బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

64 - మహాజ్యైష్ఠీ ప్రశంస

మహాజ్యేష్ఠి పర్వము నందు పురుషోత్తమ క్షేత్రము సేవింప దగినది. శ్రీకృష్ణుని బలరాముని సుభద్రను ఆనాడు దర్శించుట వలన ప్రయాగ మొదలైన పుణ్య క్షేత్రములను సేవించిన పుణ్యము ద్వాదశ క్షేత్ర యాత్రా ఫలము లభించును. గోదావరి మొదలైన పుణ్య నదులు సేవించిన ఫలము కూడ సిద్ధించును. భూమి యందు గల సర్వ దేవాలయ ములను, నదీ సాగర పర్వత తీర్థములను సేవించి స్నాన దానాదులు చేసిన పుణ్యము కృష్ణ దర్శనము చేత లభించును. అంతేగాక విష్ణు లోకము కూడ లభించి అచ్చట పుణ్యానుభవ మయిన తరువాత కర్మభూమి యందు జనించి చతుర్వేదా ధ్యయనము జేసి వేదోక్తాచార ధర్మ నిరతుడై కృష్ణ భక్తుడై విష్ణుభక్తి యోగము నంది మానవుడు మోక్షము పొందును.