కూర్మ మహా పురాణము
36వ అధ్యాయము
సూతమహర్షిపలికెను.
ఇది మరియొక పరమరహస్యములలో కెల్ల ధహస్యమగు స్టానము మహాదేవ దేవుని తీర్థము మహాలయమని పేరుగాంచినది. ఈ క్షేత్రమున దేవాది దేవుడగు రుద్రుడు నాస్తికులకు నిదర్శనమును చూపుటకు ఓకశీలాతలమున పాదమునుంచెను. ఈ క్షేత్రమున శమదమసంపన్నులగు పాశుపతులు భస్మము పులుముకొనిన దేహముకలవారై వేదాధ్యయన తత్పరులై మహాదేవుని ఉపాసించుచుందురు. ఈతీర్థమున స్నానమాడి శివుని పాదమును భక్తిపూర్వకముగా దర్శించి శిరసు వంచి నమస్కరించిన వారు రుద్ర సామీప్యమును పొందెదరు.
మహాత్ముడగు శంకరుని మరియొక స్థానము కలదు. కేదారమను ప్రసిద్ధీకలది, శుభంకరము. సిద్దులనివాసము. ఈ తీర్జమున స్నానమాడి వృషధ్వజుడగు మహాదేవుని పూజించి పరిశుద్దమగు అచటి జలమును త్రాగి గాణపత్యమును పొందెదరు. ఇచట శ్రాద్దము దానము మొదలగు పవిత్ర కర్మముల నాచరించిన అక్షయ ఫలమును పొందెదరు. ఈ క్షేత్రమును ద్విజవర్యులు నియతమనస్కులగు యతివర్యులు ఎపుడు సేవించు చుందురు.
ప్లక్షావతరణమను మరియొక పుణ్యతీర్థము కలదు. ఇది సర్వ పాపవినాశకము. ఇచట శ్రీమన్నారాయణుని పూజించి విష్ణులోకమున విలసిల్లును. మగధరాజతీర్థమను మరియొకటి కలదు. ఇదీ స్వర్గఫలప్రదము. ఇచటికి వెళ్ళినపోడు అక్షయ ఫలమును స్వర్గమును చేరును. మరియొక తీర్థము పరమపావనమగు కనఖల మనునది కలదు. ఇచటనే రుద్రదేవుడు దక్షుని యజ్ఞమును ధ్వంసముగావించెను. ఇచట గంగలో స్నానమాడి పవిత్రుడై భక్తిభావము కలిగి సర్వపాపములు తొలగి బ్రహ్మలోకమును పొందును. శ్రీ మన్నారాయణునకు ప్రియము పరమపావనమగు మహాతీర్థమొకటి కలదు. ఇచట శ్రీహరిని పూజించి శ్వేతద్వీపమును చేరును.
శ్రీపర్వతమను మరియొక తీర్ధప్రవరము కలదు. ఇచట ప్రాణములు విడిచినవాడు రుద్రునికి ప్రీతిపాత్రుడగును. ఈ క్షేత్రమున మహేశ్వరుడు దేవితో కలిసి నివసించును. ఇచట చేయబడిన స్నానము పిండ ప్రదానము మొదలగు పుణ్యకర్మలు అక్షయ ఫలమును ప్రసాదించును.
గోదావరీనది పుణ్యప్రదము సర్వపాపములను నాశము చేయునది. ఆనదియందు స్నానమొనర్చీ, యధావిధి పితృదేవతలను, దేవతలను తృప్తిపరచిన మానవుడు సర్వపాపములు తొలగి, పునీతమైన ఆత్మకలవాడై, సహస్రగోదానఫలమును పొందగలడు. కావేరియనునది పుణ్యావహము, నీండుగానుండెడి పవిత్రజలముగలనది. అచట స్నానము చేసి, మూడు రాత్రులుగాని, ఒకరాత్రిగాని ఉపవాసముండి, తర్పణాదులు ఆచరించిన మానవుడు సర్వపాపములనుండి విడిపింపబడును. తీర్థాది సేవనము ద్విజాతులవారికి శ్రేయోదాయకముగా చెప్పబడినది. మనోవాక్కాయ కర్మలు శుద్ధమై యుండి, లోభమునువీడి, బ్రహ్మచర్యమును విధిపూర్వకముగా ఆచరించెడివారు తీర్థ సేవా ఫలము పొందుదురు.
