కూర్మ మహా పురాణము
18వ ఆధ్యాయము
ఋషులు పలికిరి.
ఓ మునీ! బ్రాహ్మణులు ప్రతిదినము చేయవలసిన అన్ని కర్మలను వివరించుడు, దీనిని తెలిసి నంత మాత్రమున సంసార బంధము తొలగిపోవును.
వ్యాస మహర్షి చెప్పెను.
బ్రాహ్మణులు విధి విధాన క్రమమును ఆచరించవలసిన దానిని చెప్పెదను. సావధాన మనస్కులై వినుడు. బ్రహ్మ ముహూర్తమున లేచి ధర్మార్థ సాధన ములను సమకూర్చుకోనుటకు చేయవలసిన శరీర పరిశ్రమ ఎంత అని ఆలోచించుచు మనసులో పరమాత్మను ధ్యానించవలయును. ఉషఃకాలము వరకు ఆవశ్యకములను ముగించుకొని శౌచమునాచరించి నదిలో స్నానము చేయవలయును. ప్రాతః కాలస్నానము వలన పాపులు కూడా పరిశుద్ధులగుదురు. కావున సర్వ ప్రయత్నముతో ప్రాతః స్నానమాచరించ వలయును.
ప్రాతఃకాల స్నానము దృషా దృష్ట ఫల జనకమని చెప్పుచున్నారు. ఇది శుభ ప్రదము కూడా. ప్రాతః కాల స్నానము వలననే ఋషులకు ఋషిత్వము సిద్ధించును. నిద్రించిన వానీ ముఖమున లాలా జలము స్రవించుచుండును. అ లాలాజలముతో నిత్యకర్మ నాచరించరాదు. కావున మొదట స్నాన మాచరించవలయును. ప్రాతః కాల స్నానము వలన దారిద్ర్యము కాంతి హీనత, దుస్వప్నములు, దుర్వీ చింతనము మొదలగు పోపములు నశించి పరిశుద్ది లభించును. ఈ విషయమున ఎట్టి సంశయము లేదు. మానవులకు స్నానము లేకుండా హోమమున కాని జపమున కాని పవిత్ర కార్య యోగ్యత లభించదు. కావున ప్రాతః స్నానము తప్పక నాచరించవలయును, శక్తిలేని పక్షమున శిరస్నానము కాక కంఠస్నాన మాచరించవలయును. ఆ మాత్రము శక్తి కూడా లేనిచో తడి బట్టతో మొత్తము శరీరమును తుడుచుకొన వలయును. ఇది కపిల స్నానము.
శక్తిహీనులు కపిల స్నానమాచరించవలయును. విద్వాంసులు బ్రహ్మాది స్నానములను చెప్పిరి. బ్రాహ్మము, ఆగ్నేయము, వాయవ్యము దివ్యము వారుణము యౌగికము అని స్నానము ఆరు విధములుగేళ్ల చెప్పబడినది. మంత్రము చదువుచూ దర్భలచే జల బిందువులను ప్రోక్షించుట బ్రాహ్మస్నాన మందురు. పాదము నుండి శీరము వరకు భస్మమును రాసుకొనుట ఆగ్నేయ స్నానము, గోధూళితో అలుము కొనుట వాయవ్య స్నానము. ఎండవానల్లో తడియుట దివ్యస్నానమగును. నీటిలో మునిగి చేయునది వారుణ స్నానము. ఆత్మ తత్త్వమును ధ్యానించుట యౌగిక స్నాన మనబడును.
బ్రహ్మ జ్ఞానులు ఎక్కువగా ఆచరించు ఈ స్నానమును ఆత్మ తీర్థమందురు. ఇది మానవుల మనసును పవిత్రము గావించును కావున యోగ స్నానమును ప్రతి నిత్యమాచరించవలయును. శక్తి ఉన్నచో పొరుణ బ్రాహ్మ స్నానములను తప్పక ఆచరించ వలయును. దంతకాష్ఠమును చక్కగా కడిగి బాగుగా నమల వలయును.
