నారద మహా పురాణము - ఉత్తరార్థము
62 - ప్రయాగరాజ మాహాత్మ్యేతీర్థవిదిః
వసిష్ఠ మహర్షి పలికెను :- ఓరాజా! బ్రహ్మపుత్ర యగు మోహిని భక్తిముక్తి ప్రదాయకమగు పురుషోత్తమ మాహాత్మ్యమును విని తన పురోహితుడుగు వస్తువును మరల ఇట్లడిగెను.
మోహిని పలికెను : ఓ బ్రాహ్మణోత్తమా! అత్యద్భుతమగు పురుషోత్తమ మాహాత్మ్యమును వింటిని. ఇక ఇపుడు ప్రయాగమాహాత్మ్యమును చెప్పుము. సామాన్య విశేష తీర్థయాత్రలకు వెళ్ళినపుడు నరులు ఆచరించవలసిన విధానమును తెలుపుము. ఇట్లు పలికిన మోహిని మాటలను వినిన ఆ బ్రాహ్మణోత్తముడగు వసువు సామాన్య విధి పూర్వకముగా ప్రయాగ మాహాత్మ్యమును ఇట్లు చెప్పసాగెను.
వసువు పలికెను. : - భద్రపరులారా! తీర్థయాత్రాగమనవిధానమును తెలిపెదను వినుము. ఈ విధానమును అనుసరించినవారు యధోక్త ఫలమును పొందగలుగుదురు. పవిత్రమగు తీర్థయాత్రాగమనము యజ్ఞములనాచరించుటకన్నా విశేష ఫలప్రదము, దశమి ఏకాదశి ద్వాదశి రాత్రులందు ఉపవసించక, తీర్థయాత్రలకు వెళ్ళక, స్వర్ణదానమును, గోదానమును చేయక మానవుడు దరిద్రుడుగును. తీర్థయాత్రల వలన పొందు పలమును విపులదక్షిణలనిచ్చు అగ్నిష్టోమాదియాగముల వలన కూడా పొందజాలడు. అజ్ఞానముచే తీర్థయాత్రలు చేసినవాడు కూడా సర్వకామ సమృద్దుడే స్వర్గమును పొందును. ధనదాన్య సమాకులమగు స్థానమును పొందును. ఐశ్వర్య పూర్ణుడు జ్ఞానపూర్ణుడగును. స్వరకాలములందు భోగయుతుడగును. అతని పితరులు పితామహులు నరకమునుండి తరించబడుదురు. హస్తములు పాదములు మనస్సునియమబద్ధముగా ఉండువానికి విద్వ తపసు కీర్తి నియమబద్దముగా నున్నవానికి తీర్థయాత్ర ఫలముల లభించును. ఎవరి నుండి దేనిని గ్రహించక, లభించిన దానితో సంతృప్తి చెందువాడు, అహంకార విముక్తుడు తీర్థయాత్రా ఫలమును పొందకలుగును. కల్పనలు లేనివాడు, ప్రయత్నశూన్యుడు, తగినంత ఆహారమును పొందువాడు, ఇన్టియని గ్రహము కలవాడు, సర్వసంగవినిర్ముక్తుడు తీర్థయాత్రా ఫలమును పొందును. శ్రద్దతో, ఏకాగ్రమనస్కుడై, ధీరుడై తీర్థయాత్ర ననుసరించుచు పాపములను చేయువాడు కూడా శుద్ధి పొందును., ఇక పరిశుద్దుని మాటేల? శ్రద్ద లేనివాడు, పాపార్డుడు, నాస్తికుడు, సంశయములు తొలగనివాడు, హేతువాది ఈ అయిదు గురు తీర్థయాత్రా ఫలమును పొందజాలరు. పాపములను చేయువారి పాపములు తీర్థయాత్రలతో నశించును. పరిశుద్దాత్ములకు తీర్థయాత్రలు యధోక్త ఫలము లభించును. కామక్రోధలోభములను జయించి తీర్థయాత్రలు చేయువారు పొందజాలని ఫలముండదు. యధోక్త విధిచే తీర్థయాత్రలను చేయువారు సుఖదుఃఖాది సకల ద్వంద్వ విధిచే సకల ద్వంద్వములను సహించగలవారు స్వర్గమును పొందెదరు. గంగాది పుణ్యతీర్థములందు చాలా చేపలు నివసించుచుండును. దేవాలయములందు పక్షి గణములుండును. అయిననూ వారందరికీ ఫలము కలగుటలేదు. తీర్థమునందు