స్వామీతీర్థమను నొక గొప్పతీరము మూడు లోకములందు ఖ్యాతిగన్నది. దేవతలచే నమస్కరింపబడు కుమారస్వామి ఆ తీర్ధమందు వీడువక నీవసించును. అచటి కుమార ధారలందు స్నానముచేసి, దేవతారాధనము, పితృదేవతలకు తర్పణాదులు ఆచరించి, షణ్ముఖుని ఆరాధించిన యెడల ఆతడు స్కందునితో అతని లోకమందు ఆనందము పొందును. తామ్రపర్ణియను మరొకనదీ మూడులోకములలోను ప్రఖ్యాతివహించినది. అచట స్నానముచేసి, వేదోక్తవిధీని అనుసరించి పితృదేవతలకు తర్పణములు సమర్పించినవాడు ఎంతటి పాపకర్ముడైనను, తన పితృదేవతలను తరింపచేయును. ఇందు సంశయము లేదు.
కావేరీ జన్మస్థానమునుండియే బయలువెడలు చంద్రతీర్థము అక్షయ ఫలములను ఇచ్చునది. ఈ తీర్జమున నివసించి, అచట దేహము చాలించువారు తప్పక స్వర్గమును పొందగలరు. దేవదేవుడగు సదాశివుని, వింధ్యపర్వత పాదమందు వెలసిన స్వామిని దర్శించిన ద్విజులు యమలోకమును దర్శించరు. దేవికాప్రాంతమున 'వృష'మను పేరుగల తీర్ధమున్నది. ఇది సిద్ధపురుషులవాస స్థలము. అచట స్నానముచేసి, దానాదులు ఆచరించినవాడు యోగసిద్దీనీ పొందును. దశాశ్వమేధిక తీర్థమనునది సకలపాపవిదారకము, అచట స్నానము చేసినగాని, దర్శించినగాని, అర్చన, తర్పణ, దానాదులాచరించినగాని, పది అశ్వమేథముల ఫలమును పొందును. పుండరీకమను మహాతీర్థము బ్రాహ్మణోత్తములచే ఆశ్రయించ బడునది, నియతాత్ముడై ఆ తీర్థము చేరినవాడు పౌండరీకయజ్ఞ ఫలమును పొందగలడు.
తీర్ధములలోకెల్ల ఉత్తమమైనది బ్రహ్మతీర్థమని వినికిడి. అచటకేగి బ్రహ్మను అర్చించిన అతడు బ్రహ్మలోకమున శాశ్వతముగా నివసించగలడు. సరస్వతీ వినశనము (సరస్వతి యమునయందుకలయుస్థానము) శుభకరమగు ప్లక్షప్రస్రవణము, పరమ పావనమగు వ్యాసతీర్థము, అత్యుత్తమమగు మైనాకపర్వతము, యమునా జనన తీర్థము - ఇవన్నియు సకలజనుల పాపములను తొలగించి పునీతము చేయునవి.
