బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

224 - ఉమా మహేశ్వర సంవాదే మానవానా ముత్తమ గతి ప్రాప్తి వర్ణనమ్‌

సర్వ ప్రాణులకు ఈశుడవును దేవతల చేతను రాక్షసుల చేతను నమస్కరింప బడు ఓ భగవాన్‌! శివా! మానవుల ధర్మాధర్మము లను నాకు తెలిపి సంశయము తీర్చుము. మానవులు మానసికములు వాచికములు శారీరకములు అగు ఏ త్రివిధ కర్మ బంధములచే బంధింప బడుదురు? ఎట్లు విడుదల పొందుదురు? ఓ దేవా! ఏ శీలముచే ఎటు వంటి కర్మచే ఏ ఆచరణములచే గుణములచే వారు స్వర్గము పోందుదురు?

ధర్మ తత్త్వమును ఎఱిగి నిరతము దాని యందే ఉండు ఓ దేవి! సర్వ ప్రాణులకు హితకరమై బుద్దిని వృద్ది చేయు నీ ప్రశ్నమునకు సమాధానము చెప్పెదను వినుము, సత్య ధర్మము లందు అసక్తులై శాంతులై అన్ని బాహ్య లక్షణము లను వదలి సంశయ రహితులగు వారు బంధనములకు లో బడుదురు. అట్టివారు ప్రపంచో త్పత్తి ప్రళయముల తత్త్వము తెలిసి సర్వజ్ఞలై కోరికలు లేక కర్మ బంధముల నుండి ముక్తి పొందుదురు. త్రికరణములతో ఏ ప్రాణిని హింసించక దేని యందు అసక్తి నొందని వారు దయ కలిగి ప్రాణి హింస చేయక సత్‌ శీలము ప్రియాప్రియముల యందు సమ బుద్ది కలిగి సర్వ ప్రాణులకు విశ్వసనీయులై ఇంద్రియ నిగ్రహము కలిగిన వారు కర్మలచే బంధింప బడరు. స్వర్గమును పొందుదురు. ఇతరుల ధనముల యందు దారల యందు అసక్తి లేక వారిని తల్లిగా చెల్లెలుగా తలచుచు తన భార్యను ఋతు కాలమున మాత్రమే మొరటు సుఖమునకు కాక ధర్మమునకై కలియుచు ధర్మముచే ఆర్జించిన దానితో జీవించుచు తృప్తి నొందుచు దొంగ తనములేక సత్ర్పవర్తనము ఇంద్రియ జయము కలవారు స్వర్గము నొందుదురు. వ్యర్థముగా ఏ ప్రాణికి అపకారము చేయక మనస్సున మాలిన్యము లేక దానము సత్కర్మము తపస్సు శీలము శుచిత్వము దయ కలిగి జీవించు ఈ మార్గము దైవము నిర్ణయించి నది. వివేకము కలిగి దీనినే మానవుడు అనుసరించ వలెను.

పూజ్యుడవగు దేవ! భూతపతీ! బంధమునకు కాని ముక్తికి కాని హేతువు లగు కర్మలను తెలపుము.

తన కొఱకే కాని పరుల కొఱకే కాని జీవన మునకే కాని ధర్మమునకై కాని తన స్వేచ్ఛచే కాని అసత్యము పలుక రాదు. పరుషము కటువు నిష్టురము కొండెములు మిత్ర భేదము కలిగించునది ఇతరులకు బాధ ద్రోహమును కలిగించు నది అగు మాట పలుకక మృదువై స్వచ్చ వర్ణములు కలిగి పాపము లేక తీయనైన పలుకులు అంతఃకరణ శుద్దిగా కోపము లేక మనోహరముగా పలుకు వారు స్వర్గమును పొందుదురు. వాచిక మగు ధర్మ స్వరూపము ఇది.

ఓమహాభాగా! దేవదేవా! పినాక ధారీ! పురుషుని బంధించు మానసిక కర్మలను తెలుపుము.

