కూర్మ మహా పురాణము
52 - అథ వేదశాఖా ప్రణయనం
పూర్వము ఈ మన్వంతరము జరుగుచుండగా, మొదటి ద్వాపరయుగములో, గొప్ప ప్రభువైన వ్యాసుడుగా స్వాయంభువ మనువు పేర్కొనబడినాడు,
ఆయన ప్రభువైన బ్రహ్మయొక్క ఆదేశమువలన వేదమును అనేక విధములుగా విభజించెను. రెండవ ద్వాపర యుగములో వేదవ్యాసుడుగా ప్రజాపతియుండెను.
మూడవ ద్వాపరములో శుక్రాచార్యుడు వ్యాసుడుకాగా, నాలుగవద్వాపరములో బృహస్పతి వ్యాసుడాయెను. ఐదవ ద్వాపరములో సవీతయనువాడు, అరవదానిలో మృత్యువు వ్యాసుడుగొ నుండిరి.
ఏడవ ద్వాపరములో ఇంద్రుడు, ఎనిమిదవ ద్వాపరములో వసిష్ఠుడు, తొమ్మిదవ, పదియవ ద్వాపరములలో క్రమముగా సారస్వతుడు, త్రోధాను అనువారు వ్యాసులుగా నుండిరి.
పదునొకండవ ద్వాపరములో ఋషభుడు, ద్వాదశములో సుతేజుడు, పదుమూడవ ద్వాపరములో ధర్ముడు, పదునాలుగవ దానిలో సుచక్షువు వ్యాసులుగా నుండిరి.
పదునైదవ ద్వాపరములో త్రయ్యారుణి, పదునారవ యుగములో ధనంజయుడు, పదునేడవ ద్వాపరములో కృతంజయుడు, పదెనెన్మిదవ దానిలో ఋతంజయుడు వ్యాసులుగా నుండిరి.
తరువాత భరద్వాజుడు వ్యాసుడాయెను. అతని తరువాత గౌతముడు, అనంతరము పొచశ్రవుడు, ఆ పిమ్మట నారాయణుడు వ్యాసుడుగా నుండిరి.
ఇరువది మూడవ ద్వాపరములో తృణబిందువు, అతనియనంతరము వాల్మీకి, ఇరువది యైదవ ద్వాపర యుగమురాగా, విప్రులారా ఏ యుగమునందు పరాశరుని కుమారుడైన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడయ్యెనో, ఆతడే అన్నీ వేదములను, పురాణములను లోకమునకు ప్రదర్శించిన పోడు.
పరాశరపుత్రుడు, గొప్పయోగి, కృష్ణద్వైపాయనుడు, నారాయణరూపుడగు వ్యాసుడు, ఈశ్వరుని పూజించి, శంకరునిచూచి, స్తోత్రముచేసి, ఆదేవుని యనుగ్రహమువలన వేదములను విపులముగా విభజించెను. తరువాత వేదములను పూర్ణముగా అధ్యయనము చేసిన నలుగురు శిష్యులను స్వీకరించెను.
జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు, పైలుడు అను నలుగురిని, అయిదవవానిగానన్ను వ్యాసుడు తన శిష్యులుగా స్వీకరించెను.
ఋగ్వేదమును పఠించువాడుగా ప్రేలుని స్వీకరించినాడామహాముని. వైశంపాయనుని యజుర్వేదమును ప్రచారము చేయుటకు నియమించి నాడు.
జైమినిని సామవేద పాఠకునిగా వ్యాసుడు స్వీకరించెను ఋషి శ్రేష్ఠుడైన సుమంతుని అధర్వవేద పాఠకుడుగా గ్రహించినాడు.
ఇతిహాసములను, పురాణములను ప్రవచనము చేయుటకు ఆ మునీ నన్ను నియమించేను. ఒకటిగానున్న యజుర్వేదమును నాలుగు విధములుగా ఆయన విభజించెను.
దానియందు నాలుగు అగ్నిహిూత్రముల సమూహమేర్పడెను. దానితో తరువాత యజ్ఞమును చేసెను. యజుర్వేద మంత్రములతో ఆధ్వర్యవమను అగ్నిహెూత్రము సంభవించును.
సామవేద మంత్రములతో ఔద్దాత్రమును కల్పించెను అధర్వవేద మంత్రములతో బ్రహ్మత్వమును ఏర్పరచెను.
తరువాత సత్రమునందు ఉద్దరించి ఋగ్వేదమును ప్రభువు నిర్మించెను. యజుర్మంత్రములతో యజుర్వేదమును, సామ మంత్రములతో సామవేదమును ఏర్పరచెను. పూర్వము ఋగ్వేదమును ఇరువదియొక్క భేదములతో వ్యవస్థీకరించెను.
నూరు శాఖల భేదముతో పిదప యజుర్వేదమును నిర్మించెను. ఆ వ్యాసుడు వేయిశాఖల భేదముతో సామవేదమును కల్పించేను:
అనంతరము కుశకేతనుడగు అముని అధర్వణ వేదమును విభజించేను. వ్యాసుడు పదునెనిమిది భేదములతో పురాణ వాజ్మయమును సృష్టించెను.
పూర్వము ప్రాచీనమైన వేదము ఒక్కటి నాలుగు పాదములు కలిగియుండెను. అన్ని దోషములను శుద్ధి చేయునట్టి ఓంకారము బ్రహ్మ నుండి పుట్టినది.
భగవంతుడు, సనాతనుడు అగు వాసుదేవుడు వేదములచే తెలియబడువాడు. ఆ పరమపురుషుడు వేదములచేత గానము చేయుబడును. అతనినేవడు తెలియునో వాడు వేదవిదుడనబడును.
ఇది మిక్కిలి పరమైన బ్రహ్మము. ఉత్తమమైన ఆనందరూపమైన జ్యోతి. వేదవాక్యములచేత చెప్పబడిన తత్త్వము పోసుదేవుడు. అతడే పరమగమ్యుడు.
ఎవడు ఇతనిని తెలియునో, పోడు వేదమును తెలిసినవాడు, వేదపరుడైన ముని అనబడును. వేదములను నిశ్వాసముగా చేసికొన్న పరమ పురుషుడు, వేదాతీతుడైన పరమాత్మను వేదజ్ఞుడైన వాడు తెలిసికొనును.
వేదస్వరూపుడైన పరమేశ్వరుడు వేదములచే తెలియదగిన భగవంతుడు అని తెలియవలెను. అతడే వేదరూపుడు, తెలియదగినవాడు. అతని నాశ్రయించి ముక్తుడగును.
పరాశరపుత్రుడైన వేదవ్యాసమహాముని, ఈ పూర్వోక్తవిధముగా నాశరహితము, అక్షరాత్మకము, ఓంకార స్వరూపము అగువేదమును, వేదాతీతుడైన పరమాత్మను గూడ తెలిసియున్నాడు.
శ్రీ కూర్మపురాణములో వేదశాఖా ప్రణయనమనబడు ఏబదిరెండవ అధ్యాయము సమాప్తము.
