నారద మహా పురాణము - ఉత్తరార్థము
81 - వసు చరిత్ర నిరూపణమ్
వసువు పలికెను :- ఓ మోహినీ! ఇపుడు నీకు చెప్పిన తీర్థమాహాత్మ్య విధిని అనుసరించి తీర్థమండలమును పర్యటించి ఫలమును పొందుము. నేను కూడా నీ తండ్రి యగు బ్రహ్మతో సంభాషించి బృన్దావనమును చేరి మృగములతో కలిసి సంచరించేదను.
సూత మహర్షి పలికెను :- పురోహితుడగు వస్తువు మోహినితో ఇట్లు చెప్పి మోహినిచే చక్కగా పూజాసత్కారములు చేయబడినవాడై బ్రహ్మలోకమునకు వెళ్ళేను. అచట జగద్విధియగు బ్రహ్మకు నమస్కరించి మోహినీ చరిత్ర నంతటిని జరిగినది. జరిగినట్టుగా విన్నివించెను. వసువు మాటలను వినిన బ్రహ్మ సంతోషించి నీవు మంచి పని చేసితివి. నేను మోహినిని దేవకార్యార్థము నియోగించితిని. కాని దేవకార్యము చేయకమునుపే నీచే శపించబడి మృతి చెందెను. మరల నాయాజ్ఞచే నీవామెను బ్రతికించితివి కృతార్థుశాలను చేసితివి. కావున నీ కంటే అధిక పుణ్యాత్ముడెవడు? ఇపుడు నీవు నాకు చెప్పిన మోహినీ చరితమును విని ప్రసన్నుడనైతిని. కావున నీకు వరము నిచ్చెదను. ఏమి కావలయునో కోరుము అని పలికెను. లోకభావియగు బ్రహ్మా ఇట్లు పలుకగా బ్రాహ్మణోత్తముడగు వసువు ప్రణామమునాచరించి బృన్దావననివాసమును వరముగా కోరెను. ఆ మాటలను వినిన బ్రహ్మ చిరునవ్వు నవ్వి అట్లే కానిమ్మని పలికెను. అంతట వసువు సంతోషముతో బ్రహ్మకు నమస్కరించి బృష్ణావనమును చేరి తపము నాచరించెను. వసువు తపస్సు చేయుచుండగా ముగ్గురు ప్రియ మిత్రులతో కూడి శ్రీహరి సాక్షాత్కరించి వస్తువుతో ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా నేను నీ తపస్సునకు సంతోషించితిని ఏమి కావలయునో కోరుము. అంతట వసువు లేచి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి దేవా! ఎల్లపుడూ బృన్గావన నివాసమును కోరుచున్నాను అని పలికెను. శ్రీహరి వసువు కోరికను తీర్చి నమస్కారములనంది అంతర్థానమును చెందెను. ఆ వసువు అప్పటి నుండి స్వేచ్చారూపధరుడై బృన్దావనమున నుండెను. బృందారణ్యకుతూహలయగు శ్రీకృష్ణ భగవానుని ధ్యానించి చుండెను. ఒకపుడు యమునాతీరమున కూర్చొని శ్రీకృష్ణ భగవానుని చింతించుచు బ్రహ్మమానస పుత్రడగు నారద మహర్షిని దర్శించేను. తనకు పరమ గురువగు నాదర మహర్షిని చూచి నమస్కరించి భగవద్భక్తి వర్దకములగు పలు ధర్మముల నడిగెను. వసువు ఇట్లడుగగా అధ్యాత్మజ్ఞానము గల నాదర మహర్షి శ్రీహరి భవిష్యచ్చరితమును వసువునకు తెలిపెను.
