కూర్మ మహా పురాణము

Table of Contents

22వ అధ్యాయము

వ్యాస మహర్షి చెప్పెను

సావధానముగా గోమయముతో నీటితో భూమిని చక్కగా లీకి, ద్వజసమూహమును చేరి సజ్జనుల ద్వారా బ్రాహ్మణులను నియంత్రణ గావించవలయును. శ్రాద్ధపూర్వదినమున బ్రాహ్మణులను చక్కగా పూజించి రేపు మా ఇంటిలో శ్రాద్ధము జరుగగలదు. తాము దయతో రావలయును. ఇట్లు నియంత్రణ చేయవలయును. ఒక దినము ముందు, అపకాశము లేనిచో శ్రాద్ధ దినముననే వెళ్ళి పూర్వము చెప్పిన లక్షణములు కలపోరిని పిలువవలయును.  

మనోవేగముకల పొరీ పితృదేవతలు ఈనిమంత్రణమును విని శ్రాద్ధకాలము వచ్చినది అని పరస్పరము ఆలోచించుకొనీ శ్రాద్ధకర్త ఇంటికి చేరెదరు. అంతరిక్షమున సంచరించు పీతరులు వాయురూపమున నుండి బ్రాహ్మణులతో కలిసి భుజించెదరు. భోజనము చేసి పరమగతిని పొందెదరు. నియంత్రణ చేయబడిన విప్రులు శ్రాద్ధకాలమున నియమపరులు బ్రహ్మచర్య పరాయణులుగా నుండవలయును.

శ్రాద్ధము చేయువాడు క్రోధము, తొందరపాటు, ఏమరుపాటులేనివాడుగా ఉండపలయును. సత్యపోది సావధానిగా నుండవలయును, బరువును మోయుట, స్త్రీ సంగమము, యాత్రను విడువవలయును.

శ్రాద్దము కొరకు పిలువబడినవాడు ఇతరుల నియంత్రణమును స్వీకరించినచో ఘోరనరకమును పొందును. మరల సూకరముగా పుట్టును. ఒకబ్రాహ్మణుని నియంత్రణజూపి అతన్ని కాదని ఇంకొకరిని పిలిచినవాడు రెట్టింపు పాపమును పొంది పలకీటముగా పుట్టును. శ్రాద్ధమున నీమంత్రించబడినవాడు మైధునమాచరించినచో బ్రహ్మహత్యాపాపమును పొందును. పశుజాతిలో పుట్టును, శ్రాద్ధమున నీమంత్రితుడు ప్రయాణము చేసినచో అతని పితలు ఆనెల పాంసు భోజునులగుదురు.

శ్రాద్దమున పిలువబడిన బ్రాహ్మణుడు కలహించినచో అతని పితరులు ఆమాసముమల భోజనులగుదురు. కావున శ్రాద్ధమున నియంత్రణ చేయబడిన గాడు మనోనిగ్రహము కలిగియుండవలయును. కోపరహితుడు శౌచపరుడు కావలయును. కర్తకూడో జితేంద్రియుడు కావలయును, శ్రాద్దదినమున కంటే పూర్వదినమున సావధానమనస్కుడై దక్షిణ దీక్కునకువెళ్ళి దక్షిణ దిక్కునకు వంగియున్న వేళ్ళతోనున్న దర్భలను జలమును గొనిరావలయును. దక్షిణమునకు వంపుగా వున్నదిస్నిగ్ధమైనది ఇతర సంబంధరహితమగు నది, శుభలక్షణ సమన్వితము పవిత్రము జన సమ్మర్థరహితమునగు స్థలమును ఆవుపేడతో నలుకవలయును. నదీతీరములందు, తీర్థములందు స్వభూమియందు, పర్వతశిఖరములందు, ఏకాస్త ప్రదేశమునందు చేయబడు శ్రాద్దమున పితరులు ఎప్పుడు సంతసించుచుందురు. పరకీయభూమియందు పితృశ్రాద్ధము చేయరాదు. మోహముతో అట్లు చేసినచో ఆభూమి యజమానివలన ఆశ్రాద్ధముఫలము చేరబడును. అరణ్యములు పర్వతములు పుణ్యతీర్ధములు దేవాలయములు ఇవన్నియు అస్వామికములు ఈభూమిలో అంతటా నువ్వులను చల్లవలయును. రాక్షసులచేత ఆక్రమించబడిన భూమి నువ్వులచే శుద్ధిచేయబడును.

