కూర్మ మహా పురాణము
41వ అధ్యాయము
సూతుల వారు పలికిరి.
నైమిశారణ్య తీర్థము త్రైలోక్య విఖ్యాతము. మహాపాతక నాశము, మహాదేవునికి ప్రీతిపాత్రము. పరమ నిష్టాగరిష్ఠులగు మహరులు, మహాదేవుని చూడగోరి, తపముచేయుటకు, బ్రహ్మఏర్పరచినస్థానము. మరీచి, అత్రి, వసిష్ణ, క్రతు, అంగీర, వంశమున పుట్టిన మహర్సులు బ్రహ్మదగ్గరకు వచ్చి, చతుర్ముఖుడు, చతుర్మూర్తి సర్వవరప్రదుడగు బ్రహ్మకు నమస్కరించి యిట్లడిగిరి.
షట్ములీయులు అడిగిరి.
భగవన్! కపర్ది, అద్వితీయుడైన భర్గుడు మహాదేవుని చూచుటకు తగిన ఉపాయమేది? తెలుపుము అని బ్రహ్మను అడిగిరి.
పోజ్మమేదోషములు లేనివారై, వేయి సంవత్సరముల అవధిగల సత్రమును ఆచరింపుడు. మీరు సత్రము చేయవలసిన ప్రదేశమును చెప్పుదును”. అని పలికి మనసుతో ఓక చక్రమును సృష్టించి, వారితో యిట్లు పలికెను. “ఈ చక్రమును నేను విడుచుచున్నాను. మీరు దీనిని అనుసరింపుడు. ఎచట ఈ చక్రనేమి శీర్ణమగునో అది సత్తమాచరించ దగిన ప్రదేశము. అని పలికి బ్రహ్మ చక్రమును విడిచెను. ఆ ఋషులు చక్రమును అనుసరించిరి. ఆ చక్రనేమి శీర్ణమైన ప్రదేశమును నైమిశమని వ్యవహరించిరి. ఇది పరమపావనము. అందరిచేత పూజించబడినది. సిద్ద చారణ యక్ష గంధర్వులు ఇచటఎపుడు సేవించుచుందురు. ఈ స్థానము శంభు భగవానునిది. ఇచట దేవ గంధర్వ యక్ష రాక్షస పన్నగులు తపమాచరించి, శంకరుని నుండి గొప్ప వరములు పొందిరీ, షట్కులీయ ఋషులీదేశమును చేరి సావధానముతో సహస్రవత్సర పరిమితముగు సత్రమాచరించి, మహాదేవుని ఆరాధించి సాక్షాత్కరించుకొనిరి. కావున ఈ క్షేత్రమున చేసిన తపస్సు దానము యజ్ఞము జపాదీకములన్నియూ ఒక్కొక్కటి ఏడు జన్మల పొపములను నశింప జేయును, ఈ నైమీశమున సత్రమునాచరించుచున్న మునులతో వాయుభగవానుడు బ్రహ్మాండపురాణమును చెప్పెను. ఇచట మహాదేవుడును పార్వతితో కలిసి ప్రమధగణములతో పాటు ఇప్పటికి రమించుచున్నాడు. ఈ క్షేత్రమున నియమపూర్వకముగా ప్రాణములు త్యాగము చేసినవారు మరల తీరిగీధుని బ్రహ్మలోకమునకు చేరెదరు.
ఇచటనే జాష్యేశ్వరమను మరియొక తీర్ధము కలదు. ఇచట మహాగణుడగు నంది మహాదేవుని గూర్చి తపమాచరించేను. అతనికి ప్రసన్నుడగు శివుడు తనతో సమానత్వము మృత్యుంజయత్వమును వరములుగా నొసంగెను. ఇచటనే శిలాదుడను మహా ఋషి ధర్మవిత్తు పుత్రుని కొరకు శంకరుని గూర్చి తపమాచరించెను. అతడు వేయి సంవత్సరములు తపమాచరించిన తరువాత శంకరుడు సాక్షాత్కరించి వరమిచ్చెదనని పలికెను. అయోనిజుడు మృత్యుహీనుడగు పుత్రునిమ్మని అడిగేను, దేవితో గూడ శంకరుడు అట్లే అగుగాక అని పలికెను. అతను చూచు చుండగా అంతర్థానము నొందెను.
