నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

36 - మోహినీ మోహముత్యృజ్య గతా విబుధమందిరమ్ 

వసిష్ఠమహర్షి పలికెను. మోహిని మోహమును విడిచి స్వర్గమునకు వెళ్ళెను. అచట దేవదూత ఓపాపాత్మురాలా నీ విచటికి రా దగదు. పాపశీలురాలా. దుర్బుద్దీ! భర్బనిందా పరాయణురాలా. హరివాసరమును లోపింప చేయు నీకు స్వర్గమున స్థానము లేదు. ధర్మవిముఖులకు నరకములో నివాసముండును. ఇట్లు వాయువు మోహినితో పలికి దండముచే దండించి నరకమునకు పంపివేసెను. ఇట్లు దేవదూతచే దండించబడిన మోహిని బ్రహ్మదండపరాభూతురాలై నరకమును చేరెను. అచట యమధర్మరాజు ఆజ్ఞచే దేతలు మోహినిని చాలాకాలము దండించిరి. అన్ని నరకములలోనికి వెళ్ళి పడిపోయెను. ఓ పాపాత్మురాలా పుత్రుడగుధర్మాంగదుని భర్త చేతితో చంపించితివి. కావున నీవు స్వయముగా నాచరించిన కర్మఫలమును అనుభవించుము. ప్రజాహితము నాచరించువానిని, స్థిరప్రజ్ఞుని, మహేందవరుణోపముని, సప్తద్వీపాధిపతియగు పుత్రుని వధించి ఈఫలమును అనుభవించు చున్నావు. సామాన్య పుత్రుని చంపిననే బ్రహ్మహత్యాపాతకము సంప్రాప్తించును. ఇక ధర్మయుక్తుడగు ధర్మాంగదుని చంపిన ఏమి చెప్పవలయును? ఇట్లు దూతలచే నిందించబడుచు యముడు విధించిన యాతనలనన్నింటిని క్రమముగా అనుభవించెను. బ్రాహ్మణ శాపముపాలైన మోహినీ దేహమును స్పృశించుటచే ఆయాతనలన్ని తమ శరీరములు కొలుచుండగా సహించజాలక నరకములన్నియూ యమధర్మరాజును చేరినవి. మోహినీ శరీరస్పర్శచే పీడితలై చేతులు జోడించి ఇట్లు పలికినవి. దేవ దేవా. జగన్నాధా! ధర్మరాజా దయను చూపుము. ఈమోహినిని త్వరగా యాతనలనుండి దూరముగా పంపుము. ఈమెను స్పృశించినంతనే క్షణములో మేము భస్మమైతిమి. కావున ఈమెను నరకములనుండి పారద్రోలుము. అట్లు పలికిన నరకముల మాటలను విని యమధర్మరాజు ఆశ్చర్యమును చెందెను. తన దూతలతో ఈమెను బయటికి పంపుము. బ్రహ్మదండనిర్దగ్గుడగు స్త్రీకాని పురుషుడుకాని, చోరుడుకాని, అతని స్పర్శను నా యాతనలు సహించజాలవు. కావున మహాపాపురాలు భర్తృవచనలో పిని, పుత్రఘ్ని, ధర్మహంతకురాలు, బ్రహ్మదండహతురాలగుమోహినిని దూరముగా తరలించుడు. ఈమెను