బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

48 - ప్రతిమా నిర్మాణ విధాన పర్యాలోచనమ్‌

దేవదేవా! ఆ ప్రతిమ లింద్రద్యుమ్నునిచే నెట్లు నిర్మింప బడినవి, ఏ ప్రకారమున మాధవుడు సంతుష్టు డయ్యె నదియెల్ల నానతిమ్ము, విన వలెనన. మా మనసు లువ్విళ్ళూరు చున్నవి.

ముని వరులారా! వినుండు. వేద తుల్యమైన పురాణ మిది. యజ్ఞారంభము కాగా దేవ ప్రాసాద నిర్మాణము జరుగగా నాఱేనికి విగ్రహ నిర్మాణమును గూర్చిన యాలోచన రేయిం బవళ్ళతని మనసునం దిరవు కొనెను. సృష్టి స్థితి లయ కర్తయైన యా సర్వేశ్వరుని నేనెఱుంగను. ఆ స్వామిని నేనెట్లు గను గొందునను నూహతో రాత్రియుం బవలును పండు కొనడు. ఆ యావేదనలో నాతని కష్టైశ్వర్య సమృద్ధి మనస్తుష్టి నీయ జాలదయ్యె రాళ్ళు మన్ను కట్టెలం దేది విష్ణు ప్రతిమకు యోగ్య మగును? ఎట్టి మూర్తిని ప్రతిష్టించిన విష్ణువు ప్రీతు డగునను నాలోచనలో నతడు మునింగెను. అంతట నాతడు పాంచరాత్ర విధానమున పురుషోత్తమ దేవుని బూజించి యదే యాలోచన గొని స్వామిని స్తుతింప నారంభించెను.