4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

82 - అధ్యాయము

మూ॥ నంద ఉవాచ:

శ్రీభగవానువాచ :

నందుడిట్లన్నాడు - ఓ మహాభాగ! అంతా విన్నాను. ఓ ప్రభు! దుఃస్వప్నాన్ని గూర్చి చెప్పు. విను, అని ఆతనికి భగవంతుడు ఆమాట చెప్పాడు. (1) భగవంతునివచనమిట్లా - కలలో ఆనందంతో నవ్వితే, వివాహాన్ని చూస్తే, నాట్యము పాట ఇష్టమైంది వింటే ఆతనికి ఆపద తప్పదు.(2) పళ్ళు కొరకటం, నడుస్తూన్నట్టు చూడటం జరిగితే వానికి ధనహాని జరుగుతుంది. శరీర సంబంధమైన పీడకల్గుతుంది. (3) నూనెతో తలంటుకొని, దక్షిణ దిక్కుగాపోతే, గాడిద, ఒంటె, మహిషము వీటిని ఎక్కినట్టు కన్పిస్తే వాడికి మృత్యువు కల్గుతుంది అనుమానం లేదు. (4) కలలో, చెవిలో దాసనపువ్వు, అశోకము, గన్నేరు కన్పిస్తే, నూనె ఉప్పు, వీటిని చూస్తే వానికి ఆపద సంభవిస్తుంది. (5) దిగంబరి, నల్లనిది, ముక్కు కోయబడ్డది శూద్రునిది విధవ స్త్రీ, జడముడి, తాటిపండు వీనినిచూస్తే దుఃఖం కల్గుతుంది. (6) కలలో కోపంతో ఉన్న బ్రాహ్మణుని, కోపంగల బ్రాహ్మణ స్త్రీని చూస్తే వానికి ఆపద సంభవిస్తుంది. ఇంటినుండి లక్ష్మిపోతుంది, నిశ్చయము. (7) అడవిపూలు, ఎర్రనిపూవు, పూచిన మోదుగ, దూది, తెల్లని వస్త్రము వీటిని చూస్తే దుఃఖాన్ని పొందుతాడు. (8) పాడుతున్న దాన్ని, నవ్వుతున్నదాన్ని, నల్లచీరకట్టుకున్న స్త్రీని,నల్లని విధవస్త్రీని చూస్తే నరుడు మృత్యువును పొందుతాడు. (9) దేవతలు నాట్యం చేస్తే, పాటలు పాడితే, నవ్వితే, పెద్దగా అరిస్తే, పరుగెత్తితే (కలలో) ఆమనిషి మరణిస్తాడు. (10) వాంతి, మూత్రము, పురీషము, వైద్యుడు వెండి, బంగారం వీనిని ప్రత్యక్షంగా కానికలలోకాని చూస్తే వాని జీవితము పదిరోజులు మాత్రమే ఉంటుంది. (11) నల్లచీర ధరించిన స్త్రీని, నల్లనిమాలలు, నల్లని మై పూతగలదానిని కలలో కౌగిలించుకుంటే, వాడికి చావు కల్గుతుంది. (12) చనిపోయిన మృగపు దూడ (పిల్ల)తల గొరిగించుకున్న వాడి తల, అస్థికలమాల కన్పిస్తే వానికి ఆపద తప్పదు. (13) గాడిద, ఒంటే వీటితో కూడిన రథము, దీనిని ఒంటరిగా ఎక్కినట్టు కన్పిస్తే, వెంటనే మెలకువ వస్తే మృత్యువు కల్గుతుంది అనుమానం లేదు. (14) హవిస్సుతో, పాలతో తేనెతో, మజ్జిగతో, బెల్లంతో కాని అభ్యంగస్నానం చేసిన కలవస్తే వానికి పీడ తప్పదు. (15) ఎర్రచీర ధరించిన స్త్రీని, రక్తమాలను ఒంటిపూతనుగలదాన్ని కలలో కౌగిలించుకుంటే వానికి వ్యాధి తప్పదు. (16) పడిపోయిన గోళ్ళను, వెంట్రుకలను నిర్వాణపు అగ్నిని (చితిది), భస్మంతో నిండిన చితినిచూస్తే, మృత్యువుపొందుతాడు. (17) శ్మశానము, ఎండినకర్ర, గడ్డిపోచలు, లోహము, శమీవృక్షాన్ని కొద్ది నలు పైన గుర్రాన్ని చూస్తే దుఃఖాన్ని పొందుతాడు, నిశ్చయము. (18) పాదుకను, ఫలకము (డాలు), ఎర్రని పూమాల, భయానక దృశ్యము, మినుములు, చిరు సెనగలు, పెసలు వీటిని (కలలో) చూస్తే వెంటనే పుండు కలుగుతుంది.

