కూర్మ మహా పురాణము
46 - భువనన్యాసవర్ణనమ్
సూతుడిట్లుపలికెను.
మేరుపర్వతము పైన దేవదేవుడైన బ్రహ్మయొక్క పదునోలు వేలయోజనముల ప్రసిద్ధమైన మహాపురి కలదు. విశ్వాత్ముడు, విశ్వభావనుడు, భగవంతుడును అగు బ్రహ్మ యోగీంద్రులచే, మునీంద్ర, విష్ణు, శంకరులచే సేవింపబడుచు నివసించు చున్నాడు.
అక్కడ దేవతలందరికి ప్రభువైన, విశ్వాత్మకుడైన ప్రజాపతి అను బ్రహ్మను పూజ్యుడైన సనత్కుమారుడు ఎల్లప్పుడు సేవించుచుండును.
ఆ ప్రజాపతి, సిద్దులు, ఋషులు, గంధర్వులు, దేవతలు మొదలగు వారిచేత పూజింపబడుచు, శ్రేష్ఠమైన అమృతమును సేవించి, యోగముతో కూడిన వాడై నివసించియుండును.
ఆ ప్రదేశములో బ్రహ్మయొక్క ముందు భాగములో, దేవాధిదేవుడు, గొప్పతేజస్సు కలవాడును అగు శివునియొక్క ప్రకాశవంతము, నిర్మలము అయిన మందీరము కలదు.
అది దివ్యమైన కాంతితో కూడినది, నాలుగు ద్వారములు కలిగి మిక్కిలి మంగళకరమైనది, గొప్పఋషుల సమూహముతో నిండియున్నది, బ్రహ్మవేత్తలచే సేవింపబడునదై ఉండును.
అక్కడ సూర్యచంద్రాగ్నులు కన్నులుగా గల శంకరుడు ప్రమథగణాధిపతి, ప్రమథులతో, పార్వతీదేవితో గూడ విహరించుచుండును.
ఆచోట వేదవేత్తలు, శాంతచిత్తులు అగుమునులు, బ్రహ్మచారులు, సత్యవాదులు అగువారు తపస్సుతో మహాదేవుని ఆరాధింతురు.
మహానుభావులైన ఆ మునులు మొద॥ వారి యొక్క పూజను సాక్షాత్తు మహాదేవుడగు పరమేశ్వరుడు తన శిరస్సుతో స్వీకరించును. అక్కడ పర్వతశ్రేష్ఠముపైననే తూర్పుదిక్కున అమరావతి అనుపేరుతో సమస్త శోభలతో కూడిన ఇంద్రునియొక్క గొప్పపట్టణము కలదు. దానిలో అందరు అప్సరసలు, గంధర్వులు, సిద్దచారణులు ఇతర దేవతలు వేలకొలదిగా సహస్రాక్షుడైన ఇంద్రుని సేవించుచుందురు.
ధర్మపరులు, వేదములెలిసినవారు, యాగములు, హెూమము చేయుట యందు శ్రద్ధకలవారు ఎవరుకలరో, వారికి శ్రేష్ఠమైన ఆస్థానము పొందదగినది. అది దేవతలకు గూడ దుర్లభమైనదీ.
దానికి దక్షిణ దిక్కున, అధిక తేజస్సుకల అగ్నిదేవుని యొక్క తేజోవతి అనుపేరుకల పట్టణముండును. అది గొప్ప ఆశ్చర్యకర దృశ్యములతో కూడియుండును.
భగవంతుడైన అగ్ని తన తేజస్సుతో ప్రకాశించుచు అక్కడ వసించును. అది జపము చేయువారికీ, హోమము చేయువారికీ స్థానము రాక్షసులకు పొందరానిది.
దక్షిణ దిక్కున పర్వతముపైన యమధర్మరాజు యొక్క పెద్దనగరము, సంయమని అనుపేరుకలది, సమస్త శోభలతో కూడి యున్నదై ప్రకాశించును.
అక్కడ దేవతలు మొదలైనవారు, యమధర్మరాజును సేవించుదురు అదీ సత్యసంధులు, పుణ్యవంతులు అగుమనుష్యులకు ప్రాప్యస్థానము. దానికి పడమటి భాగములో, మహాత్ముడైన నిర్ఋతియొక్క పట్టణము రక్షోవతి అనునది కలదు. అది రాక్షసులచే చుట్టబడియుండును.
అక్కడ రాక్షసులు నైఋతదేవుని సేవించుచుందురు. ఎవరైతే లోకములో తమోగుణప్రవృత్తి కలిగి, ధర్మపరులుగా నుందురో వారు ఆపట్టణమును పొందుదురు.
పడమటి పర్వతరాజముపై వరుణదేవుని శుద్ధవతి అను పేరుగల గొప్ప పట్టణము, పుణ్యకరమైనది, అన్ని కోరికల సమృద్ధీకలదిగా నుండును.
దానిలో అప్సరసల సమూహముచేత, సిద్ధులచేత, దేవతలచేత సేవింపబడుచు వరుణ భగవానుడు నివసించును. లోకములో జలదానము చేసినవారు అక్కడకు వెళ్లుదురు.
