కూర్మ మహా పురాణము
26వ ఆధ్యాయము
వ్యాస మహర్షి పలికెను :
ఇక ఇప్పుడు పూర్వము చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మవాదులగు ఋషులకు బోధించిన సర్వోత్తమమగు దాన ధర్మమును వివరించేదను. తాను సంపాదించిన ధనమును వేద వేదాంగములను చక్కగా అధ్యయనము చేసిన సతాత్రలో శ్రద్దా పూర్వకముగా సమర్పించుట దాసమనబడును. ఇది భోగమోక్షములను ప్రసాదించును. అత్యంత శ్రద్ధతో విశిష్ట వ్యక్తులకు దానము చేసినదే విత్తమనబడును. ఇతరము ఇతరులది తాను కాపాడుచున్న దనియే భావించవలయును. దానము నిత్యము నైమిత్తికము కామ్యము అని మూడు విధములు. నాలుగవది విమలమని సర్వదానము లలో అత్యుత్తమము. తనకు ఎలాంటి ఉపకారము చేయనివానికీ ఏ ఫలాపేక్ష లేకుండా దానమిచ్చు దానము నిత్య మనబడును. తాను చేసిన పాపము నశించుటకు విద్వాంసులకరించు దానము నైమిత్తిక మనబడును. దీనిని సజ్జనులాచరింతురు. సంతానము సంపదలు విజయము స్వర్గాది ఫలముల నుద్దేశించి చేయుదానము కొమ్యమనీ ధర్మచింతకులగు ఋషులు తెలిపిరి. పరమేశ్వర ప్రీతి కొరకు బ్రహ్మజ్ఞులకు ధర్మ యుక్త మగు మనసుతో అర్పించునది. వీనుల మనబడును. ఇది శుభప్రదము. సతాత్ర లభించినపుడు యధాశక్తి దానము చేయవలయును. అటువంటి సత్పాత్ర ఎపుడో కానీ లభించదు. ఆ పాత్ర అన్నీ పాపముల నుండి ఉద్దరించును. కుటుంబ పోషణకు కావలసిన దానికంటే అధికముగా నున్న దానినే దానము చేయవలయును. వేరుగా దానము చేసినచో ఆది ఫలమును అందీయజాలదు.
శ్రోత్రియుడు, గురువు వద్ద చక్కగా అభ్యసించినపోడు, సత్కుల సంజాతుడు తపస్సంపన్నుడు, సదాచార పరుడగు దరిద్రునికి భక్తి పూర్వకముగా ఈయవలయును, ఆపోతాగియగు బ్రాహ్మణునకు భూదానము గావించినవాడు మరల తిరిగి రాని మోక్షమును పొందును. చెరుకు యప గోధుమలతో నుండు (పండు) భూమిని వేదజ్జున కిచ్చువాడు మరల పుట్టడు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోచర్మ మాత్ర భూమిని (1500 గజము) దానము చేసినచో సకల పాప నిరోచనము జరుగును. భూదానమును మించిన దానమింకొకటి లేదు. అన్నదానము దానితో సమాన మగునది. విద్యాదానము అంతకంటే గొప్పది, శాంతుడు శుచి ధర్మ శాలియగు బ్రాహ్మణునకు యథావిధిగా విద్యాదానము గావించినవాడు బ్రహ్మ లోకమును పొందును. బ్రహ్మచారికి శ్రద్ధతో ప్రతి దీనము అన్నము పెట్టినవాడు అన్నిపాపములు తొలగి ప్రాహ్మలోకమును పొందును.
గృహస్థుడగు బ్రాహ్మణునకు చేసిన అన్నదానము మహాఫలమును ఇచ్చును. కాని గృహస్థునకు అపక్వమునే ఈయవలయును. అట్లు ఇచ్చిన ఉత్తమ గతిని పొందును.
వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు తానుపవసించి అయిదుగురిని 7గురినీ కాని యధావిధిగా శాంతుడై, శుచియై ఏకాగ్ర మనస్కుడై నల్ల నువ్వులు తేనే గంధాదులతో చక్కగా పూజించి యధావిధిగా భుజింపచేసి ‘ధర్మరాజు ప్రీతి పొందునుగాక’ ఇట్లు చెప్పవలయును లేదా చెప్పించ వలయును లేక తన మనసులోనున్న దానిని చెప్పవలయును. ఇట్లు చేసినచో జీవితకాలమున చేసిన పాపము నశించును.
