4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
65 - అధ్యాయము
మూI శ్రీనారాయణ ఉవాచ :
అక్రూర ఉవాచ:
అను । శ్రీనారాయణుడిట్లన్నాడు: కంసుని మాటను విని, ధర్మవంతులలో శ్రేష్ఠుడైన ఆ అక్రూరుడు శాంతుడు, సంతోషించిన మనస్సు గలవాడై, శాంతుడైన ఉద్దవునితో ఇట్లా అన్నాడు (1) అక్రూరుడిట్లా - ఈరాత్రి, సుప్రభాతంగా మారింది (మంచి ఉదయం). నాకు శుభదినమైంది. గురువులు, విప్రులు, దేవులు, నా విషయంలో ఆనందించారనేది నిశ్చయము (2) కోటి జన్మలలో సంపాదించిన పుణ్యము నాకు స్వయంగా వచ్చింది. శుభ, అశుభమైన కర్మఫలం అంతా నాకు లభించింది. (3) కర్మలతో బద్ధుడనైన నాకు బంధమనే ఈ సంకెల తొలగిపోయింది. సంసార కారాగారము నుండి ముక్తుడనై, హరి పదానికి (స్థానం) పోతున్నాను. (4) కోపంగల, విద్వాంసుడైన కంసుడు, నాకు స్నేహవస్తువైనాడు. నన్ను (యాచించి స్నేహితునిగా) చేశాడు. ఆతని (దేవుని) కోపము నాకు వరంతో సమానంగా ఐంది. (5) వ్రజమునకు రాజైన వానిని తీసుకురావటానికి, ఇప్పుడు ప్రజమునకు వెళ్తాను, (గొల్లపల్లె పశువులుండేచోట). భక్తిముక్తులను ఇచ్చే పూజ్యుడైన ఆ పరముని (పరుడు) చూస్తాను. (6) కొత్త మేఘం వలె శ్యామలవర్ణంవాడు, నల్లకలువ వంటి కళ్ళు గలవాడు, పీత వస్త్రముతో కూడిన కటి ప్రదేశం గలవాడు. (7) దుమ్ముతో బూడిద వర్ణంగా మారిన శరీరం కలవాడు, లేదా చందనంతో పూయబడ్డ శరీరం కలవాడు లేదా వెన్నతో పూయబడ్డ శరీరం కలవాడు, చిరునవ్వు గలవాడు, అట్టి వానిని చూస్తాను (8) లేదా వినోదం కొరకై మనోహరంగా మురళిని వాయిస్తున్నాడో, లేదా ఇటునటు ఆవుల సమూహమును నడిపిస్తున్నాడు, (9) లేదా ఉన్నాడో ఒకచోట వెళ్తున్నాడో, నిద్రిస్తున్నాడో అట్టివానిని తప్పకుండా చూస్తాను. ఈ వేళ ఎటువంటి ఆజ్ఞ ఇచ్చారు. బాగా (సమయం) చూచి మంచిక్షణమందు చెప్తాను. (10) బ్రహ్మ విష్ణు శివాదులు ఆతని పాదపద్మాన్ని ధ్యానిస్తున్నారు. అనంతమైన విగ్రహం గల అనంతుడు కూడా ఆతని అంతాన్ని తెలుసుకోలేదు. (11) ఆతని ప్రభావాన్ని, దేవతలు, సజ్జనులు ఎల్లప్పుడు తెలుసుకోలేరు. ఆతని స్తోత్రం చేస్తూ, భయపడి సరస్వతిదేవి జడంగా మారింది. (12) మహాలక్ష్మికూడా ఆతని ధ్యాసయందు దాసిగా నియోగించబడి కన్పిస్తోంది. సత్వరూపిణియైన గంగ ఆతని పాదాంభోజముల నుండి ప్రవహించింది. (13) అదిజన్మ మృత్యు జరవ్యాధులను తొలగించేది. త్రిభువనములన్నింటికి పరమైనది. దర్శనం వల్ల స్పర్శలవల్లను నరుల పాతకముల హరించేది. (14) త్రైలోక్యములకు తల్లి, దేవి, మూలప్రకృతి, ఈశ్వరి, తొలగింపరాని బాధలను నశింపచేయగలది ఐన దుర్గ ఆతని పాదాం భోజముల ధ్యానిస్తున్నది. (15) ఆ మహావిష్ణువు యొక్క రోమకూపములందు విశ్వములున్నాయి. స్థూలమైనదానికన్న, స్థూలతరుడైన వాని రోమములందు అసంఖ్యాకములైన, విచిత్రములైన లోకములున్నాయి. (16) ఆతడు సర్వేశ్వరునిలో పదహారవ భాగము. ఓ బంధు! మాయామానుషరూపుడైన ఆతనిని చూడటానికి వెళ్తున్నాను. (17) అంతా వాడే, అన్ని అంతరాత్మలలోనువాడే, సర్వజ్ఞుడు - ప్రకృతికన్న పరమైనవాడు, బ్రహ్మజ్యోతిఃస్వరూపుడు, భక్తులను అనుగ్రహించే కొరకు విగ్రహమైనవాడు (రూపమెత్తాడు). (18) నిర్గుణుడు, కోరికలు లేనివాడు ఆనందం అనేది ఆయనకు లేదు, ఆశ్రయము లేనివాడు, పరముడు, పరమానంద స్వరూపుడు, సానందుడు, నందనందనుడు (19) స్వేచ్ఛామయుడు, సర్వుల కన్న పరుడు, అందరికి బీజమైనవాడు, సనాతనుడు అని యోగులు ఎప్పుడు అంటూంటారు. ఆ శిశువును రాత్రింబగళ్ళు ధ్యానిస్తుంటారు. (10) (గుణాతీతుడు, సుఖదుఃఖాతీతుడు వగైరా)
