4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
12 - శకటభంజన, యోగనిద్రోక్త కవచన్యాసము
శ్రీ నారాయణ ఉవాచ :
నారాయణమునీ పలికెను.
ఒకసారి నందుని భార్యయగు యశోదాదేవి ఆకలిగొన్న శ్రీకృష్ణుని ఒడిలో చేర్చుకొని ఆనందముగా పాలిచ్చుచుండెను. ఇంతలో నామే యింటికి ముదుసలులు, పడుచువారు, బాలికలు ఐన గోపికలు గోపాల బాలురు చేరవచ్చిరి.
వచ్చిన వారికి మర్యాదలు చేయవలెనన్న సంతోషములో ఆ సాధ్వియైన యశోద ఆకలి తీరకముందే పిల్లవానీని త్వరగా మంచము మీద పడుకో బెట్టి గోపికలకు నమస్కరించెను. వారికి తైలము, సిందూరము తాంబూలము, భూషణములు, వస్త్రములు భుజించు పదార్థములు ఇచ్చుచుండెను.
ఇంతలో ఆకలితో నున్న మాయా ప్రభువగు శ్రీకృష్ణుడు తన పాదాలు చాచి ఆడించుచు (తన్నుకొనుచు) ఏడ్చుచుండెను. అది మాయా నటనము. ఓ నారదా అట్లు తన్నుకొనుచుండగా సమీపమున నున్న బండి చక్రమున కాపాదము తాకెను. ఆ విశ్వంభరుని (విశ్వము మోయువాడు) పాదపుదెబ్బకు అది పొడిపొడియై బండి మొత్తము విరిగిపడెను. విరిగి పడిన దాని కజ్జలు తాకి పాలు పెరుగు వెన్న నెయ్యి లేని పాత్రలన్నియు పడిపోయి పదార్థమంతయు నేలపాలాయెను.
ఆ ఆశ్చర్యకరమైన సంఘటనను గోపికలు చూచి భయముతో బాలకుని వద్దకు పరుగెత్తి విరిగిన బండిని ఆ కట్టల నడుమ నున్న శిశువును పగిలిన కుండలను నేలపాలైన పెరుగు పాలను చూచిరి, భయముతో యశోదా దేవి కఱలను తొలగింప జేసి తన మాయచేతనే ఏ ప్రమాదము రాకుండ కాపాడబడిన కుమారుని ఎత్తుకొనెను. ఆకలితో నకనకలాడుచు ఏడ్చుచున్న ఆ శిశువుకు పాలిచ్చుచు ఆ సంఘటనకు కలతచెంది వెక్కి వెక్కి యేడ్చెను.
ఏమాశ్చర్యము ! హఠాత్తుగా బండి యెట్లు విరిగినది? అట్లు విరుగుటకు ఏమి కారణము కన్పించుట లేదే? అని గోపాలురు బాలకుల నడిగిరి. దానికి బాలకులందరు మామాట వినండి. నమ్మండి. శ్రీకృష్ణుని పాదపు దెబ్బకే బండి విరిగినది అనీ పల్కిరి. ఆ మాటలు విని గోపాలురు గోపికలు సంతసముతో నవ్వుకొనిరి. రేపల్లెలోని జనము ఆ వార్తవిని నమ్మక అసత్యమిది” అని పలికిరి.
ఆ శిశువునకు చేయవలసిన స్వస్తి మంగళమును (స్వస్తి వాచనమును) బ్రాహ్మణ శ్రేష్టులు చేసిరి, ఒక బ్రాహ్మణుడు శిశువు శరీరమున హస్తముంచీ కవచమంత్రమును పఠించెను. ఓ నారదా! ఆ కవచము సర్వరక్షణ చేయునది. జలశాయి (జలమున పండుకొనువాడు) యైన జగన్నాథుడు మహాసముద్ర జలమున నిద్రించియున్న సమయమున అతని నాభి కమలమున జన్మించిన చతుర్ముఖ బ్రహ్మ మధుకైటభులను రాక్షసులకు భయపడి భగవంతుని ప్రార్థించుచు సతిచేయుచుండగా భీతుడగు అతనికి విష్ణు మాయాదేవి పూర్వము దేనిని ఉపదేశించినదో ఆ కవచమును నీకు చెప్పెదను వినుము.
యోగ నిద్రోవాచ :
యోగనిద్ర ఇట్లు పలికెను:
సృష్టించిన జగత్తునకు నాథుడవగు ఓ బ్రహ్మ! నీ భయమును దూరము చేసికొనుము. శ్రీహరి యుండగా నీకేమి భయము, నేనుండగా నీకేల విచారము, సుఖముగా నుండుము అని అనెను.
నీ ముఖమును శ్రీహరి కాపాడుగాక. నీ శిరస్సును మధుసూదనుడు, నీ కన్నులను శ్రీకృష్ణుడు, నీ నాసికను (ముక్కు) రాధికాపతి రక్షించుగాక, మాధవుడు నీ కర్ణములను రెంటీని, కంఠమును శిరస్సు పై భాగమును కాపాడు గాక. హృషీకేశుడు నీ క్రింది పెదవిని, గదాగ్రజుడు నీ పలువరుసను రక్షించుగాక, నీ నాలుకను రాసేశ్వరుడు దవడను సర్వవ్యాపకుడగు వామనుడు రక్షించుగాక.
