కూర్మ మహా పురాణము
12వ అధ్యాయము
వ్యాసుడు చెప్పెను.
ఋషులారా! మీరందరు ఇప్పుడు చెప్పబోవునది, బ్రాహ్మణులకు శాశ్వత ఫలమునిచ్చునదీ, సనాతనమైన కర్మయోగమును వినుడు!
పూర్వకాలమున ప్రజాపతియగు మనువు, వీనగోరిన ఋషులకు బ్రహ్మచేత చెప్పబడినది, అఖిల వేదసిద్దమైనది, అన్ని పాపములు తోలగించునది, పవిత్రమైనది, ఋషులచే సేవించబడినది యగు కర్మయోగమును చెప్పెను. మీరందరు సావధోన మనస్కులై నేసు చెప్పుచుండగా వినుడు. బ్రాహ్మణోత్తముడు ఉపనయనము గావించుకొని వేదాధ్యయనము చేయవలయును. ఈ ఉపనయనము గర్భాష్టమమునగానీ, అష్టమ వర్షమున గాని స్వస్తూత్రోక్త వీధి విధానముగా చేసికొనవలెను. దండమును, మేఖలమును, సూత్రమును, కృష్ణాజినమును ధరించి, మునివృత్తి ననుసరించి, భిక్షాన్నమును గ్రహించుచు, గురుహితమును కోరుచు, నిత్యము గురు సమీపమున నుండి, గురువును చూచుచు అధ్యయనమును కొనసాగించవలయును.
పూర్వము బ్రహ్మ ఉపవీతముకై, కార్వాసము (ప్రత్తి)ను నిర్మించేను. బ్రాహ్మణులకిది మూడు వరుసలుండును. కార్ఫాసము లభించనపుడు కుశలతోగానీ, వస్త్రముతోగాని ఏర్పరచుకొనవలెను. ద్విజుడు ఎప్పుడు యజ్ఞోపవీతమును ధరించియే యుండవలెను. అట్లే శిఖను ధరించవలెను. శిఖా యజ్ఞోపవీతములు లేక చేసిన కర్మ చేయనట్లేయగును.
అట్లే వికారము చెందని (జీర్ణము కానిది, దగ్గముగానిది) వస్త్రము ధరించవలెను. ఈ వస్త్రము తెల్లనిది, చిల్లులు లేనిది, ఉత్తమమైనది కావలయును. ఉత్తరీయార్థము కృష్ణాజీన ధారణము ఉత్తమము. కృష్ణాజినము లభింపనిచో దివ్యాజీనము, (రురుమృగ చర్మము, గజ చర్మము, చిరుత చర్మముగాని) ధరింపవలెను.
దక్షిణ బాహువును ఎత్తి, సవ్యబాహువుపై ఎపుడు యజ్ఞోపవీతము నుంచవలెను. మెడలో హారమువలె వేసికొన్న నివీతమనబడును. (ఎడమచేతినెత్తి, కుడిచేతిపై యజ్ఞోపవీతము నుంచుకొనిన ప్రాచీనావీతమందురు. ఇది పితృకర్మలలో చేయవలెను. అగ్నిశాలలో, గోశాలలో, హెూమమున, జపకర్మలో, స్వాధ్యాయమున, భోజన సమయమున, బ్రాహ్మణుల సన్నిధిలో, గురూపాసనలో, రెండు సంధ్యలలో, సాధు సంగమమున, ఎపుడు ఉపవీతిగానే యుండవలెను. ఇది సనాతన విధి. మౌంజిని, బ్రహ్మచారికి యజ్ఞోపవీతమువలే మూడు వరుసలుగా, సమముగా, మృదువుగా ఏర్పరచవలెను. ముంజతృణము లభించనపుడు దర్భతో ఒక గ్రంధితోగాని, మూడు గ్రంథులతోగాని చేయవలయును. అట్లే మారేడు దండముగాని, మోదుగదండముగాని ద్విజుడు కేశాంతపర్యంతము ధరించవలెను. బిల్వపాలాశములు లభించనపుడు, యజ్ఞమునకు పనికివచ్చు వృక్షదండమును చక్కనిది, సుడులు, ఛిద్రములు లేనిదగు దండమును ధరించవలెను.