పలువిధములుగా సంస్కరించబడిన అన్నమును అనేకవ్యంజనములు కలదానిని చోష్యాదీసమృద్ధమును యధాశక్తి కల్పించవలయును. తరువాత మధ్యాహ్నకాలము గడిచినతరువాత క్షవరము చేసుకొనిన వారిని నఖరోమములు బయటికి రాని వారిని బ్రాహ్మణులను సమీపించి మార్గమధ్యలో దంతధావనమున కీయవలయును. వైశ్వదేవ మంత్రముల నుచ్చరించుచు మేడిచెక్కతో చేయుపాత్రలతో అభ్యంజనము కోరకు తైలమును స్నానమునకు జలమును ఈయవలయును, స్నానము చేసి తిరిగి వచ్చిన వారిని ప్రత్యుత్థానముగావించి చేతులు జోడించుకొని యధాక్రమముగా పాద్యమును ఆచమనీయమును ఈయవలెను విశ్వేదేవతలకొరకు నియంత్రించబడిన బ్రాహ్మణులను మూడు దర్బలతో ప్రొజ్ముఖాసనములనుంచవలయును. పితృదేవతలకు దక్షిణాముఖాసనములను ఒకే దర్భకలవి తిలోదకములతో ప్రోక్షించబడవలయును. ఆసనమును స్పృశించి వాటి పై వీరిని కూర్చోబెట్టవలయును. కూర్చొనుడనిపలికి విడివిడిగా ఏర్పాటు చేయవలయును.

విశ్వేదేవస్థానమున ఇద్దరు విప్రులు ప్రొజ్మఖముగా, పితృస్థానమున ముగ్గురు ఉదఙ్ముఖమున కూర్చొనవలయును. ఇట్లు వీలుకానిచో దేవస్థానమున ఒకరిని పితృస్థానమున ఒకరిని నిమంత్రించవలయును. శ్రాద్ధమున విస్తృతి జరిపిన సత్కారము దేశకాలము శౌచము బ్రాహ్మణ సంపద అను ఈ అయిదు లోపించును. కావున శ్రాద్దమున వేదపారగుడగు బ్రాహ్మణుని ఒకనిభుజింప చేసిననూ పోలుసు. సిద్దము చేసిన భోజన పదార్థములనుండి తగినంత ఒక పాత్రలో తీసుకొని దేవాలయమున భగవంతునికి నివేదన జరిపిన తరువాత ఇతర కార్యమును ప్రవర్తింపచేయవలయును. శ్రాద్దాన్నమును అగ్నీలో కానీ బ్రహ్మచారికి కాని నివేదించవలయును. కావున ఒకరినైనా విద్వాంసుని శ్రేష్టుని భుజింప చేయవలయును. శ్రాద్ధమున భుజించుటకు బ్రాహ్మణులు కూర్చున్నపుడు భిక్షుకుడు కానీ బ్రహ్మచారి కాని వచ్చినచో వారితోపాటు అతనిని కూడా భుజింప చేయవలయును. అతిథి భుజించని శ్రాద్ధమున శ్రేష్ఠము కాజాలదు. కావున శ్రాద్దములందు విశేష ప్రయత్నముతో అతిథులను పూజించవలయును. ఆతిథ్యములేని శ్రాద్ధము భుజించిన ద్విజులు, భుజింప చేసిన కర్త కూడా కాకులుగా పుట్టెదరు. అంగవికలుడు, పతితుడు, కుష్టురోగి గాయము తగిలినవాడు, పులసలు, నాస్తికుడు, కోళ్ళు వరాహములు,శునకములు శ్రాద్దమునకు దూరముగా పరిహరింబడవలయును. భయంకరుని, అపవిత్రుని, నగ్నుని, మత్తుని, ధూర్తుని, రజస్వల స్త్రీని, నీలవస్త్రని, కాషాయ వస్తునీ పాఖండులను శ్రాద్ధములో దూరముగా విడువవలయును.