కృష్ణాజినమును తీలలను, హిరణ్యమును, తేనెను, నెయ్యిని బ్రాహ్మణునకు దానము గావించినచో సకల పాపములు తొలగును. వైశాఖ పూర్ణిమనాడు పక్వాన్నమును జలకుంభమును ధర్మరాజునుద్దేశించి బ్రాహ్మణులకు దానము గావించినచో అన్ని భయములు తొలగును. బంగారము నువ్వులతో కూడిన జలకుంభములను 5 గురికి కాని 7గురికీ కాని ఇచ్చినచో బ్రహ్మహత్యాది పాపములు కూడా తొలగును. మాఘశుద్ధ ద్వాదశి సోడు ఉపవసించి శుక్లవస్త్రములను ధరించి సల్లనువ్వులతో అగ్నిలో హోమముగావించి బ్రాహ్మణులకు తిలదానముగావించినచో పుట్టిననాటి నుండి చేసిన అన్నీ పాపములను నశింపచేయును. అమావాస్యనాడు తపస్వియగు బ్రాహ్మణునకు శంకరుని ఉద్దేశించి ఏ కొంచెమైనను దానము గావించి సనాతనుడగు మహాదేవుడు సోముడు ప్రసన్నుడగు గాక అని పలికనచో 7 జన్మల పాపములు నశించును. కృష్ణ చతుర్దశినాడు స్నానము గావించి బ్రాహ్మణముఖముగా శంకరుని ఆరాధించినవాడు మరల పుట్టడు. కృష్ణాష్టమినాడు విశేషముగా స్నానము గావించి ధార్మికుడగు బ్రాహ్మణునకు పాద ప్రక్షాలనాదులతో యధావిధిగా పూజించి మహాదేవుడు ప్రీతి చెందుగాక అని తన ద్రవ్యమును దానము గావించినచో సర్వ పాపములు తొలగి ఉత్తమగతినీ పొందును.
బ్రాహ్మణులు విశేషముగా కృష్ణచతుర్దశి, కృష్ణాష్టమి, అమావాస్య దినములలో శంకరుని పూజించవలయును. ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశి దీనమున బ్రాహ్మణముఖముగా శ్రీమన్నార్ధాయణుని పూజించినచో పరమపదమును పొందును. శుక్ల పక్ష ద్వాదశి శ్రీవిష్ణు తీధి. కావున ఆ తిధి యందు ప్రయత్నముతో జనార్ధనుని ఆరాధించవలయును. ఈశ్వరుని ఉద్దేశించి విష్ణువు నుద్దేశించి బ్రాహ్మణునికి దానము గావించినచో అనంత ఫలము నిచ్చును. తానే దేవతనారాధించ దలచిననూ విశేష ప్రయత్నముతో ఆ దేవతా ఉద్దేశ్యకముగా బ్రాహ్మణుని పూజించినచో ఆ దేవత ప్రీతి చెందును. దేవతలందరు బ్రాహ్మణునీ దేహమున ఎప్పుడూ ఉందురు. బ్రాహ్మణులు లభించనపుడు ప్రతిమాదులతో పూజించవలయును. కావున ఆయా ఫలములను కోరువారు సర్వ ప్రయత్నములతో బ్రాహ్మణులలో దేవతలను పూజించవలయును. విభూతిని కోరువాడు ఇంద్రుని పూజించవలయును. బ్రహ్మ తేజస్సును పొందగోరువాడు బ్రహ్మను ఆరాధించవలయును. ఆరోగ్యమును కోరువాడు సూర్యునీ, ధనమును కోరువాడు అగ్నిదేవుని, కర్మసీద్దీని కోరువాడు వినాయకునీ ఆరోధించవలయును.
