనము (సహస్ర నామస్తోత్రపారాయణము) జరిపించిరి. ఇట్లు కార్యము నిర్వహించి జనులందరు తమ తమ యిండ్లకేగిరీ.

అప్పుడు సందుడు కోపముతో కన్ను లెఱ్ఱ తామరలవలె కాగా భార్యతో నీక్రింది విధముగా పలికెను.

నంద ఉవాచ :-

నందుడు యిట్లు పలికెను :

బాలకుని మెడకు గట్టుకొని నేడే నేను తీర్థయాత్రలకు వెళ్లిపోదును. లేదా నీవింటి నుండి వెళ్లిపొమ్ము. నీతో నాకేమి ఉపయోగము. సూరు చేదబావులకన్న ఓక దిగుడు బావి మేలు. ఒక సరస్సు (ఊట, చెరువు) వంద దిగుడు బావులకు సమానము. నూరు సరస్సులకన్న ఒక యజ్ఞమధికమైనది. వంద యజ్ఞముల కంటే ఒక పుత్రుడధికము. తపస్సు దాసముల వలన కలుగు పుణ్యము ఇంకొక జన్మలో సుఖమిచ్చును. పుత్రుడు ఈ లోకమందు పరలోకమందును సుఖమును కలిగించును. ఇట్లు నందుడు భార్యతో పలికి శాంతుడై తన యింట నిలిచెను. యశోదయు రోహిణియు గృహకర్మలందు నిమగ్నులై ఉండిరి.

నారద ఉవాచ :-

నారదుడు యిట్లు పలికెను :

ఓ భగవన్ ! గోకులమున వృక్షరూపమున నున్న సువేషము గల ఆ పురుషుడెవరు ? ఏ కారణము వలన వృక్షరూపము పొందిస్తాడు?

నారాయణ ఉవాచ :-

నారాయణమహర్షి యిట్లు పలికెను :

కుబేరుని పుత్రుడు నలకూబరుడన్న పేరు గలవాడు క్రీడార్థమై రంభతోబాటు నందన వనమున కేగెను. మనోహరమైన ఒక పుష్పోద్యానములో సరస్సు ఒడ్డున మఱ్ఱిచెట్టు సమీపమున నీర్జన ప్రదేశములో పూలగాలితో పరిమళవంతమైన చోట పుష్పశయ్యనమర్చి చందనము అగురు కస్తూరి కుంకుమ ద్రవములతో దానిని తీర్చి రత్నాల దీపములతో వెలుచు చుట్టు పూలదండలు పట్టు వస్త్రములు వ్రేలాడుచుండగా వాడు రంభను చేరదీసి యథేచ్ఛగా విహరించెను. వివరీతాది ప్రవర్తనలతో ఎనిమిది రకములైన శృంగార క్రీడా సుఖమును, ఆయాస్థానములందు నిరూపించబడిన ఆరు ప్రకారముల చుంబసమును(ముద్దు) ఉభయుల అంగాంగములను కలుపు మువ్విధముల ఆలింగనమును నఖముల దంతముల వాడియైన క్షతముల క్రీడను చేయుచు ఇట్లారసిక శేఖరుడు క్రీడించెను.

జలమందును అటనుండి స్థలప్రదేశమునను మరల స్థలము నుండి జలమందును ఆకామశాస్త్ర నైపుణ్యము గల నలకూబరుడు విహరించెను.

ముడివిడిపోయిన తలవెండ్రుకలతో - బలసిన పిరుదులు స్తనములతో - నఖముల యొక్క దంతముల యొక్క గాయములతో - నిలువెల్ల పులకించిన శరీరముతో - వంకరలైన బోమముడుల చూపులతో - రత్న కుండలముల కాంతితో వెల్లుచున్న చెక్కిళ్లతో (చెంపలతో) చిత్ర విచిత్రములైన రత్నహారములతో - పుష్పహారములతో - మువ్వల మొలనూలితో - నుదుట సిందూరపు చుక్కబొట్టుతో - ప్రాణనాథుడైన నలకూబరుడు తన పైననే చూపులు నిలుపగా ప్రేమ చిరునవ్వులతో నతని చూచుచున్న నగ్నమూర్తియైన రంభను, ఆమెతో గూడి యుండి (హఠాత్తుగా కన్పించిన మహర్షిని చూచి గూడ) పులకించిన శరీరముతో మరల మన్మథక్రీడకు పూసుకొన్న నలకూబరుని దేవలముని చూచెను.