అంతట ధర్మవిత్తముడగు శిలాదుడు యాగము చేయగోరి తనభూమిలో దున్నుచుండగా భూమిని చీల్చుకొని అతి సుందరుడగు వాడు ప్రలయ కాలాగ్నివలె మహాతేజస్వి యగు కుమారుడు నవ్వుచూ కనిపించేను. రూపలావణ్య సంపన్నుడు తేజస్సుతో అన్ని దిక్కులను ప్రకాశింప చేయుచు కునూరస్వామి వంటి వాడు సాటి లేనివాడు మేఘ గంభీరధ్వనితో ఇట్లు పలికెను. ‘తాత’! ‘తాత’ అని పలికెను. ఆకుమారుని పేరు నందిగా ప్రసిద్ధి చెందెను. ఆ కుమారుని చూచిన శిలాదుడు సంతోషించి కుమారుని ఆలింగనము చేసుకొని సంతోషముతో ఆశ్రమమున నున్న ఋషులకు చూపెను. అతనికీ జాత కర్మాదికములను యధా శాస్త్రమంగా ఆచరించేను. ఉపనయనము గావించి వేదాధ్యయనము చేయించేను. వేదాధ్యయనము పూర్తిచేసిన నంది ఉత్తమ సంకల్పమును చేసుకొనెను. పరమేశ్వరుని సాక్షాత్కరించుకొని మృత్యువును జయించెదను అని. ఒక పుణ్యనదికి వెళ్ళి ఏకాగ్ర మానసుడై శ్రద్ధతో మహేశుని యందు మనసుంచుకొని రుద్రుని గూర్చి తపమాచరించెను. ఒక కోటి సార్లు మంత్రము జపించగానే భక్త వత్సలుడగు శంకరుడు పొర్వతితో గణములతో కలిసివచ్చి వరమిచ్చెదనని పలికెను. నేనింకొకమారు కోటిమార్లు జపించవలయునని కోరుచున్నాను. నాకు దానికి సరిపడ వర మాయమని అడిగెను. శంకరుడట్లే అని పలికి అంతర్థానము చెందెను. మరల శంకరుని యందు మనసీడి కోటి జప మాచరించేను. కోటి పూర్తి కాగానే శంకరుడు భూత గణములతో కలిసి వచ్చి వరమిచ్చెదనని పలికెను. మూడవమారు కోటి జపము చేయదలచితినని పలికెను. అట్లే కానీమ్ము అని పలికి శంకరుడంతర్థానము చెందెను. మూడవ కోటి ముగియగానే ప్రీతి చెందిన శంకరుడు భూతగణములతో వచ్చి వరము నిచ్చెదననేను. నీ తేజస్సుతో ఇంకొక కోటి జపీంచ కోరుచున్నాను అని పలుకగా శంకరుడు ఇక జపించవలదు అని పలికెను.
నీవు నేటినుండీ జరా మరణ వర్జితుడవగుదువు. ఎప్పుడూ నా ప్రక్కనే యుందువు. నీవు మహాగణపతివి. దేవికి పుత్రునిగా మహేశ్వరునిగా నుందును, యోగీశ్వరుడవు. యోగినేతను, గణాధీపతులకు అధిపతివీ సర్వలోకాధిపత్యము సర్వజ్ఞత్వము నా వంటి బలము, నా జ్ఞానము దివ్యము నీకు కలుగును. ఇట్లు ప్రలయము వరకుండి నాలోకమునకు చేరెదను. ఇట్లు పలికి శంకరుడు తన గణములను పిలిచి నందీశ్వరుని గణాధిపతిగా అభిషేకించెను. తాను స్వయముగా దగ్గరుండి మరుత్పుత్రికయగు కన్యతో వివాహము జరిపించెను. ఈ ప్రదేశము జప్యేశ్వరము అనుష్ఠానము దేవదేవుడగు శంకరునిది ఈ తీర్థమున మృతిచెందినవాడు రుద్రలోకమున చేరును.
ఇది కూర్మపురాణమున షట్సాహస్రిసంహితలో ఉపరి విభాగమున 41వ అధ్యాయము.