దానికుత్తర దిగ్భాగములో పాయువుయొక్క పేద్దపట్టణము గంధవతి అనుపేరు కలదీ, పుణ్యవంతమైనది కలదు. అక్కడ వాయుదేవుడు నివసించును.
అతడు అప్సరసల సమూహముచేత, గంధర్వులచేత సేవింపబడుచు నుండును. ప్రాణాయామ పరాయణులైన బ్రాహ్మణులు ఆస్థానమును శాశ్వతముగో పొందుదురు.
దానికి తూర్పుదిక్కున చంద్రునియొక్క శ్రేష్ఠమైన పట్టణము కలదు. అది కాంతిమతి అను పేరుగలది, స్వచ్ఛమైనది. దానీయందు చంద్రుడు ప్రకాశించుచుండును.
అక్కడ ఎవరైతే ధర్మమునందు శ్రద్ధకలవారై, తమధర్మమును అనుష్ఠింతురో వారికి, అనేక సుఖములతో కూడిన ఆస్థానము తగియున్నది.
ఆ పట్టణమునకు తూర్పుభాగమున శంకరునియొక్క యశోవతి అను పేరుగల గొప్పపురము కలదు. అదిపుణ్యప్రదమైనది, అందరికిని పొందుటకు శక్యము కానిది.
ఇచ్చట రుద్రుణిచేత అధిష్టించబడిన ఈశానుని భవనము, శుభకరమైనది, గణేశ్వరుని యొక్క విశాలమైన భవనమున్నది. అక్కడ గణములచేత పరివేష్టితుడై గణేశ్వరుడుండును.
అక్కడ సుఖాదులను పొందగోరు పరమేష్టియొక్క భక్తులకు పూర్వము దేవదేవుడైన శంకరునిచేత నివాసము ఏర్పరచబడినది.
విష్ణువు పాదమునుండి బయలుదేరి చంద్రమండలమును పావనముచేసి తరువాత గంగానది అన్నివైపుల నుండి బ్రహ్మయొక్క పట్టణము నందు పడుచున్నది.
ఆ సది అక్కడ దిగి దిక్కులయందు నాలుగు విధముల చీలిపోయెను. బ్రాహ్మణులారా సీత, అలకనంద, సుచక్షువు, భద్రఅని ఆ నాలుగు పాయలకు పేర్లు.
తూర్పువైపుగా పర్వతమునుండి పర్వతమునకు ప్రవహించు సీత అనుపొయ అంతరిక్షమున సాగును. తరువాత తూర్పున భద్రాశ్వవరము నుండి సముద్రమును చేరును.
అట్లే అలకనంద దక్షిణ దిక్కుగా భారతదేశమున నడచి ఏడుపాయలుగా విడిపోయి సముద్రమును చేరుచున్నది.
సుచక్షువను పొయ పడమటి వైపు పర్వతములన్నింటినీ దాటి, పశ్చిమమున కేతుమాలమను వర్షమును చేరి సముద్రమును పొందుచున్నది.
భద్ర, ఉత్తరదిక్కునందలి పర్వతములను, ఉత్తరకురు దేశమునుదాటి ఉత్తర సముద్రమును చేరుచున్నది.
మాల్యవంతము, గంధమాదనము అను పర్వతములు నీలనీషధములంత పొడవుగలవి. ఆ రెండింటి మధ్యభాగమును పొందిన మేరు. పర్వతము కర్ణికాకారములో ఉన్నది.
అవధి పర్వతమునకు వెలుపల, భారత, కేతుమాల, భద్రాశ్వ, కురువర్షములు లోకమను కమలమునకు రేకుల వంటివి.
జఠరము, దేవకూటము అను మర్యాదపర్వతములు రెండు నీల నిషధ పర్వతములంత పొడవు కలిగి దక్షిణోత్తర దిక్కులకు వ్యాపించినవి.
గంధమాదన కైలాసపర్వతములు తూర్పు పడమరలుగా విస్తరించిన రెండు పర్వతములు. ఎనుబది యోజనముల వైశాల్యము కలిగి సముద్రమధ్యములో నిలిచి యున్నవి.
నిషధము, పారియాత్రము అనునవి మర్యాదపర్వతములు. ఈ రెండు మేరువునకు పడమటి భాగమున పూర్వమువలె నిలిచి యున్నవి.
త్రిశృంగము, జారుధ్ అనునవి ఉత్తరదిక్కున వర్షపర్వతములు కలవు. పూర్వపర్వతములంత వైశాల్యము కలిగి సముద్రములో నెలకొని యున్నవి.
బ్రాహ్మణులారా ఎనిమిది మర్యాదాపర్వతములు నాచేత తెలుపబడినవి. మేరు పర్వతమునకు నాలుగు దిక్కులందు జఠరము మొదలగు పర్వతములు పాదుకోని ఉన్నవి.
శ్రీ కూర్మపురాణములో భువన విన్యాసములో నలుబది యారవ అధ్యాయము సమాప్తము.