పితృదేవతల మానసపుత్రిక గంధకాళీదేవి. అదేనామమున ప్రసిద్ధిగన్నతీర్థము. అందుస్నానము చేసినవాడు మరణించినపిదప, పూర్వజన్మ స్మృతి కలిగి యుండి దివ్యలోకమునకు చేరును. సిద్దులచే, చారణులచే సేవింపబడు కుబేరతుంగ తీర్థము సర్వపాపములు నశింపచేయునది, అందు స్నానమాడిన నరుడు, నివసించిన యాతడు శరీరము త్యజించిన తరువత, కుబేరుని అనుచరుడై మనగలడు. రుద్రుని ప్రియవల్లభ రూపమగు, స్థానమగు ఉమాతుంగమను తీర్థమున, మహాదేవీయగు సామెను అర్చించిన, గోసహస్రదానఫలమును'పొందును. భృగుతుంగమనియెడీ పుణ్యతీర్థమున తపస్సుచేసినగాని, శ్రాద్ధదానాదులు ఆచరించినగానీ, ఆతడు తన తల్లితండ్రుల రెండు వంశములయందు ఏడుతరములవారిని పవిత్రము చేయునని పెద్దలు చెప్పగా వింటిని.
కశ్యపప్రజాపతి తీర్ధమును 'కాలసర్చి' తీర్థమనీయనగా వింటిని, తన పౌపములు నశింపగోరువాడు అచట శ్రాద్దాది క్రియలను నిత్యము చేయనగును. దశార్ణ తీర్థమందు దానముగాని, శ్రాద్ధముగాని, హేమముగాని, జపముగాని, చేసిన హని ఫలము సర్వకాలముల అక్షయమును, శాశ్వతమును నగును. కురుజాంగలమను తీర్థము ద్విజాతి పుంగవుల ఆటపట్టగు తీర్థము. అచట విధిపూర్వకముగా దానము చేసినవాడు బ్రహ్మలోకమునందు శాశ్వతుడుగా నుండును.
వైతరణి, మహాతీర్థము, స్వర్ణవేది, ధర్మపృష్ఠ, ఉత్తమము, శుభంకరమగు బ్రహ్మసరస్సు, పుణ్యమగు భరతాశ్రమము, పుణ్యస్థానము, శుభకరమునగు శ్రాద్ధవటము, మహాహ్రదము, కౌశికి – వీనియందు స్నానమాచరించి, దానాదులను చేయువాడు అక్షయమగు ఫలమును పొందును.
ప్రాణికోటికి హితము సోశించి, నాస్తికులకు నిదర్శనము చూపుటకు, పరమ జ్ఞానస్వరూపమగు మహాదేవుడు శంకరుడు ముంజప్పష్టతీర్థమున తన పాద చిహ్నములుంచినాడు. ఈస్థానమందు ధర్మపరాయణుడగు నరుడు (స్నాన ఆరాధన, దాన, జపతపాది ధర్మములు ఆచరించునాతడు) చాల అల్చకాలములోనే, పాము కుబుసము వీడుచునంత అవలీలగా తన పాపములను తొలగించుకొనును. కనకనందమసు తీర్థము మూడులోకముల ప్రసిద్ధివహించినది. ఇది ముంజపృష్ణతీర్థమునకు ఉత్తర తీరమున నున్నది. ఇది బ్రహ్మర్షిగణముల ఆవాసస్థలము. ఇచట స్నానము చేసిన ద్విజులు సశరీరముగా దివ్యలోకములకు పోవుదురు. ఇచట దానమిచ్చినగాని, శ్రాద్ధమున సమర్పించినగానీ, ఫలము అక్షయమగునని నీత్యము వినవచ్చెడి మాట ఇచట స్నానము చేసి, తన పాపములన్నియు క్షీణింపగా, మానవుడు మూడు (దేవ, పితృ, ఋషి ఋణముల నుండి విడివడును.