చక్కగా దంత శోధనము గావించుకొని ఆచమనము చేసి ప్రాతః కాల స్నానము నాచరించవలయును. దంతకష్టము మధ్య మాంగులీ అంతలోవు 12 అంగులముల పొడవు బెరడుతో కూడి యున్నది కావలయును. దాని మొదటి భాగముతో ముఖ శుద్ధి గావించుకొనవలయును. పాలు గోరు చెట్ల నుండి కాని, మాలతీ వృక్ష సంబంధము కాని శుభము. ఉత్తరేణీ బిల్వము కరవీర కాష్ఠము మంచిది. నిందిత వృక్షములను విడిచి విహితమైన వాటిలో ఏ దేనీ ఒకటి తీసుకొనవలయును. షాప దీనములలో చెట్టునుండి విడువరాదు.మొత్తము చెట్టునే వేళ్ళతో పెకిలించరాదు. వేలుతో పండ్లను తోమరాదు. పండ్లు తోము కొనిన తరువాత పండ్ల పుల్లను కడిగి విరిచి సావధానుడై పవిత్ర ప్రదేశమున విడువ వలయును.
తరువాత స్నానమాడి దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణము గావించ వలయును. తరువాత మరల ఆచమనము చేసి వాట్నియమముతో “ఆపోహిష్ఠా మయో భువ” ఇత్యాది సమ్మార్జన మంత్రములతో దర్భలతో జలమును గాయత్రీ వ్యాహృతులతో శుభప్రదమగు వారుణ మంత్రముతో ప్రోక్షించుకొనవలయును. తరువాత ఓంకారముతో వ్యాహృతులతో వేదమాతయగు గాయత్రి మంత్రమును జపించి సూర్యభగవానుని ఉద్దేశించి తదేకమనస్కుడై జలాంజలిని విడువవలయును. ప్రాగ గ్రదర్భలయందు కూర్చొని సావధానుడై మూడు మార్లు ప్రాణాయామమును గావించి సంధ్యావందనము నాచరించవలయునని శ్రుతివాక్యము.
సంధ్యయే జగత్తును సృజించునది. సంధ్యమాయాతీత నిర్వికల్ప, ఈశ్వరుని పరాశక్తియే సంధ్య. మూడు తత్త్వముల నుండి పుట్టినదే సంధ్య. సూర్యమండల మధ్య దేశమున నున్న సావిత్రిని ధ్యానము గావించి జపించి ఎపుడు తూర్పు ముఖముగానే సంధ్యోపాసన చేయవలయును. సంధ్యా హీనుడు అశుచి యగును. ఏ కర్మల నాచరించుటకు తగడు. సంధ్యావందనము చేయకుండా చేసిన ఏ పనీ ఫలించదు. పూర్వము అనన్య మనస్కులై శాంతులు వేద పండితులగు బ్రాహ్మణులు యధావిధిగా సంధ్య నాచరించి ఉత్తమ గతినీ పొందీరి. సంధ్యావందనమును వీడిచి ఇతర ధర్మ కార్యములను ప్రయత్నించువారు వేల నరకములను పొందెదరు. కావున సర్వ విధ ప్రయత్నములతో సంధ్యోపాసన చేయవలయును. సంధ్యోపాసనముతో యోగ స్వరూపుడగు భగవంతుడు పూజింపబడిన వాడగును.
తూర్పుముఖముగా ఏకాగ్ర మనస్కుడై నీలిచీ 1000 కాని 1000 కాని 10 కాని గాయత్రీ మంత్రమును జపించవలయును. 1000 ఉత్తమము. 100 మధ్యమము. 10 అధమము. దీని తరువాత సావధానుడై లేచి నిలబడి సూర్యోపస్థానము గావించ వలయును. ఋగ్యజుస్సామ మంత్రములు సూర్యుని స్తుతించునవి చాలా ఉన్నవి. వాటితో సూర్యుని దేవ దేవుని మహాయోగ రూపుని ఆరాధించి ఆ మంత్రములతో శిరస్సును భూమి నితాకునట్లు ప్రణామము గావించవలయును.