చూచుటచే నా శరీరము మండుచున్నది. ఇట్లు ధర్మరాజు పలుకగా అతని దూతలు శస్త్రాస్త్రములచే మోహినిని కొట్టుచు యమలోకమునుండి బహిష్కరించిరి. అంతట మోహయుతురాలగు మోహిని దుఃఖితురాలై పాతాలలోకమునకు వెళ్ళెను. అచట పాతాల వాసులు వారించిరి. అంతట బ్రహ్మపుత్రి మిక్కిలి సిగ్గుపడి తండ్రి వద్దకు వెళ్ళి తనదుఃఖమను తెలిపెను. ఓ తండ్రీ ! చరాచరాత్మకమగు ఈ మూడులోకములలో నాకు స్థానము లేదు. నేనెచటికి వెళ్ళిననూ బహిష్కరించుచున్నారు. నన్ను ఆయుధములచే బాగా కొట్టి బహిష్కరించుచున్నారు. నీ ఆజ్ఞను స్వీకరించి నేను రుక్మాంగదుని సమిపించితిని. అన్నిలోకములు నిందించు పనిని చేసితిని. భర్తను బాధించి శ్రేష్ఠమగు ఖడ్గముతో పుత్రుని చంపించి సంధ్యావళీ దేవిని క్షోభింప చేసి ఈదశను పొందితిని. పాపురాలనగు నాకు ఇపుడు ఏగతిలేదు. విశేషించి బ్రాహ్మణ శాపము చే దుఃఖభాగినినైతిని. బ్రాహ్మణ వాక్యహతులకు, అగ్నిదగ్గులకు, దివాకీర్తిహతులకు, మృగాదులచే భక్షించబడిన వారికి, మెరుపుచే పీడించబడువారికి దేవనది ముక్తినిచ్చును కావున నీవు నాకు శాపమునిచ్చిన బ్రాహ్మణుని దేవతలచే కలిసి ప్రసన్నుని చేసినచో నాకు గతి లభించును. ఇట్లు మోహిని పలుకగా వినిన లోకపితామహుడగు బ్రహ్మ శివ ఇంద్ర యమ సూర్యాగ్ని దేవేశులతో కలిసి, మోహినిని ముందిడుకొని బ్రాహ్మణుని వద్దకు వెళ్ళెను. దేవాది సహితుడగు బ్రహ్మ అచటికి వెళ్ళి తానుస్వయముగా గొప్ప గౌరముతో బ్రాహ్మణునికి నమస్కరించెను. రుద్రాది దేవతలచే పూజించబడు పితామహుడు మోహినికి సంతోషమును కలిగించవలయునని ముగ్గుడై స్వయముగా తానే నమస్కరించెను. మూడులోకములలోను సాధింపశక్యము కాని గొప్ప కార్యము సంప్రాప్తించినపుడు చిన్నవానికి నమస్కరించుట దోషముకాదు. వేదవేదాంగ పారగుడు తపస్సులో నున్న ఆ బ్రాహ్మణుడు దేవతలతో కలిసి వచ్చిన లోకకర్తను చూచి లేచి బ్రహ్మకు, మునులకు, దేవతలకు నమస్కరించెను. ఆసనమును సమర్పించి కూర్చుండజేసి భక్తిచే బ్రహ్మను స్తుతించెను. అపుడు ప్రసన్నుడగులోకకర్త అయిన బ్రహ్మ, ఆదేవతలు మోహిని కొఱకు ఆ బ్రాహ్మణుని ర్ధించసాగిరి. 

