కూర్మ మహా పురాణము

Table of Contents

40వ అధ్యాయము

మార్కండేయుడు పలికెను.

రాజేంధ్రా! అటనుండి ఉత్తమమగు భృగు తీర్థమునకు వెడలపలెను. అచ్చటనే భగవానుడగు భృగువు పూర్వమొకానొకపుడు రుద్రుని ఆరాధించెను. అచట దేవుని దర్శించుటవలన పాపములన్నియు వెంటనే నశించును. విశాలమగు ఈ క్షేత్రము సర్వపాపప్రశమనము. అచట స్నానము చేసినవారు, స్వర్గమును చేరుదురు. అచట మరణించినవారు మరల పుట్టరు. ఇచట పాదరక్షల యుగ్మమును, బంగారమును, అన్నమును దానము చేయవలెను. శక్త్యను సారముగా భుజింపచేసిన అక్షయ ఫలము లభించును. అన్నీ దానములు క్షీణించును. కాని భృగు తీర్థములో ఆచరించిన యజ్ఞము, దానము, తపస్సు అక్షయ ఫలము నిచ్చును. భృగు మహర్షి ఆచరించిన ఉగ్రమగు తపస్సుకు సంతోషించిన శంకరుడు, ఇచట ఎపుడు ఉండేదనని వరమిచ్చెను.

అక్కడినుండి గౌతమేశ్వర తీర్ధమునకు వెళ్లవలెను. ఇచట గౌతముడు శంకరుని ఆరాధించి సిద్ధిని పొందెను. ఈ తీర్థమున స్నానముచేసి, ఉపవసించినవాడు, బంగారు విమానముతో బ్రహ్మలోకము చేరును. ఇక్కడినుండి వృషోత్సర్గ తీర్థమునకు వెడలిన శాశ్వతఫలము పొందెదరు.

ఈ క్షేత్రమును దర్శించనివారు విష్ణుమాయావిమోహితులై మూఢులై, పరతత్వమును తెలియ జాలరు. ఇక్కడి నుండి గౌతపాపతీర్థమునకు వెడల వలెను. ఈ తీర్థమున ధర్ముడు, తన కల్మషమును శుద్ది చేసికొనెను. ఈ తీర్థము నర్మదానదీ ప్రాంతములో గలదు. ఇచట స్నానము చేసినవాడు, బ్రహ్మహత్యాపాతకము తొలగించుకొనును. ఈ తీర్థమున త్యాగమును చేసినవారు సొల్లుభుజములు, మూడు నేత్రములు కలిగి, శంకరతుల్య బలము కలవాడగును. అతడు భూమండలమునకు చక్రవర్తియగును. పదివేల కల్పముల కాలము శివలోకమున నివసించును, ఇక్కడినుండి హంస తీర్థమునకు వెళ్లవలెను. ఈ తీరమున స్నానము చేసిన వాడు, బ్రహ్మ లోకమున నివసించును. ఇటనుండి జనార్దనుడు సిద్ధి పొందిన వారాహ తీర్థమునకు వెళ్లవలెను. ఈ తీర్దము విష్ణులోకము ప్రసాదించును.

ఇక్కడినుండి చంద్ర తీర్థమునకు వెడలవలయును. విశేషించి ఈ తీర్థమున పూర్ణిమనాడు స్నానము చేయవలయును. స్నానము మాత్రమున చంద్రలోకనివాసము కలుగును. ఇక్కడినుండి కన్యా తీర్థమునకు వెళ్లవలెను. శుద్ధతృతీయనాడు ఈ తీర్థమున స్నానముచేసినవాడు చక్రవర్తియగును. దేవతలందరిచే నమస్కరించబడు దేవ తీర్థమునకు అటనుండి వెళ్లవలేను. ఇచట స్నానము చేసినవాడు దేవతలతో కలిసి ఆనందించును. ఇక్కడి నుండి పరమోత్తమమైన శిశు తీర్ణమునకు వెడలవలెను. ఇచట చేసినదానము కోటి గుణమగును, అక్కడినుండి పీతామహ తీర్థమునకు వెళ్లవలెను. ఇచట చేయు శ్రాద్దము అక్షయమగును. అక్కడి నుండి సావిత్రీ తీర్థము దర్శించవలెను. ఈ తీర్థమున ప్రాణములు విడిచిన వాడు అన్నీ పాపములు తొలగి, బ్రహ్మలోకమును పొందును. ఇచటనే మనోహరమగు మరోక తీర్థము గలదు. ఇందు స్నానమాడినవాడు దేవతలతో కలిసి విహరించును.

