బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

219 - శ్రాద్ధవిధి వర్ణనమ్‌

 పరలోకమున కేగి తమ కర్మానుగుణ మయిన స్థాన మందున్న వారికి కొడుకులు మఱియుం గల బంధువులు శ్రాద్ధ మెట్లు పెట్ట వలయునన వ్యాసభగవాను డిట్లనియె.

జగన్నాథునికి వరాహ మూర్తికి నమస్కరించి తెలుపు చున్నాను. కల్పమును వినుండు. మున్ను కోకా జలడందు మునిగి పోయిన పితరులను వరాహ మూర్తియైన ప్రభువు శ్రాద్ధముం గావించి యుద్దరించెనన

మునులదెట్ల జరిగెనో యానతిమ్మన వ్యాసుండిట్లనియె.

త్రేతా ద్వాపర యుగ సంధిలో మున్ను మెరు గిరిమీద దివ్యులు మానుషులు నైన పితరులు విశ్వే దేవులతో వసించిరి. (పితరులకు దేవత్వము మనుష్యత్వము నను రెండు ధర్మములు గలవని శస్త్రములు తెలుపు చున్నవి. కావున పితృవతి యైన యమునికి నరక చతుర్ధశి నాడు చేయ వలసిన తర్పణము దేవతగా భావించి నవ్యము గానూ మనుషత్వమును భావించి ప్రాచీనారీతి గానూ చేయ వచ్చునని ధర్మ శాస్త్రములు తెలుపు చున్నవి) అచట వారు కూరుచున్న తఱి సోముని కూతురు కాంతి మతియను దేవకన్య ప్రాంజలియై వారి యెదుట నిలిచెను. వారు కళ్యాణి! నీవెవ్వతెవు. నీకు ప్రభు వెవ్వడు? తెలుపు మనిరి. చంద్రకళను మీకిష్ట మగునేని మిమ్ము నా ప్రభువులుగా వరించు చున్నాను. నా మొదటి పేరు ఊర్జ ఆపైన స్వధయను పేరం బిలువ బడుచున్నాను. ఇప్పుడే మీరు ‘కోక’ అను పేర బిల్చినారు. పితరు లామె పలుకులు విని యామె మొము వంక జూచి తృప్తి సెందరైరి. (మోహపడి రన్నమాట) అ కన్య నూరక చూచుచు తనివి సెందక యోగ భ్రష్టులైన వారని యోఱింగి విశ్వే దేవులా పితరులను వారిని వదలి పెట్టి త్రిదివంబున కరిగిరి.

చంద్ర భగవానుడు తన కూతురు నూర్జనింట గానక మనసు కలత పడిన మనస్సుతో నెటుపోయిన దని యాలోచించెను. ఆ సమాధిలో నతడామె కామముతో బితరుల కడ కేగెనని వారిచే హృదయ పూర్వకముగా నామె స్వీకరింప బడిన దనియుం దపో బలమున నేణింగెను. అంత గినుక గొని శశాంకుడు యోగ భ్రష్టులై మనస్సు స్థాయిచెడి తండ్రి హద్దులో నున్న సాధ్వినీ! చీనీయకుండ నా కన్యను హరించితిరి గావున మీరు క్రింద బడుదురు గాక యన శపించెను. ఈ నా కూతురును స్వతంత్రురాలై ధర్మము విడిచి భరించి నందున కోకయను పేర హిమాద్రిపై నది యగుగాక యనియె. ఇట్లు శప్తులైన పితృ దేవతలు యోగ భ్రష్టులై హిమగిరి మొదట బడిరి. ఊర్జయు నక్కడనే హిమగిరి ప్రస్థమందు పడి సప్త సాముద్రమము తీర్థముంజేరి కోకయను పేర నూరు తీర్థములతో హిమగిరి శిఖరమును దడుపుచు నర్పణము సేయుట వలన (ప్రవహించుట వలన) సరిత్తు(నది) అను పేరందెను.

యోగమందిన పితరుల చల్లని నీటితో నున్న మహానదిం జూచిరి. కాని యది చంద్రుని కూతురగు ఊర్జ యేయని యెఱుంగ రైరి. అంతట పితరుల నాకలిచే గుములు చున్నట్లు ఒక రేగు వృక్షమును మధు క్షీరము నోసంగు నొక ఆవును నొసంగెను. దివ్యమైన క్షీరము కోకానది జలము రేగుపండు నను నీ యాహారము పితృ దేవతల పోషణము నను నిరూపించ బడినది. ఆ విధమైన వృత్తితో (ఆహారాదుల సేవనముతో) జీవించు చున్న పితరుల కదివేలేండ్లొక్క దినమట్లు గడచెను.