సూర్యభగవానుడు ఆకాశమున ఇంద్రియములలో ఆత్మ రూపముగా లోపల, బయట వ్యాపించియుండువాడు. శాంతుడు, మనసును బుద్ధిని అహంకారమును క్రియా శీలముగా చేయువాడు సూర్యభగవానుడే అట్టి నీకు నన్ను నేను అర్పించుకొనుచున్నోను. జ్ఞాన స్వరూపుడవగు నీకు నమస్కారము. ప్రకాశ శాలికి బ్రహ్మ రూపుడగు సూర్యునికి నమస్కారము. తమరే పరబ్రహ్మ తమరే జలము తమరే అగ్ని, తామే అమృత రసము. నీవే వ్యాహృతులు. ఓంకారము నీవే. సనాతనరుద్రులు నీవే. నీవే పురుషుడవు. నీవే సత్తువు. నీవే మహితవ్యము, కపర్దివగు నిన్ను ననుస్కరించుచున్నాను. నీవే సద సదాత్మక మగు సకల జగత్తును సృజించుచున్నావు రుద్రునికి నమస్కారము. నేను నిన్ను శరణు పొందితిని. ప్రాచేతసుడవు రుద్రరూపుడవు నీకు నమస్కారము. రుద్ర రూపుడవగు నీన్ను నేను శరణు పొందితిని. నీవు హిరణ్య బాహువువు, హిరణ్య పతివి. అంబికాపతివి ఉమాపతివి అగునీకు నమస్కారము.
చీకటిని తొలగించు ఆదిత్యునకు నమస్కారము. వజ్రహస్తుడవు త్ర్యబంకుడవగునీకు వందనము. విరూపాక్షుడవు మహానుభావుడవగు పరమేశ్వరుని శరణు పొందుచున్నాను. సకల దేహధారుల హృదయ గుహలో దాగియున్న నిన్ను నమస్కరించుచున్నాను. పరంజ్యోతి పరాగతి పరబ్రహ్మవగు నిన్ను నమస్కరించుచున్నాను. ప్రపంచరూపివి పశుపతివి నర నారీరూపుడవు పరమేష్ఠివగునీకు నమస్కారము.
ఉగ్రుడవు అందరిచే సేవించబడువాడవు అగు నిన్ను సర్వకాల మందు శరణు పొందుచున్నాను.
పరమోత్తమమగు ఈసూర్య హృదయ స్తవమును ప్రాతఃకాల మధ్యాహ్నములలో పఠించి సూర్యునికి నమస్కరించవలయును.
బ్రహ్మ ప్రదర్శించిన ఈ సూర్య హృదయమును పుత్రునికీ, శిష్యునకు ధార్మికుడగు ద్వీజునకు మాత్రమే ఈయవలయును. ఈ సూర్య హృదయము సర్వపాప ప్రశమనము, వేదసారము నుండి ఉదయించినది. ఋషి సంఘములచే సేవించబడినది. బ్రాహ్మణులకు హితమును కలిగించునది. పవిత్రమైనది. తరువాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి వీధిపూర్వకముగా ఆచమించి;
అగ్నినీ యధావిధిగా జ్వలింపచేసి హోమమును గావించవలయును. ఇట్లు యజమాని అగ్నిహోత్రమును చేయజాలని పక్షమున అతని ప్రతినిధిగా ఋత్విక్సుత్తుడుకాని, పత్నీకాని, శిష్యుడు కాని సహోదరుడు కానీ ఆజ్ఞను పొంది హోమము చేయవచ్చును. పవిత్రమును ధరించి పవిత్రకాయుడై శుక్ల వస్త్రమును ధరించి ఏకాగ్రమనస్కుడై, ఇంద్రియ నిగ్రహము కలవాడై అగ్నిలో హోమమును గావించవలయును. దర్భలు లేకుండా, యజ్ఞోపవీతంలేకుండా చేసిన కర్మ అంతా రాక్షసమవుతుంది. ఇహపరలోకంలో ఫలప్రదం కాదు
దేవతలకు నమస్కరించవలయును. ఉత్తమ వస్తువులనే అర్పించవలయును. దేవతలకు పుష్పాదికముల నర్పించవలయును. వృద్దులకు అభివాదనము చేయవలయును. గురువునుపాసించవలయును. ఎపుడూ గురు హితమును ఆచరించవలయును. ద్విజుడు తన శక్తి మేరకు ప్రయత్నముతో వేదాభ్యాసమును గావించవలయును. జపమును చేయవలయును. శిష్యులను చదివించవలయును, చదివిన వాటిని ధరించవలయును. పర్యాలోచించు చుండవలయును. ధర్మ శాస్త్రములను విశ్లేషించి ద్విజోత్తముడు చింతించవలయును. అట్లే వేదాంగములను కూడా విశేషముగా అధ్యయనము గావించవలయును. తరువాత యోగక్షేమము కోరకు ఈశ్వరుని శరణు వేడవలయును. తరువాత కుటుంబము కొరకు పలువిధములగు సంపదలను సంపాదించ వలయును.