భోగములు కోరువాడు చంద్రుని, బలమును కోరువాడు వాయువును, సంసార మోక్షమును కోరుపోడు విశేష భక్తితో శ్రీహరిని పూజించ వలయును. యోగమును, మోక్షమును బ్రహ్మజ్ఞానమును కోరువాడు విరూపాక్షునీ అనగా మహేశ్వరుని పూజించవలయును. మహాయోగములను మహా జ్ఞానములను కోరువారు ఈశ్వరుని కేశవుని పూజింతురు.
జలదానము చేయువారు తృప్తిని, అన్నదానము వలన అక్షయ సుఖముసు, తిలదానము వలన ఇష్ట సంతానము, దీపదానము వలన ఉత్తమ నేత్రములు, భూమి దానము వలన సకలాభీష్టములను, బంగారము నిచ్చిన దీర్ఘాయుష్యమును పొందును. గృహముల నిచ్చుట ఉత్తమ భవనములను రజితదానము సౌందర్యమును, వస్త్రదానము చంద్ర సాలోక్యమును అశ్వదానము అశ్వినీ దేవతల లోకమును, వృషభ దానము పుష్టీకల సంపదను, గోదానము బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించును. వాహనమును శయ్యను దానము చేసిన చక్కని భార్యను, అభయమునిచ్చినవాడు ఐశ్వర్యమును పొందును. ధాన్యదానము శాశ్వత సౌఖ్యమును, వేద దానము బ్రహ్మ తాదాత్మ్యమును పొందును. తను శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు ధాన్యములనీయవలయును. ఉత్తములగు వేదజ్జులకిచ్చినచో స్వర్గలోక ప్రాప్తి కలుగును.
గోవులకు తృణదాసము చేయుటవలన సకలపాప వినిర్ముక్తి లభించును. ఇంధనముల నిచ్చినచో దీప్త జఠరాగ్ని కలుగును, ఫల మూలకములు శాకములు వీవీధ భోజ్యములను బ్రాహ్మణులకు ఇచ్చినచో నిత్య సంతోషియగును. రోగికి ఔషధమును ఆహారమును తైలాదులను ఇచ్చినపోడు రోగరహితుడై సుఖ దీర్ఘాయుష్యములు కలవాడగును. ఛత్రదానము పాదరక్షల దానము గావించినచో క్షుర ధారా సమన్వితమగు అసి పత్ర వనమను తీవ్ర తాపమును కలిగించు నరకమును దాటివేయును. తనకు ఏదీ అత్యంతము ఇష్టమో ఇంటిలోని పోరికేదిష్టమో దానిని గుణవంతు డగు బ్రాహ్మణునికి దానము గావించినచో అక్షయ ఫలమును పొందును.
ఉత్తరాయణ దక్షీణాయన పుణ్య కాలములలో, మేష తులా సంక్రమణములలో, చంద్ర సూర్య గ్రహణములలో ఇతర సంక్రమణ కోలములలో దానము అక్షయ ఫలప్రదమగును. ప్రయాగాదీ పుణ్య తీర్థములలో పుణ్యక్షేత్రములలో ఇతర పుణ్య నదులలో పుణ్య వనములలో ఇచ్చిన వానీకి అక్షయ ఫలమును ప్రసాదించును. మానవులకు దానధర్మమును మించిన ధర్మము నురొకటి లేదు. కావున ద్వీజులు శ్రోత్రియుడగు విప్రునికి దానము గావించవలయును. స్వర్గమును, ఆయుష్యమును, ఐశ్వర్యమును కోరుసారు, పాపనాశమును కోరువారు మోక్షమును కోరువారు కూడా ప్రతిదినము బ్రాహ్మణులకు దానము చేయవలయును.
గోవిప్ర అగ్ని దేవతలకు అర్పించు దానిని మోహముతో వారించినవాడు పశుపక్ష్యాదులలో పుట్టును. ద్రవ్యమును సంపాదించి దేవతలను బ్రాహ్మణులను అర్చించని వాని ధనము రాజు మొత్తము తీసుకోని రాజ్యము నుండి బహిష్కరించవలయును. కరువు కాటకాదులలో చనిపోవుచున్న పోనీకీ బ్రాహ్మణుడు అన్నాదులనీయనివాడు పరమనింద్యుడు. అతనికి ఇచ్చుట అతని నుండి తీసుకోనుట, అతనితో కలిసి కూర్చొనుట కూడా చేయరాదు. అతనికేదైనా గుర్తుపెట్టి రాజు తన రాజ్యము నుండి బహిష్కరించవలయును. ధర్మ సాధనముగు తన ధనమును దుష్టులకిచ్చిన వాడు పూర్వము చెప్పిన దానికంటే పాపి, నరకమున దుఃఖములను అనుభవించును.