పితృకర్మలో బ్రాహ్మణుల విషయమున చేయవలసిన దంతయూ వైశ్వ దేవ పూర్వకముగా ఆచరించవలయును, యధావిధిగా కూర్చొనియున్న బ్రాహ్మణులందరినీ పుష్పహారములతో శిరోవేష్టనములతో వస్త్ర ధూప విభూషణాదులతో అలంకరించవలయును. తరువాత బ్రాహ్మణాజ్ఞతో ఉత్తరాభి ముఖముగా కూర్చున్న వారిలో విశ్వేదేవాస” అను మంత్రముతో విశ్వ దేవతలను ఆపోహించవలయును. చకగ్రా కడిగిన పాత్రలో రెండు పవిత్రములను తీసుకోని 'శంనోదేమీ' అను మంత్రముతో జలమును ప్రోక్షించి 'యవోసి' అను మంత్రముతోయవములను చల్లి, 'యాదీవ్యా' అను మంత్రముతో హస్తమున అర్ఘ్యమును విడువవలయును. తరువాత శక్త్యానుసారము గంధమాల్య ధూపాదులను సమర్పించవలయును.

తరువాత అపసవ్యముగా దక్షిణాముఖుడై పితృదేవతలకు 'ఉశంతస్వ' అను మంత్రముతో ఆవాహన చేయవలయును. తరువాత వారి అనుమతితో 'ఆయంతునః' అను మంత్రమును జపించవలయును. ‘శంనో దేవీ” అను మంత్రముతో పాత్రలో ఉదకమును, “తిలోసి' అను మంత్రముతో తిలలను చల్లి, యధా పూర్వముగా హస్తములలో అర్ఘ్యమునిచ్చి తరువాత మిగిలిన జలమును సావధానముతో పాత్రలో ఉంచ వలయును. 'పితృభ్యః స్థానం' అను మంత్రముతో పాత్రను బోర్లించవలయును, 'అగ్నౌ కరిష్యే' అని అడిగి 'కురుష్వ' అని వారి ఆజ్ఞను పొంది ఘృతప్ను తాన్నమును ఉపవీతియై హవనము చేయవలయును. దర్భపాణియే ఉపవీతియై హోమము చేయవలయును. వైశ్వదేవమను హోమము సవ్యముగా పితృకర్మను అపసవ్యముగా చేయవలయును.

విశ్వే దేవుల పరిచర్యలో కుడి మోకాలును పరచవలయును. పితృ పరిచర్యలో వామ జానువును వంచవలయును. తరువాత 'సోమాయ తే పితృమతే స్వధానమః' అని, 'అన్నయే కవ్యహవ్యాయ స్వధా' అని హోమము చేయవలయును. అగ్నిలేనిచో బ్రాహ్మణుని చేతిలోను జలమును విడువవలయును. మహాదేవుని సన్నిధిలో కాని గోశాలలోను విడువవలయును. తరువాత వారితో అనుమతీ బడసి దక్షిణా ధీశకు వెళ్ళి భూమిని గోమయముతో అలికి ఇసుకతో వేదికను చేసి దక్షిణా వనతముగా చతురస్రముగా మండలముగా కాని వేదికను నిర్మించి ఆ వేదిక మధ్యమున ఒక దర్భతో మూడు మార్లు ఉల్లేఖించి తరువాత ఆ వేదికపై దక్షిణాగ్రములుగా దర్భలను పరిచి అచట మూడు పిండముల నుంచ వలయును. ఇట్లు పిండప్రదానము తరువాత లేప భాగ అధికారులు పితరులకు పింజధారకుశ మూలమున పిండశేష సంసృష్ట హస్తమును ప్రోక్షించి తరువత మంత్రవేత్త ఆచమనము చేసి మూడుమార్లు ప్రాణాయామము చేసి ఆ అన్నమునకు పితరులకు నమస్కారము చేసి పిండముల వద్ద జలమును వీడువ వలయును. తరువాత ఆ పిండములను ఆఘ్రాణించవలయును. తరువాత పిండదానము తరువాత మిగిలిన అన్నమును బ్రాహ్మణులను విధి పూర్వకముగా భుజింప చేయవలయును. సూప శాక ఫలములను చేరుకులను పాలను పేరుగు నెయ్యి తేనెను అన్నము వివిధ భక్ష్యములను పేయములను ఇయ్యవలయును.

