కూర్మ మహా పురాణము

Table of Contents

14 - స్వాయంభువ మను వంశము

స్వాయంభువమనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు ధర్మము తెలిసినవారు, గొప్ప పరాక్రమము కలవారు అగు పుత్రులను ‘శతరూప’ కనెను.

తరువాత ఆ ఉత్తానపాదునికి ధ్రువుడను కుమారుడు కలిగెను. అతడు భగవంతుడైన నారాయణుని యందలి భక్తి చేత శ్రేష్టమైన స్థానమును పొందెను.

ఆ ధ్రువుని వలన శిష్టి, భావ్యుడు అను వారు జన్మించగా, భావ్యుని వలన శంభువు పుట్టెను. శిష్టి వలన అతని భార్య సుచ్ఛాయ పాప రహితులైన అయిదుగురు కుమారులను కనెను.

ఆ సుచ్ఛాయ వసిష్టుని మాట ప్రకారం మిక్కిలి కష్ట సాధ్యమైన తపస్సుచేసి, శాలగ్రామ క్షేత్రము వద్ద జనార్దనుడైన విష్ణుదేవుని పూజించి,

రీపువు, రిపుంజయుడు, విప్రుడు, కపిలుడు, పృషతేజసుడు అను గష్ణుభక్తులు, నీర్మలులు, స్వధర్మమును పరిపాలించువారును అగు పుత్రులను పొందినదీ.

రిపువు వలన అతని భార్య, సంపూర్ణ తేజస్సు కలిగిన, చక్కని రూపము కలిగిన చాక్షుష మనువును పుష్కరిణి యందు పుత్రునిగా పొందెను.

మహాత్ముడగు వీరణుడను మనువుకు ప్రజాపతి యొక్క కూతురి యందు చాల గొప్ప బలము కలిగిన పదిమంది కుమారులు కలిగిరి.

విరాట్పుత్రుడైన ప్రజాపతి యొక్క కన్యయందు గొప్పపరాక్రమము కల ఊరువు, పురువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, శుచి, అగ్నిష్ణుత్తు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు అని ఆ పది మంది కుమారులపేర్లు- ఆగ్నేయి అనునామే, ఊరువు వలన ఆరుగురు కుమారులను, గొప్పబలవంతులను కనెను.

అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, ఆంగిరసుడు, శివుడు అని వరుసగా వారి పేర్లు. అంగుని వలన వేనుడను పుత్రుడు కలుగగా, అతనికి వైన్యుడను వాడు జన్మించెను.

ఏ యీ వేనపుత్రుడు పృథువను పేరుతో ప్రసిద్ధుడు, గొప్పుబలము కలవాడు ప్రజలను పాలించెనో, ఎవని చేత పూర్వము ప్రజల యొక్క మేలును కోరి భూమి పితుక బడినదో;

 బ్రహ్మదేవుని శాసనమువలన గొప్పబలవంతుడైన ఇంద్రునితో కూడ, వేనుని కుమారుడైన పృధువుతో, పూర్వము బ్రహ్మదేవుని చేత చేయించబడిన యజ్ఞము నందు,

సూతుడను పౌరాణికుడుగా మాయారూపుడగు విష్ణువే స్వయముగా అవతరించెను. అతడు అన్ని శాస్త్రములను గూర్చి బోధించువాడు, ధర్మము తెలిసినవాడు, పెద్దల యందావరము కలవాడుగా ఉండెను.

ఓ ముని శ్రేష్ఠులారా  ఆ సూత పౌరాణికుని, పూర్వమే అవతరించిన, అతి పురాతనుడనైన నన్నుగా తెలిసికొనుడు. ఈ మన్వంతరమందు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు,

పురాణ పురుషుడైన హరియొక్క రూపొంతరమైన వాడు, స్వయముగా ప్రేమతో నాకు వినిపించినాడు. (పురాణకథలను) నావంశములో జన్మించిన వేదాధికారము లేని యే సూత వంశ, జులు కలరో

వారికి బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత పురాణములను ప్రవచించుట వృత్తిగా ఏర్పడింది. పూర్వము చెప్పబడిన వేన పుత్రుడైన ఆ పృథువు బుద్ధి మంతుడు, సత్యవ్రతము కలవాడు, ఇంద్రియములను జయించినవాడుగా ఉండెను.