అను ॥ కడియము, తొండ, కాకి, ఎలుగుబంటు, కోతి, గవము (గోవా, గుహనా) మలము, శరీర మలము కలలో చూస్తే ఇవి వ్యాధికి కారణమౌతాయి (20) పగిలిన కుండ, గాయపడ్డ శూద్రుడు, కుష్ఠురోగం కన్పిస్తున్న రోగిని, ఎర్రని వస్త్రంగల సన్యాసి, పంది, మహిషము, గాడిద (21) మహాఘోరమైన అంధకారము, బ్రతికిన వానిని భయంకరంగా చచ్చిన వానినిగాను, . ఇవన్నీ కలలో చూస్తే యోనిని, లింగాన్ని కలలో చూస్తే ఆపద నందుతాడు, తప్పదు.(22) కుత్సితమైన వేషము రూపముగల మైచ్చుని, భయంకరమైన యమదూతను, చేత పాశం ధరించినవానిని, పాశశస్త్రమును కలలో చూస్తే నరుడు మృత్యువు నందుతాడు. (23) బ్రాహ్మణుడు, బ్రాహ్మణి, పిల్ల, పిల్లవాడు, కొడుకు, కూతురు, ఏడుస్తున్నట్లుగాని కోపంతో ఉన్నట్టుగాని చూస్తే దుఃఖాన్ని పొందుతాడు (24) నల్లనిపూవు, నల్లనిమాల, ధాన్యము, శస్త్ర, అస్త్రధారి వికృత ఆకారంగల మేచ్ఛస్త్రీ వీరిని చూస్తే మృత్యువు నందుతాడు తప్పదు. (25) ప్రాణం పోయిన; మృతుని చూస్తే మృత్యువునందుతాడు, తప్పదు. మత్స్యాదులను ఎవడు ధరిస్తాడో వాని భౌతమరణిస్తాడు తప్పదు. (26) వాద్యము, నర్తనము, పాట పాడటము, ఎర్ర వస్త్రము, వాయిస్తున్న మృదంగం వానిని చూస్తే దుఃఖాన్నందుతాడు, తప్పదు. (27) ఛిన్నమైన శరీరాన్ని లేదా మొండెమును, వికారంగా ఉన్న వెంట్రుకలు విరియబోసుకున్న, వేగంగా నాట్యం చేస్తున్న వానిని చూస్తే నరుడు మృత్యువు నందుతాడు, (28) చచ్చినవాడైనా చచ్చినదైనా, భయానకమైన నల్లని మేచ్ఛ కలలో ఎవడిని కౌగిలించుకున్న వాడు చస్తాడు తప్పదు. (29) పండ్లు పడిపోయినట్టు, వెంట్రుకలు రాలిపోయినట్టు కలగంటే వానికి ధనహాని కలుగుతుంది. వానికి శరీరంవల్ల ఏదోపీడకల్గుతుంది. (30) కొమ్ములు గలవి, కోరలు గలవి కలలో ఇబ్బంది పెడే పిల్లలుకాని మానవులు కాని బాధిస్తే వానికి రాజకులం నుండి భయం వస్తుంది (31) విరిగిన వృక్షాన్ని, రాళ్ళ వానపడటం, ఉముక, మంగలికత్తి, ఎర్రని నిప్పుకలు, బూడిద వానవీటిని కలలో చూస్తే దుఃఖాన్ని పొందుతాడు. (32) ఇల్లు పడిపోవడం, పర్వతం పడటం, భయంకరమైన తోకచుక్కను, భుజం విరిగిన మనిషిని కలలో చూస్తే దు:ఖాన్ని పొందుతాడు. (33) రథము, ఇల్లు, పర్వతము, చెట్టు, గోవు, ఏనుగ, గుర్రము, ఆకాశము వీటినుండి భూమి పై పడుతున్నట్లు కలలో చూస్తే వాడికి ఆపద తప్పదు నిశ్చయము. (34) బూడిద, నిప్పులు గల గోయిలో పైనుండి పడ్డట్టు, కారపుకుండములందు, కారపు పొడులందు పడ్డట్టొ కలగంటే వారికి చావు తప్పదు, అనుమానం లేదు. (35) దుష్టుడు, బలవంతంగా తన తల పై నుండి ఛత్రమును తీసుకున్నట్లు కలగంటే వాని తండ్రి, కాని గురువుకాని రాజుకాని మరణిస్తారు. (36) దూడతో కూడి, భయంతో సురభి (ఆవు) ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నట్టు కలవస్తే ఆపాపి యొక్క లక్ష్మి పోతుంది, భూమిపోతుంది. (37) తాడుతో కట్టి తీసుకుపోతున్నట్టు యమదూతలు లేదా ప్లేచ్ఛులు కన్పిస్తే వానికి మృత్యువు నిశ్చయము. (38) కరణం (జోస్యుడు) బ్రాహ్మణుడు, బ్రాహ్మణి గురువు వీరు కోపించి శపించినట్లు కలవస్తే వానికి ఆపద తప్పదు. (39) శత్రువులు, కాకులు, కోళ్ళు, ఎలుగుబంట్లు, వచ్చి శరీరం పై పడ్డట్టు కలవస్తే వానికి చావు నిశ్చయము.