బ్రాహ్మణోత్తములకిష్టమగు దానినంతను నివేదించవలయును, ధాన్యమును తీలలను వివిధ శర్కరలను వేడి అన్నమును సంపదను కోరుపాడు బ్రాహ్మణులకీయ వలయును. ఫలముల పానకములను మాత్రము ఈయరాదు. శ్రాద్ధకర్త ఆ ప్రదేశమున కన్నీటిని విడువరాదు. కోపించరాదు. అబద్దమాడరాదు. అన్నమును పొదముతో స్పృశించరాదు. పాదముతో రాయరాదు, కోపముతో ఇచ్చినది త్వరత్వరగా భుజించినది మాటలాడుచు భుజించినది కూడా రాక్షసులచే హరించబడును. చెమటబట్టిన దేహముతో బ్రాహ్మణుల వద్ద నిలువరాదు. అచటికి వచ్చిన శ్యేనకాణాది పక్షులను వెళ్ళగొట్టరాదు. పితృదేవతలు కవ్యమును భుజించుటకు ఆ రూపములోనే వచ్చెదరు. శ్రాద్ధమున చేతిలో ప్రత్యక్ష లవణమును ఈయరాదు. ఇనుప పాత్రతోకాని అశ్రద్దతోకాని వడ్డించరాదు విశ్లేషించి కంచు పాత్రతో ఇచ్చిన అక్షయ ఫలము లభించును. మృణ్మయపాత్రలో భోజనము పెట్టినవాడు, భుజించినవాడు ఘోర. నరకమును పొందును. పంక్తిలో భేదబుద్దితో భేదముగా వడ్డించరాదు. అడుగరాదు. అట్లు వడ్డించినవాడు యాచించినవాడు ఇప్పించినవాడు నరకమును చేరును. శిష్టులు మౌనముగా భుజించవలయును. ప్రాకృత గుణములను వర్ణించరాదు. భోజ్యప దార్థ గుణములను వర్ణించకుండా భుజించినంతవరకే పితరులు భుజింతురు.  

పంక్తిలో అగ్రాసనమున కూర్చున్నవాడు మొదట భుజించరాదు. చాలా మంది చూచు చుండగా ఒక్కడు భుజించినచో వారి పాపములను తాను పొందును. నియంత్రించబడిన ద్విజోత్తముడు శ్రాద్ధమున ఏ కొంచెము విడువరాదు. మాంసమును నిషేధించరాదు. ఇతరుల అన్నమును చూడరాదు. పితృకర్మలో నియంత్రించబడిన బ్రాహ్మణుడు వడ్డించిన మాంసమును భుజించనిచో పరలోకమున ఇరువది యొక జన్మలు పశురూపమును పొందును. భుజించువారలకు వేదములను ధర్మశాస్త్రములను ఇతిహాస పురాణములను శ్రాద్దకల్పములను వినిపీంచవలయును. వారు భుజించినతరువాత ‘తమరు తృప్తి చెందితిరా’ అని అడిగి వారి తృప్తిని వినిన తరువాత వారి భోజన పాత్రమందు వడ్డించగా మిగిలిన అన్నమును వెదచల్లవలయును. తరువాత వారిని ఆచమింప చేయవలయును. ఆచమించిన తరువాత నాలుగు దిక్కులలో విహరించుడని పలుకవలయును. అంతట బ్రాహ్మణులు 'స్వథాస్తు' అనీ కర్తతో పలుకవలయును. తరువాత అన్న శేషమును వారికే నివేదించి వారు చెప్పినట్లు చేయవలయును. ఏకోద్దిష్ట శ్రాద్ధమున ‘స్వదితం' అని గోష్ఠి శ్రాద్దమున ‘సూనృతం' అని, అభ్యుదయ శ్రాద్దమున 'సంపన్నం' అనీ దైవ శ్రాద్ధమున రోచతే' అని పలుకవలయును. పితృ పూర్వముగా ఆ బ్రాహ్మణులను సాగనంపీ మౌనముతో దక్షిణాభిముఖుడై పితరులను ఇట్లు వరమునడుగ వలయును. దానము చేయు మా వంశము, వేద ములు, సంతానము వర్ణిల్ల వలయును. మాలో శ్రద్ద పెరగవలయును. దాన మిచ్చుటకు మా వద్ద బహు పదార్థములు ఉండవలయును.