విశాలమైన భూమిని పాలించువాడు, గొప్ప తేజస్సు కలవాడు, తన ధర్మమును చక్కగా పరిపాలించుపొడు ఆ పృధువు. అతనికి చిన్నతనము నుండి యే నారాయణుని యందు భక్తి కలిగినదీ, అతడు గోవర్థనపర్వతమును చేరుకొని, ఇంద్రియములను జయించిన వాడై తపస్సు చేసెను. అతని తపస్సు చేత శంఖ చక్రములను, గదను ధరించిన భగవంతుడగు విష్ణువు సంతోషించెను.

దామోదరుడగు ఆ విష్ణువు స్వయముగా వచ్చి రాజును గూర్చి ఇట్లు పలికెను. ఈ ధర్మమును పాలించుపోరు, సౌందర్యముతో ఒప్పువారు, ఆయుధములు ధరించిన వారందరిలో శ్రేష్ఠులు, అగు ఇద్దరు కుమారులు నా అనుగ్రహము వలన నీకు నిశ్చయముగా కలుగుదురు ఈ విధముగా చెప్పి నారాయణుడు మరల తసనీవాసమున కరిగెను. వేసపుత్రుడైన పృధువు కూడ వేదములందు చెప్పబడిన పద్ధతి ప్రకారము నిశ్చలమైన భక్తిని కలిగి, మధుసూదనుడైన విష్ణువును ధ్యానించుచు తన రాజ్యమును పరిపాలించెను.

కొద్దికాలమునకే సన్నని శరీరము కలది, స్వచ్ఛమైన చిరునవ్వు కలది అగు అతని భార్య ఆగ్నిహోత్రరూపుడైన శిఖండిని హవిరానుని అంతర్థానమై పుత్రునిగా పొందెను.

ఆ శీఖండికి సుశీలుడని ప్రసిద్ధుడైన కుమారుడు కలిగెను. అతడు ధర్మము నాచరించువాడు, సౌందర్యము కలవాడు, వేదములు వేదాంగముల యొక్క పొగమును చూచిన వాడుగా ఉండేను.

అతడు శాస్త్రము ప్రకారము వేదములను చదివి ధర్మమార్గముతో తపస్సునందు పూనిక కలవాడై, అదృష్ట వశముచే ధర్మవిదుడైన వాడై సన్న్యాసమునందు బుద్ధిని నిలిపెను.

ఆ సుశీలుడు తీర్ధ స్థలములను సేవించి, వేదాధ్యయనము నందు, తపస్సునందు నిష్ఠకలవాడై ఒక సమయమున సిద్ధులచేత సేవించబడుచున్న హిమాలయశిఖరమును చేరెను.

అక్కడ ధర్మవనమను పేరుగల ధర్మసిద్ధిని కలిగించునది, యోగులకు పొందదగినది, వేదశత్రుపులకు గోచరము కానిది అగు వనము నాతడు చూచెను.

అక్కడ పుణ్యవతి, నిర్మలమైనది, కమలములు, కలువలతో కూడినది, సిద్ధుల ఆశ్రమాలచే అలంకరింపబడిన మందాకిని అనునది  (ఉండెను).

అతడు దానియొక్క దక్షిణతీరమందు ముని శ్రేష్ఠులతో, యోగులతో కూడియున్న మిక్కిలి పుణ్యప్రదమైన, అందమైన ఆశ్రమమును ప్రీతితో చూచెను.

ఆమందాకిని నీటిలో స్నానము చేసి, పితృదేవతలకు తర్పణములిచ్చి, తామరలు కలువలు మొద పుష్పములతో మహాదేవుని పూజించి;

సూర్యమండలములో నివసించుదేవుని ధ్యానించి, తల పై దోసిలి ఒగ్గి సూర్యునివైపు చూచుచు, పరమేశ్వరుని స్తోత్రము చేసెను.

వేదములోని రుద్రాధ్యాయముతో, రుద్రుని చరిత్ర పఠనముతో, ఇతరములైన అనేక విధముల స్తోత్రములతో, వేదములందు చెప్పబడిన శివునికి సంబంధించిన మంత్రములతో, స్తుతించెను

ఇంతలో తన వద్దకు వచ్చుచున్న శ్వేతాశ్వతరుడను పేరుగల, పాశుపతులలో గొప్పవాడైన మహామునిని ఆ సుశీలుడు చూచెను.

భస్మము లేపనము చేయబడిన సమస్తావయవములు కలవాడు, కౌపీనమను ఆచ్చాదన వస్త్రముతో కూడి యున్నవాడు, తపస్సుచేత కృశించిన శరీరము కలవాడు, తెల్లని యజ్ఞోపవీతము ధరించినవాడు అగు మునీని చూచేను.

