నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

78 - అవంతికా మాహాత్మ్యమ్

మోహిని పలికెను:-

ఓ బ్రాహ్మణోత్తమా ! నర్మదా మాహాత్మ్యము అత్యద్భుతము. నరులకు పాప వినాశము. నీవు చెప్పగా వింటిని. మహానుభావా? ఇపుడు అవంతికా మాహాత్మ్యమును తెలుపుము. అట్లే దేవవన్యుడగు మహాకాలుని మాహాత్మ్యమును కూడా తెలుపుము.

వసురువాచ : -

వసువు పలికెను :-

నరులకు పుణ్యప్రదము, సర్వ పాపహరము అగు అవంతీ మాహాత్మ్యమును చేప్పెదను వినుము. మహాకాల వనము పరమ పావనము సాటిలేని తపస్థానము. ఇచటనే మహాకాల దేవుడు ఎల్లపుడూ తపమునాచరించు చుండును. ఈ భూమండలమున మహాకాల వనమును మించిన క్షేత్రము మరియొకటీ లేదు. ఇచటికి వెళ్ళిన వారు దేవతలతో పోటీ పడుదురు. ఇచటనే కపాలమోచనమును తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు బ్రహ్మాహత్య నుండి విముక్తులగుదురు. అట్లే కలవలేశాఖ్య దేవుని పూజించిన వారు వివాదములలో విజయమును, కార్యసిద్ధిని పొందెదరు. ఇచటనే అప్పరః కుండమను తీర్థము మరియొకటి కలదు. ఇచట సామాడినవారు మన్మధుని వంటి రూపవంతుడు భోగవంతుడు కాగలడు. మహీష తీర్థమున స్నానమాడిన వారు శత్రువులను జయించెదరు. రు దసరస్సున స్నానమాడిన వారు రుద్రలోకమున విహరించును. కుండలేశ్వరుని చేరి యధావిధిగా పూజించిన వారు వ్యాపారమున లాభము బడయుదురు. శివునికి ప్రీతిపాత్రులగుదురు. విద్యాధర తీర్థమున స్నానమాడిన వారు పరిశుద్ధిని పొందెదరు. మార్కండేశ్వరుని పూజించిన వారు దీర్ఘాయుష్మంతులు ధనవంతులగుదురు. కాలవనమునందున్న శీతలాదేవిని పూజించిన వారికి ఎపుడూ విస్పోటకము రాదు. స్వర్గ ద్వారమునకు వెళ్ళేదరు. రాజస్థలమును చేరి అచట సముద్ర జలమున స్నానమాడిన వారు సర్వతీర్థ స్నాన ఫలమును పొందెదరు. శంకర వాపియందు నియమముతో స్నానమాడిన వారు ఇహమున అభీష్టభోగములనను భవించి అంతకాలమున రుద్రలోకమును చేరును. శంకరాదిత్యుని పూజించిన వారు ఇతరులచే గెలువ బడ జాలరు. నీలగంగలో స్నానమాడి గంధవతీదేవిని పూజించిన వారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. దశాశ్వమేధ తీర్థమున స్నానమాడిన వారు అశ్వమేధ యాగ ఫలమును పొందెదరు. సురేశ్వరీ దేవిని చేరి గంధపుష్పాదులచే పూజించినవారు సర్వాభీష్టములను బడయుదురు. హరిసిద్ధిని పూజించి సర్వసిద్ధీశ్వరుడగును. పిశాచికాదులను పదునాలుగు మందిని పూజించి సర్వాభీష్టములను బడయును. రుద్ర సరోవరమున స్నానమాడి శ్రద్ధచే హనుమత్కేశ్వరుని పూజించి నవారు అఖిల సంపదలను పొందగలరు. వాల్మీకేశ్వరుని పూజించిన వారు సర్వవిద్యానిధీ కాగలరు. శుక్రేశ్వరాదీ లింగములను శ్రద్ధతో పూజించిన వారు సర్వరోగ వివర్జితులై అఖిల భోగాఢ్యులయ్యేదరు. పంచేశానుని పూజించిన వారు సర్వసిద్ధులను పొందును. కుశస్థితిని ప్రదక్షిణ మాచరించి వాంఛితములను పొందును. అక్రూరేశుని పూజించి క్రూరులనుండి అభయమును పొందగలడు. మందాకినిలో స్నానమాడిన వారు గంగా స్నాన ఫలమును పొందును. అంక పాదుని పూజించిన వారు శివానుచరులగుదురు. చంద్రాదిత్యుని పూజించిన వారు నానావిధ భోగములను పొందగలరు.