ఈ విధముగా లోకమెల్ల పితృ శూన్య స్వధాకారము వినిపింప నంతట దైత్యులు రాక్షసులు యాతుధానులు బలవంతులైరి. వారు విజృంభించి విశ్వే దేవతలతో విడివడిన పితృ గణములపై నలువైపుల నుండి వచ్చి పడిరి. అదిచూచి పితరులు రోషము గొని యొడ్డు నున్న యొక రాతినెత్తి పట్టు కొనిరి. ఆ రాయి తొలగగానే నది వేగ మెక్కువై నీటిచే పితరులను హిమాలయమును గూడ ముంచెత్తెను. పితరు లంతర్హితు లైనంత రాక్షసులు తాండ్ర చెట్టునెక్కి నిరాహారులై దాగి కొనిరి. పితృ దేవతలు నీటి వెల్లువకు వంత చెంది యాకట నకనకం బడి యానీటనే యుండి విష్ణుని శరణోందిరి.

గోవింద! నీవు జయింపుము. జగన్నివాస! ఓ కేశవ నీదయచే మాకును జయమగు గాక! అప్రతిమప్రతాపుడవు మమ్మీ నీట మునిగిన వారి నుద్దరింపుము. దారుణా కారులైన యా రాక్షసులకు జడిసి పోవుచున్న మమ్ము ఓవరాహ మూర్తీ! రక్షింపుము. నీ పుణ్య నామములు సంకీర్తనము సేసినంత రాక్షసులు భూత ప్రేత పిశాచాదులు నశింతురు. ధర్మాధి పురుషార్థములు సిద్ధించును. అని యిట్లు స్తుతింప విని తన దివ్య మూర్తిని జూపి కోకానది ముఖమందు నీట మునిగి తలపై రాతిం ధరించి యున్న పితృ గణముం జూచెను. అంతట వరాహ మూర్తియే హరి పితృ గణము నుద్దరింప సంకల్పించెను. తనకోఱచే గొట్టి యేత్తి యారాతిని విసరి వైచెను. పితరుల నీటినుండి యెత్తి మీది కాకర్షించెను. ఆ దివ్య వరాహము కోర యందున్న పితరులు బంగార మట్లు మెఱయుచు విష్టునిచే భయ ముక్తులైరి. అట్లువారి నెత్తి విష్టు తీర్థమను పేరందిన యాతావున హరి వారిన లోహార్గముల నందలి జలమును ద్రావ నిచ్చెను. అవ్వల తన రోమముల నుండి పుట్టిన దర్భలను చెమట నుండి పుట్టిన నువ్వులను జేకొని కొఱకం చొక దానిని సూర్య సమాన ప్రభనుగ గల్పించి ఒక పాత్రను తీర్థముగా రూపొందించి కోటి వటము క్రింద నిలువబడి గంగాధరమను తీర్థ మందలి ఉదకమును తుంగకూటము నుండి గైకొని యజ్ఞియములైన ఓషధులను మధు క్షీర రసములను గంధములను పువ్వులను గంధదూప దీపాదులను జేకొని సరస్సు నుండి ధేనువును సముద్రము నుండి రత్నములను గైకొని భూమిని కోరచే గీసి నీటం దడిపి భూమిని కుశలచే గీసి కొఱవిని దాని చుట్టుం ద్రిప్పి మఱల మఱల నీరు ప్రోక్షించి రోమ కూపము లందుండి ప్రాగ గ్రములైన (తూర్పువైపు కొసలుగా నున్న) కుశలను గ్రహించి ఋషుల నాహ్వానించి పితృ తర్పణము చేయుదు ననియె. వారును జేయమన ప్రభువు విశ్వేదేవులను బిల్చి సమంత్రకముగ వారికి విష్టరముల (అసనములను) నొసంగి యక్షతలచే దేవతారక్ష సేసెను. సర్వ దేవతల యంశలతో బుట్టిని అక్షతలు ఓషదులు నన్ని దిశల నంతట రక్షణ యిచ్చుటకు గల్పింప బడినవి. దేవ దానవ దైత్య యక్ష రక్షస్సులం జరాచర మందెక్కడును వానికి క్షయము నెవ్వరు గల్పింప జాలరు. గావున వానికి అక్షతములు అను పేరేర్పడి నది. మున్ను విష్ణువు దేవతా రక్షరణ కొరకే యక్షతల నేర్పరచెను. కుశలు గంధము యువలు పువ్వులచే అర్ఘ్య మొసంగి వరాహమూర్తి విశ్వేదేవుల నిట్లడిగెను.