అతడు శివుని స్తోత్రమును ముగించి, ఆనంద బాష్పములతో తడిసిన కన్నులు కలవాడై తన తలతో అతని పాదములకు ప్రణామము చేసెను. చేతులు జోడించి యీ వాక్యము పలికెను. ఓ మునీశ్వరా  యోగీశ్వరుడవు, యోగవేత్తలలో శ్రేష్టుడవు, భగవంతుడవగు నీవు సాక్షాత్కరించినావు. అందువలన నేను ధన్యుడనైనాను. అనుగ్రహింపబడినాను.

ఆహా  ఏమి నాయొక్క గొప్ప అదృష్టము  నాతపస్సులు ఫలవంతములైనవి. నీ శిష్యుడనైన నేను మీకు ఏమి సేవచేయవలెనో చెప్పి, పుణ్యాత్ముడా  నన్ను రక్షింపుము.

ఆశ్వేతాశ్వతరమహాముని శీలవంతుడు. రాజు అగు సుశీలుని అనుగ్రహించి, తపస్సు చేత నశించిన పాపములు కల అతనిని తన శిష్యుడుగా స్వీకరించెను.

సన్యాసమునకు సంబంధించిన శాస్త్రవిధిని సంపూర్ణముగా జరిపించి, వివేకవంతుడైన అతడు తమ శాఖయందు విధింపబడిన వ్రతనీయమముకల ఈశ్వర విషయక జ్ఞానము నతనికుపదేశించెను.

ఆ జ్ఞానము సమస్త వేదములందలి సారభూతము, ప్రాణుల బంధ రూపాలైన పాశములను విడిపించునది. బ్రహ్మ మొదలగు వారిచే ఆచరింపబడిన చీపరీ ఆశ్రమమనీ ప్రసిద్ధమైనది.

ఆ ముని ఆశ్రమములో నివసించు వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, బ్రహ్మచర్య వ్రతమును పాటించువారును అగు యే శిష్యులు కలరో, వారిని చూచి ఆ ముని ఇట్లనెను.

ఇక్కడ యోగులు, సొచేత ప్రవర్తింప జేయబడిన శాఖను అధ్యయనము చేసియే, ఈశ్వర నిర్మితమైన విశ్వమును ధ్యానించుచు మహాదేవుడగు శివుని సేవించుచున్నారు. ఇక్కడ మహాదేవుడగు శివుడు పార్వతీదేవితో విహరించుచు, భక్తుల యందలి దయాగుణముతో నివసించి ఉన్నాడు.

ఈ ప్రదేశములో పూర్వము సమస్త లోకములను సృష్టించిన నారాయణుడు స్వయముగా, లోకముల మేలుసుకోరి, మహాదేవుని పూజించెను.

ఇక్కడ దేవతలకు గూడ దేవుడైన ఈశాన దేవుని ఆరాధించి దేవతలు, రాక్షసులు కూడ గొప్ప సిద్ధిని పొందిరి.

ఇచ్చటనే మరీచి మొదలగు మునులందరు మహేశ్వరుని దర్శించి, తమ తపస్సు యొక్క బలమువలన సర్వకాలీనమైన జ్ఞానమును పొందినారు.

ఓ రాజా  అందువలన నీవు కూడ తపస్సు, యోగముతో కూడిన పొడవై నాతో కూడ ఎల్లప్పుడు ఉండుము. దాని వలన నీవు సిద్ధినిపొందగలవు.

ఆ బ్రాహ్మణోత్తముడీవిధముగా పలికి, భగవంతుడైన శివుని ధ్యానించి, అతనికి సర్వసిద్ధులు కలుగుటకు గాను మహా మంత్రమును విధి ప్రకారముపదేశించెను.

ఆ మంత్రము సమస్త పాపములను తొలగించునది, వేదముల సారభూతమైనది, మోక్షమునిచ్చునది, “అగ్నిః” అనునది ఆదియందుకలిగి ఋషులచేత ప్రవర్తింప జేయబడిన పుణ్యమైనది.

ఆ సుశీలుడను రాజుకూడ, అతని మాటలవలన శ్రద్ధతో కూడినవాడై, సాక్షాత్తుగా పాశుపతుడై వేదాభ్యాసమునందు నిమగ్నుగాడాయెను.