తరువాత మాధ్యాహ్ని క స్నానము కొరకు మృత్తికను పుష్పములను అక్షతలను దర్భలను నువ్వులను పరిశుద్ధమైన గోమయమును సంపాదించ వలయును. నదులలో దేవతలు నిర్మించిన కుండములో, తటాకములలో, సరస్సులలో, సెలయేళ్ళలో జలాశయములో స్నానమాచరించ వలయును. ఇతరుల జలాశయములలో ఎపుడూ స్నానము చేయరాదు. ఇట్లు కుదరనీ పక్షమున జలాశయము నుండి అయిదు మట్టి ముద్దలను బైటికి తీసి స్నానము చేయవలయును. ఒకసారి శిరశ్శుద్ధి చేయవలయును. రెండు మార్లునాభిపైన పై భాగమున శుద్ధి చేసుకొనవలయును. క్రింది భాగమున మూడు మార్లు చేయవలయును. పాదములను ఆరుమార్లు చేసుకొనవలయును. పచ్చి ఉసిరికాయంత మట్టిని తీసుకొనవలయును, గోమయ ప్రమాణము కూడా ఇంతియే ఉండవలయును. దానితో శరీరమును పూయవలయును.
వారుణ మంత్రములతో జలమును అభిమంత్రించి పవిత్రభావముతో అవ్యయుడగు శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు స్నానము చేయవలయును. జలములు నారాయణుని నుండి పుట్టినవి. జలములే నారాయణుసోధారములు. కావున స్నానకాలమున నారాయణుని ధ్యానించవలయును. ఓంకారముతో ఆదిత్య మంత్రమును జపించి మూడుమార్లు నీటిలో మునుగ వలయును. ఆచమనము చేసియున్ననూ మంత్రమును తెలిసినవారు మరల ఈ మంత్రముతో ఆచమనమును చేయవలయును. విశ్వతో ముఖుడవగు నీవు అన్ని ప్రాణుల అంతర్యామిగా హృదయమున సంచరింతువు. నీవే యజ్ఞుడవు. నీవే ఓంకారానీవి. జలము జ్యోతి రసము అమృతము అన్నియు నీవే.
విద్వాంసుడగు వాడు రెండు చరణముల మంత్రమును మూడు మారులు, వ్యాహృతులు ప్రణవముతో కూడిన గాయత్రీ మంత్రమును కానీ అఘమర్షణ మంత్రమును కాని జపించవలయును. తరువాత “ఆపోహిష్ఠా మయో భువః” “ఇద మాపః ప్రవహిత” ఇత్యాది మంత్రములతో వ్యాహృతులతో సమ్మర్జనమును చేసుకొనవలయును. తరువాత ఆ జలమును “ఆపోహిష్ఠా”ది మంత్రములతో అభిమంత్రించి నీటమునిగి నీటి లోపల నుండి అఘమర్షణ మంత్రమును మూడు మార్లు జపించవలయును. నిలుచుని ఉంటే సూర్యుణ్ణి చూస్తూ జపం చేయవలెను. లేదాత్రీ పదయగు గాయత్రీనీకాని ‘తద్విష్ణోః పరమం పదం’ అను మంత్రమును కాని, ఓంకారమును కాని జపించవలయును లేదా శ్రీహరిని సంస్మరించవలయును. యజుర్వేదములోని “ద్రుపదోదీవ ముంచతు” అను మంత్రమును నీటిలోపల మునిగి యుండి మూడుమారులు జపించిన పొనికీ అన్ని పాపములు నశించును.