కరభేశ్వరుని పూజించిన వారు వాహన సౌఖ్యమును పొందెదరు. లడుక ప్రియ వీ ఘ్నేశుని పూజించిన వారు సుఖాన్వితులగుదురు. కుసుమేశాదీకులను పూజించిన వారు సర్వభోగములను పొందెదరు. యజ్ఞవాయందు స్నానమాడి మార్కండేశుని పూజించిన వారు సర్వ యజ్ఞ ఫలమును పొంది స్వర్గమున ఒక యుగ కాలము నివసించును. సోమవతీ తీర్థమున స్నానమాడి సోమేశ్వరుని పూజించి ఇహపరములందు పాంఛితార్థములను పొందగలరు. యాతనా కలనమున స్నానమాడిన వారు యాతనలను చూడ జాలరు. నరకేశుని పూజించిన వారు స్వర్గమును పొందెదరు. కేదారేశుని, రామేశ్వరుని, సౌభాగేశుని, నరాదిత్యుని పూజించిన వారు సకలాభీష్టములను పొందగలరు. కేశవార్కుని పూజించిన వారు కేశవప్రియులయ్యేదరు. శక్తిభేదమున స్నానమాడిన వారు అత్యుగ్ర సంకటముల నుండి విముక్తులగుదురు. స్వర్ణక్షుర బ్రహ్మవాపి యందు స్నానమాడి అభయేశ్వరుని అగస్త్యేశుని పూజించి సర్వ సంపదలను పొందును. ఓంకారేశాది లింగములను పూజించిన వారు మహేశ ప్రసాదము వలన సకలాభీష్టములను పొందగలడు. మహాకాలవనమున లింగ సంఖ్యలేదు. అచట ఉన్న లింగమును పూజించిన వారు శివప్రియులయ్యేదరు. అట్లే కనకశృంగా కుశస్థలీ, అవంతికా, పద్మావతీదేవి, కుముద్వతీ ఉజ్జయినీ, ప్రతికలా, విశాలా, అమరావతీ మొదలగు పుణ్యతీర్థ క్షేత్రములెన్నియో కలవు. శిప్రానదిలో స్నానమాడి మ హేశుని పూజించిన వారు సకలాభీష్టములను పొందగలరు. గోమతీ కుండమున స్నానమాడిన వారు స్వర్గమును చేరెదరు. వామనకుండమున స్నానమాడి సర్వదేవేశుడగు శ్రీధరుని సహస్రనామములతోస్తుతించు వారు సాక్షాత్తు శ్రీహరి యగును. వీరేశ సరస్సున స్నానమాడి కాలభైరవుని పూజించిన వారు ఇహమున సకల సంపదల ననుభవించి అంతమున శివలోకమును చేరును. కుటుంబేశ్వరుని చేరి ఉపచారములచే పూజించిన వారు సకల కామనలను పొంది అంతమున స్వర్గమును చేరును. దేవప్రయాగ సరస్సున దేవమాధవుని పూజించిన వారు శ్రీహరి యందు భక్తిని పొంది అంతమున విష్ణులోకమును చేరును. కనకరాజ తీర్థమున నియతమనస్కులై స్నానమాడిన వారు సర్వరోగ వినిర్ముక్తులై ధనవంతులు, భోగవంతులు అయ్యేదరు. అంతరహయాత్రయందు విఘ్నేశుని భైరవుని, ఉమాదేవిని, రుద్రులను, ఆదిత్యులను, ఇతర దేవతలను శ్రద్ధతో పూజించినవారు స్వర్గలోకమును పొందెదరు. రుద్ర సరస్సు మొదలగు తీర్థములు చాలా కలవు. ఈ తీర్ధములలో శంకరుని పూజించిన వారు సుఖవంతులగుదురు. అష్టతీర్థయందు స్నానమాడిన వారు సమగ్ర యాత్రా ఫలమును పొందెదరు. ఇది పాపనాశకమగు అవన్తో మాహాత్మ్యము. నీకు సమగ్రముగా చెప్పితిని. దీనిని వినిన వారు సర్వపాప వినిర్ముక్తులయ్యెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున అవంతికా మాహాత్మ్యమను డెబ్బది యెనిమిదవ అధ్యాయమ.