కూర్మ మహా పురాణము
23 - వంశకీర్తనమ్
జయధ్వజునకు తాలజంఘుడను పేరుగల కుమారుడు కలిగెను. అతనికి నూరుగురు పుత్రులు కలిగిరి. వారందరు తాలజంఘులను పేరుతోనే పిలువ బడిరి.
పొరిలో పెద్దవాడు గొప్ప పరాక్రమము కల వీతిహోత్రుడనుడు రాజాయెను. వృషుడు మొదలగు పుణ్య ప్రవర్తనకల ఇతర యాదవులు కూడ అతని సంతతిలోనివారై ఉండిరి.
వంశకర్తగా ఉండెను. అతనికీ మధువను వాడు పుత్రుడుగా జన్మించెను. ఆ మధువుకు వందమంది కుమారులు కలిగిరీ. వారిలో వంశకర్తగా వృషణుడుండెను.
వీతిహోత్రుని కుమారుడు అనంతుడనుపేర ప్రసిద్ధుడై ఉండెను. అతనికి అన్ని శాస్త్రముల యందు పాండిత్యము కలిగిన దుర్జయుడను పుత్రుడుండెను.
ఆ దుర్జయుని భార్య సౌందర్యవతి, అన్ని గుణములచే అలంకరింపబడినది, పతియే దైవముగా భావించు వ్రతముకలదీ, భర్తతో కలి సీ తమ ధర్మముసోచరించునదీగా ఉండెను.
ఆ దుర్జయ మహారాజు ఒకప్పుడు యమునానదీతీరములో ఉండి, మధురమైన కంఠస్వరముతో పాడుచున్న ఉర్వశీ దేవిని చూచెను.
తరువాత మనస్సులో మన్మథ వీకారము కలిగినవాడై, ఆమేదగ్గరకు వెళ్ళీ ఇట్లనెను. ఓ దేవీ నీవు చాలాకాలము నాతో కలిసి రమించుటకు తగియున్నోవు. ఆ ఉర్వశీదేవి, అందము లావణ్యము కలిగిన ఆ రాజును చూచి రెండవ మన్మధునివలే నున్న అతనితో కలిసి చాలకాలము శృంగారక్రీడలతో రమించేను.
చాల కాలము గడచిన తరువాత రోజు వివేకము కలవాడై చక్కనిదైన ఉర్వశితో, “నా అందమైన పట్టణమునకు తిరిగి వెళ్లుదును ” అనీ యనగా ఆమె నవ్వుచు ఇట్లు పలికెను.
ఓ అందమైన రోజకుమారా నీతో అనుభవించిన ఈ సుఖభోగములతో సోకు తృప్తి కలుగలేదు. అందువలన నీవు ఇంకొక సంవత్సరము వరకు ఉండవలెను.
బుద్దిమంతుడైన రాజు ఆమెతో ఇట్లు పలికెను. “నేను పట్టణమునకు వెళ్ళి మరల శీఘ్రముగా నీవద్దకు రాగలను. అందువలన నీవు నాకు వెళ్లుటకనుమతించవలేను.”
ఆ ఉర్వశి అతని మాటవిని ఇట్లనెను. “ఓరోజా అట్లే చేయుము. అంతవరకు నీవు మరియొక అప్సరసతో కలిసిరమించవలదు, రాజు అట్లే అని పలికి మిక్కిలి మనోహరమైన తననగరమునకువెళ్లెను. వెళ్లి పతివ్రతయగు భార్యను చూచి ఆరాజు భయపడెను.
అతని భార్య పతివ్రత, గుణవంతురాలు. దృఢమైన స్తనములుకల ఆమె తనభర్తను భయపడినవానిగా చూచీ, ప్రసన్నమైన వాక్కుతో ఇట్లనెను.
స్వామీ ఎందుకు మీకు ఇప్పుడు భయము కలుగుచున్నది? ఆకారణమును నాకు ఉన్నదున్నట్లుగా చెప్పుము. ఈ భయపరిస్థితి రాజులకు కీర్తిదాయకము కాదు.
ఆరాజు భార్యయొక్క మాటవినీ, సిగ్గుతో క్రుంగిన మనస్సుకలవాడై ఏమియు బదులు పలుకకుండెను. ఆమె తనయొక్క జ్ఞానదృష్టితో విషయమును తెలిసికొనెను.