అను! మన్వంతర సహస్రములు, నిరాహారుడై, కృశోదరుడై,పద్మమందు బ్రహ్మతపస్సు చేశాడు. ఇది వరలో పాద్మమందు కృతయుగంలో చేశాడు. (21) మళ్ళీ అంత తపస్సు చెయ్యి అప్పుడు నన్ను చూడగలవు, అని ఒకసారి మాటవినబడింది. ఐనా ఆతనిని చూడలేదు. (22) అంతకాలము తిరిగి తపస్సుచేసి వరాన్ని పొందాడు, ఆతనిని చూచాడు. అలాంటి పరమేశుని ఈరోజు చూడబోతున్నాను. ఓ ఉద్ధవ! (23) బ్రహ్మవయస్సు ఎంతో, అంతకాలము శివుడు తపస్సు చేశాడు, ఇది వరలో, జ్యోతిర్మండల మధ్యమందు, గోలోకమందును, ఆతనిని చూచాడు. (24) సర్వతత్వుడు, సర్వసిద్ధుడు, నాకు తత్వము, పరుడు, వరుడు, ఆతనిని పొందాడు. ఆతని పదాంబుజములందు, నిర్మలమైన, స్థిరమైన భక్తిని పొందాడు శివుడు (25) తన భక్తుని, భక్తవత్సలుడు తన ఆత్మ సమంగా చేశాడు. ఇలాంటీపరమేశుని ఈరోజు చూడబోతున్నాను. ఓ ఉద్దవ! (26) వేయి ఇంద్రులు పడిపోయేంతకాలము నిరాహారుడై, కృశోదరుడై అనంతుడు భక్తితో పరమాత్మనుగూర్చి తపస్సు చేశాడు (27) అప్పుడు ఆ ఈశ్వరుడు, ఆతనికి ఆత్మ సమమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇలాంటి పరమేశుని ఈవేళ చూడబోతున్నాను. (28)వేయి ఇంద్రులు పడిపోయేంత కాలము ధర్ముడు తపస్సు చేశాడు. అప్పుడు ఆతడు అందరు చేసే కర్మలకు, ధర్మములకు (కలవారికి) సాక్షియైనాడు. (29) ఆతని అనుగ్రహం వల్ల శాసించేవాడు, ఫలమునిచ్చేవాడు, ఐనాడు ఇక్కడి నరులకు ఇలాంటి సర్వేశుని ఈరోజు చూడబోతున్నాను ఓ ఉద్ధవ! (30) ఇరువది ఎనిమిది మంది ఇంద్రుల పతనమునకై ఎన్ని రాత్రిబంగళ్ళెతాయో (పతనము 1 పగలు 1 రాత్రి) ఆక్రమంగామాస, అబ్దములతో నూరు సంవత్సరాలు బ్రహ్మ వయస్సు (31) అలాంటి బ్రహ్మ విభువు యొక్క రెప్పపాటు కాలములో పతనమౌతాడు, ఎంత ఆశ్చర్యకరం. ఇలాంటి పరమాత్మను ఈవేళ చూడబోతున్నాను, ఓ ఉద్ధవ! (32) భూమిమీది రేణువుల సంఖ్య తెలియనట్లే బ్రహ్మల సంఖ్య అనంతము. అట్లాగే విశ్వములకు బంధువు (బంధము) వాటికి ఆధారము, మహావిరాట్టు (33) ప్రతివిశ్వమందు, బ్రహ్మవిష్ణు శివాదులు ప్రత్యేకము (విశ్వం=సృష్టి), మునులును, మనువులు, సిద్ధులు, మానవాదులు, చరాచరములు ప్రత్యేకము. (34) పదహారు భాగములుగా ఏదుందో ఆ విరాడ్రూపము, అవలీలగా సృష్టినందింది. నశించింది. ఇలాంటి ఆ సర్వశాసకుణ్ణి ఈరోజు చూడబోతున్నాను, ఓ ఉద్దవ! (35) అని ఈవిధముగా పలికి అక్రూరుడు పులకాంకిత విగ్రహుడై మూర్చనందాడు, కన్నీళ్ళతో, ఆతని చరణాంబుజములను ధ్యానించాడు. (36) ఆతని పదాంబుజములను స్మరిస్తూ, స్మరిస్తూ భక్తిపూర్ణుడైనాడు. పరమాత్మయైన కృష్ణునకు ప్రదక్షిణం చేశాడు (ధ్యానిస్తూ). (37) ఉద్దవుడు ఆతనిని కౌగిలించుకొని మాటి మాటికి ప్రశంసించాడు. అతడు శీఘ్రముగా గృహమునకు వెళ్ళాడు. అక్రూరుడు కూడా తన మందిరమునకు వెళ్ళాడు. (38) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ మందు నారాయణ నారద సంవాదమందు అక్రూరుని ఆనందాతిరేకమును చెప్పటమనునది అరువది ఐదవ అధ్యాయము సమాప్తము.