చేతిలో నీటిని తీసుకొని జపించి మార్జనము చేసి ఆ జలమును శిరమున ధరించినచో సకల పాపముల నుండి విముక్తుడగును. అశ్వమేథ యాగము సకల పాప నీవారకమగునట్లు అఘమర్షణ మంత్రము కూడా సర్వపాప వినాశకముగా పేర్కొనబడినది.
పూలతో నిండిన దోయిలిని శిరముపై నింపి సూర్యోపస్థానమును గావించవలయును. ఆ పుష్పములను సూర్యుని పై చల్లి ‘ఉద్వయం తమనస్పర్’ ‘ఉదుత్యం జాతవేదసం’ ‘చిత్రం దేవానా ముదగాదనీకం’ ‘తచ్చక్షు రేవహితం పురస్తాత్’ “హంస శుచి షద్వసురంతరీక్ష” అను మంత్రములతో కాని, గాయత్రీ మంత్రముతోకానీ ఇతర వైదిక మంత్రములతో కాని, పాప నాశకములగు సౌరమంత్రములతో కానీ జపించి తరువాత మరల గాయత్రీ మంత్రము జపించవలయును. ఇదీ జపయజ్ఞమనబడును.
ప్రాగగ్రములగు దర్భలపై ప్రాజ్ముఖుడై శుచియై కూర్చొని సూర్యభగవానుని దర్శించుచు సావధాన చిత్తముతో పలువిధములగు పవిత్రములైన మంత్రములను, రహస్య విద్యలను, శతరుద్రీయమును, అధర్వ శిరో మంత్రములను, సౌర మంత్రములను జపించవలయును. నిలుచుని ఉంటే సూర్యుణ్ణిచూస్తూ జపంచేయవలెను. స్పటికమాల, ఇంద్రాక్షమాల, రుద్రాక్షమాల, పుత్రజీవమాల కాని జపమాలగా నుండవలయును. ఈమాలలో మొదటీ మాలకంటే తరువాత చెప్పబడిన మాల శ్రేష్ఠమని తెలియవలయును.
జ్ఞానియైన వాడు జపము చేయునపుడు మాటాడరాదు. ఇతరములను చూడరాదు. శిరస్సును మెడను కదిలించరాదు. దంతములను చూపరాదు. ఇట్లు చేసిన ఆ జప ఫలమును గుహ్యకులు రాక్షసులు సిద్దులు బలవంతముగా హరింతురు. కావున ఏకాంతము శుభకరమైన స్థానమున జపము నాచరించవలయును.
జపము చేయుచున్నపుడు, చండాలులను, అపవిత్రులను, పతితులను చూచినచో ఆచమనము చేసి మరల జపించవలయును. ఒకవేళ వారితో మాట్లాడినచో స్నానము చేసి జపించవలయును. అపవిత్ర వస్తువులను చూచినచో ఆచమనము గావించి సావధానముతో మరల జపించవలయును. తడి వస్త్రమును ధరించియున్నచో నీటి మధ్యన నుంచి యధాశక్తి సౌరమంత్రములను కాని, ఇచ్ఛానుగుణముగా పవమాన మంత్రములను జపించవలయును. తడిబట్ట కానిచో పవిత్ర భూమియందు దర్భలపై కూర్చొని ఏకాగ్రముతో జపించవలయును.
జపము ముగిసిన తరువాత ప్రదక్షిణము నాచరించి భూమిపైన నమస్కరించి శాస్త్ర విధితో ఆచమించీ శక్త్యనుసారము స్వాధ్యాయమును ఆచరించవలయును. ఆ తరువాత దేవతలను ఋషులను పితృగణమును మొదట ఓంకారము చివర నమః అనీ తరువాత వః తర్పయామి అను తర్పణములను గావించవలయును.
