బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

206 - బాణ యుద్ధ వర్ణనమ్‌

బాణుడు త్రిలోచనునికి మ్రొక్కి యిట్లనియె. వేయి బాహువులతో యుద్ధము లేక నేను నిస్పృహుడ నైతిని. ఈ చేతు లున్నందులకు ఇవి సాఫల్యము నందుట కేదేని రణము సంఘటింప వలదా? అది లేనపుడీ చేతులు బరువు చేటుగదా. ఇవి యెందులకు? అన శంకరుండు

నీ నెమలి టెక్కెమెప్పుడు విఱుగునో యప్పుడు మాంసాశనులగు జనముల కానంద మగు యుద్ధము నీకు సంఘటించు ననియె.

అంతట సంతసించి శంభునికి మ్రొక్కి యింటికి వచ్చి రాగానే ధ్వజ భంగ మగుట చూచి మిక్కిలి హర్ష మొందెను. ఇదే సమయ మున చిత్రలేఖ యా యనిరుద్థుని కన్యాంతః పురమునకు యోగ బలమున గొనివచ్చి నిలుప నుషా దేవితో గ్రీడించు చున్న వానింజుచి కావలి వాండ్రు దైత్యపతి కెఱిగించిరి. బాణు నానతిచే వచ్చి పైబడిన సేవక సైన్యము నమ్మహాత్ముడ నిరుద్ధుడు ఇనుప పరిఘం గొని చాప మోదెను.

వారట్లు హతు లైనంత బాణుడు రథమెక్కి వచ్చి పోరి యవ్వీరుని వలన బరాజయ మొందెను. అవ్వల బాణుడు మంత్రము జపించి మాయా యుద్ధము సేయ నారంభించెను. సర్పాస్త్రముచే యదు నందనుని బంధించెను. అనిరుద్ధుడెటు వోయెనని ద్వారకలో ననుకొను చున్న యదువులకు నారదు డతని బాణునిచే బద్ధు డయినట్లు తెలియ జేసెను. అవ్వల యాదవులా యనిరుద్ధ కుమారుని యోగ విద్యా విశారద యగు నొక యంగన శోణిత పురమునకు గొంపోయి నట్లు విని శత్రువు నందు విశ్వాసము నందిరి.