భస్మము చేత పూయబడిన సమస్త శరీరము కలవాడు, దుంపలు, వేర్లు, పండ్లు ఆహారముగా కలవాడై, శాంతుడు, ఇంద్రియముల నచినవాడు, కోపమును జయించినవాడు, సంస్యాసవీధి నాశ్రయించినవాడుగా ఆయెను.

హవిర్ధానుడు ఆగ్నేయి యనుభార్యయందు విలువిద్యయందు పారంగతుడైన ప్రాచీనబర్హిషుడను పేరుగల కుమారుని పొందెను.

పూజనీయుడైన ప్రాచీనబర్హి, ఆయుధములను ధరించిన వారందరిలో శ్రేష్ఠుడై సముద్రతనయ యగు తన భార్య యందు పదుగురు కుమారులను కనెను.

ఆ కుమారులు ప్రసిద్ధమైన బలముకల రోజులుగా ప్రచేతసులు అని ప్రఖ్యాతులైరి. తమ శాఖ వేదము నధ్యయనము చేసి నారాయణుని యందు భక్తి కలవారుగా ఉండిరి.

ఆ పదిమంది ప్రచేతసుల వలన మారిష అను స్త్రీ యందు పూర్వము బ్రహ్మదేవుని కుమారుడుగా నుండిన మహానుభావుడైన దక్షప్రజాపతి జన్మించెను.

ఆ ప్రాచేతసుడగు దక్షుడు ధీమంతుడైన మహేశ్వరునితో వివాదము కలిగించుకొని, అతనిచేత శపింపబడేను.

మహాదేవుడైన శివుడు తన దేవియొక్క ఇంటికి వచ్చుచున్న దక్ష ప్రజాపతిని చూచి, అతనికి తగిన అతిథి సత్కారమును స్వయముగా చేసెను.

అప్పుడు బ్రహ్మదేవుని కుమారుడైన దక్షుడు క్రోధముచే ఆక్రమింపబడినవాడై, తనకు జరిగిన సత్కారము తగినదిగా లేదని భావించి తన యింటికి వెళ్ళిపోయెను.

తరువాత ఒక సమయమున తన యింటికి వచ్చిన తన పుత్రికయగు సతీదేవిని దక్షుడు, మిక్కిలి చెడ్డ మనస్సు కలవాడై భర్తతో కూడ ఆమెను నిందించి బెదరించెను.

నీ భర్తయగు శివునికంటే నా తక్కిన అల్లుండ్లందరు శ్రేష్ఠులైనవారు. నీవు కూడా మా పుత్రికలలో దుష్టులవు. అందువలన ఇక్కడి నుండి వచ్చిన దారిలో వెళ్ళుము.

ఆ దక్షుని వాక్యమును వినీ శంకరునీ భార్యయగు సతీదేవి, తన తండ్రియగు దక్షుని దూషించి, తన శరీరమును అగ్నిలో దహించు కొనేను. (పశుపతి, చర్మమును వస్త్రముగా ధరించిన భర్తయగు శివునకు నమస్కరించి ఆత్మత్యాగము కావించుకొనెను. తరుపోత ఆ సతీదేవి హిమవంతుని తపస్సుచే సంతోషించినదై అతనికి పుత్రికగా జన్మించెను.

ఆశ్రయించిన వారి బాధలను తొలగించు భగవంతుడగు రుద్రుడు, ఆమెను తన భార్యగా గుర్తించి, ఆమె మరణమునకు కారణమైన దక్షుని యింటికి వచ్చి అతనిని శపించెను.

ఈ బ్రహ్మ సంబంధమైన శరీరాన్ని విడిచిపెట్టి క్షత్రియ వంశములో పుట్టుము. నీవు మూడబుద్ధి కలవాడవై నీ పుత్రిక యందే కుమారునికి జన్మనీయగలవు.

ఇట్లు పలికీ మహాదేవుడగు శివుడు కైలాస పర్వతమునకు వెళ్ళేను. ఆ స్వాయంభువుడగు దక్షుడు కూడా కొంతకాలమునకు ప్రాచేతసుడుగా పుట్టెను.

ఇది అంతయు స్వాయంభువ మనువు యొక్క చరిత్ర, దక్షుని వరకు జరిగిన దానిని వీను వారి పాపములను తొలగించు దానిని మీకు చెప్పినాను.

శ్రీ కూర్మపురాణములో రాజవంశానుకీర్తన మందు పదునాల్గవ అధ్యాయము సమాప్తము.