నారద మహా పురాణము - ఉత్తరార్థము
29 - కాశీవర్ణనమ్
కాషీల పలికెను : ఇట్లు ఆడయేనుగు రూపమును ధరించిన ఆ రాక్షసి మూడు ముహూర్తముల కాలములో విశ్వేశ్వరుని నివాసమగు కాశీ నగరమును చేరెను. ఆ నగరమును చేరిన రాక్షసి భర్తతో ఇట్లు పలికెను. ఓ ప్రియా ఈ కాశీ నగరము పాపమను వు/క్షమునకు గొడ్డలివంటిది. షడూర్మికాంచనమునకు ఈ నగరము దురోదరి. కర్మయను బీజమును శమింప చేయునది. అందరికి సద్ధతిని ప్రసాదించునది. ఈ నగరము మొదట విష్ణుక్షేత్రమని పురాణములు చెప్పుచున్నవి. విష్ణుక్షేత్రము కాని చోట ఎవరికీ మోక్షము కలుగదు. ఈ నగరము పూర్వము శ్రీహరి నగరము. సర్వప్రాణులకు మోక్షమును ప్రసాదించునది. అన్ని పాపములను నశింప చేయునది. ఒకప్పుడు శివుడు సర్వలోక కర్త తన తేజస్సుచే ప్రకాశించుచున్న పితామహుని చూచుటకు బయలుదేరెను. బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి, వేదమును వినిపించుచు బ్రహ్మముందు నిలిచేను. నాలుగు ముఖములచే నాలుగు వేదములను పఠించుచు బ్రహ్మ ముందు నిలిచెను. నాలుగు ముఖములచే నాలుగు వేదములను పఠించుచున్న జగన్నాధుడగు బ్రహ్మను చూచి శంకరుడు ప్రీతి చెందెను. ఇక బ్రహ్మయొక్క అయిదవ ముఖము ప్రగల్భముగా నుండుట చూచిన శంకరుడు క్రోధావిష్టుడాయెను. ప్రగల్భముతోనున్న ఆ అయిదవ ముఖమును త్రిలోచనుడు కోపముచే నఖాగ్రముతో ఖండించెను. అట్లు ఛేదించబడిన బ్రహ్మ శిరస్సు శివుని వామహస్తమును అంటియుండెను. వదలి పెట్టలేదు. బ్రహ్మ కూడా దుఃఖితుడై శివుని చూచుచుండెను. రుద్రుడు కూడా లజ్జితుడై త్వరగా బయలుదేరెను. పలు విధములుగా ఆ శిరమును వదిలించుకొనుటకు ప్రయత్నించినను ఆ శిరము విడివడలేదు. ఈ సంఘటన చాలా ఆశ్చర్యమును కలిగించేను. చింతా వ్యాకులుడై శ్రీహరిని స్మరించెను. శివుడు స్మరించిన వెంటనే శ్రీహరి ఆవిర్భవించెను. దేవదేవుడు, సర్వ వ్యాపియగు శ్రీమహావిష్ణువును చూచిన శంకరుడు తేజోహీనుడై వినయముగా శిరస్సును వంచి నమస్కరించెను. అట్లు చింతా వ్యాకులుడు బ్రహ్మద్రోహి, భయాతురుడగు శివుని ఓదార్చి అతని సంతోషకరమగు మాటలను పలికెను. ఓ శంకరా నీవు బ్రహ్మ శిరమును ఖండించి పాప మునాచరించితివి. కావున స్వయం కృతాపరాధ ఫలమును కొంతకాలము అనుభవించుము. ప్రతి ప్రాణి తానాచరించిన శుభాశుభకర్మలను ఆనుభవించియే తీరవలయును. నూరు