కాని దేవాలయములందు కాని వాసము. ముఖ్యముకాదు. భావము ప్రధానము. భావహీనులు ఫలమును పొందజాలరు. కావున హృదయమున భక్తి భావమును ప్రతిష్టించుకొని ఏకాగ్రమనస్కుడై పుణ్యతీర్థములను సేవించవలయును. మునీన్తులు చెప్పిన విధించిన ఆమోదించిన తీర్థయాత్రను గురువులచే నియమించబడిన బ్రహ్మచారులు యధావిధిగా నాచరింతురు. సర్వస్వము నశించిననూ అల్పబలము కలవాడైననూ బ్రాహ్మణులను ముందు నిడుకొని, యజ్జాధికారము ఉన్ననూ తొలగిననూ బ్రాహ్మణులు తీర్థములను పర్యటించవలయును. పరిశుద్ద మనస్సుకల మునీన్తులు పవిత్ర తీర్థములలో యజ్ఞపలము లభించునని చెప్పియున్నారు. యజ్ఞములందు అధికారము కలవారు మాత్రము ఇల్లు, గృహస్థధర్మములే ముఖ్యము. గృహస్థాశ్రమమును యధావిధిగా ఆచరించువారికి తీర్థయాత్రలు నిషేధించబడినవి. సర్వతీర్థములు అగ్నిహోత్రతుల్యములు కాజాలవని కొందరు చెప్పేదరు. మొదట గృహస్థాశ్రమమున చక్కగా ఆచరించువాడు అప్రమత్తుడై గృహమున నుండువాడు తీర్థయాత్రలకు వెళ్ళదలచినచో సావధానుడై మొదట గణేశుని పూజించవలయును. దేవతలను పితరులను బ్రాహ్మణులను సాధువులను విత్తానుసారముగా ప్రయత్నముతో పూజించవలయును. తీర్థయాత్రల నుండి తిరిగి గృహమునకు వచ్చిన తరువాత ఇట్లే దేవ పితృ బ్రహ్మణ సాధువులను పూజించవలయును. ఇట్లు యధావిధిగా తీర్థయాత్రలను చేయువారికి యధోక్త ఫలము నిశ్చయముగా లభించును. దేశాన్తరమునకు వెళ్ళుచు నేతితో శ్రాద్దమునా చరించవలయును. ఇది యాత్రార్థము చేప్పబడినది. మరల ఇల్లు చేరిన వెంటనే చేయవలయును. ప్రయాగతీర్థమున యాత్రకు వచ్చిన వారు పితృమాత్స వియుక్తులైనచో కేశములను వపనము చేయవలయును. నిష్కారణముగా వపనము చేయరాదు. గయను వెళ్ళుటకు సిద్ధపడినవాడు యధావిధిగా శ్రాద్ధమునా చరించి కార్పటీ వేషమును ధరించి గ్రామ ప్రదక్షిణము నాచరించి గ్రామాన్తరమునకు వెళ్ళి శ్రాద్దశేషమును భుజించవలయును. తరువాత విఘ్నము లేకుండా ప్రతి దినము వెలవలయును. గయాక్షేత్రమునకు వెళ్భువానికి ప్రతిపదమున అశ్వమేధ పలము లభించును. వృషభము నధిరోహించి తీర్థయాత్రలకు వెళ్ళువాడు నరకమున నివసించును. గోవుల క్రోధము పరమదారుణము కదా. అతనిచ్చు తర్పణమును పితృదేవతలు గ్రహించరు. ఐశ్వర్యము, వలననో లోభము వలననో వాహనముతో చేసిన యాత్ర నిష్పలమగును. కావున వాహనమును విసర్జించవలయును. గోవాహనమున వెళ్ళినచో గోవధ పాతకము లభించును. హయయానమున వెళ్ళినచో నిష్పలమగును. నరవాహనమున వెళ్ళినచో అర్ధవలము లభించును. నడిచి వెళ్ళినచో నాలుగు రెట్లు వలము కలుగును. వరాతపాది బాధలున్నచో ఛత్రమునుదరించవలయును. గులకరాళ్లున్నచో దండమును ధరించవలయును. శరీరమును కాపాడుకొనుటకు పాదరక్షలను ధరించి యుండవలయును. పుణ్యతీర్థమును చేరి అచట స్నామును అప్రాధాన్యముగా చేసినచో స్నానపలమును