కూర్మ మహా పురాణము

Table of Contents

15వ అధ్యాయము

వ్యాస మహర్షి చెప్పెను.

ఒక వేదమును, రెండు వేదములను, మూడువేదములను లేదా నాల్గు వేదములను ద్విజుడు అధ్యయనము గావించి అర్థమును తెలిసికోనీ స్నాతకుడు కావలెను. గురువుకు దక్షిణ సమర్పించి, గురువు ఆజ్ఞతో సమావర్తనము చేసికొనవలెను. బ్రహ్మచర్య వ్రతము పరిపూర్ణముగా అనుష్ఠించి, ఆ ప్రతఫలరూపముగా, శక్తి సంపన్నుడై, స్నాతకుడు కావచ్చును.

వైష్ణవ దండము (ఉత్తరేణి దండము) ధరించవలెను. కౌపీనము, ధోవతి, ఉత్తరీయము, రెండు యజ్ఞోపవీతములు, జలపూర్ణ కమండలము, ఛత్రము, మురికిలేని తలపాగ, పొదుకలు, పాదరక్షలు, బంగారు కుండలములు, దర్భముష్టిని ధరించి, కేశ నఖములను యధా సమయముగ తీసివేయించుకొని పవిత్రుడై, నీత్యస్వాధ్యాయ యుక్తుడై, కంఠము నుండి పై భాగమున మాలలు ధరించరాదు. బంగార్డు హార విషయమున తప్ప, ఎర్రనీ మాలలు ధరించరాదు.

నిత్యము శుక్ల వస్త్రధరుడై సుగంధమును ధరించుచు, ప్రియదర్శనుడుగా నుండవలెను. జీర్ణ వస్త్రములను, మలిన పస్త్రములను విభవమున్నపుడు ధరించరాదు. రక్తవస్త్రములను, చూచు వారికి ఉద్వేగము కలిగించు వస్త్రములను, ఇతరులు ధరించి, విడిచిన వస్త్రములను, కమండలమును, పాదరక్షలను, పుష్పహారములను, పాదుకలను ఉపయోగించరాదు. ఉపవీతమును అలంకారములను, దర్భలను, కృష్ణాజినమును, అపసవ్యముగా ధరింపరాదు. వస్త్రమును వికృతముగా ధరింపరాదు.

తరువాత తనకు సమాన కుల రూపములు గల సులక్షణయగు కన్యను, జాతి దోషము లేనిదానిని వివాహ మాడవలెను. బ్రాహ్మణుడు మాతృ గోత్రములో పుట్టని దానిని, తమ ఋషుల గోత్రములో పుట్టని దాని, శీల శౌచ సమన్వితయగు కన్యను వివాహ మాడవలెను.

పుత్రుడు కలుగువరకు, ఋతు కాలమున భార్యను అనుగమించవలేను. అట్లే నిషిద్ధ దినములను విడువవలెను. షష్టి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, చతుర్దశి, తన జన్మ దినము నుండి మూడు దినములు బ్రహ్మచర్యమును అనుసరించవలయును.

గార్హస్త్య అగ్నిని (ఆవపథ్యము) ప్రతిదినము హెూమము చేయవలయును. ప్రతినిత్యము పవిత్రములైన వ్రతములను ఆచరించు చుండవలయును. వేద విహితమైన నిత్యకర్మలను, స్వకర్మలను, సోమరితనము విడిచి ఆచరించవలయును. పై కర్మలను ఆచరించనిచో, అతి భయంకరమైన నరకములు పొందును. వినయ సంపన్నుడై వేదాభ్యాసము చేయవలయును. పంచ మహాయజ్ఞములు విడువరాదు. సంధ్యోపాసనను గృహ్యసూత్ర విహిత కర్మలను ఆచరించుచుండవలెను.

తనతో సమానులైన వారితో, తన కన్న అధికులైన వారితో స్నేహము చేయవలయును, భగవంతుని ఆరాధించవలెను. దేవతా పూజన చేయవలెను. భార్యాపోషణము చేయవలెను. తాను ఆచరించిన ధర్మమును చెప్పరాదు. తాను చేసిన పాపము దాచరాదు. ప్రతిదినము తనకు హితమును చేసికొనవలెను. సర్వ భూతములపై దయచూపు చుండవలెను. వయసునకు, కర్మకు సంపదకు, శాస్త్రమునకు, వంశమునకు తగిన విధముగా వేషమును, వాక్కును, బుద్ధిని అలవరచుకొని ఆచరించుచు సంచరింపవలెను. శ్రుతి స్మృతులలో చెప్పబడినది, సజ్జనులచే ఆచరింపబడినది మాత్రమే సదాచారమగును. అట్టి ఆచారమునే సేవించవలెను. ఇతరమును అనుసరించరాదు.

తండ్రులు తాతలు నడచిన దారిలోనే తాను నడువవలయును. ఇదియే సన్మార్గము. ఈ మార్గము నవలంబించినవాడు వత్తుడు కాడు.