జన్మలలోనైనను అనుభవించనిదే కర్మనశించదు. నేనేమి చేతును? ఎటు వెళ్ళుదును? దుఃఖితుడవగు నిన్ను చూచి, నీ దుఃఖమును చూచి నా ప్రాణములు వికలములగు చున్నవి. ఈలోకములోని మహాపాపములన్నియూ బ్రహ్మహత్యతో సమములు కాజాలవు. నీవు సర్వలోకములకు గురువువు. దర్మమునుపదేశించువాడవు. అయిననూ బ్రహ్మహత్యాపాతకముచే పరాభూతుడవై ఒక్క క్షణము కూడా నిలువజాలవు. ఈ బ్రహ్మహత్య మహా ఘోరము. మత్స్యగంథము కలది. జరాతుర నాలుకను బయటికి చాచి నిన్ను పట్టుకొనుటకు నీవెంట పరుగెత్తి వచ్చుచున్నది. కావున నీవు పన్నెండు సంవత్సరములు ఒకేచోట నిలువక పాపనాశమును కోరి అంతటా తిరుగు చుండవలయును. పన్నెండు సంవత్సరములు సకల తీర్థములలో తిరుగుచు వామహస్తమును ప్రక్షాళనము చేసుకొనుచు కపాలమున భిక్షను స్వీకరించుచు ఈ దారుణమగు పాపమునుండి విముక్తుడవగుదువు. ఇట్లు శ్రీహరి పలుకగా శివుడు అన్ని తీర్థములలో తిరుగుచుండెను. కపాలమును విడిపించుకొనుటకు జలములలో హస్త ప్రక్షాళనమును గావించుకొనుచు మూడు సంవత్సరములు తిరిగి బదరికాశ్రమమును చేరెను. ధర్మపుత్రుడు దేవదేవుడగు శ్రీమహా విష్ణువు నుండి భిక్షను స్వీకరించదలచెను. ద్వారమున నిలిచి విష్ణు నాకు భిక్షనిమ్ము అని పలికెను. అంతట నారాయణ దేవుడు ద్వారమున నిలిచియున్న హరుని చూచి భిక్షను స్వీకరించమని దక్షిణహస్తమును చాచెను. అట్లు భిక్షనిచ్చుటకు చాచిన శ్రీహరి దక్షిణహస్తమును చూచి హరుడు త్రిశూలముచే ప్రహరించెను. అట్లు త్రిశూలముచే అయిన గాయము నుండి లోకభయంకరములగు మూడు ధారలు వెడలెను. ఆ ధారలు ప్రస్థద్వాదశహస్త ప్రమాణములు చిత్రవర్ణములు గలవిగా నుండెను. ఆ మూటీలో ఒక రక్త ధారమాత్రము హరుని కపాలమున పడెను. రెండవ ధోర శివుని ముఖమున పడెను. మూడవది జలమునపడెను. ముందు పాపమును హరించుచుటకు హేతువగునది శివుని ఒక జలధార చేరినది. ఆ మూడు ధారలను శివుడు యధావిధిగా మూడు సంవత్సరములు సేవించి కొద్దిగా ప్రీతిని చెంది పుణ్యకరమగు కురుక్షేత్రమును చేరేను.