మహారాజా నీవు భయపడవలదు. పాపమునకు పరిహారము చేసికొనవలెను. నీవే భయపడినచో నీరాజ్యమంతయు వినాశముపొందగలదు.
తరువాత ఆ రాజు తనపట్టణము నుండి బయలుదేరి కణ్వమహాముని ఆశ్రమమునకు వెళ్లి అక్కడ పుణ్యాత్ముడైన కణ్వమునిని చూచి కణ్వముని నోటినుండి పాపమునకు ప్రాయశ్చిత్త విధానమును విని, గొప్పబలవంతుడైన ఆరాజు ఆమునీచే సూచింపబడిన హిమాలయ పర్వతము పృష్ఠభాగమునకు వెళ్ళెను.
ఆ రాజు వెళ్లునప్పుడు దారిలో ఒక గంధర్వ శ్రేష్టుని చూచెను. అతడు ఆకాశములో దివ్యమైన మాలతో అలంకరించబడి గొప్పగా ప్రకాశించుచుండెను.
శత్రు సంహారకుడైన ఆ రోజు మాలను చూచి శ్రేష్టురాలైన ఉర్వశి అను అప్పరసను తలచుకొనెను. ఈ మాల ఆమెకే తగియుండునని అభిప్రాయపడెను.
ఎక్కువకామము కలవాడై ఆరాజు ఆమాలను గ్రహించుటకు పూనుకున్నవాడై, ఆగంధర్వునితో చాలగొప్పయుద్దమును చేసెను.
ఓ విప్రులారా ఆదుర్జయరాజు యుద్ధములో గెలిచి గంధర్వుని నుండి మాలను స్వీకరించి, ఆ అప్సరసను చూచుటకు గాను ప్రేమతో యమునానదిని గూర్చివెళ్లెను.
అక్కడ ఆ అప్సరసకన్పించక ఆ రాజు మన్మథుని బాణములచేత పీడింపబడినవాడై, ఆమెను చూచుటకు ఏడుద్వీపములతో కూడిన సమస్త భూమండలమును సంచరించెను.
హిమాలయపర్వతము యొక్క ప్రక్కభాగమున ప్రవేశించి, ఉర్వశిని చూచుటకు కుతూహలము కలవాడై, హేమకూటమను పేరుతో ప్రసిద్ధమైన ఒక పర్వత శ్రేష్ఠమును చేరుకోనెను.
ఆయా ప్రదేశాలలోని అప్సరసలు, సింహపరాక్రమముగల, చిత్రమైన మాలచేత అలంకరించబడిన రోజునుచూచి అతనియందు కామమును పొందిరి. ఆరో.జు ఉర్వశి వాక్యమును తలచుచు, ఆమెయందులగ్నమైన మనస్సుకలపొడై ఆ అప్సరసలందరిని చూడకుండెను. తరువాత పర్వతశిఖరములను గూర్చివెళ్లెను.
అక్కడ కూడా దీవ్యాప్సరసయగు ఊర్వశిని చూడక, కామముచేత బాధింపబడినవాడై దేవతలతోసమాన పరాక్రమముగల రోజు దేవతలనీవాస స్థానమైన మహామేరు పర్వతమునకు వెళ్లెను.
అతడక్కడ ముల్లోకములయందు మానసమనుపేరుతో ప్రసిద్దమైన సరస్సును చేరుకొనెను. మేరుశిఖరమును దాటితనభుజబలముతో విశ్వాసముకలవాడై
ఆ మానససరస్సు తట ప్రదేశములందు తిరుగుచున్న, మనోహరమైన, మిక్కిలి కోరికతో కూడియున్న, నిర్దుష్టమైన శరీరముకల ఊర్వశిని చూచెను. ఆమెకు మరల మాలనుఇచ్చెను.
ఆ దుర్జయుడు మాలచేత అలంకరింపబడిన ఊర్వశిని చూచి, మోహమును పొంది తనను ధన్యునిగా భావించినవాడై ఆమెతో చాలకాలము రమించేను.