ఓ బ్రాహ్మణోత్తమా! ఒకసారి నేను కైలాసవాసియగు శంకరుని దర్శించుటకు భవిష్యద్బన్టావన రహస్యమును అడుగుటకు కైలాసమునకు వెళ్ళితిని. అప్పుడే నేను సిద్దసమావృతుడు తన మహిమచే జగత్తునంతటినీ వ్యాపించియున్న శంకరునికి నమస్కరించి నా ఈప్సితమును అడిగితిని. అంతట శంకరుడు చిరునవ్వు నవ్వుచు ఇట్లు పలికెను. ఓ నారదా! నీవిపుడడిగిన శ్రీహరి భవిష్యచ్చరిత్రను నేను సురభివదనమునుండి వింటిని, ఇపుడు దానిని నీకు చెప్పెదను. ఒకపుడు నేను గోలోకమధ్యలో నున్న, స్వసంతానసహిత, సుప్రీతురాలు, సుస్నిగ్ధమానస యగు సురభిని చూచితిని. అపుడు నేను పయస్విని యగు గోమాతను " శ్రీహరి భవిష్యచ్చరితమును అడిగితిని. అపుడు నాకు సురభి శ్రీహరి భవిష్యచ్చరితమును తెలి పెను. ఓ శంకరా ఇపుడు శ్రీకృష్ణ భగవానుడు రాధాసమన్వితుడై గోపాలక గోపికలకు సుఖమును కలిగించుచు ఈ గోలోకమున ఆనందముగా నున్నాడు. అతను కొంతకాలమునకు భూలోకమున మధురా మండలమున ఆవిర్భవించి బృన్దారణ్యమున క్రీడించును. వృషభాను సుతయగు శ్రీహరి ప్రియురాలగు రాధ విరజాగేహద్వారస్థుడగు శ్రీహరి మిత్రుని శ్రీరాముని కోపించి శపించును. శ్రీరాముడు కూడా నీవు మానుషలోకమున పుట్టుమని శపించును. ఇట్లు ఇద్దరూ శాపముచే భూలోకమున పుట్టెదరు. తరువాత బ్రహ్మ ప్రార్థనచే శ్రీహరి భూభారమును హరించుటకు భూలోకమున వసుదేవ పుత్రునిగా అవతరించును. వసుదేవుని ఇంటిలో పుట్టి తరువాత కంసునీ భయముచే వ్రేపల్లెకు చనును. అచట నుండి శ్రీహరి కంసుని పంపున వచ్చిన బాలఘాతిని యగు పూతనను, సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తుని సంహరించును. అట్లే మహాకాయుడు దేవపీడాకరుడగు వత్సాసురుని సంహరించును. బ్రహ్మను, ఇంద్రుని, వరుణుని, మదించిన కుబేర పుత్రులను గర్వరహితులను చేసి వృషాసురుని సంహరించును. శంఖచూడుని, కేశిని, వ్యోమాసురుని సంహరించి వ్రేపల్లెలో నివసించుచు పదకొండు సంవత్సరములు గోపికలతో క్రీడించును. తరువాత మధురానగరమును చేరి రజకుని సంహరించి, కుబ్జను చక్కగా చేసి, దనుర్భంగము గావించి కువలయాపీడమను గజమును సంహరించి చాణూరాది మల్లులను పరిమార్చి తన మేనమామయగు కంసుని సంహరించును. కారాగారబద్ధులగు తన తలిదండ్రులను విడిపించి, కాలయవనుని సంహరించి, జరాసంధ భయము వలన ద్వారకానగరమున నివసించును. రుక్మిణిని, సత్యభామను, సత్యను, జాంబవతినీ, కైకేయిని, లక్ష్మణను, మిత్రవిందను, కాలిందిని వివాహమాడును. తరువాత నరకాసురుని సంహరించి పదునారు వేల రాజ కన్యలను విమాహమాడును. పౌండ్రకుని, శిశుపాలుని, దంత వక్రుని, విదూరధుని శాల్వుని, ద్వీవీధుని సంహరించును. వజ్రనాభుని, సునాభుని, షట్సురాలయులతో, త్రిశిరదైత్యుని సంహరించును. కౌరవపాండవులకు పరస్పరము కలహమును కలిగించి భూభారహరణమును కోరి సంహరించును. యాదవులకు యాదవులచే పరస్పరము వైరమును కలిగించి స్వకులమును హరింప చేయును. అపుడు మరల తన నివాసమునకు చేరును. ఓ శంకరా! ఇది శ్రీహరి భవిష్యచ్చరితము. నీకు చెప్పితిని. ఇక నీవు వేళ్ళుము. శ్రీహరి భూతలమునకు వెళ్ళినపుడు దీనినంతటిని చూడగలవు. ఇట్లు సురభి చెప్పిన శ్రీహరి చరితమును విని నో నివాసమునకు చేరితిని. దానినే ఇపుడు నీకు చెప్పితిని. నీవు కూడా ఈ సమయమున శ్రీ గోపీపతి చరితమును చూడగలవు. ఇట్లు తెలిపిన శంకరుని మాటలను వినిన వసువు సంతోషముచే పులకితగాత్రుడయ్యెను. వీణానాదముచే శ్రీహరిని గానము చేయుచు ఆనందించుచు జగత్తును ఆనందింపచేయుచున్నాను అని నారదుడు పలికెను. ఇది శ్రీహరి భవిష్యచ్చరితము. నీ హితమును కోరి నీకు తెలిపితిని.
సూతమహర్షి పలికెను: ఇట్లు నారదమహర్షి బ్రాహ్మణోత్తముడగు వస్తువునకు తెలిపి, వీణా నాదము గావించుచు, యదునందనుని ధ్యానించుచు వేడలేను. ఆ వస్తువు కూడా నారదమహర్షి మాటలను విని బృందావనమున పరమప్రీతిచే నివసించెను. అచట ఎల్లకాలము బ్రాహ్మణులు శ్రీ కృష్ణభగవానుని క్రీడలను చూడగోరుచుందురు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున వసుచరిత్ర నిరూపణమను ఎనుబడియొకటవ అధ్యాయము.