కురుక్షేత్రమును చేరిన హరుడు స్థాణువై అచటనే పడెను. మూడు సంవత్సరములు బ్రహ్మప్రదజలమున క్రుంకులిడెను. అచట మూడు సంవత్సరములు గడుపగా కపాలమున సగభాగము విడిచెను. సర్వగుహాశయుడగు శ్రీహరిని చాలా కాలము స్తుతించెను. అట్లు స్తుతించబడిన శ్రీహరి శివునికి వరమునిచ్చేను. ఓ శివా చాలా తీర్థములను పర్యటించి ఇక్కడి నుండి కాశీ నగరమునకు వెళ్ళుము. అంతట శ్రీహరికి నమస్కరించి చాలా మార్లు ప్రదక్షిణములనాచరించి తీర్ధయాత్రలను పర్యటించుచు అవిముక్త పురిని (కాశీ నగరమును) చేరెను. కాశీ నగర సీమను ప్రవేశించుచు వెనుక తిరిగి చూచేను. అచట తన వెనుక బ్రహ్మహత్య రాక పోవుటను చూచెను. సీమకు అవతల నిలిచి యుండుటను గమనించేను. అప్పుడు ఇది వైష్ణవక్షేత్రము పాపనాశనము అని తెలిసి సర్వవంద్యుడగు మాధవుని శ్రద్ధతో స్తుతించెను. ఓ జగదీశా! నాధా! విషూ! జగదానన్ద నిధాన! వేదవేద్యా! మధుమధన! నృసింహా! పీతాంబరధారీ! గరుడవాహనా! మాధవా, ఆదిదేవా గోపనాయక! రమేశ! రాధాపతీ! దేవేశ! సకల కామపూర! కృష్ణ! జయము జయము. సురవర! వరుణ సాగరా! ఆర్తినాశక! పుండరీకాక్ష! అధిపతి! విభో! పరేశ! యదు కుల తిలక! సాగరవాస! శారీ! పర్వతో ధార దక్ష! ధనుర్ధారీ! కలికలుషాపహరణ! పద్మపాద! గృణద! ఆత్మప్రద! కూర్మ! వామనా! వరాహా! నరసింహా పరశురామా! యజ్ఞరూపా!కాలాశితవస్త్రధారీ! బుద్దిరూపా కల్కీ! భవభయహరణ! భక్తవశ్య! గోపాలక! ప్రణతోద్దారక! పుణ్యకీర్తి నామ! భూభారహరణ! దేవపూజ్య! ప్రకృతీశ! జగన్ని వాస! రామ! గుణగణ విలసచ్చరాచరేశ! త్రిగుణాతీత! సనాతన! అగ్రపూజ్య! నిజజన పరిరక్షిత! అంతకరిపూ! కమలపాద! సుందర! పద్మనాభ! కమలకర! కుశేశయాధి వాస ప్రియ! కామానన! త్రిగుణాధీశ! త్రిమూర్తి వరదా! పాపహరణ! రఘునాధ! దురితాపహరణ! త్రిగుణవ్యాప్త జగత్! త్రికాలదక్ష! దనుజకుల వినాశనైక కర్మ! అనఘారూఢ! ఫణేశ! కంపనాశా! సూర్యచన్జనేత్ర! ప్రగల్భ చేష్ట! ధ్వాంతహరణ! నవజలదశ్యామదేహా! లక్ష్మీనాధా! యజ్ఞరూపా యజ్ఞధర! మాతృబద్ధదామ! నవనీత ప్రియ! గోపీజనప్రియ! అఘ, బక, వృషకేశి, పూతనాంతక! త్రిశిరో వాలి దశాస్యభేదక! నరకపుర వినాశన! బాణబాహుచ్ఛేదక! త్రిపురారీపూజ్య, సుదామమిత్ర! సంసారతారణ! అహిత్రపాదపద్మ! ప్రకటైశ్వర్య! పురాణ పురుష! ఆ జానుబాహు బహుజన్మ పుణ్యప్రాప్య! మంగళార్హ! శ్రుతివేద్య! శ్రుతిధామ! శాంత! శుద్ద! వరద! వరేణ్య! నీ పాదపద్మములను శరణు పొందితిని. పాపపీడితుడనగు నన్ను కాపాడుము. నాకు సద్గతిని ప్రసాదించువారు నీకంటే ఇతరులు లేరు. నా ప్రార్థన ప్రసన్నుడవు కమ్ము! ఇట్లు దేవదేవుడగు శంకరుడు భక్తిచే స్తుతించగా భక్తవత్సలుడగు శ్రీనాధుడు వెంటనే అచట ఆవిర్భవించెను.