అంతట హరి తలచి నంతనే వచ్చి నగరుడు నెక్కి బలరామునితో ప్రద్యుమ్నునితో గూడి బాణ పురమున కేగెను. పుర ప్రవేశ మందే బలశాలు రగు ప్రమథ గణముతో రణ మయ్యెను. హరి వారిని క్షయ మొందించి బాణపుర ప్రాంతములకు వెళ్లెను. అవ్వల త్రిపాదము త్రిశిరస్కము నైన మాహాజ్వరము బాణుని కాపు దలకై శార్ఙ్గ ధన్వునితో (హరితో) పోర జొచ్చెను. కృష్ణ శరీర స్పర్శ వలన భస్మ సర్శ వలన జనించిన యొకానొక తాపమును బలరాముడు కూడ పొంది కన్నులు మూసి కొనెను. కృష్ణునితో బోరు చున్న మహేశ్వర జ్వరము వైష్ణవ జ్వరముచే కృష్ణ దేహము నుండి త్రోసివేయ బడెను. నారాయణుని భుజముల యొత్తిడిచే పీడింప బడిన మహేశ్వర జ్వరమును చూచి బ్రహ్మ దీనిని క్షమింపుడని పలికెను. వాని బాహువన మట్లు తెగిపోవ మధువైరి త్రిపుర వైరిచే దెలుప బడి చేత నున్న సుదర్శనమును వదల నెంచెను. అప్పుడుమాపతి లేచి బాహువులు తెగి రక్త ధారలను వర్షించు చున్న బాణునిం గని సామ పూర్వకముగ గోవిందునితో నిట్లనియె. నారాయణ భుజా ఘాతముచే గల్గిన బాధచే గన్నులు తీసి వేసిన మాహేశ్వర జ్వరముంగని బ్రహ్మ వీనిని క్షమింపు మని హరింగోరె అటు మీద క్షమించితి నని వైష్ణవ జ్వరమును దన యంద లయింప జేసి కొనెను. నీతో నాకైన యీ యుద్ధము నెవ్వరు స్మరింతురో వారు విజ్వరులు (జ్వర బాధలేని వారు) అయ్యెదరని హరి యేగెను. అవ్వల శత్రు ప్రయుక్తము లగు పంచాగ్నుల గెల్చి క్షీణింప జేసి దానవుల సేనలను విష్ణువు లీలగ పిండి సేసెను. అవ్వల బాణుడు శంకరుడు కుమార స్వామియు సమస్త సైన్యముతో కృష్ణు నెదిరించి యుద్ధము సేసిరి. హరి హరుల పోరాటము మిక్కిలి దారుణ మయ్యెను. శస్త్రాస్త్రము లచే లోకములు సంక్షోభించెను. ఇది సర్వ జగ త్ప్రళయము వచ్చిన దని వేల్పులు తలచిరి. గోవిందుడు జృంభ ణాస్త్రముచే శంకరుని జృంభింప జేసెను. అంతట దైత్యులు ప్రమథులును నశించిరి. జృంభణము వలన నోటు వడి హరుడు రథమధ్యమం దొరగెను. కృష్ణునితో బోర లేడయ్యెను కుమారస్వామి గరుడునిచే బొడువ బడిన బాహువులతో ప్రద్యుమ్నుని యస్త్రముల దెబ్బతిని కృష్ణుని హుంకారము లచే శక్త్యా యుదము చెదర రణభూమి నుండి తొలగి పోయెను. హరిచే శంకరుడూ దరగొన న సుర సైన్యము నాశము గన గుహుడోటు వడ ప్రమథసేన క్షయ మొంద నందీశు డశ్వములం బూన్చిన రథమెక్కి బాణుడు కృష్ణునితో కృష్ణుని బలముతో బోర వచ్చెను. మహావీరుడు బలభద్రుడు బాణుని సైన్యము ననేక విధముల జెండాడెను. ప్రద్యుమ్నుడు రణ ధర్మము ననుసరించి పారిపోక (వెనుదివక) పోరెను. బలరాముడు నాగలి కొనచే బట్టిలాగి రోకలిను చక్రి బాణములచే నుగ్గా సేయుటను బాణుడు నూచెను. అవ్వల కృష్ణుడును బాణుడును దలపడిరి. ఒండొరులు మెఱుగులు గ్రమ్ము కవచములను ఖండించు కొనిరి. ఒండొరుల బాణములను ఒండొరులను గొట్టు కొనిరి. తుదకు హరి బాణుని సంహరింప వలెనిన దృఢ నిశ్చయము సేసి కొనెను అంతట నూరుగురు నూర్యులట్లు వెలుగు చక్రమును సుదర్శ నాఖ్యమును దైత్య చక్రవైరి హరిచే బట్టెను. మధువైరి ఈ సారి బాణుడు నశించి తీర వలెనని చక్రాయుదమును వదలి నంతట రాక్షసుల మాయా మంత్ర శక్తి కోటరి యనునది దిగంబరి యయ్యెను. అనగా వెల్లడి యయ్యెను. ఆ శక్తింగని కనులు మూసికొని బాణుని బాహు వనమును ఖండించుటకు సుదర్శనమును విసరెను. ఆ చక్రా యుధము బాణుని బాహు వనమును నరకెను. హరి యామీద బాణుని గూడ సంహరింప నెంచి నంతట త్రిపురవైరి (శివుడు) బాణుడు చేతులు తెగి రక్తము వర్షించు చుండ గని తటాలున వచ్చి హరితో సామ పూర్వముగ నిట్లనియె.

కృష్ణా! కృష్ణా! జగన్నాథ! నీవు పురుషోత్తముడవు పరాత్పరుడవు ఆద్యంతములు లేని వాడవువని యెఱుంగుదును. దేవ మనుష్య పశు పక్ష్యాదు లందు శరీరమును గ్రహించుట దైత్య సంహారము సేయుట యను క్షణము గల యీ చేష్ట నీ లీల. కావున ప్రసన్నుడ వగుము. ఈ బాణున కేనభయ మిచ్చి యున్నాను. నా పల్కిన పలుకు నీ వబద్ధము సేయ దగదు. నాయాశ్రయ మదముచే బెరిగిన వాడు వీడు. నీ యపరాధ మిందు లేదు. ఈ దైత్యుని కేను వరము లిచ్చితిని. కావున నిన్ను నేను సైరణ గొను మని కోరుచున్నాను. అన గోవిందుడా మాధవుని శూలపాణిం గూర్చి ప్రసన్న ముఖుడై బాణుని యెడ గసి విడచి యిట్లనియె.

శంకర! నీచే వరము లీబడిన వాడు గావున నీ భాణుడు బ్రతుకుంగాక! నీమాటపై గల గౌరవము చేనిదిగో చక్రమును మఱలించి తిని. నీవభయ మిచ్ఛుట నేని చ్చుటయే. నాకంటె నీవు వేఱు గావని చూడ దగను. నేనెవ్వడనో యతడు నీవే. సదేవా సుర మానుష మైన యీ జగత్తు గూడ మనమే. అవిద్యా మోహితులైన వారు భేద దృష్టి నందుదురు. అని కృష్ణుడు పలుక ప్రద్యుమ్నుని జుట్టుకొని యున్న పాములు చచ్చువడి పోయినవి. అంతట పత్నితో గూడిన యనిరుద్దుని గరుడునిపై కెక్కించికొని బలరామ కృష్ణ కృష్ణ సంబంధి పరివారములు ద్వారకా పురికి వచ్చిరి.