కూర్మ మహా పురాణము
18 - అథవంశానుకీర్తనమ్
ఆ బలికి గొప్పబలపరాక్రమములుకల నూరుగురు కుమారులుండిరి. వారందరిలో ముఖ్యుడు తేజోవంతుడు, గొప్పబలవంతుడుఐన బాణుడనువాడు.
అతడు శంకరుని యందేక్కువ భక్తికలరాజుగా తనరాజ్యమును పాలించేను. మూడులోకములను తనవశముచేసికొని దేవరాజైన ఇంద్రుని బోధించెను.
తరువాత ఇంద్రుడు మొదలగు దేవతలందరు శంకరునీవద్దకు వెళ్లి యిట్లు పలికిరి, ప్రభూ మీ భక్తుడైన బాణుడను గొప్ప అసురుడు మమ్ములను బాధించుచున్నోడు.
దేవతలకు దేవుడైన ఆపరమేశ్వరుడు దేవతలందరిచేత అట్లు ప్రార్ధింపబడినవాడై, ఒక్కబాణముచేతనే విలాసముగా బాణునీ పట్టణమును కాల్చివేసెను.
తనపట్టణము కాల్చబడుచుండగా చూచి ఆ బాణుడు త్రిశూలధారి, నీలలోహితుడు, గోవులకు పతీ, ఈశ్వరుడును అగురుద్రుని శరణము కోరెను.
కోరికలను వదలినవాడై బోణుడు, శివసంబంధియైన ఆ లింగమును తలపై ధరించీ ఆపట్టణమునుండి వెలుపలికి వచ్చి పరమేశ్వరుని స్తోత్రము చేసెను.
అట్లుబాణునిచేత సుతింపబడిన భగవంతుడు, నీలలోహితుడు, ప్రభువు అగు శంకరుడు, గణపతిదేవతగా కల బాణమును సంకల్ప బలముతో ప్రయోగించెను.
తరువాత ఈవిధముగా మిక్కిలి భయంకరులైన తారుడు, శంబరుడు, కపిలుడు, శంకరుడు, స్వర్భానువు, వృషపర్వుడు అనువారు దనువుకు కుమారులుగా ప్రధానులుగా చెప్పబడినారు.
ఓ బ్రాహ్మణులారా సురస అను నాగమాతకు వేయిసంఖ్యగల సర్పములు సంతతిగా కలిగెను.
అరిష్టనునామె అదేవిధముగా అనేక శిరస్సులు కలిగిన, ఆకాశసంచారులు, మహాత్ములును అగు వేయిమంది గంధర్వులను సంతానముగా పొందెను.
అనంతుడు మొదలగు గొప్పనాగులు కద్రువు సంతానముగా ప్రసిద్ధులు. బ్రాహ్మణవర్యులారా తామ అనువనిత ఆరుగురు కన్యలను పొందెను.
శుకీ, శ్యేని, భాసి, సుగ్రీవ, గ్రంథిక, శుచీ అని ఆ కన్యల పేర్లు. సురభీ గోవులను, మహిషులను సంతతిగా పొందినది.
'ఇర', వృక్షములను, తీగలను, తృణజాతిమొక్కలను అంతట ప్రసవించేను. 'ముని' యను స్త్రీ యక్షులను, రాక్షసులను, అప్సరసలను కనెను.
కోపకారణమున రాక్షస సమూహమును జన్మింపజేసెను. వినతాదేవి కుమారులు గరుడుడు, అరుణుడు అనువారు ప్రసిద్ధులు.
పొరిలో బుద్ధిమంతుడగు గరుడుడు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సునుచేసి శివునియొక్క అనుగ్రహము వలన విష్ణువునకు వాహనముగా పదవిని పొందినాడు.
అట్లే అరుణుడుకూడ తపస్సుతో మహాదేవుని పూజించి, పూర్వము సంతోషించిన అతనిచేత సూర్యునికి సారధి పదవిలో నియమించబడినాడు.
కశ్యప ప్రజాపతి వంశజాతులైనవీరు, స్థావర జంగమరూపులు నాచేత తెలుపబడినారు. ఈవైవస్వతమన్వంతరములో వినువారి పాపములను నశింపజేయునది ఈ వృత్తాంతము.
మంచి నీయమము కలిగిన చంద్రుని భార్యలు ఇరువది యేడుమందీ కూతుళ్లు చెప్పబడినారు. అరిష్టనేమి భార్యలయొక్క సంతానము యొక్క చాలామంది పుత్రులు కలిగిన పండితునియొక్క నలుగురు విద్యుత్తులు, అదే విధముగా శ్రేష్ఠులు, ఇంద్రుని చేత సత్కరింపబడిన ఋషులు కూడ అంగీరసునికి కలిగిరి.
దేవతల ఋషిఅయిన కృశాశ్వునికి ప్రహరణుడను దేవ కుమారుడు జన్మించినాడు. వీరు వేయి యుగాల తరువాత మరల కూడ జన్మిస్తారు. ఆయా మన్వంతరాలలో తమపేర్లతో, సమానమైన కార్యములతో నియతముగా జన్మింతురు.
శ్రీ కూర్మపురాణములో వంశానుకీర్తనమును పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