అట్లు ఆవిర్భవించిన శ్రీహరిని చూచి హరుడు దండవత్రణామము నాచరించెను. మరల లేచి చేతులు జోడించి నమస్కరించెను. ఇట్లు నమస్కరించుచున్న భూతనాయకుని హృషీకేశుడిట్లు పలికెను. నీ సోత్తమునకు సంతోషించింతిని. ఏమి వరము కావలయునో కోరుకొనుము. ఇచ్చెదను అని ఆ శ్రీహరి వాక్యమును వినిన భూతేశుడు బ్రహ్మహత్యచే పీడించబడుచు భక్తి ప్రదాయకుడగు శ్రీహరితో ఇట్లు పలికెను. చక్రగదారా! నీ క్షేత్రమున నివాసమును చేయగోరుచున్నాను. బ్రహ్మహత్య నీ క్షేత్రసీమకు అవతల నున్నది. గరుడ ధ్వజా నాకు క్షేత్రదానమును గావించి దయ చూపుము. నేను ఇటునుండి మరలి వెళ్ళినచో బ్రహ్మహత్య మరల నా వెంటపడును. నీ క్షేత్రమున నేను నివసించినచో ఈ మూడు లోకములలో పూజలనందగలను. ఇట్లు పలికి వృషధ్వజుడు ఊరకుండెను. రమాప్రియుడు అట్లే అని అంగీకరించెను. అప్పటి నుండి ఈ కాశీపురము శివక్షేత్రమనబడుచున్నది. కాని ఇది పూర్వము విష్ణుక్షేత్రమని విద్వాంసులు తెలియదురు. దయార్ద్రహృదయుడగు మాధవుని నేత్రముల నుండి నీరు వేడలివచ్చెను. ఆ జలము బిందు సరస్సుగా మారెను. మాధువుని ఆజ్ఞ చే యచట వృషధ్వజుడు స్నానము గావించెను. ఆ బిందు సరస్సులో స్నానమాడినంతనే శంకరుని చేత నుండి కపాలము వీడి పడెను. కావున ఆ తీర్థమునకు కపాలమోచన తీర్థమని ప్రసిద్ది కలిగెను. ఈ సరస్సు బిందుమాధవ సరస్సు అని కూడా పేరు వచ్చెను. శ్రీహరి శంకరునికి తన క్షేత్రమునిచ్చి వెడలెను. శంకరుడు కూడా భక్తి భావముచే అచట నిలిచెను. ఇచట నున్న శంకరుని బ్రహ్మాది దేవతలు తమ తమ స్థానములలో నుండియే ఎల్లవేళలా చూచుచుందురు. ఇచట శంకరుడు పదివేల సూర్వులతో సమమగు కాంతి గలవాడు, దిగంబర ని షేవితుడు, తనను సేవించుటలో శూలియే విశ్నుములను కలిగించుచుండెను. ఇట్లు విఘ్నములు కలుగగా శివార్చకులు శ్రీహరిని స్తుతించి విఘ్నములను తొలగించుకొందురు. ఇచట శివుని కాశీనగరమును ధ్యానించుచు అన్ని లోకములు నిలిచినవి. శివుని ధ్యానించు శైవులందరూ చింతలేనివారైరి. జరామృత్యురహితులై శివలోకమును చేరెదరు. ఇహలోకమున కూడా బహు ఫుణ్యయుతులై రోగహీనులై నివసించేదరు. యజ్ఞశేషమును భుజించుచుందురు. బుద్దీయుతులగుదురు. ఈ కాశీ క్షేత్రమున స్నానము, జపము, దైవపూజ, దానము కూడా విధించబడలేదు. ఇచట మరణించుట యొకటే ప్రశంసించబడినది. ఈ కాశీ నగరమున మరణించినవారు కృతకృత్యులగుదురు. అట్టి కాశీ నగరమును చేరితిమి. భోగులకు కూడా మోక్షమును ప్రసాదించునన్న ఇక వ్రతధారుల విషయము చెప్పనేల? ఈ రాజకుమారిని కాశీనాధుని మందిరమున నుంచుము. ఈ రాజకుమారిని దుష్టుడగు రాక్షసుడు విడదీ సేను. నియమాన్వితయగు ఈ కుమారిని తన భోగము కొఱుకు తీసుకొనివచ్చెను. ఇది కాశీ క్షేత్ర మహాత్మ్మము. నీకు సవిస్తరముగా వివరించితిని. ఇచట శుభాశుభకర్మలు అన్నియూ నశించును భూత భవ్యభవిష్య కర్తలు జ్ఞానాజ్ఞానకృతములగు కర్మలు కూడా నశించును. ఈ కాశీ నగరమును శ్రీహరి కర్మనాశమునకు నిర్మించెను. ఈ కాశీనగరమున మరణించిన వారు అనంతము ఉగ్రమగు దుఃఖమును యమయాతనలను అనుభవించరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మెహినీ చరితమున కాష్ఠీలో పాఖ్యానమున రాక్షసీ చరితమున కాశీ వర్ణనమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము.