పొందును కాని తీర్థఫలమును పొందజాలడు ఇతరుల ధనముతో వెళ్ళిన వారికి పదునారవ భాగము పలము లభించును. అనుకోకుండా ప్రసంగవశమున వెళ్ళినవారికి సగము ఫలము మాత్రమే లభించును. పుణ్యతీర్థములందు బ్రాహ్మణులను పరీక్షించరాదు. పుణ్యతీర్థములలో యాచనకొచ్చిన వారికి భోజనము పెట్టవలయునని మనువు చెప్పియున్నాడు. తీర్థములలో సత్తు పిండితో కాని యవలతోకాని, పాయసముతో కాని, రేగి పండ్లతో కాని, వుసిరికతోకాని, పిండితో కాని పిండదానమును చేయవలయును. తీర్థములలో అర్చావాహన వర్జితముగా శ్రాద్ధము నాచరించవలయును. శునక కాక గృహపాపుల దృష్టి హతము కాని దానిని చేయవలయును. తీర్థములలో నాచరించు శ్రాద్ధము పితరులకు తృప్తిని కలిగించును. సకాలములో కాని అకాలమున కాని తీర్థమున లభించినవారితోనే లభించిన పదార్థములతోనే పితృతర్పణమును చేయవలయును. ఆలస్యము చేయరాదు. విఘ్నము నాచరించరాదు. కుశమయి ప్రకృతిని తీర్థజలమున విసర్జించవలయును. ఎవరినుద్దేశించి విసర్జన చేసిన అతని అష్టమాంశ ఫలము లభించును. నీవు కుశస్వరూపుణివి. కుశపుత్రుడవు. పూర్వము బ్రహ్మచే నిర్మించబడితివి. నీవు స్నానముచేసినచో ఈ గ్రంథి బంధన ఉద్దేశ్యభూతుడు కూడా స్నానము చేసిన వాడగును. ముండనము ఉపవాసము అన్ని తీర్థములలో విధి. విశాల, విరజ, గయ కురుక్షేత్రములలో మాత్రము ఈ విధి వర్తించదు. భూమండలగత తీర్థములు పుణ్యప్రదములగుటకు కారణమును వినుము. శరీరమున కొన్ని అవయవములు ప్రధానములగునట్లు భూప్రభావము వలన, అద్బుతము వలన, జలము వలన, అగ్ని వలన, మునులు పరిగ్రహించుట వలన తీర్థములు పుణ్యప్రదములగుచున్నవి. గంగాతీర్థమును చేరి ముండనమును చేయుంచుకొననిది వాని క్రియలన్నియూ వ్యర్థములగును. అతను తీర్థద్రోహియగును. గంగాతీర్థమున భాస్కరక్షేత్రమున ముండనము చేయించుకోననివాడు కోటి కులములతో కల్పాన్తము వరకు గౌరవనరకమును చేరును. ఉత్తమనదియగు గంగను చేరి కల్పాన్తము వరకుండు పాపరాశులన్నియూ కేశముల నాశ్రయించియుండును గాన కేశములను విడువవలయును. గంగాజలమున ఎన్ని నఖకేశములు పడునో అన్ని వేలవర్షములు స్వర్గములో నివసించును. ప్రయాగ వ్యతిరిక్త గంగలో ముండనము చేయించుకొనరాదు. ఇందుకు భిన్నముగా వ్యవహరించిన వాడు మహారౌరవనరకమును పొందును. తండ్రి బ్రతికియుండగా తీర్థ మును చేరినవాడు యధావిధిగా క్షౌరమునాచరించవలయును కాని మీసములను ఖండించుకొనరాదు. మునులెల్లరూ క్షౌరమును నిషేధించియుండలేరు. మీసములను కేశములను వపనముచేసిననే ముండనమందురు. మీసములను వదిలి కేశములను మాత్రము తీసినచో క్షౌరమందురు. కావున వేదవిదులు క్షౌరము ముండనము వేరువేరని చెప్పియుండిరి.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున
ప్రయాగరాజ మహాత్మ్యమున తీర్థ విధి యను అరువది రెండవ అధ్యాయము.