ప్రతినిత్యము స్వాధ్యాయపరాయణుడు కావలెను. నిత్యముయజ్ఞోపవీతధారియై యుండవలెను. సత్యవాది, క్రోధమును జయించువాడు, బ్రహ్మ స్వరూపమును పొందును. ప్రతినిత్యము స్నాన సంధ్యల నాచరించుచు, బ్రహ్మ యజ్ఞములను సల్పుచు, అసూయా రహితుడై, మృదు స్వభావియై ఇంద్రియ నీగ్రహము కలవాడు ఇహ పరములలో అభ్యుదయమును పొందగలడు. రాగ భయ క్రోధములు విడిచినవాడు, లోభ మోహములు లేనివాడు, సావిత్రీ జపము చేయువాడు, శ్రాద్ధకారి, అయిన గృహస్థుడు ముక్తిని పొందును. తల్లిదండ్రులకు, గోబ్రాహ్మణులకు హీతము నాచరించువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, యజనశీలుడు, దైవభక్తుడు, బ్రహ్మలోకమున నివసించును. ఎల్లప్పుడు ధర్మ కామార్థములు సేవించుచు, దేవతలను పూజించుచు, ప్రతినిత్యము యత్న పూర్వకముగా దేవతలకు నమస్కరించుచుండవలెను.

తన సంపదను శాస్త్రానుసారముగా విభజించుచు, అనగా ధర్మము కొరకు, కీర్తికొరకు, సంపదను పెంచుటకు, తన భోగమునకు, తనవారి కొరకు - ఇట్లు 5 విధములుగా సంపదలు విభజించినవాడు ఇహ పరములలో కీర్తిని పొందును. ఓర్పు, దయ కలవాడైన గృహస్థుడు మాత్రమే గృహస్థుడనబడును. గృహమున ఉన్నంత మాత్రమున గృహస్థుడు కాజాలడు. క్షమ, దయ, విజ్ఞానము, సత్యము, శమము, దమము, ఆధ్యాత్మిక జ్ఞానము - ఇవి బ్రాహ్మణ లక్షణములు. కావున బ్రాహ్మణుడు వీనిని విడువరాదు. శక్త్యానుసారము కర్మను ఆచరించుచు, నిందితములను వీడువవలయును.

మోహమును తోసిరాజనీ, ఉత్తమ యోగమునుపొందిన గృహస్థుడు సంసార బంధమును వీడును. ఈ విషయమున సందేహముతో పనిలేదు, ఇతరుల కోపము వలన కలిగిన నీంద, అనాదరము, ఆక్షేపము, హింస, బంధనము, వధ మొదలగు దోషములను సహించుట క్షేమ అనబడును.

సౌహార్దముతో తమ దుఃఖమునవలె, పర దుఃఖమున కూడా కరుణ కలిగి యుండుట దయ అని మునులు పలికిరి. ఇది సాక్షాత్తు ధర్మ సాధనము. యథార్థముగా చతుర్ధశ విద్యలు ధరించుట విజ్ఞాన మనబడును. ఈ విజ్ఞానముతో ధర్మము వృద్ధియగును. యధావిధిగా అధ్యయనము చేసి, ధనమును పొంది, ధర్మ కార్యములను ఆచరించనిచో అదీ విజ్ఞాన మనబడదు. సత్యముతో అన్ని లోకములు జయించవచ్చును. సత్యమే పరమ పదము. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటను సత్యమని పండితులు చెప్పెదరు.

శారీరక ప్రక్రియా నియంత్రణమును (ఇంద్రియ నిగ్రహమును) దమమని, ప్రకృష్ట జ్ఞాన వికాసము శమమని, (మనో నిగ్రహము) ఆత్మ సంబంధ జ్ఞానమును అక్షరమని అందురు. ఈ జ్ఞానమును పొందినవాడు శోకించడు. మహాదేవుని పొందించు విద్య జ్ఞానమనబడును. ఆ జ్ఞానమున నిష్ఠ కలవాడు, ఆ జ్ఞానమందే తత్పరుడై యుండుపోడు విద్వాంసుడగును. ఇతడు సర్వకాలముల యందు కోపరహితుడై, శుచియై, పంచ మహాయజ్ఞములను ఆచరించుచు, ఆ ఉత్తమ పదమును చేరును. ధర్మమున కాధారమైన యీ శరీరమును, యత్న పూర్వకముగా పరిపాలించు. చుండవలయును, దేహము లేనిదే పరమాత్మ కూడా తెలియబడడు. ద్వీజుగు చునో నిగ్రహాము కలిగి, ధర్మార్థ కామముల యందు ప్రవర్తించు చుండవలెను. ధర్మ వర్జీతమైన కామమునుగాని, అర్థమునుగానీ మనసుతనైన స్మరింపరాదు, ధర్మాచరణతో కష్టములు కలిగినను, అధర్మము నాచరించరాదు. ధర్మమే భగవంతుడు. అన్ని ప్రాణులకు ధర్మమే గతి, ధర్మమే ప్రాణులకు ప్రియము కలిగించునది. కావున మానవుడు భూత ప్రీయమును ఆచరించవలయును కానీ, పరులకు ద్రోహము కలిగించు పనిని చేయరాదు. వేద సౌందను, దేవలోనిందను చేయరాదు. అట్లు చేయువారితో కలిసి యుండరాదు, ఇట్లు శాస్త్ర విధిని బోధించిన ఈ ధర్మాధ్యాయమును, నియమ పూర్వకముగా చదివినవాడు, చదివించినవాడు బ్రహ్మలోకమున నీవసీంచును.

ఇది కూర్మపురాణమున షట్ సాహస్ర సంహితలో ఉపరి విభాగమున పదునైదవ అధ్యాయము