మానవుని స్వర్గలోక గతికి సాధన మగు మానసిక ధర్మములు చెప్పెదను వినుము. అతడు మనస్సును చెడు దానినిగా చేసిన కర్మచే బద్ధు డగును. అరణ్యమున నిర్జన ప్రదేశమున పర ధనము కనబడినను గ్రహించ తలచక ఏకాంతమున లభించినను పరదారల కోరక శత్రులను మిత్రులను సమముగా మైత్రితో చూచుచు వేదశాస్త్రా ధ్యయనము దయ శౌచము సత్యము కలిగి తమ ధనముతో తృప్తులై ఏ ప్రాణియందు దయయే కాని వైరము లేని వారు స్వర్గమును పొందుదురు. జ్ఞానము సత్కర్మలు ఓర్పు మంచి మనస్సు కలవారిపై ప్రీతి ధర్మాధర్మ జ్ఞానము కలిగి తామాచరించు శుభ, అశుభ కర్మలలో వేని యొక్క ఫలము నందును కోరికలు లేక జీవించు వారు స్వర్గము నొందుదురు. ఈ చెప్పిన మానసిక పాపములను విడిచి దేవ బ్రాహ్మణ భక్తి కలిగి నిత్యము సత్కర్మల యందు ప్రయత్న పరులయి యుండు వారు స్వర్గము పొందుదురు. మానసిక సత్కర్మలు నీకు తెలిపితిని. మఱి ఏమి విన గోరెదవు?

ఓ మహేశ్వరా! మానవుల విషయమున నాకొక సంశయము కలదు. మీరు దానిని వివరించి తీర్చ వలయును. ఏ కర్మచే ఏ తపస్సుచే దీర్ఘాయువు లభించును? ఏ కర్మచే ఆయువు క్షీణించును? కర్మ విపాకము ఎట్టిది? కొందఱు మహాభాగ్యము కలవారు మఱి కొందరు మంద భాగ్యులు అగుటకు కొందరు గొప్ప కులమున మఱి కొందరు తక్కువ కులమున పుట్టుటకు కొందఱు కొయ్య బొమ్మల వలె కురూపులు మఱి కొందరు అందగాండ్రు కొందఱు ప్రజ్ఞా హీనులు మఱి కొందఱు మహా ప్రజ్ఞ కల పండితులు జ్ఞాన విజ్ఞాన వంతులు కొందఱు అల్ప వాక్కు కలవారు మఱి కొందఱు గొప్ప వాక్పాటవము కలవారు ఐ కన బడుటకు హేతువును తాము నాకు వివరించ వలయును.

దేవీ! మర్త్య లోకమున ప్రతి మానవుడును తన కర్మకు తగినట్లు ఫలమును పొందు విధమును చెప్పెదను వినుము. యోగీంద్రుడే ఐనను ఎప్పుడును చేతిలో దండమును ఆయుధము లను ధరించి ప్రాణి సమూహముల ప్రాణముల హింసించుచు వాటిపై దయలేక వానికి భయమే కలిగించుచు కీటకము లను పక్షులకు కూడ రక్షణ నీయని వాడు నరకము పొందును. ఇట్టి ఏ హింసను చేయని వాడు స్వర్గము పొందును. అట్టి ధర్మాత్ముడు స్వస్వ రూపము తోనే ఉండును. హింసకుడు నరకమున భయంకరము క్లేశ ములతో కూడినదియు అగు యాతనను పొంది ఎట్లోదాని నుండి బయట పడిన తరువాత కూడ మానవుడై జన్మించి నను క్షీణాయు వగును. పాప కర్మలు చేయుచు ప్రాణులను హింసించుచు వానికి అహితు డగుటయే ఆయుః క్షయమునకు హేతువు. శుభ కర్మల ఆచరించుచు ఆయుధము ధరించక ఏ ప్రాణిని దండించక హింసించక ఏ ప్రాణిని తానై చంపక చంపింపక చంపు వారిని అను మోదించక తన యందు వలెనే ఇతర ప్రాణి యందు భావము కలిగి ప్రాణుల యందు స్నేహము కల నరుడు దేవత్వమును పొందును. సముచితము లగు సుఖముంను అనుభవించి స్వర్గమున సంతోషమును పొందును. ఒకప్పుడు ఒట్టి వాడు మానవుడై జన్మించి నను దీర్ఘాయు డగును. ప్రాణి హింసను విడుచుటయే దీర్ఘాయువును పొందుటకు మార్గమని బ్రహ్మ విధించెను.