ద్విజుడు సావధాన మనసుడై ప్రాతః సాయం సంధ్యలలో సంధ్యావందన మాచరింపవలేను. కోమముతోగానీ, లోభముతోగానీ, భయము వలన మోహము వలన సంధ్యను విడచినచో పతితుడగును. తరువాత ప్రాతః కాలమున, సాయంకాలమున ప్రసన్న చిత్తముతో అగ్నికార్యము చేయవలయును. స్నానము చేసి దేవ ఋషి పితృగణములను తృప్తి పరచవలెను. పుష్ప పత్ర జలములతో దేవతలను పూజించవలయును, ధర్మాను సారముగా నీత్యము వృద్ధులకు అభివాదము చేయవలయును. సోమరితనమును విడచి, “అసౌ అహంభో?” అనీ సొమోచ్చారణ పూర్వకముగా చక్కగా వంగి ఆయురారోగ్య సిద్ధి కొరకు నమస్కరించవలెను. ఆయుష్మాన్ భవ సౌమ్యై, అనీ అభివాదము చేసిన వానికి ద్విజుడు ప్రత్యభివాదము చేయవలెను. పేరు చివర లేదా వాక్యము చివర వ్యంజనమున్నచో, దాని కన్నొ మొదట ఉన్న అచ్చును పుతముగా పలుకవలెను.
అభిపోదము చేసిన తరువాత ప్రత్యభివాదము చేయనివానికి మరల విద్వాంసుడు అభివాదము చేయరాదు. ప్రత్యభివాదము చేయనివాడు శూద్రస ముడగును. గురువుకు అభివాదము చేయునపుడు వ్యత్యస్తపాణియై చేయవలెను. అనగా ఎడమచేతితో ఎడమపాదమును, కుడిచేతితో. కుడి పాదమును స్పృశించవలెను. ఈ ప్రక్రియ లౌకిక వైదిక, ఆధ్యాత్మికములలో సమానము. ఎవని నుండి జ్ఞానము పొందుతామో అతనికి మొదట నమస్కరించవలెను. దేవ పూజనము మొదలగు కర్మల యందు భీక్షలో లభించిన జల పుష్ప సమిధలను, ఇతర పదార్థములను గ్రహించరాదు. బ్రాహ్మణుడు కలిసినపుడు కుశలమును, క్షత్రియుడు కలిసినప్పుడు అనామయము (రోగరాహిత్యము) వైశ్యుడు కలిసినపుడు క్షేమమును, శూద్రుని ఆరోగ్యమును అడుగవలెను.
ఉపాధ్యాయుడు, తండ్రి, జ్యేష్టభాత, రాజు, మేనమామ, కన్యనిచ్చిన మామ రక్షకుడు, తల్లితండ్రి, తండ్రితండ్రీ, జ్యేష్ఠ వర్ణుడు, పెదతండ్రి పినతండ్రి వీరిని గురువులందురు. తల్లి, తల్లితల్లి, గురుపత్ని పినతల్లి, మేనత్త, అత్త, తండ్రితల్లి, పెద్దక్క పోషించినది ఈ స్త్రీలు గురువులుగా చెప్పబడిరి. ఇట్లు తల్లి నుండి తండ్రి నుండి గురువులు చెప్పబడిరి. మనోవాక్కాయ కర్మలతో వీరిని అనుసరించవలయును.
గురువును చూచిన వెంటనే ఆసనము నుండి లేచి, చేతులు జోడించుకొని, అభివాదన వీధితో నమస్కరీంచవలెను. వీరితో కలిసి ఒకే ఆసనముపై కూర్చుండరాదు. తన కొరకుగాని, బ్రతుకు తెరువునకు గాని, గురువుతో వాదించరాదు. గురువుతో ద్వేషముతో సంభాషింపరాదు. ఇతర గుణములున్నను గురువును ద్వేషించినవాడు అథఃపతీతుడగును.