“ఓ పాపిష్టుడా! వృక్షరూపమును పొందుము. గోకులమునకు పోయి ఈ శాపమనుభవించుము. శ్రీకృష్ణ స్పర్శ లభింపగనే శాపము తీరి మరల నీ లోకము పొందుదువు గాక” అని ముని నలకూబరుని శపించి కామర్తురాలైన రంభను చూచి నీవు మనుష్య స్త్రీగా జన్మింతువు గాక. జనమేజయుని సుందర పత్నీవగుదువు. ఇంద్ర సంయోగము వలన తిరిగీ, శాపవిమోచనము పొంది ఈ లోకమునకు వతువు అని పలికి ముని తన ఆశ్రమమునకు వెళ్లిపోయెను. కుబేరపుత్రుడు తన గృహమున కేగెను. నారదా ! నీ ప్రశ్నకు ఉత్తరము చెప్పితిని. ఇక రంభ కథ చెప్పుదును వినుము.

రంభ భారతఖండమున సుచంద్రనృపతీ యింట జన్మించెను. ఆకన్య శ్రేష్ఠమైన సౌందర్యము గలదై లక్ష్మీస్వరూపముగా నుండెను. ఆ సుచంద్రుడు కన్యను చక్కగా నలంకరించి నానా విధ మంగళ పదార్థములతో బాటు జనమేజయునకు కన్యాదానము చేసెను. ఆ సౌభాగ్యవతి జనమేజయునకగ్రమహిషియయ్యెను. ఆ రోజు జనరహితమైన అనేక ప్రదేశములలో విహరించుచు నామెతో సుఖమనుభవించెను.

ఒకసారి ఆ రాజశ్రేష్ఠుడు అశ్వమేధయాగమారంభించి దీక్షలోనుండెను. ఇంద్రుడు యజ్ఞాశ్వమును మాటుగా చేసుకొని ఆ మందిరముననే ఉండెను. పూజాకాలమున చూచిన యజ్ఞాశ్వము చాల యందముగానున్నదని భావించి సుందరియగు రాజపత్ని ఆసక్తితో దానిని చూచుటకై ఒంటరిగా అక్కడికి వెళ్లెను. ఆ సాధ్విని చూచి ఇంద్రుడు ఆ యశ్వము ప్రక్కనే ప్రత్యక్షమై ఆ సతిని బలాత్కరించెను. ఆమె నివారించుచున్నను ఆగక ఇంద్రుడక్కడ ఆమెతో రమించెను. ఆ తరువాత రాత్రి పగలు తెలియక ఇంద్రుడక్కడనే మూర్ఛపోయెను. ఆమె అట్లు ఇంద్రుని సంభోగమాత్రము చేత (బ్రతుక నిష్టపడక) యోగశక్తితో దేహత్యాగము చేసెను. ఇంద్రుడాతర్వాత తను చేసిన పనికి సిగ్గుపడి రాజుకు భయపడి స్వర్గమునకేగిను.

రాజు తన భార్య మరణించిన వార్త విని చూచి మాటి మాటికి మిక్కిలి దుఃఖించెను. ఆ వెనుక యజ్ఞము ముగించీ బ్రాహ్మణులకు నిండు దక్షిణలిచ్చెను. రంభయు మానవ శరీరము వదిలి స్వర్గమునకేగెను. ఓ నారదమహామునీ ! నీకేవిధముగా మద్ది చెట్టును (స్వామి) విరుచుట (కూల్చుట) రంభాసలకూబరులు శోషమోక్షము పొందుట చెప్పితిని. శ్రీకృష్ణచరిత్రము జన్మమృత్యువులను జరను (ముసలితనమును) తొలగించునట్టిది, పుణ్యప్రదమైనది. ఇక నీకు తరువాతి కథను చెప్పుదును.

ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ఆర్జునవృక్ష భంజనమనెడి పదునాల్గవ అధ్యాయము సమాప్తము.