ఇక్కడ నుండి మానస తీర్థమున చేరి, స్నానము చేసినవాడు రుద్రలోకమును పొందును. అక్కడినుండీ, దేవతలచే నమస్కరించబడు స్వర్గబిందు తీర్థమునకు వెడలి స్నానము చేసినచో, దుర్గతిని పొందజాలడు. అక్కడినుండి అప్సరేశ తీర్థమునకు వెడలి స్నానమాచరించిన, స్వర్గమున అప్సరసలతో క్రీడించుచు ఆనందించును. ఇక్కడినుండీ భారభూతి తీర్థమును దర్శించి, స్నానమాడి, ఉపవసించి, శివుని అర్చించినచో, రుద్ర లోకమున వసించును. ఈ తీర్థమున మృతి చెందినవాడు గాణాపత్యమును పొందును ఈ తీర్థమున కార్తీకమాసమున పార్వతీపతిని ఆరాధించినవాడు, అశ్వమేథమునకు పదిరెట్లు ఫలితము పొందునని పండితులు చెప్పెదరు. ఈ తీర్థమున తెల్లని ఎద్దును దానము చేసిన వృషభవాహనముతో రుద్రలోకము చేరును. ఈ తీర్ణమున ప్రాణములు విడిచినవాడు సర్వపాప విముక్తుడై, రుద్రలోకమును పొందును. ఈ తీర్థమున జలప్రవేశము చేసినవాడు హంసయుక్త పోహనముతో స్వర్గలోకమును పొందును. ఇక్కడ జగత్ర్పసిద్దమగు 'ఏరండీనర్మదా' సంగమము కలదు. ఇది పరమ పావనము. సర్వపాప ప్రణాశనము. ఇచట స్నానమాడి, ఉపవసించి, ప్రత పరాయణుడైనవాడు, బ్రహ్మ హత్యాపాతకమును గూడా పోసోడును.

ఇక్కడినుండి, నర్మదా సముద్రసంగమమునకు వెళ్లవలెను. ఈ తీర్థమున జనార్దనుడు జమదగ్ని నామముతో సిద్ది పొందెను. ఈ నర్మదా సముద్ర సంగమములో స్నానము చేసినవాడు అశ్వమేధయాగమునకు మూడింతల ఫలమును పొందును.

 ఇక్కడి నుండి పింగళేశ్వర తీర్థమునకు వెడలవలెను. ఇందు స్నానమాడిసపోడు రుద్రలోకమును చేరును. ఇందుపవసించి, విమలేశ్వరుని దర్శించినవాడు నూరు జన్మలనుండి చేసిన పాపము తొలగించుకొనీ, శివసాన్నిధ్యము చేరును. ఇచటనుండి 'ఆలికా' తీర్థమునకు వెళ్లి స్నానము ఒకదినము ఉపవాసముతో, మనోనియమమున చరించినవాడు, బ్రహ్మహత్యాపాప వినిర్ముక్తుడగును. ఇట్లు సంక్షేపముగా నీకు ప్రధానముగు తీర్థములను చేప్పితిని. విస్తరముగా చెప్పటకుగాని, తీర్థ సంఖ్యను చెప్పుటకుగానీ శక్తి చాలదు. ఈ నర్మదానది పవిత్రము, పరిశుద్ధము, త్రిలోకప్రసిద్దము అన్ని నదులలో శ్రేష్టము మహాదేవునికి ప్రియము. నర్మదను మనసుతో స్మరించినవాడు, నూరు చంద్రాయణవ్రతముల ఫలము పొందును. శ్రద్దను విడిచి, నాస్తిక్యము పొందిన క్రూరులు ఘోర నరకమున పడుదురని, మహాదేవుడు తెలిపెను.

ఈ నర్మదానది సమీపమున ఎపుడు మహాదేవుడు నివసించి యుండును. కావున సర్మదానది పుణ్యప్రదము. బ్రహ్మహత్యానివారకమని తెలియవలయును.

ఇది కూర్మపురాణమున షట్సాహస్రసంహితలో ఉపరి విభాగమున నలుబదియవ అధ్యాయము.