పిండములను గోవులకు మేకలకు లేదా బ్రాహ్మణులకు అగ్నిలో జలములో కానీ అర్పించవలయును. శ్రాద్ధకర్త పత్నీ పుత్రేచ్చ కలదైనచో మధ్యమ పిండమును భుజించవలయును. చేతులు కడుగుకోని ఆచమనము చేసి శ్రాద్ధ శేషముతో బంధువులను సంతోషింప చేయవలయును, బంధువులు తృప్తి పొందిన తరువాత భృత్యులను భుజింప చేయవలయును. తరువాత తాను భార్యతో మిగిలిన అన్నమును భుజింపవలయును. సూర్యాస్తమయము వరకు శ్రాద్ధ స్థలము నుండి ఉచ్ఛిష్టమును తీసి వేయరాదు. ఆ రాత్రి దంపతులు బ్రహ్మచర్యముతో నుండవలయును. శ్రాద్ధమును ఆచరించి తాను భుజించీ స్త్రీ సంగము గావించినచో మహా రౌరవ నరకమును పొంది కీటకముగా పుట్టును. ఆ దినము పవిత్రునిగా కోప రహితునిగా, శాంతునిగా, సత్యవాది సావధానునిగా నుండవలయును. స్వాధ్యాయమును ప్రయాణమును పరిత్యజించవలయును. భోక్త కూడా ఈ నియమమును పాటించవలయును. ఒక శ్రాద్దమున భుజించి మరొక శ్రాద్ధమున భుజించినచో మహో పొతకులతో సమానముగా నరకమును చేరుదురు. ఇట్లు మీకు చక్కగా సనాతనమగు శ్రాద్ధ కల్పము చెప్పబడినది. అనాసక్తుడగు తత్త్వవేత్త అయినచో అపక్వముతో శ్రాద్ధమునా చరించవలయును, అగ్ని హోత్ర రహితుడు, యాత్రలో ఉన్నవాడు, ఆపదలోనున్నవాడు, వీధీనీ తెలిసి శ్రద్ధతో ఆమశ్రాద్ధము నోచరించ చలయును, ఆ అపక్వముతోనే అగ్నిలోను ఈయవలయును. పిండ ప్రదానము కూడా చేయవలయును. మనో నిగ్రహముతో ఈ వీధితో శ్రాద్ధము నాచరించినవాడు పాపములు తొలగి యోగి స్థానమున నిలుచును. కావున ద్విజోత్తముడగు వాడు సర్వ ప్రయత్నముతో శ్రాద్ధమును చేయు వలయును. శ్రాద్ధ మాచరించినచో సనాతనుడగు పరమాత్మ ఆరాధించబడును.