స్వాధ్యాయపరులు విద్యావంతులు జితేంద్రియులు సత్యము నియమము కలవారు అగు బ్రాహ్మణులకు దానము చేయవలయును. ధార్మికుడగు విద్వాంసుడు చక్కగా భుజించిన వాడైనను మరల భుజింప చేయవలయును కానీ పది దినములు ఉపవాసమున్ననూ వృత్తి హీనుడైన మూర్చుని భుజింప చేయరాదు. దగ్గరలోనున్న శ్రోత్రియుని విడిచి ఇతరునికిచ్చినచో ఆ పనితో ఆ పాపి 7 తరముల వరకు దహించబడును. ఒకవేళ దూరములో నున్నపోడు శీల విద్యాదులలో అధికుడైనచో దగ్గరనున్న మౌనిని అతిక్రమించి ఈయవచ్చును. ఇచ్చిన దానిని చక్కగా లాగుకొనువాడు, చక్కగా పూజించి ఇచ్చినవాడు స్వర్గమును చేరును. అట్లు చేయనివాడు నగకమును చేరును. నాస్తికునకు తర్కికి పాషండునకు వేదము తెలియనివానికి నీరు కూడా ధర్మవేత్త ఈయరాదు. అపూపము హిరణ్యము గోవు అశ్వము భూమి లీలలు విద్యా రహితుడు గ్రహించినచో వెంటనే కట్టేవలే భస్మమగును. బ్రాహ్మణుడు ఉత్తములగు ద్విజుల నుండియే ధనమును పొంద కోరవలయును లేదా స్వజాతి వలన గ్రహించవలయును. కానీ శూద్రుల నుండి గ్రహించరాదు.
బ్రాహ్మణుడు వృత్తిని సంకోచింప చేసుకొనవలయును. ధన విస్తారమును కోరరాదు. ధన లోభమున పడినచో బ్రాహ్మణ్యమునే కోల్పోవును. సకల వేదాధ్యయనము కానీ సకల యజ్ఞములు కాని వృత్తి సంకోచము వలన లభించు ఉత్తమ ఫలమును పొందజాలవు. దానము గ్రహించుటలో ఆసక్తి ఉండరాదు. జీవయాత్రకు యాత్రకు ధనమును గ్రహించవలయును. తనకు కావలసిన దానికన్నా అధికమును గ్రహించినవాడు అధోగతిని పొందును. ఎప్పుడూ యాచించువాడు స్వర్గమును పొందలేడు. అతను కూడా చోరులవలె జనులను భయ పెట్టును. గురువులను భృత్యులను ఉద్దరించగోరువారు అతిథులను దేవతలను పూజించ గోరువారు అందరి నుండి గ్రహించవచ్చును కానీ దానీనీ తన భోగమున కుపయోగించరాదు. ఇట్లు మనో నిగ్రహము కల గృహస్థుడు దేవతలను అతిథులను పూజించుచున్నచో పరమ పదమును పొందును, లేదా ఉన్నదంతయూ పుత్రుని కప్పగించి తత్త్వవిత్తు అరణ్యమునకు వెళ్ళి ఏకాకియై సావధానీ ఉదాసీనుడై సంచరించవలయును. ఇట్లు మీకు గృహస్థుల ధర్మమును చెప్పితిని. దీనిని తెలిసి నియమ పూర్వకముగా అనుష్టించవలయును. నిత్య మనుష్టింప చేయవలయును. ఇట్లు అనాదీయగు పరమాత్మను గృహస్థ ధర్మముతో చక్కగా అర్చించినవాడు ప్రకృతిని అతిక్రమించి పరమగతిని పొందును. మరల పుట్టడు.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగముస 26 వ అధ్యాయము