దివ్యులు మనుషులును గూడ నైన పితరులను ఆహ్వానించు చున్నాననియె. వారు పిలువుమన వారిని శుచియై పిలిచెను. నువ్వులతో మొదళ్ళు చివరలు కూర్చిన దర్భలను మోకాలిపై హస్తమానించి సవ్యముగ అసన మోసంగెను. అదే విధముగ పితరులను పితృస్థాన మందున్న విప్రులకు ‘‘ఆయాంతు’’ అను మంత్రము సెప్పుచు నాహ్వనించెను. ‘‘అపహత’’ అను మంత్రముచే నపస్యవముగా అసురాదుల వలస రక్షణనిచ్చి పితరుల నామ గోత్రములతో ‘‘తత్పితరో మనోజరానావా ఆగచ్ఛత’’ అను మంత్రము కూడా జెప్పుచు నావాహనము సేసెను. ‘‘సంవత్సరైః’’ అను మంత్రముచే నర్ఘ్య మిచ్చెను. యాస్తిష్టంత్య మృతావా చోయన్మ అనియన్మే పితామహ అని తండ్రికి పితామహునికి ‘యన్మే ప్రపితామహ’ అని ప్రపితామహునికి కుశ గంధ పుష్ప తిల మిశ్రమైన యర్ఘ్యమును అపస్యముగ నిచ్చెను. అట్లే మాతా మహులకును విష్ణువు పొనరించెను. ఇట్లు గంధాదులచే నర్చించి ధూప దీపము లొసంగి ‘‘అదిత్యా వసవోరుద్రా’’ అను మంత్రముతో నెయ్యి నువ్వులు దర్భలతో నన్నమును పాత్ర యందుంచి యవ్వల మునులను జూచి ‘‘అగ్నౌకరిష్యే’’ అని పిలికి వారు కురుష్య (చేయుము) అని ప్రేరణ యీయ సోమునికి అగ్నికిని యముని కిని మూడాహుతు లిచ్చెను. ‘‘యోమామకేతి’’ అను యజుర్మంత్ర సప్తకము జపించి హోమశిష్టమును నామ గోత్రములతో నొక్కొక్కసారి మూడేసి యాహుతులుగా పితృ స్థానమం దొసంగెను. ఇందు మిగిలిన యన్నమును పిం డపాత్ర యందుంచెను.

ఆ మీదట పరిశుద్దము (ప్రత్యగ్రము) ఒకేసారి యుడికి నది నిలువ యుండనిది కూరలు తక్కువ పండ్లెక్కువ యునై యాఱు రసములు గల్గి యమృతోపమాన మయిన యన్నమును బ్రాహ్మణుల కారగింపిడి పిండపాత్ర యందు గూడ వడ్డించి మంత్రముతో నేయి తేనెయుం గూర్చి పృథివి అనియు మధువాతా అను ఋగ్వేద మంత్రమును బఠించెను. బ్రాహ్మణులు భోజనము సేసిన తర్వాత నైదు మంత్రములు య త్తే యను ఋక్కుతో నారంభించి నాధికం అను సమాప్తి మంత్రము వరకు జపించెను. త్రిమధు త్రిసువర్ణ మంత్రములను బృహదారణ్యక మును మఱియు జపింప వలసిన సౌకర సూక్త పురుష సూక్తము లనుగూడ జపించెను. విప్రులు భోజనము సేసిన తర్వాత తృప్తాస్థ మీరు తృపులైనారా? అని అడిగి వారు తృప్తాస్మ తృప్తు లైనాము అని అన్న తర్వాత అంత వరకు మౌనముతో భోజనము సేసిన బ్రాహ్మణులు మౌన విమోచనము సేయుటను సూచించు నుత్తరాపోశన మొసంగెను.

(--------------తాత్పర్యం ఇవ్వలేదు------------------------)