ధనహీనుడగు ,బ్రాహ్మణుడు కందమూలముతో ఫలముతో కూడా చేయవచ్చును. అది కూడా లేనిచో స్నానము చేసి సావధానియై తిలోదకములతో తర్పణము గావించవలయును. తండ్రి బ్రతికి యుండగా శ్రాద్ధము చేయరాదు. తప్పని సరిగా చేయవలసినచో హోమాంతము వరకే చేయవలయును. మరికొందరు తండ్రి ఎవరికీ పిండదానము చేయునో వారికే చేయవలయును అని చెప్పిరి. తండ్రి, తాత, ముత్తాత వీరిలో ఎవరు మరణించిన పోరికి మాత్రమే చేయవలయును. ఇతరులకు చేయరాదు. అతని అభిరుచికి అనుసారముగా జీవించిన పురుషుని భుజింప చేయవలయును. జీవించిన వానినీ అతిక్రమించి పిండదానము చేయరాదని శ్రుతి బోధించుచున్నది. ద్యాముషాయణ కుడు బీజ క్షేత్ర పితరు లను సమముగా పిండదానము చేయవలయును, (తన కన్య నిచ్చెదనని వాగ్దానము చేసిన తరువాత వాడు చనిపోయినచో ఆ కన్య చనిపోయిన దాని సంపదను పొందుటకు పిండాదీకమునిచ్చుటకు అధికారి దేవాలయములో సగోత్రునితో వివోహము జరిగిన తరువాత ఆ కన్యకు కలిగిన పుత్రుడు ద్యాముష్యాయణుడగును) ఇతను తన కన్నతండ్రికీ, మొదట చనిపోయిన వాగర్థానము భర్తకు ఇద్దరికీ పిండ ప్రదానము గావించవలయును. ఇట్లు గావించినవాడు సంపదలో సగ భాగమునకు అరుడు. తల్లిదండ్రుల నుండి కొనీ పుత్రునిగా స్వీకరించినచో అతను తన పుట్టుకకు కారణమగు తండ్రికి పిండదానము చేయవలయును. క్షేత్ర పీతకు అనగా తన తల్లిని మొదటి భార్యగా స్వీకరించిన వానికి పిండదానము చేయరాదు. నీయోగములో అనగా దేవరాదుల వలన కలిగిన పుత్రుడు క్షేత్రికి బీజికి ఇద్దరికీ పిండ ప్రదానము చేయవలయును. అట్లే ఒకే శ్రాద్ధములో విడివిడిగా ఇద్దరి పేర్లను కీర్తించవలయును.

మరణించిన దినమున యధావిధిగా ఏకోద్దిష్టము నాచరించవలయును. ఆశౌచము తొలగిన తరువాత కామ్య శ్రాద్దమును ఆచరించ. వలయును. అభ్యుదయ శ్రాద్ధమును (హిందీ) పూర్వహముననే ఆచరించవలయును. అంత దేవ కార్యము వలెనే ఆచరించవయలును. నువ్వులతో చేయవలసిన దానిని యవములతో చేయవలయును. చక్కని దర్భలు కావలయును. ఇద్దరిని ద్విజులను భుజింప చేయవలయును. 'నాందీముఖాః పీతరః ప్రియంతాం' అని ఉచ్చరించవలయును.  

 మొదట మాతృ శ్రాద్ధమును తరువాత పితృశ్రాద్దమును ఆచరించవలయును. తరువాత మాతామహులకు శ్రాద్ధము చేయవలయును. ఇది అభ్యుదయ శ్రాద్ధ విధి. ఇట్లు శ్రాద్ధత్రయముండును. ఇది దేవ పూర్వకముగా ఈయవలయును. ఇందు అప్రదక్షిణముగా ఈయరాదు. ఉపవీతీగానే ప్రాజ్ముఖుడై పిండ ప్రదానము గావించవలయును. మొదట గణేశ్వరులతో కలిసిన షోడశ మాతృకలను పూజించవలయును. విచిత్రములగు స్థండిలము లందు ప్రతిమలందు లేదా బ్రాహ్మణులందు ధూపదీప గంధ భూషణ నైవేద్యాదులతో మాతృ గణమును పూజించి శ్రాద్ధత్రయముగా నాచరించవలయును. మాతృయాగము చేయకుండా శ్రాద్ధము నాచరించినచో అతనిని క్రోధముకల మాతృ దేవతలు హింసింప తలచెదరు.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 22వ అధ్యాయము.