గురువులందరీలో, విశేషించి అయిదుగురు పూజ్యులు. వారిలోను మొదటి ముగ్గురు శ్రేష్టులు, వారిలోను మాత ఉత్తమ గురువు. కన్నతండ్రి, కన్న తల్లి విద్యనుపదేశించినవారు, జ్యేష్ఠభాత, భర్త - యీ అయిదుగురు గురువులుగా చెప్పబడిరి. వీరిని సర్వప్రయత్నముతో చివరికి ప్రాణముల నర్పించియైనను అభివృద్ధి కోరువాడు, విశేషించి పూజించవలెను.
తల్లిదండ్రులు ఎంతవరకు, గోహత్య, గురుహత్య, బ్రహ్మహత్యాది మహాపాతకములు చేయనివారుగా ఉందురో అంతవరకు పుత్రులు అన్నిటిని విడిచి వారిని సేవించవలెను. పుత్ర గుణములతో తల్లిదండ్రులు సంప్రీతులైనచో, ఆపుత్రుడు సకల ధర్మములను పొందును. మాతృ సమమైన దైవము, పితృసముడైన గురువు లేడు. ఎంత కష్టపడినను వారికీ ప్రత్యుపకారము చేయలేడు, పితృసముడైన జ్యేష్ఠ భాతను అవమానించిన మూర్ఖుడు దానితో ఘోరమైన నరకమును పొందును.
మనోవాక్కాయములతో ఎప్పుడు తల్లిదండ్రులకు ప్రియమునే చేయవలెను.
వారీ అనుమతి లేనిదే ఇతర ధర్మములు ఆచరించరాదు. మోక్ష సంబంధము, నీత్య నైమిత్తిక ధర్మముల విషయమున ఈ నియమము వర్తించదు. తల్లిదండ్రుల సేవ ఇహమున ధర్మసారము, పరమున మోక్ష ప్రదముగా చెప్పబడినది. గురువును చక్కగా ఆరాధించి, వారి ఆజ్ఞతో వెడలిన శిష్యుడు, ఇహమున విద్యాఫలము, పరమున ధర్మ ఫలమును అనుభవించును.
సన్మోర్గమును అనుసరించు పురుషుడు తనను భరించి పోషించిన వానిని సర్వదా పూజించవలయును. ఉపకారము చేసినదాత అత్యధిక గౌరవమునకు యోగ్యుడు. తాను పొందిన బ్రతుకు తెరువునకు ప్రత్యుపకారముగా తన ప్రాణములను అర్పించినవారు అక్షయలోకములను పొందుదురనీ మనువు చెప్పెను.
మేనమామలను, పినతండ్రులను, మామలను, ఋత్విజులను, లేచి ఎదురేగి అసౌ అహం అభివాదయే” అని చిన్నవారు పలుకవలేను. తన కన్నా వయసులో చిన్నవారైనను యజ్ఞాదులలో దీక్షితుడైన పేరుతో పిలువరాదు. ధర్మము తెలిసిన వాడు “అయ్యా 'తమరు' అని భాషించ వలెను. సంపదలను కోరు క్షత్రియులు నిత్యము ఆదరముతో బ్రాహ్మణులకు అభిపోదము, పూజ, నమస్కారములు గావించవలయును.
బ్రాహ్మణుడు, క్షత్రియాదులకు ఏ స్థితిలోను అభివాదము చేయరాదు. క్షత్రియాదులు జ్ఞాన గుణ కర్మలు కలిగియున్నను, బహుశాస్త్ర అధ్యయనము గావించినను అభివాదము చేయరాదు. బ్రాహ్మణుడు అన్ని వర్ణముల వారికి శుభము కలిగించునన్నది వస్తు స్థితి. సవర్ణులు సవర్ణులకు అభివాదము చేయవచ్చును. ద్విజులకు అగ్ని గురువు. వర్ణములలో బ్రాహ్మణుడు గురువు. స్త్రీలకు పతి గురువు. అభ్యాగతుడు అందరికీ గురువు.