దేవతలను బ్రహ్మఋషులను కూడా అక్షతోదకములతో తర్పణము గావించవలయును. స్వసూత్రోక్త విధానముగా నువ్వులతో పితృదేవతలను తర్పణము గోవించవలయును. ఎడమ చేతి సోయముగల కుడిచేతితో రెండు చేతులు అనగా దోసిలిచే జలముతో దేవతలకు ఋషులకు తర్పణము గావించవలయును. సవ్యముతో దేవతలకు నివీతిగా ఋషులకు ప్రాచీనా వీతిగా పితరులకు తర్పణము గావించవలయును. తమ తమ తీర్థములలో చేయవలయును.
పితృ తర్పణమునకు పూర్వము దేవతాతర్పణ విషయమున వస్త్రమును (స్నాన) చక్కగా పిండుకొని ఆచమును గావించి వాజ్నియమముతో తమ శాఖోక్త మంత్రములతో పుష్ప పత్ర జలములతో దేవతలకు తర్పణము గావించవలయును. బ్రహ్మను శంకరుని సూర్యుని శ్రీ మహావిష్ణువును ఇతరేష్ట దేవతలను భక్తితో కోపమును విడిచి పూజించవలయును.
పురుష సూక్తముతో శ్రీహరిని తర్పించవలయును. జలము సర్వదేవతా స్వరూపము కావున జలముతో చక్కగా అర్చించవలయును. సావ ధాన పూర్వకముగా ఓంకారోచ్చారణ పూర్వకముగా దేవతలను ధ్యానించి విడివిడిగా నమస్కారముతో పుష్పమును సమర్పించవలయును. శ్రీ మహా విష్ణు నారాధించుటకంటే పవిత్ర వైదిక కార్యమింకొకటి లేదు. కావున అనాది మధ్య నీధనుడగు శ్రీహరిని ప్రతినిత్యము ఆరాధించ వలయును.
‘తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్త’ ఇత్యాది మంత్రము పురుష సూక్తము” ఈ రెండిటితో సమానమగు మంత్రము నాలుగు వేదములలో ఇంకొకటీ లభించదు. పరిశుద్ధ తేజోవంతుడగు శ్రీహరి యందు తనను తాను నివేదించుకోనవలయును. ‘తద్విష్ణోః ఇత్యోది మంత్రముతో తదాత్ముడై అతనియందే మనసు నుంచి శాంతుడు కావలయును. లేనిచో సనాతనుడు భగవంతుడు మహాదేవుడు మహేశ్వరుడగు ఈశానుని భావపూతుడై ఆరాధించవలయును.
రుద్రగాయత్రితో, ప్రణవముతో ఈశాన మంత్రములతో రుద్ర మంత్రములతో త్ర్యంబకముతో సావధానుడై పుష్పములతో పత్రములతో జలముతో చందనాదులతో కాని ‘నమశ్శివాయ’ అని మంత్రముతో యోజన చేయవలయును. ‘ఋతంసత్యం’ అని ఈశ్వరుని నమస్కరించవలయును. ‘యోబ్రహ్మాణర’ అను మంత్రము ద్వారా స్వాత్మ నివేదనము గావించుకొన వలయును.
శివుని పంచనామములను జపించుచు ప్రదక్షిణము గావించవలయును. ఆకాశమధ్య గతుడగు శివునీ ఈశాన దేవుని ధ్యానించవలయును. తరువాత “హంస శ్శుచిషద్వసు” ఇత్యాది మంత్రములతో ఆదిత్య భగవానుని దర్శించుకొనవలయును. తరువాత ఇంటికి వెళ్ళి సావధాన మనస్కుడై పంచ మహా యజ్ఞముల నాచరించవలయును. దేవ యజ్ఞము పితృ యజ్ఞము భూతయజ్ఞము మనుష్య యజ్ఞము (అతిథి యజ్ఞము) బ్రహ్మ యజ్ఞము అనునవి పంచ మహా యజ్ఞములు.
