నారద మహా పురాణము - ఉత్తరార్థము
1 - ద్వాదశీమహాత్మ్యవర్ణనమ్
శ్రీ గణేశాయనమః శ్రీ కృష్ణాయనమః
మాంధాతోవాచ:-
శ్రీ గణేశునకు నమస్కారము. శ్రీ కృష్ణునకు నమస్కారము.
మేఘము వలె నల్లనివి శార్జధనువు అల్లి త్రాడు తాకుడుతో గట్టిబారినలో కత్రయమండప స్తంభములైన శ్రీహరినాలుగు బాహువులు మిమ్ములను కాపాడుగాక. దేవదానవశిరోరత్నములతో ప్రకాశించు శ్రీహరిపాదపద్మములు మా భీష్టముల నెరవేర్చుగాక.
మాంధాత పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా? ఘోరమగు శుష్కార్ధమగు పాసేన్దనమును ఏ అగ్ని దహించునో మీరు చెప్పుడు. ఓ బ్రాహ్మపుత్రా! మూడులోకములలో నున్న మూడు విధములగు జ్ఞానములలో నీకు తెలియనది లేదు. తెలియని పాతకమును శుష్కమని తెలిసినదానిని ఆర్థ చెప్పెదరు. జరుగ బోవునది, జరిగినది, జరుగుచున్నది అను మూడు విధములగు పాపములు ఏ అగ్నితో నశించునో నాకు తెలుపుము.
వసిష్ఠమహర్షిపలికెను :- ఓ రాజోత్తమా! ఆర్ద్రపాపము, శుష్కపాపము సమస్తము ఏ అగ్నితో దహించబడునో వినుము. విష్ణు వాసరమగు ఏకాదశినాడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉపవసించి మధుసూదనుని పూజించవలయును. స్నానమునాచరించి ఉపవసించి, రాత్రి జాగరణ చేసినచో తస్కరుడు ధనమును హరించునట్లు సకలపాపములను హరించును. ఏకాదశి యను అగ్ని నూరు జన్మల పాపరాశిని భస్మము చేయును. పద్మనాభవాసరమంతటి పాపనాశకమగు పరమపవిత్రమైనది మానవులకు మరొకటి లేదు. ఏకాదశి ఉపవాసము వరకే మానవుని దేహములో పాపములుండును. వేయి ఆశ్వమేధయాగములు, నూరు రాజసూయయాగములు, ఏకాదశీఉపవాసములోని ఒక అంశతో సాటిరావు. మానవుడు ఏకాదశేంద్రియములతో చేసినపాపములన్నియూ ఏకాదశ్యుపవాసముతో నశించును. ఏకాదశితోసాటివచ్చు పాపనాశకము మరియొకటిలేదు. మిషతో ఆచరించిననూ యమదర్శనము కాదు. ఈ ఏకాదశి సర్వమును మోక్షమును ప్రసాదించును. రాజ్యమును పుత్రులనిచ్చును. మంచి భార్యనిచ్చును. శరీరాగ్యమును ప్రసాదించును. గంగానది, గయాక్షేతము, కాశీ, పుష్కరము, కురుక్షేత్రము, రేవానది, దేవిక, యమునో, చంద్రభాగా, ఇవన్నియూ హరిదినమంత పవిత్రము కాజాలవు. ఆయాసము లేకుండగా హరిమందిరమును చేర్చును. ఏకాదశినాడు పవసించి, రాత్రి జాగరణము చేసి సర్వపాపవిముక్తుడై విష్ణులోకమును చేరును. ఏకాదశ్యుపవాసము మాతృపక్షమున పదితరములను, పితృపక్షమున పదితరములను, భార్యాపక్షమున పది తరములను ఉద్దరించును. ఉపవసించిన వానిని కూడా విష్ణుపురమును చేర్చును. ఏకాదశి చింతామణితో నిధితో సమానము. సంకల్పమను కల్పవృక్షము వేదవాక్యము వంటివి యగు ద్వాదశిని ఆశ్రయించిన నరులు నాలుగు భుజములు కలిగి గరుడ వాహనులు, మాల్యధారులు, పీతాంబరధారులుగా హరిమందిరమును చేరుదురు. ఇది యంతయు ద్వాదశీ ప్రభావము. నీకు చెప్పితిని. ఘోరమగు పాపరాశికి అగ్నిహోత్రము. ఏకాదశి ఎపుడు ఉపవసించదగినదే. పుత్ర పౌత్రాదివిపుల భోగములననుభవించ గోరు మానవులు ఈ వ్రతము నాచరించవలయును. ఈలోకమున ఆదరముతో హరిదినమును ఇష్టముతో కాని అయిష్టముతోకాని ఆచరించువారు ఎన్ని పాపముకలవారైనను శ్రీమహావిష్ణులోకమును పొందెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున ద్వాదశీమహాత్మ్య వర్ణణమను మొదటి అధ్యాయము సమాప్తము.