ముకుందుడు నీ వక్షస్థలమును దైత్యసంహారకుడు నీ గర్భమును రక్షించుగాక. నాభిని జనార్ధనుడు మేహనమును (లింగము) విష్ణువు కాపాడుగాక. పురుషోత్తముడు పిరుదులను, గుహ్యము (మర్మావయవము)ను రక్షించుగాక. అన్నీ సంకటములలో అన్ని ప్రదేశములలో నృసింహాడు నీ హస్తములను, వరాహమూర్తి నీ పాదములను కాపాడుగాక.
నీ ఊర్ధ్వ భాగమును నారాయణుడు క్రింది భాగమును కమలాపతి (లక్ష్మీభర్త) రక్షించుగాక. నీ తూర్పుదిశను గోపాలుడు, అగ్ని దిశను రావణాంతకుడు, వనమాలి దక్షిణ దిశను, వైకుంఠుడు నైఋతి దిశను కాపాడుగాక, సజ్జన రక్షకుడగు వాసుదేవుడు పశ్చిమ దిశను, పుట్టుకలేని విష్టరశ్రవుడు ఎల్లప్పుడు నీ వాయవ్య దిశను రక్షించుగాక. జలజాసనుడు (పద్మము పై కూర్చుండువాడు) తన తేజస్సుతో నీ ఉత్తర దిశను, ఈశ్వరుడు ఈశాన్య దిశను కాపాడుగాక, అంతట (పదివైపుల నుండి) శత్రుజేత రక్షించుగాక.
జలమందు నేలమీద ఆకాశమున నిదురలోను నిన్ను రాఘవుడు రక్షించుగాక.
పూర్వము నేను స్మరించినంత మాత్రమున దయతో శ్రీహరి నాకుపదేశించిన అద్భుతమైన ఫలమిచ్చునట్టి ఈ కవచమును నీకు చెప్పితిని. పూర్వము నూరేళ్ల ఆకాశమున నిలిచి భయంకరమైన యుద్ధమును నేను శుంభ రాక్షసునితో చేయవలసి వచ్చినది. గురి కన్పించని భయంకరమైన ఆ శుంభునితో సంభవించిన యుద్ధములో ఆకాశమున నిలిచిన నాకు ఈ కవచము లభించగనే దీని మహిమ వలస వాడు ఓడింపబడి చచ్చి నేలమీద పడెను. శుంభడట్లు చావగనే ఆకాశమున నిలచిన దయాళువగు గోవిందుడు కవచముతో బాటు నాకొక మాలనిచ్చి గోలోకమునకు వేంచేసెను.
(ఓ నారదా! కల్పాంతరమున జరిగిన యీ వృత్తాంతము దయతో నీకు చెప్పితిని} ఈ కవచ ప్రభావము వలన లోపలి భయముండదు. కోటిసంఖ్యలలో బ్రహ్మలు సృష్టికర్తలు} నేను చూచుచుండగా గడచిపోయిరి. నేను శ్రీహరితో బాటు ప్రతి కల్పమున (సృష్టి మొదలై అది గడచి ప్రళయమగు వరకుండు కాలమును కలమందురు) నేనును స్థిరముగా నుందును. అని యోగనిద్ర (మాయాదేవి} బ్రహ్మాకు చెప్పి కవచమిచ్చి (ఉపదేశించి అంతర్ధానమయ్యెను. అపుడు కమలోద్భవుడు జంకు లేకుండ స్వామీ నాభి కమలమున నిలిచియుండెను.
బంగారు తాయెత్తులో ఈ కవచము లిఖించిన పత్రమును బిగించి మెడలో గాని కుడి హస్తమున (మోచేచి పై భాగము) గాని విజ్ఞుడెప్పుడును కట్టుకొనవలెను. అట్టివానీకి నీరు అగ్నీ జలము శత్రువుల నుండి భయము కలుగదు. జలమందు స్థలమందు ఆకాశమందు నిద్రా దశయందును వానిని భగవంతుడు రక్షించును. యుద్ధరంగమున, పిడుగుపాటులో, ఆపదలలో, ప్రాణ' సంకట సమయములో ఈ కవచమును స్మరించినంతనే చదువుకోనగనే జంకు భయము లేనిపోడగును. ఈ కవచమును శంకరుడు కంఠమున బంధించుకొనియే పూర్వము త్రీపురములను కష్టసాధ్యులైన ఆ త్రిపురాసురులను విలాసముగా సంహరించెను. కాళికాదేవి ఈ కవచమును కట్టుకోనియే రక్తబీజ రాక్షసుని నమిలి చంపెను. వేయి తలల శేషుడును దీనిని ధరించియే ఈ విశ్వమును నువ్వుగింజను ధరించునట్లు తేలికగా ధరించును. మేమిద్దరము (నరనారాయణులు} జీవుల యొక్క కర్మలకు ధర్మకార్యములకు సాక్షిగా నుండు సనత్కుమారుడును ఈ కవచ ప్రభావము వలననే అంతట జయము పొందు వారముగా నున్నాము.
(గోకులమందు సందునింట) బ్రాహ్మణుడు ఆ నంద శిశువు కంఠమందు కవచమును కట్టెను. శ్రీహరి స్వయముగా తన కవచమును తన కంఠమున ధరించెను. ఈ విధముగా శ్రీవారి యొక్కయు కవచము యొక్కయు మొత్తము ప్రభావమును చెప్పితిని. ఓ నారదా! అనంతుడును అచ్యుతుడుసు ఐన స్వామి యొక్క ప్రభావము సాటిలేనిది సుమా.
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో శకట భంజనము యోగనిద్ర చెప్పిన కవచస్యానమనెడి పన్నెండవ అధ్యాయము సమాప్తము.