తర్పణమునకంటె పరంగా బ్రహ్మ యజ్ఞము చేయనిచో మనుష్య యజ్ఞము చేసిన తరువాత బ్రహ్మ యజ్ఞమును చేయవలయును. అగ్నికి పశ్చిమ దిక్కున భూతయజ్ఞము చివర దర్భలపై దర్భల ధరించి సావధానుడై కూర్చొని యజ్ఞాగ్నిలో కాని లౌకికగ్నిలో కాని జలము నందు కాని, భూమీ యందు కాని వైశ్వ దేవమును చేయవలయును. దీనినే దేవ యజ్ఞమందురు. లౌకికాగ్నిలో అన్నము వండినచో దీనిలోనే హవనము చేయవచ్చును. శాలాగ్నిలో అన్నము వండినచో వైశ్వదేవము చేయవలయును. ఇదియు సనాతన విధి. దేవయజ్ఞము చేయగా మిగిలిన అన్నముతో భూత యజ్ఞము చేయవచ్చును. ఇది యేభూతయజ్ఞము, అన్ని ప్రాణులకు ఐశ్వర్యమును ప్రసాదించును. కుక్కలకు చండాలులకు, పతితులకు, పక్షులకు భూమిపై అన్న మునీయ వలయును. భార్య సాయంకాలము వండిన అన్నమును మంత్ర రహితముగా బలి చేయవలయును. ఇదియే భూతయజ్ఞము. ప్రాతః సాయంకాలములందు విధించబడి యున్నది. ప్రతి నిత్యము ఒక ఉత్తమ బ్రాహ్మణుని భుజింప చేయవలయును. ఈ భోజనము పితృ దేవతలను ఉద్దేశించి చేయవలయును. ఇదియే నిత్య శ్రాద్దము. పితృ యజ్ఞము అనబడును. ఇది ఉత్తమగతిని ప్రసాదించును.
లేదాతన శక్యను సారము కొద్దిగా అన్నమును తీసి సౌవధానముతో వేద తత్త్వార్థము తెలిసిన బ్రాహ్మణునకు అర్పించవలయును. ప్రతి దినము అతిథిని పూజించవలయును. నమస్కరించవలయును. అర్చించవలయును. తన ఇంటికి వచ్చిన వానీని త్రికరణ శుద్ధిగా హంతకారమును అగ్రముకానీ భిక్షను కానీ శక్త్యానుసారముగా అతిథికి ఈయ వలయును. అతిథిని పరమేశ్వరునిగా భావించవలయును.
అన్నమును భిక్షయనీ అన్నమునకు నాలుగురెట్లను అన్నాగమనీ అందురు. అన్నోగ్రమునకు నాలుగురెట్లు హంతకారమందురు. గోదోహన కాల పర్యంతము స్వయముగా అతిథికొరకు ప్రతీక్షించవలయును. అట్లు వచ్చిన అభ్యాగతులను కూడా అతిథి తుల్యముగా పూజించవలయును. బ్రహ్మచారీ యగు భిక్షునకు యధావిధిగా భీక్ష నిడవలయును. లోభమును విడిచి యాచకులకు యధాశక్తి అన్నము నీయవలయును. యాచకులు భిక్షుకులు అభ్యాగతులు లభించనిచో అన్నమును గోవుల కర్పించవలయును. తరువాత అన్నమును నిందించక మౌసముగా బంధువులతో కలిసి భుజించవలయును.
ద్విజుడు పంచ మహా యజ్ఞములను చేయకుండగా భుజించినచో పశు జాతిలో పుట్టును. ప్రతి దినము వేదాధ్యయనము యథాశక్తి పంచ మహాయజ్ఞములు, క్షమ దేవత పూజ ఇవి శీఘ్రముగా పాపములను నశింప చేయును. మోహముతోకాని బద్దకముతో కాని దేవతార్చన గావించక భుజించినచో నరకములను పొందును. తరువాత గ్రామ సూకరముగా పుట్టును.
కావున సర్వవిధ ప్రయత్నములతో నిత్యకర్మలను శాస్త్ర విధి ననుసరించి ఆచరించిన తరువాత ద్వీజుడు తన వారితో కలిసి భుజించినచో ఉత్తమగతిని పొందును.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 18వ అధ్యాయము