విద్య, కర్మ, వయసు, బంధుత్వము, ధనము యీ ఐదు పూజ్య స్థానములు. వీనిలో తరువాతి దానికంటే మొదటిది శ్రేష్ఠము. త్రివర్ణికులలో యీ అయిదు మిక్కిలీ బలీయములు. ఇవి ఉన్నవాడు పూజ్యుడగును. ఈ అయిదు గుణములను పొందిన శూద్రుడు దశవర్ష వయస్కుడైనచు పూజారుడైయగును.
బ్రాహ్మణునికి, స్త్రీకి, రాజునకు, నేత్రహీనునకు, వృద్ధునకు, బరువు మోయుచున్న వానికీ, రోగికి, బలహీనునకు తాను తొలగి దారి విడువ వలెను. బ్రహ్మచారి శిష్టుల గృహము నుండి ప్రతి దినము శ్రద్ధాళువై భిక్షను తెచ్చి గురువునకు నివేదించి, అతని ఆజ్ఞతో మౌనముగా భుజించవలయును.
ఉపనీతుడగు ద్వీజుడు భిక్షా చరణమును 'భవత్' శబ్దము మొదట ఉపయోగించి చేయవలెను. రాజులు ‘భవత్' శబ్దమును మధ్యను, వైశ్యులు చివరను వాడవలెను. తల్లిని, పినతల్లిని, తన సోదరిని, తనను అవమానించని స్త్రీని ఉపనయన కాలమున మొదట భిక్ష చరించవలయును. సజాతీయుల గృహములలో తమకంటే ఉచ్చవర్గముల యిండ్లలో అందరి నుండి భిక్షాటన చేయవచ్చును. పతితులను మాత్రము విడువవలెను.
వేదములు యజ్ఞములు లోపించనిచోట, స్వకర్మాచరణములో శ్రేష్ఠులైన వారి యిండ్లలో ప్రతిదినము ప్రయత్న పూర్వకముగా భిక్షాటన గావించ వలయును. గురువుల యిండ్లలో, జ్ఞాతుల యిండ్లలో, బంధువుల యిండ్లలో భిక్షాటన చేయరాదు. ఇతరుల యిండ్లలో లభించనపుడు మొదటివానిని విడువవలేను: అనగా గురు జ్ఞాతి కులములను విడచీ, బంధుకులములలో ఆచరించవచ్చును. పైన చెప్పినవి చెప్పిన చోట లభించనపుడు ప్రయత్నపూర్వకముగా వాక్కును నియంత్రించుకొని, చీక్కులను చూడకుండ గ్రామమంతయు సంచరించవలయును.
తనకు అవసరమున్నంత, నిష్కపటముగా, భిక్షమును సంపాదించుకొని మౌనముతో సావధాన మనస్కుడై వినయాన్వితుడై భుజించవలయును. ప్రతి దీనము భిక్షాన్నముతో జీవించవలయును. కాని ప్రతినిత్యము ఒకే అన్నమును, ఒకేచోట ఒకరిదీ భుజించరాదు. భిక్షాన్నము భుజించుపోని వృత్తి ఉపవాస సమమని చెప్పబడినది.
అన్నమును ఎపుడు పూజించవలయును. అన్నమును నిందించరాదు. అన్నమును చూసి సంతోషించవలెను. ప్రసన్నుడు కావలయును. మనోవాక్కాయములతో అభినందించవలయును. అతిభోజనము, అనారోగ్యమును, అనాయుష్య మును, అస్వర్గము (నరకము)ను కలిగించును. అతిభోజనము పుణ్యదూరము, లోకుల చేత ద్వేషింపతగినది కావున అతిభోజనము విడువవలెను.
తూర్పుముఖముగా గాని, సూర్యాభీముఖముగా గాని, కూర్చుని భుజించ వలయును. ఉత్తరాభిముఖముగా భుజించరాదు. ఇది సనాతన విధి. భుజించు ముందు పాదములను హస్తములను కడిగికొని, రెండుసార్లు ఆచమనము చేసి పరిశుద్ధమైన ప్రదేశమున కూర్చుని భుజించవలయును. భోజనము తరువాత మరల రెండు మూగులు ఆచమనము చేయవలయును.
ఇది శ్రీ కూర్మపురాణము షట్ సాహస్ర సంహితలో ఉపరివిభాగమున పండ్రెండవ అధ్యాయము.