మహిషములు, ఎలుగుబంట్లు, ఒంటెలు, పందులు, గాడిదలు, ఇవి కోపంతో పరుగెత్తుతున్నట్లు కనిపిస్తే ఆతడు రోగగ్రస్తుడౌతాడు నిజము (41) ఎర్రచందనం కట్టెలు నేతిలో ముంచిహోమం చేస్తే గాయత్రి మంత్రంతో వేయి మార్లు హోమం చేస్తే దానిని శాంతిగా చెప్పారు. (42) భక్తితో మధుసూదనుని వేయిసార్లు జపిస్తే వాడు పాపరహితుడౌతాడు పీడకల ఫలం పోయి సుఖవంతుడౌతాడు. (43) అచ్యుతుడు, కేశవుడు, విష్ణువు, హరి, సత్యము,జనార్థనుడు, హంస, నారాయణుడు ఈ ఎనిమిది పేర్లు స్మరిస్తే శుభమౌతుంది. (44) శుచిగా తూర్పుముఖంగా, ప్రాజ్ఞుడు, పదిమార్లు జపిస్తే ఆతడు పాపరహితుడౌతాడు పీడకల, మంచిఫలాన్నే ఇస్తుంది. (45) విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, మాధవుడు, మధుసూదనుడు, హరి, నరహరి, రాముడు గోవిందుడు, దధివామనుడు (46) భద్రకరమైన ఈ పది పేర్లను భక్తితో జపించాలి. భక్తితో నూరుమార్లు జపిస్తే రోగం పోతుంది. (47) లక్షసార్లు జపిస్తే బంధనం నుండి ముక్తుడౌతాడు, నిశ్చయము. పది లక్షలమార్లు జపిస్తే మహావంధ్య కూడా సంతానం పొందుతుంది. (48) హవిష్యం తినే వాడు. ఎట్లా శుద్ధుడో అట్లా దరిద్రుడు ధనవంతుడౌతాడు. కోటిమార్లు జపిస్తే నరుడు జీవన్ముక్తుడౌతాడు. (49) ఓం నమః శివుడు, దుర్గ, గణపతి, కార్తికేయుడు, సూర్యుడు, ధర్మము, గంగ, తులసి, రాధ, లక్ష్మి, సరస్వతి, (50) ఈ పేర్లు శుభకరమైనవి. నీటిలో స్నానం చేసి వీనిని జపించినవాడు, ఆతడు తన కోరికను పొందుతాడు. చెడుకల మంచిదౌతుంది. (51) ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వదుర్గతి నాశినికి మహామాయకుస్వాహా. (52) పది హేడక్షరముల ఈ మంత్రము లోకములకు కల్పవృక్షము వంటిది. శుచిగా పదిసార్లు జపిస్తే దుఃస్వప్నంకలవాడు సుఖవంతుడౌతాడు. (53) నూరు లక్షల జపంతో నరులకు మంత్రము సిద్ధిస్తుంది. మంత్రసిద్దిపొందినవాడు వాంఛితమైన సర్వసిద్ధిని పొందుతాడు. (54) ఓం నమోమృత్యుంజయాయ అని స్వాహాంతంతో ఈ మంత్రాన్ని లక్షసార్లు జపించాలి. కలలో మరణాన్ని చూచినవాడు కూడా నరుడు నూరు సంవత్సరాల ఆయుర్దాయం కలవాడౌతాడు. (55) పూర్వ ముఖంగా లేదా ఉత్తరముఖంగా కూర్చోని స్వప్నమును గూర్చి ప్రాజ్ఞునకు చెప్పాలి. తాగినవాడు లేదా మాంసం తినేవాడు (కాశ్యపం) దుర్గతుడు, నీచుడు, దేవబ్రాహ్మణ నిందకుడు మూర్ఖుడు, అనభిజ్ఞుడు వీరికికలను చెప్పరాదు. (56) అశ్వత్థము, జ్యోతిషుడు, విప్రుడు, పితృదేవ ఆసనములు, ఆర్యుడు, వైష్ణవుడు, మిత్రుడు, వీరికి పగటి కలగూర్చి చెప్పాలి (57) అని పాపనాశనమైన, పుణ్యకరమైన కథను నీకు చెప్పాను. ఇది విన్నవారు ధన్యులు. కీర్తికరము ఆయుష్కారకమిది. ఇంకా ఏం వినదలిచావు (58) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీ భగవంతుడు, నందుడు వీరి సంవాదంలో ఎనుబది రెండవ అధ్యాయము.