 

నాయనా! బ్రాహ్మణోత్తమా సదాచారపరా! పరలోకోపకారక! కృపాసింధో దయతలచి మోహినికి సద్గతిని ప్రసాదించుము. రుక్మాంగదుని మోహింప చేయుటకు మోహినిని నేనే పంపియుంటిని. యమలోకము శూన్యమగుట, వైకుంఠము పూర్ణముగా నుండటను చూచి, లోకులందరూ బాధలు లేని వారుగా నుండుటచే, దేవతలకు హితమునుచేయు మోహినిని మనసుచే సృజించితిని. ఓ బ్రాహ్మణోత్తమా నేను చెప్పుదానిని సావధానముగా వినుము. లోకకళ్యాణకారిణియగు ధర్మసూక్ష్మమును ధర్మస్వరూపమును తెలియుము. ఈ స్వర్ణసన్నిభయగు రూపముకల మోహినిచే రుక్మాంగదుని పరీక్షించి భార్యా పుత్రులతో 

శ్రీహరి మందిరమున చేర్చితిమి. రాజు ఎదురులేని భక్తి చే హరివాసరమును సేవించెను. కావున యమలోకము శూన్యము చేయబడినది. యమ లిపిని తుడిచి వేసెను. ఓ బ్రహ్మరీ! ఎన్ని జన్మలలోనైననూ దేవాపకారము క్షమించరానిది. బ్రాహ్మణాపకారము విశేషించి క్షమించరానిది. కావున మోహినికి సహాయముగా బ్రాహ్మణులు వెడలిరి. సాంఖ్యవిదులకు పొందరానిది, అష్టాంగయోగముచే పొందజాలని, భక్తి మాత్రముచే పొందదగిన శ్రీహరిలోకమునకు రాజును రాజపుత్రుని, రాజపత్నిని చేర్చితిమి. పుణ్యశీలుడగు రాజశ్రేష్ఠునకు జరిపిన కార్యమునకు పాపవేగమునకు నీశాపముచే దగ్గురాలై మోహిని భస్మముగా మిగిలి పోయెను. ఈ మోహిని దేవతల కొఱకు, సంసారమును పెంచుటకు, రాజునకు ఉపకరించుటకు మాత్రమే ప్రవర్తించినది. అంతే కాని స్వార్ధమును కోరి ఆచరించలేదు. అయినపుడు ఈమె' అవమానమును పొదుట తగదు. కావున ఓ బ్రాహ్మణోత్తమా ఈ అపకారమును క్షమించుము. దయ చూడుము. శాంతిని పొందుము. పిండిని ఇసురుట నీతిసమ్మతముకాదు. శాపమునిచ్చి పతితురాలను చేసితివి. అనుగ్రహించి గతిప్రదానము చేయుము. నీవిట్లు చేసినచో ఈ మోహిని తన క్రూర బుద్ధిని విడుచును. ఇట్లు బ్రహ్మ పలుకగా విచారించి కోపమును విడిచెను. త్రిదశాధినాధుని ఇట్లు పలికెను. నీపుత్రికయగు మోహిని బహుపాపముల నాచరించినది. కావున సకల ప్రాణులలో సకలలోకములలో ఉనికిని గోల్పోయినది. కావున నేను చాలా సేపు విచారించి మోహిని కొరకు నిర్ణయించితిని. నీ ప్రీతికొరకు ఆగతిని ఇచ్చెదను. నీవు నాకు పూ జ్యతరుడవు కదా నీ మాట నామాట నిజము కావలయును. దేవకార్యము మోహినీ కార్యము నెరవేరవలయును. భూతసంఘములు ఆక్రమించని ప్రదేశమున మోహినియుండును. సప్తద్వీపవతియగు భూమి జంగమా జంగమముల చే. వ్యాపించ బడియున్నది. తలాది లోకములు దైత్యాదులచే, ఆకాశము పక్ష్యాదులచే, స్వర్గము సుకృతులచే, నరకము పాపులచే, మత్స్యాదులచే సాగరము వ్యాప్తమైయున్నది. కావున వీటియందు మోహినికి ఉనికి లేదు. అని అంతట బ్రహ్మదేవతలతో ఆలోచించి మోహినితో నీకెక్కడా స్థానములేదని పలికెను. అపుడు మోహిని ఆమాటను విని, తండ్రి ఆజ్ఞను ఆచరించునదై హరివాసరన్మాశినియగు మోహిని పురోహితునితోపాటు అందరికి నమస్కరించి ఇట్లు పలికెను. 

ఓ దేవోత్తములారా మీకు చేతులు జోడించుచుంటిని. ఇట్లు నమస్కారశతముచే దేవతలగు మీరు ప్రసన్నహృదయముతో సర్వప్రీతి కరముగా నా యాచన నీయ దగును. ఏకాదశి ప్రభావముచే పాపులందరికి సద్గతి లభించును. ఆగతిని పెంచుటయే నాకు ప్రయోజనము కావలయును. భర్త సవతి, పుత్రుడు ఈ ముగ్గురిని నేను వైకుంఠమునకు పంపితిని. భూలోకమున ఇపుడు నేను మీ కొరకు పతిహీననై యున్నాను. హరిదినము దుష్టమెట్లగునో తెలుపుడు. నాస్వార్ధమునకు ఇట్లు యాచించుచున్నాను.  

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మహినీ చరితమున ముప్పది యారవ అధ్యాయము.