మానససరోవరమున స్నానముచేసినవాడు ఇంద్రుని అర్ధాసనమును అలంకరించును. ఉత్తరమానస తీర్థమున యథాశక్తి, యధోచితముగా శ్రాద్ధాదికర్మములు నిర్వర్తించవలేను. అట్లు చేసినవానీకి దీవ్యభోగములతోపాటు, మోక్షాపాయ సాధనమును లభించును. సొసాధాతువులతో అలంకరింపబడిన హిమాలయపర్వతము వేయిపైన ఎనుబది యోజనముల విస్తారము కలిగియున్నది. అచట సిద్దచారణులు దేవర్షిగణములు విస్తారముగా సంచరించెదరు. అచటనే సుషుమ్నమునుపేరుగల పుష్కరిణీ గలదు. అచటి ప్రదేశమును సేవించి, విద్వాంసుడగు ద్వేజుడు బ్రహ్మహత్యా పొతకము వంటి దానిని సైతము తొలగించుకొనగలడు. ఒకసారి చేసిన శ్రాద్దము అక్షయమగును. ఒక్కసారి దానమిచ్చిన అనంతమగు అభ్యుదయము ప్రసాదించును. తద్వారా తనకు పూర్వము పదితరములు పితృదేవతలను, తనతరువాతి పదితరముల వారిని తరింపచేయగలడు. హిమాలయపర్వతము, గంగానది సర్వప్రదేశములు లోకపోవనములు. సముద్రము వంక ప్రవహించునదులు, నదులను స్వీకరించు సముద్రమును రెండును విశేషపుణ్యప్రదములు.
బదరీక్షేత్రమును శ్రీ మన్నారాయణుడు, నరునితో కలిసియుండి పావనము చేయుచున్నాడు. అచటకేగినవ్యక్తి కలికల్మషము నుండి వెంటనే విడువబడును. ఆ తీర్థమున ఇచ్చిన దానముగాని, అనుష్టించిన జపముగాని, అక్షయ ఫలమును ఇచ్చును. ఆ తీర్థము మహాదేవుడగు శంకరునికి ప్రీతికరము., అందువలన విశేషించి పుణ్యఫలప్రదము. అచట విధిపూర్వకముగా, శ్రాద్ధమొనర్చినవాడు పితృదేవతలనందరను తరింపచేయగలడు.
సీద్దగంధర్వులచే సేవింపబడు దేవదారువనము అచటనే యున్నది. భక్తవత్సలుడగు మహాదేవునిచే వరమొసగబడిన క్షేత్రమిది. పూర్వము అందరుమునులను మోహింపచేసి, పిదప వారిచే ఆరాధింపబడి, ప్రసన్నుడై, శంకరుడు, నిర్మలాంతః కరణులగు మునులతో, యిట్లనెను. “మీ రందరు రమ్యమగు యీ ఆశ్రమమునందే నివసింపుడు. ఎల్లకాలము నాయందే భావన నింపిన మనసుకలవారై ఇష్టకామ్యార్థ సిద్ధిని పొందుడు.
ధర్మకర్మానుష్టాన పరులగు లోకులు ఎవరు నన్నిచట అర్చించెదరో, వారికి పరమము, శాశ్వతమగు గాణాపత్యమును ప్రసాదించెదను. శ్రీ మన్నారాయణునితో సహా నేను యిచ్చట నిత్యము వసించెదను. ఇచట ప్రాణములు వీడిన నరుడు పునర్జన్మము పొందడు. బ్రాహ్మణోత్తములారా దేశాంతర గతులైనవారైనను (ఈ తీర్థమును దర్శింప జాలనివారు) ఎవరైన యీ తీర్థమును స్మరించిన, వారికి కూడ సర్వపాపములను నాశము చేయుదును. ఈ తీర్థమున అనుష్టింపబడిన శ్రాద్ధ, దాన, తప, రామ, పిండప్రదాన, ధ్యాన, జప నియమాదులు అన్నియు అక్షయ ఫలదాయకము లగును." అందువలన ఈ దేవదారువనమును, పుణ్యకరమైనదానిని, మహాదేవుని వాసమైనదానిని, పురుషోత్తముడగు భగవన్నారాయణుడు సన్నిహితుడైయున్నదానిని, గంగాదీ వీపుల తీర్థములు సమీపముననున్నదానిని, దేవదారువనమును ద్విజులు సర్వప్రయత్నముల, దర్శించవలెను.
ఇది శ్రీ కూర్మపూరాణము షట్సాహస్రసంహితలో ఉత్తరార్థములో ముప్పదీ ఆరవ అధ్యాయము.