తరువాత ఊర్వశీ రాజశ్రేష్టునీతో ఒక వాక్యమును పలికేను. “ఓవీరా అప్పుడు నీవుపట్టణమునకు వెళ్లి ఏమి చేసితివీ ” ? అని
ఆరాజు ఊర్వశికి, తనభార్య పలికిన దంతయు చెప్పెను. కణ్వుని దర్శనమును, మాలనపహరించుటను కూడ ఆమెకుతెలిపెను.
దుర్జయుడు పలికిన మాటవిని ఊర్వశి అతనీ హితమును గోరునదై వేళ్లుమని పలికెను. కణ్వుడు నీకు శాపమునీయగలడు. నీ ప్రియురాలుకూడ నన్నుశపించగలదు. కావున నీవు వెళ్లుము.
ఆ మహారాజు ఆమెచేత చాలమార్లు చెప్పబడీ కూడ, కామమదముచే మోహమును పొందినపోడై ఊర్వశియందే మనస్సు లగ్నము చేసినవాడై, ఆమె మాటను పాటించడాయెను.
అప్పుడు స్వేచ్ఛారూపశక్తిగల ఊర్వశి, రాజునకు రోమములేక్కువగా కలిగి, పింగళవర్ణపుకన్నులు గల భయంకరమైన తనరూపమును చూపించేను.
అదిచూచి దుర్జయుడామె యందు విరక్తికలవాడై, కణ్వుని వచనమును తలచుకొని, ‘ఛీ’ అని తన్నునిందించుకోని తపస్సుచేయుటకు ప్రారంభించెను.
పండ్రెండు సంవత్సరాల కాలము కందమూలములను, పండ్లనుతీనుచు, మరొక పండ్రెండు వర్షములు వాయువును మాత్రము ఆహారముగా కలిగి ఆరాజుండెను.
తరువాత కణ్వుని ఆశ్రమానికి వెళ్లి భయముతో ఆయనకంతయు తెలిపెను. అప్సరసతో కొంతకాలము కలిసి ఉండుట, తరువాత తపస్సు చేయుట అంతయు చెప్పెను.
రాజశ్రేష్ఠుడైన ఆదుర్జయుని చూచి, పూజ్యుడైన కణ్వఋషి ప్రసన్నుడై, అతని పాపమును నిర్మూలన కావించదలచి ఇట్లు పలికెను.
కణ్వుడిట్లనెను :-
“ఈశ్వరునిచే నివాసముగా చేసికొనబడిన దివ్యమైన వారణాశి పట్టణమునకు వెళ్లుము. అక్కడ భగవంతుడైన మహేశ్వరుడు లోకమును సంసారబంధమునుండి విడిపించుటకు నిలిచియున్నాడు.
గంగానదియందు స్నానముచేసి శాస్త్రవిధానము ప్రకారము దేవతలకు, పితరులకు సంతర్పణములిచ్చి, లింగరూపియైన విశ్వేశ్వరుని దర్శించుకొని క్షణకాలములో పాపమునుండి విముక్తుడవు కాగలవు”.
అని చెప్పగావిని దుర్జయుడు కణ్వమునికి శిరస్సువంచి ప్రణామముచేసి ఆయనవద్ద సెలవును పొంది వారాణసీకి వెళ్లి శివుని దర్శించుకొని పాపములనుండి విముక్తుడాయెను.
తరువాత నిర్మలమైన తనపట్టణమునకు వెళ్లి రాజ్యపాలనము చేసెను. పిమ్మట కణ్వుడాతని చేత ప్రార్థింపబడి దయతో యజ్ఞమునతని చేత చేయించెను.
తరువాత అతనికి బుద్ధిమంతుడైన సుప్రతీకుడను కుమారుడు కలిగెను. అతడు పుట్టగానే రాజు వద్దకు ఉర్వశియందు పుట్టిన, దేవకుమారునితో సమానులైన ఏడుగురు గొప్పపరాక్రమవంతులు చేరిరి. వారందరు గంధర్వకన్యలను తమ భార్యలుగా స్వీకరించిరి.
ఇది యంతయు సహస్రజిత్తుయొక్క శ్రేష్ఠమైన వంశముయొక్క మనుష్యుల పాపములను నశింపజేయునది అగువృత్తాంతము మీకు చెప్పబడినది. ఇక క్రోష్ణువు యొక్క వృత్తము చెప్పెదను వినుడు.
శ్రీ కూర్మపురాణములో రాజవంశానుకీర్తనమునందు ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
